Dalal Street
-
Stock Market: బేర్ విశ్వరూపం
ముంబై: అమెరికాలో మాంద్యం భయాలు మార్కెట్లను ముంచేశాయి. జపాన్ కరెన్సీ యెన్ భారీ వృద్ధి బెంబేలెత్తించింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు వణికించాయి. వెరసి దలాల్ స్ట్రీట్ సోమవారం బేర్ గుప్పిట్లో విలవిలలాడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ షేర్ల విలువ భారీగా పెరిగిపోవడంతో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ఫలితంగా సెన్సెక్స్ 2,223 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 పాయింట్లు పతనమై 24,055 వద్ద నిలిచింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన రోజు జూన్ 4న (5.76% పతనం) తర్వాత ఇరు సూచీలకిదే భారీ పతనం. రోజంతా నష్టాల కడలిలో ... అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఏకంగా 3% నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 2,394 పాయింట్ల నష్టంతో 78,588 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు క్షీణించి 24,303 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు సాహసించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కొట్టిమిట్టాడాయి. ఒకదశలో సెన్సెక్స్ 2,686 పా యింట్లు క్షీణించి 78,296 వద్ద, నిఫ్టీ 824 పాయింట్లు కుప్పకూలి 23,893 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. → బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. సరీ్వసెస్ సూచీ 4.6%, యుటిలిటీ 4.3%, రియల్టీ 4.2%, క్యాపిటల్ గూడ్స్ 4.1%, ఇండస్ట్రీయల్ 4%, విద్యుత్ 3.9%, ఆయిల్అండ్గ్యాస్, మెటల్ 3.75% చొప్పున క్షీణించాయి. → సెన్సెక్స్ సూచీలో హెచ్యూఎల్(0.8%,) నెస్లే (0.61%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ఇందులో టాటా మోటార్స్ 7%, అదానీ పోర్ట్స్ 6%, టాటాస్టీల్ 5%, ఎస్బీఐ 4.50%, పవర్ గ్రిడ్ 4% షేర్లు అత్యధికంగా పడ్డాయి. → చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 4%, 3.6% చొప్పున క్షీణించాయి. → బీఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టయిన మొత్తం 4,189 కంపెనీల షేర్లలో ఏకంగా 3,414 కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. → రిలయన్స్ 3% పడి రూ. 2,895 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 4.50% పతనమై రూ.2,866 కనిష్టాన్ని తాకింది. మార్కెట్ క్యాప్ రూ. 70,195 కోట్లు ఆవిరై రూ. 19.58 లక్షల కోట్లకు తగ్గింది. → మార్కెట్లో ఒడిదుడుకులు సూచించే వొలటాలిటీ ఇండెక్స్(వీఐఎక్స్) 42.23 శాతం పెరిగి 20.37 స్థాయికి చేరింది. ఇంట్రాడేలో 61% ఎగసి 23.15 స్థాయిని తాకింది. లేమాన్ బ్రదర్స్, కోవిడ్ సంక్షోభాల తర్వాత ఈ సూచీ కిదే ఒక రోజులో అత్యధిక పెరుగుదల.2 రోజుల్లో రూ.19.78 లక్షల కోట్ల ఆవిరి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ సోమవారం ఒక్కరోజే రూ.15.32 లక్షల కోట్లు హరించుకుపోయాయి. శుక్రవారం కోల్పోయిన రూ.4.46 లక్షల కోట్లను కలిపితే గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లో ఇన్వెస్టర్లకు మొత్తం రూ.19.78 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ. 441.84 లక్షల కోట్లకు పడింది.84 దిగువకు రూపాయి కొత్త ఆల్టైమ్ కనిష్టంఈక్విటీ మార్కెట్ల భారీ పతనంతో రూపాయి విలువ సరికొత్త జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్ మారకంలో 37 పైసలు క్షీణించి 84 స్థాయి దిగువన 84.09 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 83.78 వద్ద మొదలైంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, దలాల్ స్ట్రీట్ భారీ పతన ప్రభావంతో ఇంట్రాడే, జీవితకాల కనిష్టం 84.09 వద్ద స్థిరపడింది. ‘అమ్మో’రికా! ముసిరిన మాంద్యం భయాలు.. ఉద్యోగాల కోత.. హైరింగ్ తగ్గుముఖం.. మూడేళ్ల గరిష్టానికి నిరుద్యోగం.. 4.3%కి అప్ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల ఎఫెక్ట్... ఫెడ్ రేట్ల కోత సుదీర్ఘ వాయిదా ప్రభావం కూడాఅమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచమంతా తుమ్ముతుందనే నానుడిని నిజం చేస్తూ, ప్రపంచ స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూఎస్ తయారీ, నిర్మాణ రంగంలో బలహీనతకు గత వారాంతంలో విడుదలైన జాబ్ మార్కెట్ డేటా ఆజ్యం పోసింది. జూలైలో హైరింగ్ 1,14,000 ఉద్యోగాలకు పరిమితమైంది. అంచనాల కంటే ఏకంగా 1,80,000 జాబ్స్ తగ్గాయి. మరోపక్క, జూన్లో 4.1 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జూలైలో 4.3 శాతానికి ఎగబాకింది. 2021 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతేకాదు, ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్తో సహా మరికొన్ని కంపెనీలు తాజా కొలువుల కోతను ప్రకటించడం కూడా అగ్గి రాజేసింది. ఈ పరిణామాలన్నీ ఇన్వెస్టర్లలో మాంద్యం ఆందోళనలను మరింత పెంచాయి. వెరసి, గత శక్రవారం అమెరికా మార్కెట్లు కకావికలం అయ్యాయి. నాస్డాక్ 2.4% కుప్పకూలింది. డోజోన్స్ 1.5%, ఎస్అండ్పీ–500 ఇండెక్స్ 1.84 చొప్పున క్షీణించాయి. కాగా, గత నెలలో ఆల్టైమ్ రికార్డుకు చేరిన నాస్డాక్ అక్కడి నుంచి 10% పైగా పతనమై కరెక్షన్లోకి జారింది. ఆసియా, యూరప్ బాటలోనే సోమవారం కూడా అమెరికా మార్కెట్లు 3–6% గ్యాప్ డౌన్తో మొదలై, భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ స్టాక్స్.. ట్రిలియన్ డాలర్లు ఆవిరి రెండో త్రైమాసిక ఫలితాల నిరాశతో నాస్డాక్లో టాప్–7 టెక్ టైటాన్స్ (యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఎన్వీడియా, టెస్లా, మెటా) షేర్లు అతలాకుతలం అవుతున్నాయి. ఏఐపై భారీగా వెచి్చస్తున్న మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి కంపెనీలకు ఆశించిన ఫలితాలు రావడం లేదనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇక బలహీన ఆదాయంతో అమెజాన్ షేర్లు 10% క్రాష్ అయ్యాయి. ఫలితాల నిరాశతో ఇంటెల్ షేర్లు ఏకంగా 26% కుప్పకూలాయి. 1985 తర్వాత ఒకే రోజు ఇంతలా పతనమయ్యాయి. కంపెనీ ఏకంగా 15,000 మంది సిబ్బంది కోతను ప్రకటించడంతో జాబ్ మార్కెట్లో గగ్గోలు మొదలైంది. వెరసి, షేర్ల పతనంతో టాప్–7 టెక్ షేర్ల మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్లకు పైగా ఆవిరైంది. కాగా, సోమవారం ఈ షేర్లు మరో 6–10% కుప్పకూలాయి. ఎకానమీ పరిస్థితి బయటికి కనిపిస్తున్న దానికంటే చాలా బలహీనంగా ఉందని సీఈఓలు సిగ్నల్స్ ఇస్తున్నారు. యుద్ధ సైరన్..: పశ్చిమాసియాలో హమాస్ చీఫ్ హనియేను ఇజ్రాయిల్ తుదముట్టించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించడంతో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేస్తోంది. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు సద్దుమణగక ముందే మరో వార్ మొదలైతే క్రూడ్ ధర భగ్గుమంటుంది. బ్యారల్ 100 డాలర్లను దాటేసి, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుంది. వెరసి ఎకానమీలు, మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. జపాన్.. సునామీ అమెరికా దెబ్బతో ఆసియా, యూరప్ మార్కెట్లన్నీ సోమవారం కూడా కుప్పకూలాయి. జపాన్ నికాయ్ సూచీ ఏకంగా 13.5 శాతం క్రాష్ అయింది. 1987 అక్టోబర్ 19 బ్లాక్ మండే (14.7% డౌన్) తర్వాత ఇదే అత్యంత ఘోర పతనం. నికాయ్ ఆల్ టైమ్ హై 42,000 పాయింట్ల నుంచి ఏకంగా 31,000 స్థాయికి దిగొచి్చంది. గత శుక్రవారం కూడా నికాయ్ 6% క్షీణించింది. ముఖ్యంగా జపాన్ యెన్ పతనం, ద్రవ్యోల్బణం 2% లక్ష్యంపైకి ఎగబాకడంతో అందరికీ భిన్నంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు బాటలో వెళ్తోంది. గత బుధవారం కూడా రేట్ల పెంపు ప్రకటించింది. దీంతో డాలర్తో ఇటీవల 160 స్థాయికి చేరిన యెన్ విలువ 142 స్థాయికి బలపడి ఇన్వెస్టర్లకు వణుకు పుట్టించింది. జపాన్, అమెరికా ఎఫెక్ట్ మన మార్కెట్ సహా ఆసియా, యూరప్ సూచీలను కుదిపేస్తోంది.ఫెడ్ రేట్ల కోతపైనే ఆశలు.. కరోనా విలయం తర్వాత రెండేళ్ల పాటు ఫెడ్ ఫండ్స్ రేటు 0–0.25% స్థాయిలోనే కొనసాగింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగబాకి, 2022 జూన్లో ఏకంగా 9.1 శాతానికి చేరడంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ రేట్ల పెంపును మొదలెట్టింది. 2023 జూలై నాటికి వేగంగా 5.25–5.5% స్థాయికి చేరి, అక్కడే కొనసాగుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం ఈ ఏడాది గతేడాది జూన్లో 3 శాతానికి దిగొచి్చంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో (క్యూ2) యూఎస్ జీడీపీ వృద్ధి రేటు 2.8 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ, ఫెడ్ మాత్రం రేట్ల కోతను సుదీర్ఘంగా వాయిదా వేస్తూ వస్తోంది. గత నెలఖర్లో జరిగిన పాలసీ భేటీలోనూ యథాతథ స్థితినే కొనసాగించింది. అయితే, తాజా గణాంకాల ప్రభావంతో సెప్టెంబర్లో పావు శాతం కాకుండా అర శాతం కోతను ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ రేట్ల కోత విషయంలో ఫెడ్ సుదీర్ఘ విరామం తీసుకుందని, దీనివల్ల ఎకానమీపై, జాబ్ మార్కెట్పై ప్రభావం పడుతోందనేది వారి అభిప్రాయం. అధిక రేట్ల ప్రభావంతో మాంద్యం వచ్చేందుకు 50% అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్ అంటోంది!– సాక్షి, బిజినెస్ డెస్క్ -
8.50 లక్షల కోట్ల సంపద ఆవిరి
సెన్సెక్స్ ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో రూ.8.50 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.365 లక్షల కోట్లకు దిగివచ్చింది. ముంబై: దలాల్ స్ట్రీట్లో మంగళవారం అమ్మకాల మోత మోగింది. అధిక వెయిటేజీ షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు(3%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2%), ఎస్బీఐ(4%) షేర్లు పతనంతో పాటు పశ్చిమాసియాలోని యుద్ధ ఉద్రికత్తలు ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. ఇటీవల విడుదలైన కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడమూ సెంటిమెంట్పై ఒత్తిడి పెంచింది. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. గడిచిన 3 నెలల్లో భారీగా ర్యాలీ చేసిన చిన్న, మధ్య తరహా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ 3శాతం చొప్పున నష్టపోయాయి. పెరిగి పడిన మార్కెట్... మూడు రోజుల వరుస సెలవుల తర్వాత తెరుచుకున్న మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 444 పాయింట్లు పెరిగి 71,868 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు బలపడి 21,717 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. కానీ, కాసేపటికే అమ్మకాల ఒత్తిడి మొదలైంది. ఒక దశలో సెన్సెక్స్ 1,189 పాయింట్లు క్షీణించి 70,235 వద్ద, నిఫ్టీ 397 పాయింట్లు దిగివచ్చి 21,193 వద్ద ఇంట్రాడే కనిష్టాలను దిగివచ్చాయి. చివరికి సెన్సెక్స్ 1,053 పాయింట్లు నష్టపోయి 70,371 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 330 పతనమై 21,242 వద్ద స్థిరపడ్డాయి. జనవరి 17 తర్వాత సూచీలకు ఇది భారీ పతనం. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లూ డీలా...! అమ్మకాల సునామీతో ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు ఎరుపెక్కాయి. రంగాల వారీగా ఎన్ఎస్ఈలో మీడియా 13%, రియల్టీ 5%, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 4%, మెటల్, ఆయిల్అండ్గ్యాస్ 3%, బ్యాంక్ నిఫ్టీ 2%, ప్రైవేట్ రంగ బ్యాంక్ 2%, ఎఫ్ఎంసీజీ, ఆటో ఇండెక్సులు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. ఫార్మా సూచీ మాత్రమే 1.5% రాణించింది. ►నష్టాల ట్రేడింగ్లోనూ మెడి అసిస్ట్ హెల్త్కేర్ లిస్టింగ్ సక్సెస్ అయ్యింది. ఇష్యూ ధర(రూ.418)తో పోలిస్తే బీఎస్ఈలో 11.24% ప్రీమియంతో రూ.465 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో 22% ఎగసి రూ.510 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభపడి దాదాపు లిస్టింగ్ ధర రూ.464 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.3,197 కోట్లుగా నమోదైంది. ►ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత సిప్లా షేరు రాణించింది. డిసెంబర్ క్వార్టర్లో నికర లాభం 32% వృద్ధి చెందినట్లు వెల్లడించడం కలసి వచ్చింది. బీఎస్ఈలో ఈ షేరు 7% పెరిగి రూ.1,409 వద్ద ముగిసింది. ►సోనీ గ్రూప్ 10 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందం రద్దుతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేరు కుప్పకూలింది. బీఎస్ఈలో 10% నష్టంతో రూ.209 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో ఏకంగా 34% పతనమై రూ.152 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. చివరికి 33% నష్టంతో రూ.156 వద్ద స్థిరపడింది. ఒక దశలో షేరు ఇరు ఎక్సే్చంజీలో లోయర్ సర్క్యూట్ను తాకింది. షేరు భారీ క్షీణతతో కంపెనీకి రూ.7,300 కోట్ల నష్టం వాటిల్లింది. ►హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు పతనం ఆగడం లేదు. బీఎస్ఈలో 3.50% నష్టపోయి రూ.1428 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 3.65% పతనమై రూ.1,425 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.83 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు వరుస అయిదు రోజుల్లో 13% క్షీణించింది. -
దలాల్ స్ట్రీట్లో శాంటాక్లాజ్ లాభాలు
ముంబై: క్రిస్మస్కు ముందు దలాల్ స్ట్రీట్లో శాంటా క్లాజ్ ర్యాలీ కనిపించింది. పతనమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ లాభపడ్డాయి. ఐటీ, మెటల్, టెక్, ఆటో, ఫార్మా, రియల్టీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 71,107 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు బలపడి 21,349 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన స్టాక్ సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర లాభ, నష్టాల మధ్య కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 71,260 వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 21,390 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు 1.04%, 0.75% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,829 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,167 కోట్ల షేర్లు కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) కలి్పంచే అంశంలో పదేళ్ల గడువు లభించడంతో ఎల్ఐసీ షేరు 4% పెరిగి రూ.793 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 7% పెరిగి రూ.820 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. షేరు నాలుగు లాభపడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.18,057 కోట్లు పెరిగి రూ.5.01 లక్షల కోట్లకు చేరింది. ► ఒడిదుడుకుల ట్రేడింగ్లో ఐటీ షేర్లు రాణించాయి. విప్రో 6.55%, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 4%, ఎంఫసీస్, హెచ్సీఎల్ టెక్ 3%, కోఫోర్జ్ 2.50%, ఎల్అండ్టీఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఒకటిన్నర శాతం, ఎల్టీటీఎస్, టీసీఎస్ షేర్లు ఒకశాతం చొప్పున లాభపడ్డాయి. ► స్టాక్ మార్కెట్ వరుస 3 రోజులు పనిచేయదు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా, సోమవారం(డిసెంబర్ 25న) క్రిస్మస్ సందర్భంగా ఎక్చే్చంజీలు పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి మంగళవారం యథావిధిగా ప్రారంభం అవుతుంది. ► అజాద్ ఇంజనీరింగ్ ఐపీఓకు 80.60 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.01 కోట్ల ఈక్విటీలు జారీ చేయగా మొత్తం 81.58 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ఐబీ కోటా 179.66 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్లు విభాగం 87.55 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 23.71 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ► కెనిడియన్ బిలియనీర్ ప్రేమ్ వాట్సా గ్రూప్ ఫెయిర్ఫాక్స్ గ్రూప్.., ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థలో 5.7% వాటాను దక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా ఎఫ్ఐహెచ్ మారిషన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ నుంచి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్కు చెందిన 2.16 కోట్ల ఈక్విటీల(5.7% వాటా)ను రూ.1,198 కోట్లకు కొనుగోలు చేసినట్లు బల్క్డీల్ డేటా తెలిపింది. ఈ లావాదేవీ తర్వాత ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు 4% నష్టపోయి రూ.573 వద్ద స్థిరపడింది. -
దలాల్ స్ట్రీట్లో అదానీ మెరుపులు: రూ. 11 లక్షల కోట్లకు ఎంక్యాప్
అదానీ గ్రూప్ అధినేత, బిలియనీర్ గౌతం అదానీకి భారీ ఊరట లభించింది. ఈ ఏడాది జనవరిలో హిండెన్బర్గ్ ఆరోపణల తరువాత మార్కెట్ క్యాపిటలైజేషన్ను భారీగా కోల్పోయిన అదానీ గ్రూపు క్రమంగా కోలుకుంటోంది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో గౌతమ్ అదానీ నేతృత్వంలోని సమ్మేళనానికి చెందిన లిస్టెడ్ సంస్థలు 12 శాతం ర్యాలీ అయ్యాయి.తాజాగా లాభాలతోసంస్థ ఎం క్యాప్ ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. అదానీ మార్కెట్ క్యాప్ రూ.11 లక్షల కోట్ల మార్క్ను క్రాస్ చేసింది. ఈ ఫిబ్రవరి తర్వాత మొదటిసారిగా గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ను రూ.11 లక్షల కోట్ల మార్కును అధిగమించడం విశేషం. మొత్తం పది అదానీ గ్రూప్ కంపెనీలు - అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్, అదానీ పవర్, ఎసిసి, అంబుజా, ఎన్డిటివి శుక్రవారం ట్రేడ్లో భారీ పెరుగుదలను నమోదు చేశాయి. మరోవైపు అబుదాబి నేషనల్ ఎనర్జీ PJSC (TAQA) అదానీలో పెట్టుబడులపై మీడియా నివేదికల మధ్య అదానీ గ్రూప్ స్టాక్లు దలాల్ స్ట్రీట్స్లో మెరుపులు మెరిపించాయి. అదాని గ్రూప కంపెనీలో పెట్టుబడుల వార్తలపై అబుదాబి కంపెనీ స్పందించింది. ఆ వార్తల్లోవాస్తవం లేదని TAQA కొట్టిపారేసింది.ఈ వారం ప్రారంభంలో, యూఎస్ ఆధారిత బోటిక్ పెట్టుబడి సంస్థ రాజీవ్ జైన్ నేతృత్వంలోని GQG భాగస్వామి అదానీ పవర్ 31.2 కోట్ల ఈక్విటీ షేర్లను రూ. 9,000 కోట్లకు (1.1 బిలియన్ డాలర్ల) కొనుగోలు చేసింది. కాగా ఈ ఏడాది జనవరిలో హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టు విడుదలైనప్పటి నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ రెండు నెలల్లోపే సమ్మేళనం స్టాక్లు 75 శాతానికి పడి పోయాయి. అదానీ గ్రూప్ అవకతవకలు, అక్రమాలకు పాల్పడిందని హిండెన్బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలు సత్యదూరమైనవని గౌతం అదానీ తీవ్రంగా ఖండించారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన మార్కెట్రెగ్యులేటరీ సెబీరిపోర్ట్ను త్వరలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచ నుంది. -
మార్కెట్కు బడ్జెట్ బూస్ట్, కానీ ఈ షేర్లు మాత్రం ఢమాల్!
సాక్షి,ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అమృతకాల బడ్జెట్ స్టాక్మార్కెట్కు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా ఆరంభంలోనే 500 పాయింట్లు ఎగిసిన సూచీలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దాదాపు 1200 పాయింట్లు ఎగిసాయి. టాక్స్ షాక్ తగిలిన రంగాలు తప్ప అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1112 పాయింట్ల లాభంతో 60661 వద్ద, నిఫ్టీ 266 పాయింట్ల లాభంతో17928 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ అండ్ టి, హెచ్డిఎఫ్సి ట్విన్స్ లాంటివి టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిగరెట్లపై పన్నులు పెంచుతున్నట్లు ప్రకటించడంతో గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్తో సహా సిగరెట్ కంపెనీల షేర్లు బుధవారం 5 శాతం కుప్పకూలాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్ 5శాతం, గోల్డెన్ టొబాకో 4 శాతం, అయితే 6 శాతం నష్టపోయిన ఐటీసీ షేర్లు తేరుకొన్నాయి. ఇంకా ఎన్టిసి ఇండస్ట్రీస్ 1.4 శాతం, విఎస్టి ఇండస్ట్రీస్ 0.35 శాతం నష్టాలతో కొనాసగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11 శాతం (YoY) కంటే ఎక్కువ పెంచాలని ప్రతిపాదించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 18 లక్షల కోట్ల నుండి రూ.20 లక్షల కోట్లకు పెంచాలనే ప్రతిపాదన దాదాపు 11 శాతం ఎక్కువ అని, గోద్రెజ్ ఆగ్రోవెట్, బ్రిటానియా, టాటా కన్స్యూమర్స్ షేర్ స్టాక్లకు జోష్నిస్తుందని స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం. -
స్టాక్ మార్కెట్: బడ్జెట్ ముందు అప్రమత్తత
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్లో స్టాక్ మంగళవారం సూచీలు స్వల్ప లాభాలతో గటెక్కాయి. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ లోక్సభలో 2022–23 ఆర్థిక సర్వే సమర్పణ, నేడు(బుధవారం)బడ్జెట్, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయం వెల్లడి తదితర కీలక పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వహించారు. ట్రేడింగ్లో 683 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్ 49 పాయింట్లు పెరిగి 59,550 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 198 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆఖరికి 13 పాయింట్ల లాభంతో 17,662 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, ఫార్మా, అయిల్అండ్గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు వరుసగా 1.50%, రెండుశాతానికి పైగా పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,440 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.4,506 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ వెల్లడి(నేడు) ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సర్వే తెలపడంతో రూపాయి 41 పైసలు క్షీణించి 81.93 స్థాయి వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► జనవరి అమ్మక గణాంకాల వెల్లడి(నేడు)కి ముందు ఆటో కంపెనీల షేర్లు రాణించాయి. అశోక్ లేలాండ్, ఎంఅండ్ఎం, భాష్, మదర్శన్, ఐషర్ మోటార్స్ షేర్లు 3.50% నుంచి మూడుశాతం దూసుకెళ్లాయి. హీరోమోటోకార్ప్, ఎంఆర్ఎఫ్, టాటా మోటార్స్ షేర్లు రెండుశాతం పెరిగాయి. భారత్ ఫోర్జ్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్స్ షేర్లు ఒకశాతం లాభపడ్డాయి. ► క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్య బలహీన అంచనా వ్యాఖ్యలతో టెక్ మహీంద్రా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో రెండుశాతం నష్టపోయి రూ.1,015 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో నాలుగుశాతం క్షీణించి రూ.996 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. -
Union Budget 2023: స్టాక్ మార్కెట్పై బడ్జెట్ ప్రభావం ఎలా ఉంటుంది!
బడ్జెట్.. బడ్జెట్.. బడ్జెట్.. ప్రతి ఏటా జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి 1 వరకు దేశవ్యాప్తంగా ఈ పేరు వినిపిస్తుంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ కోసం సాధారణ ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదార్ల వరకు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటారు. ఆశించిన మేరకు బడ్జెట్ ఉంటే ఆనందాలు వెలువెత్తడం లేదంటే నెట్టింట మీమ్స్తో రచ్చ చేయడం ఇటీవల చూస్తూనే ఉన్నాం. మోదీ సర్కార్ ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే, 2024లో సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో రాబోవు బడ్జెట్పై ప్రతి రంగంలో, ప్రతి వర్గంలో ఎన్నెన్నో అంచనాలు కనిపిస్తున్నాయి. ఇక స్టాక్ మార్కెట్పై బడ్జెట్ ప్రభావం ఎలా ఉండబోతోందని తెలుసుకుందాం! స్టాక్ మార్కెట్పై ప్రభావం గత కొన్ని సంవత్సరాల పరిస్థితులను పరిశీలిస్తే సాధారణ బడ్జెట్కు ముందు స్టాక్ మార్కెట్లలో నీరసమైన వాతావరణం కనిపిస్తుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వాటి కదిలికలు మొదలవుతున్నాయి. బడ్జెట్ పూర్తిగా ద్రవ్యానికి సంబంధించిన అంశం. కాబట్టి దీని ప్రభావం మిగతా వాటిపై కచ్చితంగా ఉంటుంది. స్టాక్మార్కెట్పై బడ్జెట్ ప్రభావం ఎలాంటిదనే విషయం మాత్రం ఆర్థికమంత్రి మీద ఆధారపడి ఉంటుంది. వివిధ రంగాలకు కేటాయించిన మొత్తం ఆధారంగా ఈ ప్రభావాన్ని నిర్ణయించవచ్చు.ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా అభివృద్ధికి పెద్ద పీట వేస్తే ఆ సానుకూల నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే వారంలో సూచీల్లో ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. చదవండి: ఆ సూపర్ లగ్జరీ కార్ల క్రేజ్.. అబ్బో రికార్డు సేల్స్తో దూసుకుపోతోంది! -
స్టాక్ మార్కెట్: 3 నెలల కనిష్టానికి సూచీలు
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండోరోజూ అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. టీప్లస్1 సెటిల్మెంట్ ట్రేడింగ్ విధానం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. వచ్చేవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం కూడా జరగనుంది. ఈ పరిణామాణాలకు తోడు వారాంతపు రోజు కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. బాండ్లపై రాబడుల పెరుగుదల, క్రూడాయిల్ ధరల ఒడిదుడుకులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్స్ రంగ షేర్ల భారీ పతనంతో సెన్సెక్స్ 874 పాయింట్లు నష్టపోయి 59,307 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 287 పాయింట్లు క్షీణించి 17,604 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది మూడు నెలల కనిష్ట ముగింపు. అదానీ గ్రూప్ సంస్థలకు భారీగా రుణాలిచ్చాయన్న హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ రెండుశాతం, మిడ్క్యాప్ సూచీ 1.30% నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,978 కోట్ల షేర్లను విక్రయించారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.4,252 కోట్ల షేర్లను కొన్నారు. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.49 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రెండు శాతం క్రాష్ అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ..., రిపబ్లిక్ డే సెలవు రోజు తర్వాత దేశీయ మార్కెట్ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 38 పాయింట్ల నష్టంతో 60,167 వద్ద, నిప్టీ 15 పాయింట్ల పతనంతో 17,877 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఆ తర్వాత అమ్మకాల వెల్లువతో ఒక దశలో సెన్సెక్స్ 1,231 పాయింట్లకు పైగా నష్టపోయి 58,975 దగ్గర, నిఫ్టీ 398 పాయింట్లు క్షీణించి 17,494 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. అయితే ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంతమేర నష్టాలను భర్తీ చేసుకోగలిగాయి. రెండు రోజుల్లో రూ.10.65 లక్షల కోట్ల నష్టం గత రెండురోజుల్లో సెన్సెక్స్ 1,648 పాయింట్ల పతనంతో బీఎస్ఈలో 10.65 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్లు సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.269 లక్షల కోట్లకు దిగివచ్చింది. నిఫ్టీ సైతం 514 పాయింట్లు క్షీణించింది. అదానీ గ్రూప్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇచ్చిన వివరణ, ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించలేకపోయింది. ఈ గ్రూప్నకు చెందిన మొత్తం ఏడు కంపెనీల్లో అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ 20% లోయర్ సర్క్యూట్, అదానీ విల్మార్, అదానీ పవర్ షేర్లు ఐదుశాతం లోయర్ సర్క్యూట్ వద్ద లాకయ్యాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు వరుసగా 18%, 16% చొప్పున నష్టపోయాయి. ఇటీవల అదానీ గ్రూప్ విలీనం చేసుకున్న అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ కంపెనీల షేర్లు సైతం 17%, 13% చొప్పున నష్టపోయాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక నేపథ్యంలో గడిచిన రెండు రోజుల్లో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.4.17 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఎఫ్పీవోకు బిడ్స్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీవోకు తొలి రోజు(27న) రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 4.7 లక్షల బిడ్స్ దాఖలయ్యాయి. 4.55 కోట్ల షేర్లను ఆఫర్ చేసింది. ఆఫర్కు ధరల శ్రేణి రూ. 3,112–3,276కాగా.. గడువు ఈ నెల 31న(మంగళవారం) ముగియనుంది. బీఎస్ఈలో షేరు 19 శాతం పతనమై రూ. 2,762 వద్ద ముగిసింది. చిన్న ఇన్వెస్టర్లకు కేటాయించిన 2.29 కోట్ల షేర్లకుగాను 4 లక్షల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్విబ్ విభాగంలో 1.28 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా.. 2,656 షేర్లకు, నాన్ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 96.16 లక్షల షేర్లకుగాను 60,456 షేర్ల కోసం బిడ్స్ లభించాయి. బుధవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,985 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. -
స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 774 పాయింట్లు క్రాష్
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు బుధవారం ఒకశాతానికిపైగా నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 774 పాయింట్లు పతనమై 60,205 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 226 పాయింట్లు క్షీణించి 18వేల దిగువున 17,892 వద్ద నిలిచింది. ఉదయం ప్రతికూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 898 పాయింట్లు క్షీణించి 60,081 వద్ద, నిఫ్టీ 272 పాయింట్లు నష్టపోయి 17,846 వద్ద ఇంట్రాడే కనిష్టాను నమోదు చేశాయి. సెన్సెక్స్ సూచీలో ఏడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 1.50%, ఒకశాతం నష్టపోయాయి. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా నేడు ఎక్సే్చంజీలకు సెలవు. డాలర్ మారకంలో రూపాయి విలువ 2 పైసలు క్షీణించి 81.65 స్థాయి వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2394 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1378 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. సెన్సెక్స్ ఒకశాతానికి పైగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు రూ.3.66 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. నష్టాలు ఎందుకంటే దేశీయ ప్రధాన ప్రైవేట్ గ్రూప్ అదానీ కంపెనీ షేర్లలో భారీ అమ్మకాలు మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. రిపబ్లిక్ డే సెలవు నేపథ్యంలో వీక్లీ, వారాంతాపు ఎక్స్పైరీ బుధవారమే జరిగింది. దేశీయ అతిపెద్ద ఎఫ్పీఓ(ఆదానీ ఎంటర్ప్రైజస్) ప్రారంభం, టీ1 సెటిల్మెంట్ అమల్లోకి రానుండటం, వచ్చేవారం(బుధవారం) కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పరిణామాల నేపథ్యంలో లిక్విడిటీ కోసం ట్రేడర్లు తమ పొజిషన్లను విక్రయించాయి. ఎఫ్ఐఐలు భారత ఈక్విటీల నుంచి ఈ నెలలో ఇప్పటివరకు రూ. 17 వేల కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, బడ్జెట్ అంచనాలు, ముడి చమురు ధరలు పెరగడం వంటి పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ►నష్టాల మార్కెట్లోనూ టీవీఎస్ కంపెనీ షేరు దూసుకెళ్లింది. డిసెంబర్ త్రైమాసికంలో మెరుగైన ప్రదర్శన కనబరచడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 5.50 శాతం పెరిగి రూ. 1,038 వద్ద స్థిరపడింది. ►క్యూ3లో ఆకర్షణీయ ఫలితాలను సాధించినప్పటికీ., ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేరు విక్రయాల ఒత్తిడికి లోనైంది. నాలుగు శాతం నష్టంతో రూ.715 వద్ద ముగిసింది. ►ఇండస్ టవర్స్ షేరు రెండేళ్ల కనిష్టాన్ని తాకింది. మూడో క్వార్టర్ ఫలితాలు నిరాశపరచడం షేరుకు ప్రతికూలంగా మారింది. బీఎస్ఈలో 7.19% నష్టపోయి రూ. 158.20 వద్ద ముగిసింది. చదవండి: Credit Card Tips: క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఇవి పాటించకపోతే మీ జేబుకు చిల్లు ఖాయం! -
రెండో రోజూ మార్కెట్ల జోరు
ముంబై: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. సెన్సెక్స్ 390 పాయింట్లు జంప్చేసి 61,046 వద్ద నిలిచింది. వెరసి మళ్లీ 61,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ 112 పాయింట్లు జమ చేసుకుని 18,165 వద్ద ముగిసింది. అయితే తొలుత మార్కెట్లు కొంతమేర డీలా పడ్డాయి. వెనువెంటనే ఊపందుకుని చివరివరకూ పటిష్టంగా కదిలాయి. ఇటీవల అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు మంగళవారం స్వల్ప కొనుగోళ్లు చేపట్టడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఆసియా, యూరోపియన్ మార్కెట్ల సానుకూలతలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. మంగళవారం(17న) సైతం సెన్సెక్స్ 563 పాయింట్లు ఎగసిన విషయం విదితమే. కాగా.. తొలుత సెన్సెక్స్ 60,569 వద్ద కనిష్టాన్ని తాకినప్పటికీ ఆపై 61,110 వరకూ దూసుకెళ్లింది. ఈ బాటలో నిఫ్టీ 18,184– 18,032 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. డాలరుతో మారకంలో రూపాయి బౌన్స్బ్యాక్ కావడం మార్కెట్లకు జోష్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. మెటల్స్ జూమ్ ఎన్ఎస్ఈలో మెటల్ ఇండెక్స్ 1.7 శాతం పుంజుకోగా, ఫార్మా, ప్రయివేట్ బ్యాంకింగ్ 0.6 శాతం చొప్పున లాభపడ్డాయి. పీఎస్యూ బ్యాంక్స్ 1.25 శాతం వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా స్టీల్, ఎల్అండ్టీ, యూపీఎల్, విప్రో, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ, దివీస్, గ్రాసిమ్ 3–1 శాతం మధ్య లాభపడ్డాయి. రూపాయి స్పీడ్... డాలరుతో మారకంలో వరుసగా మూడు రోజుల నష్టాలకు దేశీ కరెన్సీ చెక్ పెట్టింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 28 పైసలు లాభపడి 81.41 వద్ద ముగిసింది. అయితే రూపాయి తొలుత 81.80 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి డాలరు ఇండెక్స్ వెనకడుగు వేయడం, దేశీ ఈక్విటీలు ఊపందుకోవడంతో 81.25 వరకూ బలపడింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.5 శాతం క్షీణించి 101.93కు చేరడం రూపాయికి హుషారునిచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. స్టాక్ హైలైట్స్ ►ఈ ఏడాది తొలి 9 నెలల్లో ఆదాయం 41 శాతం ఎగసి రూ. 3,384 కోట్లను తాకడంతో ల్యాండ్మార్క్ కార్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్చేసి రూ. 587 వద్ద ముగిసింది. తొలుత రూ. 599 వరకూ ఎగసింది. 2022 డిసెంబర్ 23న లిస్టయిన తదుపరి ఇదే గరిష్టం! ►క్యూ3 ఫలితాలపై అంచనాలతో ఉషా మార్టిన్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్చేసి రూ. 191 వద్ద ముగిసింది. తొలుత రూ. 199 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ► గత మూడు వారాల్లో 20% ర్యాలీ చేసిన యురేకా ఫోర్బ్స్ షేరు బీఎస్ఈలో తొలుత 1.5 శాతం బలపడి రూ. 537 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. చివరికి అమ్మకాలు పెరిగి 1.6% నష్టంతో రూ. 521 వద్ద ముగిసింది. -
మార్కెట్ బౌన్స్బ్యాక్
ముంబై: ముందురోజు నష్టాల నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్బ్యాక్ అయ్యాయి. సెన్సెక్స్ 563 పాయింట్లు జంప్చేసి 60,656 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 158 పాయింట్లు ఎగసి 18,053 వద్ద ముగిసింది. ప్రధానంగా ఇండెక్స్ హెవీవెయిట్స్కు డిమాండ్ పెరగడంతో మార్కెట్లు ప్రస్తావించదగ్గ స్థాయిలో లాభపడ్డాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీ, బ్యాంకింగ్ సంస్థలు పటిష్ట ఫలితాలు సాధిస్తుండటంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు విశ్లేషించారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 60,704– 60,072 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఈ బాటలో నిఫ్టీ 18,072–17,887 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. పీఎస్యూ బ్యాంక్స్ డీలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ఆయిల్, ఐటీ, ఆటో రంగాలు 1.2–0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు 2 శాతం పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎల్అండ్టీ, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ ద్వయం, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఆర్ఐఎల్, బ్రిటానియా, అల్ట్రాటెక్, మారుతీ 3.7–1.2 శాతం మధ్య ఎగశాయి. అయితే ఎస్బీఐ, బజాజ్ ఫిన్, ఇండస్ఇండ్, విప్రో, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ 1.6–0.4 శాతం మధ్య నీరసించాయి. రూపాయి వీక్ డాలరుతో మారకంలో రూపాయి 12 పైసలు క్షీణించింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 81.70 వద్ద ముగిసింది. సోమవారం ముగింపు 81.58కాగా.. మంగళవారం(17న) ట్రేడింగ్లో 81.79 వద్ద ప్రారంభమైంది. తదుపరి 81.89 వరకూ నీరసించింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.2 శాతం పుంజుకుని 102.4కు బలపడటం దేశీ కరెన్సీని దెబ్బ తీసినట్లు ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి. కాగా.. మంగళవారం ట్రేడింగ్లో చిన్న షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 1,890 నష్టపోగా, 1,621 లాభపడ్డాయి. గత రెండు రోజుల్లో రూ. 3,173 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన ఎఫ్పీఐలు తాజాగా రూ. 211 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! స్టాక్ హైలైట్స్ ∙హైదరాబాద్లో వాణిజ్య నిర్మాణాలకుగాను రూ. 1,000–2,500 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్లు వెల్లడించడంతో ఎల్అండ్టీ కౌంటర్ 4 శాతం జంప్చేసింది. రూ. 2217 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 2,218 వద్ద సరికొత్త గరిష్టాన్ని చేరింది. నేడు(18న) వాటాదారుల అత్యవసర సమావేశం(ఈజీఎం) నిర్వహించనున్న నేపథ్యంలో స్పెషాలిటీ రెస్టారెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో 9 శాతంపైగా జంప్చేసింది. రూ. 273 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సరికొత్త గరిష్టం రూ. 283 వరకూ దూసుకెళ్లింది. చదవండి: Rage Applying: కంపెనీలను కుదిపేస్తున్న'రేజ్ అప్లయింగ్' సునామీ -
మళ్లీ మార్కెట్ల పతనం
ముంబై: షార్ట్ కవరింగ్తో ముందురోజు ర్యాలీ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి పతన బాట పట్టాయి. సెన్సెక్స్ 632 పాయింట్లు కోల్పోయి 60,115 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 809 పాయింట్లవరకూ జారి 59,938కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 187 పాయింట్లు పడిపోయి 17,914 వద్ద స్థిరపడింది. వెరసి సాంకేతికంగా కీలకమైన 18,000 స్థాయిని కోల్పోయింది. బ్యాంకింగ్ కౌంటర్లతోపాటు ఇతర బ్లూచిప్స్లో ఊపందుకున్న అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. అయితే డాలరుతో మారకంలో వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ పుంజుకోవడం గమనార్హం! యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్న నేపథ్యంలో మార్కెట్లలో తాజా అమ్మకాలు నమోదైనట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ విశ్లేషకులు ప్రశాంత్ తాప్సీ పేర్కొన్నారు. గత వారం చివర్లో వరుసగా మూడు రోజులు దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణ పథంలో సాగిన విషయం విదితమే. విదేశీ ఎఫెక్ట్ నేటి(10న) ట్రేడింగ్లో యూరోపియన్ మార్కెట్లు నేలచూపులకే పరిమితంకావడం, అంతకుముందు యూఎస్, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ రిటైల్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు విదేశీ అంశాలకు ప్రభావితమైనట్లు తెలియజేశారు. సెన్సెక్స్ దిగ్గజాలలో ఎయిర్టెల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఐటీసీ, ఆర్ఐఎల్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ ప్రధానంగా నష్టపోయాయి. అయితే టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, హెచ్యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం బలపడ్డాయి. ముందురోజు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు ప్రకటించిన టీసీఎస్ 1 శాతం వెనకడుగు వేసింది. చిన్న షేర్లు డీలా బీఎస్ఈలో టెలికం, సర్వీసులు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, టెక్నాలజీ, కమోడిటీస్, రియల్టీ రంగాలు 1.6–0.7 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు మెటల్, హెల్త్కేర్, ఆటో, ఆయిల్– గ్యాస్ స్వల్పంగా బలపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.5 శాతం స్థాయిలో డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 2189 నష్టపోగా.. 1329 లాభపడ్డాయి. సోమవారం రూ. 203 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) మరో రూ. 2,109 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) మాత్రం రూ. 1,807 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ హైలైట్స్ ► ఈ ఏడాది తొలి అర్ధభాగంలో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించిన ష్నీడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రా షేరు 14 శాతం దూసుకెళ్లి ఏడేళ్ల గరిష్టం రూ. 203కు చేరింది. ► క్యూ3లో జేఎల్ఆర్ హోల్సేల్ అమ్మకాలు ఊపందుకోవడంతో టాటా మోటార్స్ షేరుకి డిమాండ్ పెరిగింది. పతన మార్కెట్లోనూ 6 శాతం జంప్చేసి రూ. 413 వద్ద ముగిసింది. ►సెర్బియన్ సంస్థ నోవెలిక్లో 54 శాతం వాటా కొనుగోలు వార్తలతో సోనా కామ్స్టార్ షేరు 6 శాతం జంప్చేసి రూ. 448 వద్ద ముగిసింది. -
అవును.. కొత్త ఏడాది కలిసొచ్చే కాలమే, ఎందుకో తెలుసా?
గతేడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్కు కొత్త ఏడాది కలిసొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ 2023లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు తెరపడనుంది. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొలిక్కి రావచ్చు. దేశీయ పరిస్థితులను గమనిస్తే.., ధరలు కొండెక్కి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వినియోగం పుంజుకుంటుంది. ప్రభుత్వ వృద్ధి దోహద చర్యలు, ప్రోత్సాహక విధానాలు, కార్పొరేట్ కంపెనీల ఆదాయాల్లో మెరుగైన వృద్ధి మన మార్కెట్ను ముందుకు నడపొచ్చని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడితో.. లాభాలు చూస్తే కళ్లుచెదరాల్సిందే -
పరిమిత శ్రేణిలో ట్రేడింగ్
ముంబై: ట్రేడింగ్లో లాభ, నష్టాల మధ్య పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి. గత రెండు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ(నేడు)కి ముందురోజు ట్రేడర్లు అప్రమత్తత వహించారు. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఉదయం సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 60,812 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో 362 పాయింట్ల పరిధిలో 61,075 వద్ద గరిష్టాన్ని, 60,714 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 18 పాయింట్ల నష్టంతో 60,910 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో 18,132 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 18,173 – 18,068 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. ఆఖరికి పది పాయింట్లు పతనమై 18,122 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ షేర్లు రాణించాయి. కాగా, డాలర్ మారకంలో రూపాయి విలువ ఏడు పైసలు పెరిగి 82.80 స్థాయి వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► ఇండియా పెస్టిసైడ్స్ షేరు తొమ్మిదిశాతం లాభపడి రూ.263 వద్ద స్థిరపడింది. తన అనుబంధ షల్విస్ స్పెషాలిటీస్ ఉత్తరప్రదేశ్లో తయారీ ప్లాంట్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతి లభించడం షేరు ర్యాలీకి కారణమైంది. ట్రేడింగ్లో 11% బలపడి రూ.269 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ► మాల్దీవులు దేశంలో యూటీఎఫ్ హార్బర్ ప్రాజెక్ట్ అభివృద్ధి పనులను ఆర్వీఎన్ఎల్ దక్కించుకోవడంతో ఈ కంపెనీ షేరు ఐదు శాతం పెరిగి రూ.67 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకింది. చదవండి: దేశంలో తగ్గని ఐపీవో జోరు..ఐపీవోకి సిద్దంగా దిగ్గజ కంపెనీలు -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. 4 రోజుల్లో రూ.15.78 లక్షల కోట్లు ఆవిరి!
ముంబై: కోవిడ్ భయాలకు తోడు తాజాగా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు తెరపైకి రావడంతో శుక్రవారం స్టాక్ సూచీలు కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలు సెంటిమెంట్ను మరింత బలహీనపరిచాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ విస్తృత స్థాయిలో మార్కెట్లో అన్ని రంగాలలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 60 వేల స్థాయిని, నిఫ్టీ 18 వేల స్టాయిలను కోల్పోయాయి. మార్కెట్ ముగిసే సెన్సెక్స్ 981 పాయింట్లు క్షీణించి 60 వేల దిగువన 59,845 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 321 పాయింట్లు నష్టపోయి 17,807 వద్ద నిలిచింది. మధ్య, చిన్న తరహా షేర్లలో నెలకొన్న అమ్మకాల సునామీతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.11%, మిడ్క్యాప్ సూచీ 3.40 చొప్పున క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.706 కోట్లు షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,399 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో థాయ్లాండ్ తప్ప అన్ని దేశాల సూచీలు నష్టాల రెండున్నర శాతం వరకు క్షీణించాయి. యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం పతనమయ్యాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు ఒకశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో ఈ వారం సూచీలు భారీగా నష్టపోయాయి. ఈ ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,493 పాయింట్లు, నిఫ్టీ 462 పాయింట్లు కోల్పోయాయి. 4 రోజుల్లో రూ.15.78 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ నాలుగు ట్రేడింగ్ సెషన్లలో 1961 పాయింట్ల(మూడుశాతానికి పైగా) పతనంతో స్టాక్ మార్కెట్లో భారీగా సంపద హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.15.78 లక్షల కోట్లు తగ్గి రూ. 272.12 లక్షల కోట్లకు చేరింది. ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్ల భారీ పతనం ప్రభుత్వరంగ షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 14%, యూనియన్ బ్యాంక్ 10.57%, సెంట్రల్ బ్యాంక్, యూకో బ్యాంక్ షేర్లు పదిశాతం, మహారాష్ట్ర బ్యాంక్, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 8–7% చొప్పున నష్టపోయాయి. కెనరా బ్యాంక్. పీఎస్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ షేర్లు 5 నుంచి మూడుశాతం పతనమయ్యాయి. ఫలితంగా నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 6.5% నష్టపోయింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► లిస్టింగ్ తొలిరోజే ల్యాండ్మార్క్ కార్స్ షేరు డీలాపడింది. ఇష్యూ ధర (రూ.506)తో పోలిస్తే 7% డిస్కౌంట్తో రూ.471 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 12% క్షీణించి రూ.446 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి పదిశాతం నష్టంతో రూ.456 వద్ద స్థిరపడింది. ► అబాన్స్ హోల్డింగ్స్ కూడా ఇష్యూ ధర (రూ.270)తో పోలిస్తే 1% నష్టంతో ఫ్లాట్గా రూ.273 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ పతనంలో భాగంగా ట్రేడింగ్లో 20% క్షీణించి రూ.216 అప్పర్ సర్క్యూట్ తాకి ముగిసింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్ఫోన్! -
మూడు వారాల్లో అతిపెద్ద లాభం
ముంబై: బ్యాంకింగ్, ఇంధన, ఎఫ్ఎంసీజీ షేర్లు పరుగులు తీయడంతో స్టాక్ సూచీలు మూడు వారాల్లోనే అతిపెద్ద ఒకరోజు లాభాన్ని సోమవారం నమోదు చేశాయి. యూరప్ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. గతవారంలో నష్టాలను చవిచూసిన సూచీలు ఈ వారం అతి స్వల్ప ఫ్లాట్గా ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆసియా మార్కెట్ల రికవరీ, యూరప్ మార్కెట్ల సానుకూల వార్తలతో సూచీలు రోజంతా పటిష్టమైన లాభాలతో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఉదయం 61,405 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 507 పాయింట్లు బలపడి 61,845 గరిష్టాన్ని తాకింది. చివరికి 468 పాయింట్ల పెరిగి 61,806 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 151 పాయింట్లు ర్యాలీ చేసి 18,420 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 163 పాయింట్లు పెరిగి 18432 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. వచ్చే ఏడాది(2023)లో అమెరికా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) వృద్ధి నెమ్మదించే అవకాశాలు ఉండొచ్చనే అంచనాలతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అలాగే ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ అరశాతం, స్మాల్ సూచీ 0.30% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.538 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.687 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► కెఫిన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకు తొలిరోజు 55 శాతం స్పందన లభించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ 2.27 కోట్ల షేర్లను జారీ చేయగా, 1.29 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ► గడిచిన నెలరోజుల్లో నైకా విక్రయాలు భారీగా తగ్గిపోవడం ఈ కంపెనీ షేరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. బీఎస్ఈ ఇంట్రాడేలో నాలుగు శాతానికి పైగా పతనమై రూ.158 వద్ద జీవితకాల కనిష్టానికి దిగివచి్చంది. ఆఖరికి మూడుశాతం నష్టంతో రూ.163 వద్ద స్థిరపడింది. -
12 కోట్లకు బీఎస్ఈ ఇన్వెస్టర్లు
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం బీఎస్ఈలో రిజిస్టరైన ఇన్వెస్టర్ల ఖాతాలు గత 148 రోజుల్లో కోటి జత కలిశాయి. దీంతో ఎక్సే్ఛంజీలో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 12 కోట్ల మైలురాయిని తాకింది. జులై 18 నుంచి డిసెంబర్ 13 మధ్య కాలంలో కోటి ఖాతాలు కొత్తగా జ త కలసినట్లు బీఎస్ఈ వెల్లడించింది. కాగా.. ఇంతక్రితం 11 కోట్ల ఇన్వెస్టర్ల సంఖ్య చేరేందుకు 124 రోజులు తీసుకోగా.. 10 కోట్లకు 91 రోజులు, 9 కోట్లకు 85 రోజులు, 8 కోట్లకు 107 రోజులు పట్టడం గమనించదగ్గ అంశం! యూనిట్ క్లయింట్ కోడ్(యూసీసీ) ఆధారంగా 2022 డిసెంబర్ 13కల్లా రిజిస్టరైన ఇన్వెస్టర్లు 12 కోట్లకు చేరినట్లు బీఎస్ఈ తెలియజేసింది. వీరిలో 42 శాతంమంది 30–40 వయ సువారుకాగా.. 23 శాతంమంది 20–30 వయసును కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక 40–50 వయసు వ్యక్తుల వాటా 11 శాతంగా వెల్లడించింది. ఇన్వెస్టర్ల సంఖ్యలో 20 శాతం మహారాష్ట్రకు చెందగా.. 10 శాతంతో గుజరాత్, 9 శాతంతో యూపీ, 6 శాతంతో రాజస్తాన్, తమిళనాడు తదుపరి ర్యాంకులలో నిలుస్తున్నాయి. చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! -
స్టాక్ మార్కెట్: ప్రారంభంలో హుషారు.. చివర్లో నీరసం
ముంబై: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ రోజంతా నష్టాలలోనే కదిలాయి. చివరికి సెన్సెక్స్ 87 పాయింట్లు క్షీణించి 61,663 వద్ద ముగిసింది. నిఫ్టీ 36 పాయింట్లు తక్కువగా 18,308 వద్ద స్థిరపడింది. తొలుత హుషారు చూపిన మార్కెట్లు వెనువెంటనే నీరసించాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో మిడ్ సెషన్కల్లా సెన్సెక్స్ 61,337కు, నిఫ్టీ 18,210 దిగువకు చేరాయి. ఈ వారం ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో నిలిచాయి. నికరంగా సెన్సెక్స్ 132 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయాయి. ఆటో బ్లూచిప్స్ వీక్: ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగాలు 1.2–0.6 శాతం మధ్య క్షీణించాయి. అయితే పీఎస్యూ బ్యాంక్స్ 1.5 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, ఐషర్, మారుతీ, సిప్లా, కోల్ ఇండియా, టాటా కన్జూమర్, ఎయిర్టెల్, యూపీఎల్ 2.5–1 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, హెచ్యూఎల్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంక్ 1.2–0.4 శాతం మధ్య బలపడ్డాయి. చిన్న షేర్లూ: మార్కెట్లను మించుతూ మిడ్, స్మాల్ క్యాప్స్ వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,137 నష్టపోగా.. 1,360 లాభపడ్డాయి. చదవండి: QR Code On Cylinders: కేంద్రం సంచలన నిర్ణయం, గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త -
కొత్త గరిష్టాల వద్ద ముగింపు
ముంబై: ట్రేడింగ్లో పరిమితి శ్రేణిలో కదలాడిన సూచీలు బుధవారం కొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్స్ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలోనూ తాజా ఏడాది గరిష్టాలను నమోదుచేశాయి. సెన్సెక్స్ ఉదయం 164 నష్టంతో 61,709 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో 180 పాయింట్లు బలపడి 62,053 వద్ద కొత్త ఏడాది గరిష్టాన్ని తాకింది. అలాగే 61,709 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 108 పాయింట్ల పెరిగి కొత్త జీవితకాల గరిష్టం 61,981 వద్ద స్థిరపడింది. నిఫ్టీ రోజంతా 98 పాయింట్ల పరిధిలో కదలాడి 18,442 వద్ద 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 6 పాయింట్ల అతి స్వల్ప లాభంతో 18,410 వద్ద ముగిసింది. ఆటో, మీడియా, మెటల్, ఫార్మా, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.386 కోట్లను షేర్లను అమ్మేశా రు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1437 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు, యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 35 పైసలు బలహీనపడి 81.26 స్థాయి వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మేదాంతా బ్రాండ్ పేరుతో హాస్పిటల్స్ చైన్ నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్ ఐపీవో లిస్టింగ్ మెప్పించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.336తో పోలిస్తే 18% ప్రీమియంతో రూ.398 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 26% ర్యాలీ చేసి రూ.425 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగిసేసరికి 23 శాతం బలపడి రూ.416 వద్ద స్థిరపడింది. ► బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ఐపీవో సైతం విజయవంతమైంది. ఇష్యూ ధర రూ.300తో పోలిస్తే 7% ప్రీమియంతో రూ.321 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 12% రూ.335 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 6% పెరిగి రూ.317 వద్ద స్థిరపడింది. యాక్సిస్ వాటాకు రూ. 3,839 కోట్లు ఎస్యూయూటీఐ ద్వారా ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్లోగల 1.5 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించింది. షేరుకి రూ. 830.63 ఫ్లోర్ ధరలో గత వారం ప్రభుత్వం 4.65 కోట్లకుపైగా యాక్సిస్ షేర్లను విక్రయించింది. వెరసి రూ. 3,839 కోట్లు అందుకున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా ట్వీట్ చేశారు. దీంతో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 28,383 కోట్లను సమకూర్చుకున్నట్లు వెల్లడించారు. చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
స్టాక్ మార్కెట్: ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్
ముంబై: ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణతో స్టాక్ సూచీల ఏడురోజుల వరుస ర్యాలీకి మంగళవారం బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్లలోని బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ సెంటిమెంట్పై ప్రభావం చూపాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఒకటిన్నర శాతం పతనమూ సూచీల నష్టాలకు కారణమైంది. సెన్సెక్స్ 288 పాయింట్ల నష్టంతో 59,544 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 75 పాయింట్లు పతనమై 17,656 వద్ద నిలిచింది. ప్రైవేట్ రంగ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఫార్మా, మెటల్, ఐటీ, ఆటో రంగాల షేర్లు రాణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ అర శాతం లాభపడగా, స్మాల్క్యాప్ సూచీ 0.35% చొప్పున నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.247 కోట్ల షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.872 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్కాంగ్, తైవాన్, కొరియా, ఇండోనేషియా, చైనా దేశాల మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ సూచీలు అరశాతం లాభపడ్డాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. 60వేల స్థాయి నుంచి వెనక్కి సెన్సెక్స్ ఉదయం 171 పాయింట్ల లాభంతో 60,003 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 17,808 వద్ద మొదలయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 60,081 గరిష్టాన్ని తాకింది. లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 59,489 పాయింట్ల వద్ద కనిష్టానికి దిగివచ్చింది. నిఫ్టీ 17,637–17,812 పాయింట్ల మధ్య కదలాడింది. మార్కెట్లకు సెలవు బలిప్రతిపద సందర్భంగా (నేడు)బుధవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలు పనిచేయవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు్ల ఉదయం సెషన్లో మాత్రమే సెలవును పాటిస్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. ‘మూరత్ ట్రేడింగ్’లో లాభాలు దీపావళి(హిందూ సంవత్ 2079 ఏడాది)సందర్భంగా సోమవారం జరిగిన ‘మూరత్ ట్రేడింగ్’లో దేశీ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. సాయంత్రం 6.15 నుంచి రాత్రి 7.15 నిమిషాల మధ్య జరిగిన ఈ ప్రత్యేక ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఫలితంగా సెన్సెక్స్ 525 పాయింట్ల లాభంతో 59,831 వద్ద ముగిసింది. నిఫ్టీ 154 పాయింట్లు పెరిగి 17,731 వద్ద స్థిరపడింది. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
సెన్సెక్స్.. బౌన్స్ బ్యాక్!
ముంబై: ఆర్బీఐ రెపో రేటును పెంచినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. తొలుత నష్టాలతో ప్రారంభమైన ప్రధాన ఇండెక్సులు తదుపరి ఆర్బీఐ ప్రకటించిన జీడీపీ, ద్రవ్యోల్బణ అంచనాలతో దూసుకెళ్లాయి. సమయం గడిచేకొద్దీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ఆసక్తి చూపడంతో సాంకేతికంగా కీలకమైన స్థాయిలను అధిగమించాయి. సెన్సెక్స్ 1,017 పాయింట్లు జమ చేసుకుని 57,427 వద్ద ముగిసింది. నిఫ్టీ 276 పాయింట్లు ఎగసి 17,094 వద్ద స్థిరపడింది. కొత్త సిరీస్(అక్టోబర్) తొలి రోజు ట్రేడర్లు లాంగ్ పొజిషన్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంచనాలకు తగ్గట్లే 0.5 శాతం రెపో పెంపు, రూపాయి పుంజుకోవడం వంటి అంశాలు సెంటిమెంటుకు జోష్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. బ్యాంకింగ్, మెటల్ జోరు..: ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, రియల్టీ, ఆటో, వినియోగ వస్తువులు 3–1.5% మధ్య ఎగశాయి. హిందాల్కో, ఎయిర్టెల్, ఇండస్ఇండ్, బజాజ్ ఫిన్ ద్వయం, కొటక్ బ్యాంక్, టైటన్, హెచ్డీఎఫ్సీ ద్వయం, టాటా స్టీల్, ఐసీఐసీఐ, యూపీఎల్, మారుతీ, యాక్సిస్ 5.6–2.3% మధ్య జంప్చేశాయి. ►5జీ సేవలు ప్రారంభంకానుండటంతో ఎయిర్టెల్ షేరు సరికొత్త గరిష్టం రూ. 809ను తాకింది. చివరికి 4.6% జంప్చేసి రూ. 800 వద్ద ముగిసింది. ►ప్రమోటర్ సంస్థ స్పిట్జీ ట్రేడ్ 40 లక్షల షేర్లను కొనుగోలు చేసిన వార్తలతో అదానీ గ్రీన్ ఎనర్జీ 12.5 శాతం దూసుకెళ్లింది. రూ. 2,253 వద్ద నిలిచింది. తొలుత రూ. 2,405కు ఎగసింది. ►పవర్గ్రిడ్ నుంచి రూ. 333 కోట్ల విలువైన ఆర్డర్ను పొందిన వార్తలతో బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు 5 శాతం జంప్చేసి రూ. 1,192 వద్ద ముగిసింది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
గ్లోబల్ మాంద్యం భయాలు: 5 లక్షల కోట్లు ఢమాల్
సాక్షి,ముంబై: బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్మాంద్యం, ముఖ్యంగా ఫెడ్ రిజర్వ్ వడ్డింపుతో దేశీయ స్టాక్మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసింది. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రికార్డు కనిష్టానికి చేరింది. సెన్సెక్స్ 1020 పాయింట్ల నష్టంతో 58,098 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 1.72 శాతం క్షీణించి 17,327 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్ 57,981కి పడిపోయింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్. ఆటో, ఐటీ రంగ షేర్లు నష్టపోయాయి. వరుసగా మూడో సెషన్లో పతనాన్ని నమోదు చేయడమే కాదు, వరుసగా నాల్గవ వారాంతంలోనూ క్షీణించాయి. అన్ని బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 276.6 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ ఒక్కరోజు ట్రేడర్లు రూ.4.9 లక్షల కోట్ల మేర నష్ట పోయారు. టెక్నికల్గా సెన్సెక్స్ 59500 స్థాయిని నిఫ్టీ 17500 స్థాయికి చేరింది. దీంతో ఇన్వెస్టర్లు టెక్నికల్ లెవల్స్ను జాగ్రత్తగా పరిశీలిస్తారని, ఈ స్థాయిలు బ్రేక్ అయితే అమ్మకాల వెల్లువ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఫెడ్ వడ్డింపు, డాలర్ ఇండెక్స్ 20ఏళ్ల గరిష్టానికి చేరడంతో, రూపాయి పతనం,అమెరికా బాండ్ ఈల్డ్స్ పతనం,ఎఫ్ఐఐల అమ్మకాలు బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీలో పతనం తదితర కారణాలు మార్కెట్ ఔట్లుక్ను బేరిష్గా మార్చాయి. దీనికి తోడుఫెడ్బాటలోనే ఆర్బీఐ కూడా రానున్న సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచనుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే బ్రిటన్, స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. -
స్టాక్ మార్కెట్: 3 రోజుల నష్టాలకు చెక్
ముంబై: స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో రోజంతా లాభాలతో కదిలాయి. సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ సాధించి 59,141 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 92 పాయింట్లు ఎగసి 17,622 వద్ద స్థిరపడింది. వెరసి ప్రపంచ మార్కెట్ల ట్రెండ్కు విరుద్ధమైన రీతిలో నిలిచాయి. ప్రారంభంలో వెనకడుగు వేసినప్పటికీ వెనువెంటనే పుంజుకున్నాయి. ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్, మీడియా, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలు 2–1 శాతం మధ్య లాభపడి మార్కెట్లకు దన్నునిచ్చాయి. రియల్టీ 1 శాతం, మెటల్ 0.5 శాతం చొప్పున నీరసించాయి. బ్లూచిప్స్ తీరిలా.. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్యూఎల్, ఎస్బీఐ, నెస్లే, బజాజ్ ఫిన్, హెచ్డీఎఫ్సీ, దివీస్, ఐటీసీ, యాక్సిస్, యూపీఎల్, ఐషర్, మారుతీ, ఇన్ఫోసిస్ 3.4–1 శాతం మధ్య లాభపడ్డాయి. మరోపక్క టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా, పవర్గ్రిడ్, సిప్లా, ఐసీఐసీఐ 2.4–0.8 శాతం మధ్య నష్టపోయాయి. చిన్న షేర్లు వీక్ మార్కెట్లు బలపడినప్పటికీ చిన్న షేర్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. దీంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ ఇండెక్సులు 0.16 శాతం చొప్పున డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,973 నష్టపోగా.. 1,655 లాభపడ్డాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 312 కోట్లు ఇన్వెస్ట్ చేయగా దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 95 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. తాత్కాలికమే.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష నేపథ్యంలో ఇకపై మార్కెట్లు ఊగిసలాటకు లోనుకావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్ధ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. బుధవారం ప్రకటించనున్న సమీక్షలో ఫెడ్ 0.75% వడ్డీ రేటును పెంచే అంచనాలున్నట్లు తెలియజేశారు. స్టాక్ హైలైట్స్ ► హెర్క్యులెస్ హోయిస్ట్స్ షేరు బిజినెస్ల విడదీత వార్తలతో 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 218 వద్ద ఫ్రీజయ్యింది. ► షుగర్, ఇంజనీరింగ్ విభాగాలుగల త్రివేణీ ఇంజనీరింగ్ షేరు 17% జంప్చేసి 288 వద్ద ముగిసింది. ► వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్ల కోసం మాడ్యులర్ ఇంటీరియర్స్కు రూ. 113 కోట్ల విలువైన ఆర్డర్లు లభించడంతో ఇండోనేషనల్ షేరు 20% అప్పర్ సర్క్యూట్ రూ. 404 వద్ద ముగిసింది. ► అదానీ గ్రూప్ తాజాగా రూ. 20,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించడంతో అంబుజా సిమెంట్స్ 9% దూసుకెళ్లి 565 వద్ద ముగిసింది. చదవండి: బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్.. రూ.275 ప్లాన్తో 3300జీబీ.. ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే! -
మార్కెట్లో మాంద్యం భయాలు
ముంబై: ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చనే భయాలతో శుక్రవారం దలాల్ స్ట్రీట్లో అమ్మకాలు పోటెత్తాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు సెంటిమెంట్పై మరింత ఒత్తిడిని పెంచాయి. ట్రేడింగ్ ఆద్యంతం అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండుశాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1,093 పాయింట్లు క్షీణించి 58,840 వద్ద ముగిసింది. ఈ సూచీలో మొత్తం నాలుగు మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీ 347 పాయింట్లను కోల్పోయి 17,531 వద్ద నిలిచింది. నిఫ్టీ 50 షేర్లలో సిప్లా, ఇండస్ ఇండ్ షేర్లు మాత్రమే లాభంతో గట్టెక్కాయి. ఐటీ, ఆటో, రియల్టీ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ మూడు శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ రెండుశాతం చొప్పున క్షీణించాయి. ట్రెజరీ బాండ్లపై రాబడులు, డాలర్ ఇండెక్స్ పెరగడంతో పెరుగుదలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో సూచీలు ఒకవారంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 952 పాయింట్లు, నిఫ్టీ 303 పాయింట్లను కోల్పోయాయి. ట్రేడింగ్ ఆద్యంత అమ్మకాలే... ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 349 పాయింట్లు పతనమై 59,585 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లు క్షీణించి 17,797 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటంతో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలకే మొగ్గుచూపారు. ఒక దశలో సెన్సెక్స్ 1247 పాయింట్లను కోల్పోయి 58,687 వద్ద, నిఫ్టీ 380 పాయింట్ల నష్టాన్ని చవిచూసి 17,497 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. కాగా, సెన్సెక్స్ భారీ నష్టంతో శుక్రవారం ఒక్క రోజే ఇన్వెస్టర్లకు రూ.6.18 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఇదే సూచీ గడిచిన మూడు రోజుల్లో 1,730 పాయింట్లను కోల్పోవడంతో మొత్తం రూ.7 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. వెరసి బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.285.90 లక్షల కోట్ల నుంచి రూ.279.80 లక్షల కోట్లకు దిగివచ్చింది. నష్టాలు ఎందుకంటే అంతర్జాతీయంగా మాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ హెచ్చరించడంతో భారత్తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ద్రవ్యోల్బణ కట్టడికి కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధాన అమలుకు సిద్ధమతున్న వేళ.., వడ్డీరేట్ల పెంపుతో ఆర్థిక మాంద్యం ముంచుకురావచ్చనే ఆందోళనలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. దేశీయంగా ఆగస్టులో ద్రవ్యోల్బణం మళ్లీ ఎగువబాట పట్టడం ఆందోళన కలిగించింది -
పావెల్ ప్రకటనతో భారీ పతనం.. రూ.2.39 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీరేట్ల పెంపు తప్పదని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటనతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. ఉదయం భారీ నష్టాలతో మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల ప్రభావంతో రోజంతా బలహీనంగానే ట్రేడయ్యాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 861 పాయింట్లు క్షీణించి 57,973 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 246 పాయింట్ల పతనంతో 17,313 వద్ద నిలిచింది. ఆసియాలో ఒక్క చైనా అన్ని దేశాల స్టాక్ సూచీలు రెండుశాతం నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 0.50% నుంచి ఒకశాతం పతనమయ్యాయి. అమెరికా సూచీలు పావుశాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ ఒకటిన్నర నష్టంతో బీఎస్ఈలో రూ.2.39 లక్షల కోట్ల సంపద మాయమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొ త్తం విలువ రూ.274 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఆరంభ నష్టాల నుంచి రికవరీ అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఉదయం స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 1467 పాయింట్ల పతనంతో 57,367 వద్ద, నిఫ్టీ 370 పాయింట్ల పతనంతో 370 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 57,367 వద్ద కనిష్టాన్ని, 58,208 గరిష్టాన్ని చూసింది. నిఫ్టీ 17,380 – 17,166 పరిధిలో ట్రేడైంది. రిలయన్స్ షేరు ఒడిదుడుకులకు లోనై, చివరికి ఒకశాతం నష్టంతో రూ.2,597 వద్ద ముగిసింది. -
ఝున్ఝున్వాలా లేని ఆకాశ ఎయిర్లైన్ పరిస్థితి ఏంటి?
సాక్షి,ముంబై: రాకేష్ ఝున్ఝున్వాలా అకాలమరణంతో ఇటీవలే సేవలను ప్రారంభించిన సరికొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్లైన్ భవితవ్యం ఏంటి? ప్రణాళికలు ఏంటి? సంస్థ నిర్వహణ ఎలా ఉండబోతోంది అనే సందేహాలు బిజినెస్ వర్గాల్లో నెలకొన్నాయి. ఝున్ఝున్వాలా రెక్కల కింద ఎదగాలని, రాణించాలని ఎదురు చూసిన ఆకాశ ఎయిర్కి ఆయన ఆకస్మిక మరణం షాక్నిచ్చింది. (ఝున్ఝున్వాలా అస్తమయంపై స్మృతి ఇరానీ ఏమన్నారంటే) ముఖ్యంగా భారతదేశంలో, బిలియనీర్ యాజమాన్యంలోని విమానయాన సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, సుబ్రతా రాయ్ సహారాకు చెందిన సహారా ఎయిర్లైన్స్ కథ ఇదే. ఈ కారణంగానే విశ్లేషకులు ఆకాశ ఎయిర్ కార్యకలాపాలను ప్రారంభించకముందే దాని భవిష్యత్తుపై, సందేహాలను, భయాలను వ్యక్తం చేశారు. ఇపుడు ఆయన హఠాన్మరణంతో ఈ భయాలు మరింత పెరిగాయి. (రాకేష్ ఝున్ఝున్వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా?) అయితే ఆకాశ సీఈఓ వినయ్ దూబే మాట్లాడుతూ ఝున్ఝున్వాలా వారసత్వాన్ని, విలువను ముందుకు తీసుకెడతామని, మంచి విలువలతో గొప్ప విమానయాన సంస్థగా నడపడానికి కృషి చేస్తామని దూబే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా తనపై విశ్వాసముంచిన ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆకాశకు ఝున్ఝున్వాలా చాలా కీలకం. ముఖ్యమైన పెట్టుబడిదారుడిగా మాత్రమే కాకుండా ఆయనకున్న అపారమైన పలుకుబడితో బ్యాంకులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుండి చౌకగా ఫైనాన్సింగ్ ఏర్పాటు చేయగల సత్తా ఉన్నవారు. అలాంటి ఆయన మరణంతో కొంత ఒత్తిడి తప్పదని సీనియర్ ఎయిర్లైన్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు. ఆయన మరణం కంపెనీ వృద్ధికి, ఆశయ సాధనకు తాత్కాలిక బ్రేక్స్ ఇస్తుందని, పెట్టుబడిదారులు కూడా జాగ్రత్తగా ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే దేశ విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే గ్లోబల్ఎయిర్లైన్స్తో ఆకాశ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని మరికొంతమంది మార్కెట్ నిపుణుల అంచనా. ఝున్ఝున్వాలా ఎయిర్ లైన్స్ సంస్థ ఎల్సిసిలో 40 శాతానికి పైగా వాటా 3.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 264 కోట్లు) పెట్టుబడులు పెట్టాడు. ఇది ఆయన చివరి ప్రధాన పెట్టుబడులలో ఒకటి మాత్రమే కాదు, ఆయనకు అత్యంత ఇష్టమైనది కూడా. ఆకాశ మొదటి విమానంలోని ప్రయాణీకులతో తీసుకున్న సెల్పీలు తీపి జ్ఞాపకాలుగా మిగిలి పోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ పేరొందిన ఝున్ఝున్వాలా చివరిసారిగా ఆగస్ట్ 7న ముంబై -అహ్మదాబాద్ మధ్య జరిగిన ఆకాశ ఎయిర్ తొలి విమాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిపించారు. వీల్చైర్లో తిరుగుతూ అందరిన్నీ ఉత్సాహపరుస్తూ జోక్స్ వేస్తూ పోటీదారులతో ముచ్చటించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణీకుల సౌకర్యాల్లోగానీ, ఉత్పత్తి నాణ్యతలో ఎలాంటి రాజీలేకుండా పొదుపుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆకాశ యాజమాన్యం , సిబ్బందికి పిలుపునిచ్చారు. ఆకాశ కోసం ఝున్ఝున్వాలా ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టి ఇండిగో లాంటి సంస్థల్ని భయపెట్టిన ఝున్ఝున్వాలా సంస్థ భవిష్యత్తు కోసం భారీ ప్రణాళికలే వేశారు విస్తృతమైన పెట్టుబడితో పాటు, ఎయిర్లైన్ నిర్వహణ కోసం అగ్రశ్రేణి విమానయాన పరిశ్రమ లీడర్లను ఎంచుకున్నారు. ప్రపంచంలో బహుశా ఏ విమానయాన సంస్థ ఏర్పాటైన 12 నెలల్లో సేవలు ప్రారంభించ లేదు. కానీ ఝున్ఝున్వాలా ఆ ఘనతను సాధించారు. ముఖ్యంగా జెట్ ఎయిర్వేస్, గో ఫస్ట్ సీఈఓగా పనిచేసిన దుబెనే సీఈవోగా ఎంపిక చేశారు. విమానయాన సంస్థలో దుబేకు 31 శాతం వాటా ఉంది. అలాగే 2018 వరకు ఇండిగో డైరెక్టర్గా ఒక దశాబ్దం పాటు పనిచేసిన ఆదిత్య ఘోష్ను కూడా తన టీంలో చేర్చుకున్నారు. ఘోష్ ఎయిర్లైన్లో 10 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఝున్ఝున్వాలా చరిష్మా సలహాలు, ఫండ్ పుల్లింగ్ సామర్థ్యాలు ఆకాశకు ఇకపై అందుబాటులో లేనప్పటికీ, ఆకాశ అభివృద్ధి చెందుతుందని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లోని రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని అన్నారు. ఆ మేరకు ఆయన సంస్థను కట్టుదిట్టం చేశారన్నారు. ఇండియా జనాభా, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, ఏవియేషన్ పరిశ్రమ వృద్ధిపై ఆయన విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక ఆకాశ ఎయిర్ అని అన్నారు. అక్టోబర్ 11న రాకేశ్ ఝున్ఝున్వాలా ప్రమోటర్గా ఉన్న 'ఆకాశ ఎయిర్' అల్ట్రా-లో కాస్ట్ విమాన సేవలు ప్రారంభించేందుకు పౌర విమానయాన శాఖ నుంచి ప్రాథమిక అనుమతులు లభించాయి. జులై 7న సేవలు ప్రారంభించేందుకు 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్' నుంచి 'ఆపరేటర్ సర్టిఫికేట్' పొందింది. ఆకాశ ఎయిర్ ఆగస్టు 7న తొలి సర్వీసును నడిపింది. ఈ క్రమంలోనే ఆగస్టు 13న బెంగళూరు-కొచ్చి, ఆగస్టు19న బెంగళూరు-ముంబై,సెప్టెంబరు 15న చెన్నై-ముంబైకు తన విమాన సేవల్ని అందించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. -
స్టాక్ మార్కెట్: ఆరో రోజూ అదే సీన్.. ఆఖరి గంట ఊపిరిపోసింది
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనైన సూచీలు.., ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆరో రోజూ లాభాలను ఆర్జించాయి. ఐటీ షేర్లతో పాటు అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రాణించాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 214 పాయింట్లు పెరిగి 58,351 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 43 పాయింట్లు బలపడి 17,388 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 57,789–58,416 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 182 పాయింట్ల రేంజ్లో కదలాడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.765 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.518 కోట్ల షేర్లను అమ్మేశారు. అమెరికా, చైనా మధ్య తైవాన్ వివాదంతో ప్రపంచ మార్కెట్లు లాభ, నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆరు రోజుల్లో రూ.13.53 లక్షల కోట్లు గడచిన ఆరు రోజుల్లో సెన్సెక్స్ సూచీ ఐదున్నర శాతానికి(3,082 పాయింట్లు)పైగా ర్యాలీ చేయడంతో బీఎస్ఈలో రూ.13.53 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.271 లక్షల కోట్లకు చేరింది. ఇదే ఆరు రోజుల్లో నిఫ్టీ 904 పాయింట్లు పెరిగింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► 5జీ ఉత్పత్తుల ఆవిష్కరణకు జియోతో జతకట్టడంతో సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రొవైడర్ సుబెక్స్ షేరు 20% పెరిగి రూ.33.30 అప్పర్ సర్క్యూట్ను తాకింది. ► మధ్య ప్రాచ్యానికి చెందిన ఓ ప్రముఖ ఎయిర్వేస్ సంస్థకు 24% వాటాను అమ్మేందుకు చర్చలు జరుపుతుందనే వార్తలతో స్పైస్జెట్ జెట్ షేరు 13 శాతం లాభపడి రూ.50.05 వద్ద స్థిరపడింది. ► రైడ్ షేరింగ్ దిగ్గజం ఉబెర్.., జొమాటోలో తనకున్న మొత్తం వాటాను విక్రయించడంతో జొమాటో షేరు తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ట్రేడింగ్లో 9.62% పతనమై రూ.50.25కి దిగివచ్చింది. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో 0.50% స్వల్ప నష్టంతో రూ.55.40 వద్ద నిలిచింది. చదవండి: 'ప్రమాదం అంటే ఓ వ్యక్తి రోడ్డున పడటం కాదు..ఒక కుటుంబం రోడ్డున పడటం' -
స్టాక్ మార్కెట్: ఏప్రిల్ 13 తర్వాత.. ఇదే తొలిసారి
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు ఆటో షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారమూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు కలిసొచ్చాయి. కేంద్రం వెల్లడించిన స్థూల ఆర్థిక గణాంకాలు అంచనాలకు తగ్గట్లు నమోదయ్యాయి. కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పించగలిగాయి. ఫలితంగా మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ 545 పాయింట్లు పెరిగి 58,115 వద్ద నిలిచింది. ఏప్రిల్ 13వ తేదీ తర్వాత సెన్సెక్స్ 58 వేల స్థాయిపై ముగియడం ఇదే తొలిసారి. నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో 17,340 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు. కాగా, ఇటీవల జీవితకాల కనిష్టానికి దిగివచ్చిన రూపాయి రికవరీ క్రమంగా రికవరీ అవుతోంది. సోమవారం 18 పైసలు బలపడి నెలగరిష్ట స్థాయి 79.24 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా వాహన విక్రయాలు జూలైలోనూ రెండంకెల వృద్ధిని నమోదు చేయడంతో ఆటో షేర్లు భారీగా గిరాకీ నెలకొంది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు విషయంలో ఇకపై దూకుడు వైఖరిని ప్రదర్శించకపోవచ్చనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 4 రోజులు: రూ.12.74 లక్షల కోట్లు 4 రోజుల ర్యాలీతో రూ.12.74 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.270 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► 5జీ స్పెక్ట్రం కోసం రికార్డు స్థాయిలో రూ.1.50 లక్షల కోట్లకు పైగా బిడ్లు ధాఖలవడంతో టెలికాం షేర్లు లాభాల మోత మోగించాయి. రిలయన్స్ 2.60% ఎగసి రూ.2,575 వద్ద స్థిరపడింది. ఎయిర్టెల్ షేరు 2.40% పెరిగి రూ.694 వద్ద ముగిసింది. చదవండి: ఆగస్ట్లో విడుదలయ్యే అదిరిపోయే స్మార్ట్ఫోన్లు ఇవే! -
అమెరికా ఎఫెక్ట్.. ఆ షేర్ల జోరు అదిరింది!
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ ప్రకటనకు ముందు దేశీయ స్టాక్ మార్కెట్ లాభపడింది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో పాటు యూరప్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఏషియన్ పెయింట్స్, ఎల్అండ్టీ, మారుతీ, టాటా స్టీల్ తదితర కీలక కంపెనీల కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 548 పాయింట్లు పెరిగి 55,816 వద్ద స్థిరపడింది. ఈ సూచీలో 30 షేర్లలో మూడు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ 158 పాయింట్లు బలపడి 16,642 వద్ద నిలిచింది. దీంతో సూచీలు రెండురోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కినట్లైంది. విస్తృతస్థాయిలో మధ్య తరహా షేర్లకు అధిక డిమాండ్ నెలకొనడంతో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఒకశాతం ర్యాలీ చేసింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.40% పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 437 కోట్ల షేర్లను అమ్మేశారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.712 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 13 పైసలు క్షీణించి 79.91 స్థాయి వద్ద స్థిరపడింది. ఫెడ్ పాలసీ ప్రకటనకు ముందు(బుధవారం రాత్రి) ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. క్యూ1లో నికర లాభం 45 శాతం వృద్ధి చెందడంతో ఎల్అండ్టీ షేరు 2.5% పైగా లాభపడి రూ.1,797 వద్ద ముగసింది. ప్రతి రెండు షేర్లకు ఒక షేరు (1:2) చొప్పున బోనస్గా ఇచ్చేందుకు బోర్డు అనుమతినివ్వడంతో గెయిల్ షేరు రెండుశాతం లాభంతో రూ.147 వద్ద నిలిచింది. -
ఇన్వెస్టర్లకి అలర్ట్: ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో.. ఓ లుక్కేద్దాం!
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ ఒడిదుడుకుల ట్రేడింగ్కు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం నిర్ణయాల వెల్లడి, ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల ఎక్స్పైరీ ముగింపుతో పాటు కీలక కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాల ప్రకటన అంశాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో పాటు సాధారణ డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ‘‘స్టాక్ సూచీలు ఈ వారం తీవ్ర ఊగసలాటకు గురికావొచ్చు. బుధ, గురువారాల్లో వెలువడనున్న ముఖ్యంగా యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలు, రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల దిశానిర్దేశాన్ని శాసించవచ్చు. కొనుగోళ్లు కొనసాగితే 16,800–850 శ్రేణిలో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే నిఫ్టీకి 16,250–16,500 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ► క్రూడాయిల్ ధరలు దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడం, ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టాక్ సూచీలు గతవారంలో రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. ఐటీ, బ్యాంకింగ్, వినిమయ, మెటల్ షేర్లకు రాణించడంతో సెన్సెక్స్ 2311 పాయింట్లు, నిఫ్టీ 670 పాయింట్లు లాభపడ్డాయి. గతేడాది(2021) ఫిబ్రవరి తర్వాత సూచీలు ఒక వారంలో ఈ స్థాయిలో లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి. కార్పొరేట్ ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్ ముందుగా నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇన్ఫోసిస్ జూన్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. కంపెనీల షేర్లకు నిఫ్టీ సూచీలో 30 శాతానికిపైగా వెయిటేజీ ఉంది. ఇక వారంలో నిఫ్టీ సూచీలో 18 కంపెనీలతో సహా సుమారు 400కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఆటో, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, నెస్లే ఇండియా, శ్రీ సిమెంట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీఐసీ, సన్ ఫార్మా కంపెనీలు క్వార్టర్ ఫలితాలను ప్రకటించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ఫెడ్ పాలసీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం మంగళవారం(జూలై 26న) ప్రారంభం కానుంది. మరుసటి రోజు (బుధవారం) చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటి నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో ఫెడ్ కమిటీ గత సమీక్షలో చెప్పినట్లు 50–75 బేసిస్ పాయింట్ల వడ్డీరేట్ల పెంపునకే కట్టడి ఉండొచ్చు. అయితే ద్రవ్యోల్బణ కట్టడికి అధికప్రాధాన్యతనిస్తూ ఒకశాతం పెంపునకు మొగ్గుచూపితే అది మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచినట్లే అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ఎఫ్ఐఐల యూటర్న్ కొంతకాలంగా దేశీయ ఈక్విటీలను విక్రయిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు.ఈ జూలైలో ఇప్పటి వరకు(1–22 తేదీల్లో) రూ.1,100 కోట్ల విలువైన షేర్లను కొన్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ‘యూఎస్ రిటైల్ అమ్మకాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు 75 బేసిస్ పాయింట్లకు మించి ఉండకపోవచ్చనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ లాంటి వర్థమాన దేశాల మార్కెట్లో తిరిగి కొనుగోళ్లకు పాల్పడుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగిరావడం, దేశీయ జూన్ క్వార్టర్ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడం కూడా కలిసొచ్చింది’’ అని మార్నింగ్స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. గత నెల జూన్లో రూ. 50,203 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈక్విటీల నుంచి ఎఫ్పీఐలు దాదాపు రూ. 2.25 లక్షల కోట్లను వెనక్కి తీసుకెళ్లారు. చదవండి: ఎయిర్టెల్ చీఫ్ మిట్టల్ ప్యాకేజీ తగ్గింపు.. ఎంతంటే -
డబుల్ బొనాంజా.. ఆ షేర్లు కొన్నవారికి బంఫర్ ఆఫర్!
Vedanta Share Price: గతంలో కొంత కాలం ఇన్వెస్టర్లను దంచి కొట్టిన దలాల్ స్ట్రీట్ ఇటీవల అదరగొడుతూ మంచి ఊపుతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే షేర్లతో లాభాలు ఆర్జిస్తున్న ఇన్వెస్టర్లకు మెటల్స్, మైనింగ్ కంపెనీ వేదాంత మరో గుడ్న్యూస్ చెప్పింది. తన వాటాదారులకు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 19.5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. దీంతో ఆ సంస్థలోని పెట్టుబడిదారులు డబుల్ బొనాంజా పొందారనే చెప్పాలి. వేదాంత ఇన్వెస్టర్లకు డబుల్ బొనాంజ్ వేదాంత షేర్లు భారీ స్థాయిలో ప్రారంభమై ఆ తర్వాత వాటి షేరు ధర పెరుగుతూ రూ.253.25కి చేరింది. జూలై 1 తర్వాత ఈ స్థాయిలో స్టాక్ పెరగడం ఇదే తొలిసారి. ఇటీవల షేర్లు లాభాలతో పాటు వాల్యూమ్స్ కూడా మద్దతుగా ఉన్నాయి. అంటే వాల్యూమ్స్ కూడా పెరిగాయి. ప్రస్తుత వాల్యూమ్లు కూడా 20 రోజుల సగటు కంటే ఎక్కువగానే ఉన్నాయి. టెక్నికల్గా వీటిని పరిశీలిస్తే.. స్టాక్ ధర 20-రోజుల మూవీంగ్ యావరేజ్ కంటే పైన ట్రేడవుతోంది. స్వల్పకాలిక మూవింగ్ యావరేజ్ పైన షేర్ ధర 250 వద్ద పటిష్టంగా కొనసాగుతుంది. కాగా వేదాంత షేర్ ఆల్టైం హై ధర రూ. 259.95గా ఉండడం గమనార్హం. చదవండి: ఆకాశ ఎయిర్: టికెట్ ధరలు, స్పెషల్ మీల్ -
దలాల్ స్ట్రీట్ ఢాం
ముంబై: ఉక్రెయిన్లో రష్యా వేసిన బాంబులకు దలాల్ స్ట్రీట్ దద్దరిల్లింది. గత రెండేళ్లలో ఎన్నడూ చూడని రీతిలో మార్కెట్లో మహా ఉత్పాతం సంభవించింది. అన్ని రంగాల షేర్లలో విక్రయాల ఊచకోత జరగడంతో యుద్ధానికి మించిన రక్తపాతం జరిగింది. యుద్ధ భయాలతో చిగురుటాకుల్లా వణికిపోయిన స్టాక్ సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. వెరసి స్టాక్ మార్కెట్లకు ఈ గురువారం ‘‘టెర్రిబుల్ థర్స్డే’’గా నిలిచిపోయింది. సెన్సెక్స్ 2,702 పాయింట్లు నష్టపోయి 54,530 వద్ద ముగిసింది. నిఫ్టీ 815 పాయింట్లు క్షీణించి 16,248 వద్ద నిలిచింది. తొలి దశ కోవిడ్ లాక్డౌన్ విధింపు ప్రకటన(2020 మార్చి 23)తర్వాత జరిగిన సూచీలకిదే అతిపెద్ద పతనం. విస్తృత అమ్మకాలతో బీఎస్ఈ స్మాల్, మిడ్, లార్జ్క్యాప్ ఇండెక్స్లు ఏకంగా ఆరుశాతం చొప్పున క్షీణించాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లోనూ ఏ ఒక్క షేరు లాభపడలేదు. ఇండెక్సుల్లో దిగ్గజాలైన ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్, బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతీ షేర్లు ఏడుశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 6,448 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.7,668 కోట్లను కొన్నారు. ఇంట్రాడేలో ట్రేడింగ్ ఇలా... ఉదయం సెన్సెక్స్ 1,814 పాయింట్ల భారీ పతనంతో 55,418 వద్ద మొదలైంది. నిఫ్టీ 514 పాయింట్ల క్షీణించి 16,549 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. అమ్మకాల సునామీ ట్రేడింగ్ ముగిసే వరకు కొనసాగింది. ఒక దశలో సెన్సెక్స్ 2,850 పాయింట్లు క్షీణించి 54,383, నిఫ్టీ 860 పాయింట్లు 16,203 వద్ద కనిష్టాలను తాకాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► ఇన్వెస్టర్లు భయాలను ప్రతిబింబించే వొలటాలిటి ఇండెక్స్ వీఐఎక్స్ 30.31 శాతం ఎగిసి 31.98 స్థాయికి చేరింది. ► బీఎస్ఈ ఎక్సే్ఛంజీలోని నమోదైన మొత్తం కంపెనీల షేర్లలో 3,160 షేర్లు నష్టాన్ని, 232 షేర్లు స్టాకులు లాభపడ్డాయి. 86 షేర్లులో ఎలాంటి మార్పులేదు. ఇందులో 279 షేర్లు ఏడాది కనిష్టాన్ని తాకాయి. ► ఇదే ఎక్సే్ఛంజీల్లో వివిధ రంగాలకు ప్రాతినిథ్యం వహించే మొత్తం 19 రంగాల ఇండెక్సులన్నీ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్సులు 6% క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీల్లో ఒక్క షేరు లాభపడలేదు. రూ.13.57 లక్షల కోట్లు ఆవిరి రష్యా సైనిక చర్య ప్రభావంతో ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో నష్టం వాటిల్లింది. సెన్సెక్స్ రెండేళ్లలో అతిపెద్ద నష్టాన్ని చవిచూడటంతో బీఎస్ఈలో రూ.13.57 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.242.20 లక్షల కోట్లకు దిగివచ్చింది. గతేడాది(2021) అక్టోబర్ 18న బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.274.69 లక్షల కోట్లకు చేరి జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. నాటితో పోలిస్తే నాలుగు నెలల్లోనే ఇన్వెస్టర్లు రూ.32 లక్షల కోట్లను కోల్పోయారు. బంగారం భగభగ పెట్టుబడులకు ‘పసిడి’ కవచం అంతర్జాతీయ మార్కెట్లో 2,000 డాలర్లకు చేరువ... దేశీయంగా ఒకేరోజు రూ. 2,000 అప్ న్యూఢిల్లీ: యుద్ధ తీవ్రత నేపథ్యంలో ఇన్వెస్టర్లు తక్షణం తమ పెట్టుబడులకు బంగారాన్ని ఆశ్రయించారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్లో ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర ఈ వార్త రాస్తున్న రాత్రి 10 గంటల సమయంలో గత ముగింపుతో పోల్చితే 20 డాలర్లు లాభంతో 1930 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఒక దశలో 1976 డాలర్ల స్థాయిని కూడా చూసింది. అంతర్జాతీయ మార్కెట్లో 52 వారాల కనిష్టం 1,682 డాలర్లు. కోవిడ్–19 తీవ్రత నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో 2020 ఆగస్టులో పసిడి ధర ఆల్టైమ్ గరిష్టం 2,152 డాలర్లను తాకింది. వ్యాక్సినేషన్, కరోనా భయాలు తగ్గడం వంటి అంశాల నేపథ్యంలో ధర క్రమంగా దిగివస్తూ, 2021 ఆగస్టునాటికి 1,682 డాలర్లకు దిగివచ్చింది. అయితే ఈ స్థాయి కొనుగోళ్ల మద్దతుతో తిరిగి క్రమంగా 1,800 డాలర్ల స్థాయికి చేరింది. భౌగోళిక ఉద్రిక్తతలు తిరిగి పసిడిని కీలక అవరోధం 1,910 డాలర్ల పైకి చేర్చాయి. దేశీయంగా భారీ జంప్ ఇక అంతర్జాతీయంగా చరిత్రాత్మక ధరకు చేరిన సందర్భంలో దేశీయంగా పసిడి ధర 10 గ్రాములకు ధర మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో (ఎంసీఎక్స్) రూ.56,191కి చేరింది. వార్షికంగా ఇది దాదాపు 45% పెరుగుదల. అటు తర్వాత క్రమంగా రూ.45 వేల దిగువకు దిగివచ్చిన పసిడి ధర, ప్రస్తుతం ఎంసీఎక్స్లో రూ.51,540 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ముగింపుతో పోల్చితే ఇది రూ.1,160 పెరుగుదల. ట్రేడింగ్ ఒక దశలో ధర రూ.52,797కు చేరడం గమనార్హం. దేశీయ ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి 10 గ్రాముల ధర గురువారం క్రితం ముగింపుతో పోల్చితే 99.9 స్వచ్ఛత 2,491 పెరిగి రూ. 52,540 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర రూ.2,481 ఎగసి రూ.52,330కి చేరింది. వెండి కేజీ ధర రూ. 3,946 ఎగసి రూ.68,149 వద్ద ముగిసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రాతిపదికన పసిడి తదుపరి కదలికలు ఉంటాయని భావిస్తున్నారు. అయ్యో.. రూ‘పాయే’... 99 పైసలు నష్టంతో 75.60 కు డౌన్ భారత్ కరెన్సీ రూపాయిపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 99 పైసలు బలహీనపడి, 75.60 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు, దీనితో మార్కెట్ పతనం, క్రూడ్ ధరల తీవ్రత వంటి అంశాలు రూపాయిని బలహీనపరిచాయి. ట్రేడింగ్లో విలువ 75.02 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 75.75కు పతనమైంది. ఆయిల్ దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీ డిమాండ్ వచ్చింది. ఆసియా దేశాల కరెన్సీల్లో రూపాయి తీవ్రంగా నష్ట పోయింది. కాగా, ఆరు ప్రధాన కరెన్సీలతో కూడిన డాలర్ ఇండెక్స్ 1.30 శాతం లాభంతో 97.35 వద్ద పటిష్టంగా ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). నష్టాలకు కారణాలివే... ► యుద్ధ భయాలు అంతర్జాతీయ ఆంక్షల బెదిరింపులను లెక్కచేయకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై ‘‘వార్’’ ప్రకటించడం మార్కెట్ వర్గాలను కలవరపెట్టింది. రష్యా సేనలు గురువారం ఉదయం తూర్పు ఉక్రెయిన్పై దాడికి దిగాయి. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఎటు దారితీస్తాయోనన్న భయాలతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగారు. ► క్రూడాయిల్ కష్టాలు ఉక్రెయిన్ – రష్యా సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటింది. ప్రపంచ క్రూడ్ ఎగుమతుల్లో పదిశాతం వాటాను కలిగి ఉన్న రష్యాపై ఇతర దేశాలు ఆంక్షలు విధిస్తే ధరలు మరింత పెరిగే సూచనలు కనిపించడం ఇన్వెస్టర్లను మరింత కలవరపెట్టింది. ► ఎఫ్అండ్ఓ ముగింపు అమ్మకాలు ఫిబ్రవరి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు స్కేయర్ ఆఫ్ చేసుకున్నట్లు గణాంకాలు తెలిపాయి. వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కూడా గురువారమే కావడంతో ఇన్వెస్టర్లు విక్రయాలకు తెగబడ్డారు. ► ప్రపంచ మార్కెట్ల పతనం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేయోచ్చనే భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. యుద్ధ భయాలతో పాటు క్రూడాయిల్, కమోడిటీ ధరలు ఆకాశానికి చేరుకోవడంతో పాటు, ద్రవ్యోల్బణ భయాలతో అంతర్జాతీయ మార్కెట్ల పతానికి కారణమయ్యాయి. ఆసియాలో సింగపూర్, హాంగ్కాంగ్, కొరియా, తైవాన్ సూచీలు మూడు శాతం నుంచి రెండున్నర శాతం వరకు నష్టపోయాయి. జపాన్, చైనా ఇండోనేషియా దేశాలు 2% క్షీణించాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద ‘‘వార్’’ జరుగుతున్న ఐరోపా ప్రాంతాల్లోనూ ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అక్కడి ప్రధాన మార్కెట్లైన బ్రిటన్, ఫాన్స్, జర్మనీ స్టాక్ సూచీలు నాలుగు నష్టపోయాయి. అమెరికా మార్కెట్ల రెండున్నర శాతం నష్టాలతో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో అల్లకల్లోలానికి కారణమైన రష్యా ప్రధాన స్టాక్ సూచీ ఆర్టీఎస్ 38 శాతం క్షీణించింది. మరో సూచీ ఎంఓఈఎక్స్ 45 శాతం మేర పతనమైంది. డాలర్ మారకంలో రష్యా దేశ కరెన్సీ రూబుల్ 45% పతనమైంది. -
ఒడిదుడుకులు కొనసాగవచ్చు
ముంబై: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, కీలక వడ్డీరేట్ల పెంపు భయాల నేపథ్యంలో స్టాక్ సూచీలు ఈ వారంలోనూ తడబడవచ్చని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పోరేట్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు ట్రేడింగ్ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికల అంశాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల ఆందోళనలతో గతవారంలో మొత్తంగా సెన్సెక్స్ 492 పాయింట్లు, నిఫ్టీ 142 పాయింట్లు నష్టపోయాయి ‘‘గత నాలుగు నెలలుగా మార్కెట్లో స్థిరీకరణ కొనసాగుతోంది. ఇప్పటికీ నిర్ణయాత్మక దిశను ఎంచుకోలేకపోయింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణ ఆందోళనలు, రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు సెంటిమెంట్పై ఒత్తిడిని పెంచుతున్నాయి. నిఫ్టీకి సాంకేతికంగా దిగువస్థాయిలో 17050 వద్ద బలమైన మద్దతు స్థాయి ఉంది. ఎగువస్థాయిలో 17,550–17,650 వద్ద శ్రేణిలో నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెచ్ వినోద్ నాయర్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు నేడు(సోమవారం) వెల్లడికానున్నాయి. చైనా జనవరి ద్రవ్యోల్బణ డేటా, యూరోజోన్ డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి, అమెరికా జనవరి రిటైల్ అమ్మకాలు ఈనెల 16న (బుధవారం) వెల్లడికానున్నాయి. యూఎస్ ఫెడ్ మినిట్స్ గురువారం విడుదల అవుతాయి. జపాన్ జనవరి ద్రవ్యోల్బణ గణాంకాలు ఈనెల 18న (శుక్రవారం) వెల్లడికానున్నాయి. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపగలవు. కార్పొరేట్ ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఫలితాల ప్రకటన అంకం చివరి దశకు చేరుకుంది. కోల్ ఇండి యా, ఐషర్ మోటార్స్, గ్రాసీం ఇండస్ట్రీస్, స్పైస్ జెట్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మార్, అం బుజా సిమెంట్స్, నెస్లేలతో సహా బీఎస్ఈలో నమోదైన 1,000కు పైగా కంపెలు ఈ వారంలో తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇన్వెస్టర్లు ఈ గణాంకాలపై దృష్టి సారించవచ్చు. ద్రవ్యోల్బణ ఆందోళనలు అంతర్జాతీయంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం మార్కెట్ల వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా ద్రవ్యోల్బణ 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ ఈ మార్చి కంటే ముందుగానే వడ్డీరేట్లను పెంచవచ్చనే భయాలు నెలకొన్నాయి. ధరల కట్టడికి పలు దేశాల కేంద్ర బ్యాంకులు తమ ద్రవ్యపాలసీని కట్టడి చేసేందుకు సిద్ధమయ్యాయి. గురువారం ఫెడ్ మినిట్స్ వెల్లడి అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ మినిట్స్ గురువారం వెల్లడికానున్నాయి. ద్రవ్యపాలసీ, ద్రవ్యోల్బణంతో సహా అర్థిక వ్యవస్థ పనితీరుపై ఫెడరల్ ఓపెన్ మా ర్కెట్ కమిటీ వైఖరిని తెలియజేసే ఈ మినిట్స్ ఈక్విటీ మార్కెట్లకు దిశానిర్ధేశం చేయనున్నాయి. తారాస్థాయికి రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భౌగోళిక సరిహద్దు వివాద ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రష్యా ఈనెల 16న ఉక్రెయిన్పై దాడి చేయవచ్చని అమెరికా నిఘా వర్గాలు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్కు సమాచారం ఇచ్చాయి. యూఎస్తో సహా పలు దేశాలు ఉక్రెయిన్లోని తమ పౌరులను వెనక్కి వచ్చేయాలని కోరుతున్నాయి. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఈ ఫిబ్రవరి తొలి భాగంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి రూ.14,935 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల నుంచి రూ.10,080 కోట్లను, డెట్ విభాగం నుంచి రూ.4,830 కోట్లను, హైబ్రిడ్ సిగ్మెంట్ నుంచి రూ.24 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, బాండ్ ఈల్డ్స్ పెరుగుదల భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ లాంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని మార్నింగ్స్టార్ ఇండియా ఎండీ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
నాలుగు లిస్టింగ్లు... రెండు ఐపీవోలు
నాలుగు లిస్టింగ్లు.., రెండు పబ్లిక్ ఇష్యూల ప్రారంభంతో ఈ వారం దలాల్ స్ట్రీట్ కళకళలాడనుంది. పేటీఎంతో సహా మొత్తం నాలుగు కంపెనీల షేర్లు ఈ వారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇందులో నేడు పీబీ ఫిన్టెక్, సిగాచీ ఇండస్ట్రీస్, ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ షేర్ల లిస్టింగ్ కార్యక్రమం ఉంది. ఈ మూడు కంపెనీలు ప్రాథమిక మార్కెట్ నుంచి రూ.6,550 కోట్ల సమీకరించాయి. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న పేటీఎం షేర్లు గురువారం లిస్ట్ కానున్నాయి. ఇదే వారంలో టార్సన్స్ ప్రొడక్ట్స్, గో ఫ్యాషన్లు కంపెనీలు ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ల్యాబొరేటరీ ఉపకరణాల తయారీ సంస్థ టార్సన్స్ ప్రొడక్ట్స్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభం కానుంది. బుధవారం (నవంబర్ 17)తో ముగిసే ఐపీవో ద్వారా కంపెనీ రూ.1,023 కోట్లను సమీకరించనుంది. గో ఫ్యాషన్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బుధవారం మొదలవుతుంది. వచ్చే సోమవారం(22వ తేదీ)తో ముగిసే ఇష్యూ ద్వారా రూ.1,014 కోట్లను సమీకరించనుంది. ఇందుకు రూ. 655–690 ధరల శ్రేణిని ప్రకటించింది. -
భారీగా పతనమైన సూచీలు
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లు నేడు భారీగా పతనమయ్యాయి. స్టాక్ మార్కెట్లు మరో బ్లాక్ ఫ్రైడేని నేడు చవిచూశాయి. బ్యాంక్, స్మాల్, మిడ్ క్యాప్ ఇలా అన్ని రంగాల షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో దేశీయ సూచీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం 1,939.32 పాయింట్ల లేదా 3.80 శాతం నష్టంతో సెన్సెక్స్ 49,099.99 వద్ద, నిఫ్టీ -568.20 పాయింట్లు లేదా 3.76 శాతం నష్టంతో 14,529.15 వద్ద ట్రేడ్ ముగిసింది. ఇంట్రాడేలో 50,400 వద్ద గరిష్ఠాన్ని తాకిన బీఎస్ఈ ఇండెక్స్ 48,890 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక ఎన్ఎస్ఈ సూచీ 14,919 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేస్తే 14,467 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.14 వద్ద నిలిచింది. చదవండి: పోస్టాఫీస్ జీవిత బీమా పథకాలపై బోనస్ -
భారత మార్కెట్లో మారిన ఎఫ్పీఐల ప్రాధాన్యతలు
విదేశీ ఇన్వెసర్లు భారత స్టాక్ మార్కెట్లో మే-జూన్ మధ్యకాలంలో రూ.35వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఒక్క మే నెలలో రూ.14,569 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయగా, ఈ జూన్లో ఇప్పటి వరకు రూ.19,970 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఎఫ్పీఐల ప్రాధాన్యతలు మారాయి. ఈ రంగాల షేర్లను కొన్నారు టెలికాం, అటో, కన్స్ట్రక్షన్ మెటీరియల్, మీడియా రంగాల షేర్లలో అధికంగా కొనుగోళ్లు జరిపారు. అలాగే ఆహార, బేవరీజెస్ అండ్ టోబాకో, ట్రాన్స్పోర్టేషన్, హోటల్స్, రిస్టారెంట్స్ అండ్ టూరిజం, ఫార్మా అండ్ బయోటెక్నాలజీ, ఇన్సూరెన్స్, ఎయిర్లైన్స్ రంగాలకు చెందిన షేర్లలో పెట్టుబడులను 1శాతం వరకు పెంచుకున్నారు. టెలికాం రంగానికి సంబంధించి విదేశీ ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలో మే 31నాటికి రూ.89,120 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. అంతకు ముందు ఏప్రిల్లో ఇదే రంగానికి చెందిన రూ.75,452 కోట్ల ఈక్విటీ షేర్లతో పోలిస్తే ఇది 18.11శాతం అధికం. కన్స్ట్రక్షన్ మెటీరియల్ రంగానికి చెందిన షేర్లను 9శాతం పెంచుకున్నారు. అటో, అటో విడిభాగాల కంపెనీలకు చెందిన షేర్లను 6.4శాతానికి పెంచుకున్నారు. ఈ రంగాల షేర్లను విక్రయించారు ఇదే సమయంలో వారు బ్యాంకింగ్, రోడ్లు, హైవేలు, నౌకాయాన రంగాల షేర్లను విక్రయించారు. టెక్స్టైల్స్, యూటిలిటీ, కన్జూ్యమర్ డ్యూరబుల్స్, రియల్ ఎస్టేట్, కెమికల్స్ రంగాలకు చెందిన షేర్లలో వాటాలను తగ్గించుకున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లను అధికంగా విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి విదేశీ ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలో మే 31నాటికి రూ.4,15,061 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. అంతకు ముందు ఏప్రిల్లో ఇదే రంగానికి చెందిన రూ.4,65,367 కోట్ల ఈక్విటీ షేర్లతో పోలిస్తే ఇది 10.81 శాతం తక్కువ. మన మార్కెట్లోనే కొనుగోళ్లు ఎందుకు..? భారీ పతనం తర్వాత, ప్రస్తుతం భారత స్టాక్ వాల్యూయేషన్లు లాంగ్ టర్మ్ యావరేజ్ల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల విలువలతో పోలిస్తే మరింత తక్కువగా ఉన్నాయి. బహుశా ఈ కారణమే ఎఫ్పీఐలకు ఇండియా ఈక్విటీ మార్కెట్ల వైపు నడిపించి ఉండవచ్చు. మార్చి ఏప్రిల్లో ఎఫ్పీఐలు విక్రయించిన షేర్లలో సగానికి పైగా షేర్లను తిరిగి కొనుగోలు చేశారు. సమీప కాలంలో, లిక్విడిటీ అధికంగా ఉండే రంగాల్లో కొనుగోళ్లు జరపవచ్చు అని నిర్మల్ బంగ్ ఈక్విటాస్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. -
అయోధ్య తీర్పు : దలాల్ స్ట్రీట్లో ఇక మెరుపులే
సాక్షి,ముంబై: వివాదాస్పద అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు శనివారం వెలువరించిన తీర్పుపై సర్వత్రా ఆమోదం లభించింది. దీనిపై దలాల్ స్ట్రీట్ నిపుణులు కూడా పాజిటివ్గా స్పందించారు. సుమారుగా వందేళ్ల నుంచి నలుగుతున్న వివాదం కొలిక్కి రావడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు మంచిదని మార్కెట్ పండితులు, ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుతో దేశంలోని ప్రధాన రాజకీయ, విధాన పరమైన అనిశ్చితి ముగిసిందని అన్నారు. దీంతో ఇండియాపై విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకం బలపడుతుందని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని అంచనావేస్తున్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే స్టాక్మార్కెట్లో కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కొత్త గరిష్టాల వద్ద కొనసాగుతున్నాయి. తాజా పరిణామాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత బలపడి, కొనుగోళ్లతో దలాల్ స్ట్రీట్ మరింత దూసుకుపోనుందని భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్తర ప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోంది. దేశం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే, ఖచ్చితంగా ఉత్తర ప్రదేశ్ వాటా లక్ష కోట్ల డాలర్లుగా ఉండాలి’ అని సీనియర్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా అభిప్రాయపడ్డారు. వ్యవస్థను సరళతరం చేసే ఎటువంటి నిర్ణయమైనా, ఇండియాపై విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచుతుంది’ అని కేఆర్ చోక్సి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, ఎండీ దివాన్ చోక్సి అన్నారు. ‘మొదట కశ్మీర్ 370 ఆర్టికల్ తొలగింపు, అనంతరం అయోధ్యం తీర్పు దేశీయ వ్యవస్థకు మంచిదనీ, ఎల్టీసీజీ, వ్యక్తిగత పన్ను రేట్లను మార్చడం వంటి సంస్కరణలు మరిన్ని వస్తాయని సంజయ్ భాసిన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మార్కెట్పై బుల్లిష్గా ఉన్నానని, బెంచ్ మార్క్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరడం ఇక సులభమని తెలిపారు. ఈ తీర్పు వలన అయోధ్యను సందర్శించి దేశీయ, విదేశీ టూరిస్ట్లు రోజుకు 50,000 నుంచి 1 లక్షకు చేరుకుంటారని కేడియా అన్నారు. ‘ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను మార్చిన వైష్ణోదేవి, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లానే అయోధ్య కూడా మారుతుంది’ అని అభిప్రాయపడ్డారు. కాగా అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు మొత్తం 2.77 ఎకరాల భూమిని రామమందిరం నిర్మణానికే కేటాయించాలని, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. -
ఎన్నికలు, క్యూ4 ఫలితాలే కీలకం..!
ముంబై: దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల వేడి పెరుగుతోంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా.. ఈవారంలోనే తొలి దశ ప్రారంభంకానుంది. గురువారం (ఏప్రిల్ 11న) జరిగే ఈ పోలింగ్.. సామాన్య పౌరులతో పాటు ఇటు మార్కెట్ వర్గాల్లోనూ వేడి పెంచుతోంది. ఎన్నికల నేపథ్యంలో వెలువడే ప్రీ–పోల్ సర్వేలు, తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నారనే ప్రధాన అంశాలు మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘సాధారణ ఎన్నికల అంశమే ప్రధానంగా ఈవారంలో మార్కెట్ను నడిపించనుంది. వచ్చే ఐదేళ్లలో ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉండనున్నాయనే కీలక అంశానికి ఈ ఎన్నికలే స్పష్టత ఇవ్వనున్నాయి. కచ్చితంగా ఇన్వెస్టర్ల దృష్టి పోల్స్పైనే ఉండనుంది’ అని సాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సునీల్ శర్మ అన్నారు. ఎన్నికల వేడిలో ఫ్రెంట్లైన్ స్టాక్స్ అప్మూవ్కు కొంత సమయం పట్టే అవకాశం ఉండగా.. స్మాల్ స్టాక్స్ మాత్రం ర్యాలీని కొనసాగించే అవకాశం ఉందని ఎడిల్వీస్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మార్చిలో ర్యాలీ చేసిన లార్జ్క్యాప్ షేర్లు.. ఈనెల్లో తగ్గిన కారణంగా.. ఈ షేర్లలో అప్ట్రెండ్కు అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు వీ కే శర్మ అన్నారు. ఐటీ ఫలితాలతో క్యూ4 ఎర్నింగ్స్ బోణి దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఈవారంలోనే ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. నాలుగో త్రైమాసికం (క్యూ4) ఫలితాలతో పాటు పూర్తి ఏడాది (2018–19) ఫలితాలను ఇరు సంస్థలు శుక్రవారం వెల్లడించనున్నాయి. టీసీఎస్ వరుస నిరంతర (సీక్వెన్షియల్ కాన్స్టెంట్) కరెన్సీ వృద్ధి క్యూ4లో 2% ఉండేందుకు అవకాశం ఉండగా.. డాలర్ రెవెన్యూ (క్వార్టర్ ఆన్ క్వార్టర్) వృద్ధి 2% ఉండవచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ అంచనాకట్టింది. ఇన్ఫీ డాలర్ ఆదాయ వృద్ధి 2–2.5% మేర ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తుండగా.. డిజిటల్ ట్యాలెంట్ కోసం అత్యధిక నిధులు కేటాయించడం వల్ల ఎబిటా మార్జిన్లో క్షీణత ఉండవచ్చని ప్రభుదాస్ లిలాధర్ అంచనావేసింది. ఇక 2020 రెవెన్యూ గైడెన్స్ అత్యంత కీలకంకానుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు పేర్కొన్నాయి. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి.. ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మార్చి రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈ ఆర్థిక అంశాలు మార్కెట్కు కీలకమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఈఏడాదిలో 12 డాలర్ల మేర పెరిగి శుక్రవారం 70.41 డాలర్ల వద్ద ముగియగా.. ఆర్థిక వ్యవస్థ మందగించ వచ్చంటూ వస్తున్న అంచనాల నేపథ్యంలో ముడిచమురు ధరలు మరింత పెరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. క్రూడ్ 69–70.20 శ్రేణిలో కదలాడేందుకు అవకాశం ఉందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ హెడ్ ఫారెక్స్ సజల్ గుప్తా అంచనావేశారు. 11,760 పాయింట్లకు నిఫ్టీ..! వీక్లీ ముగింపు ఆధారంగా చూస్తే.. నిఫ్టీ మరోసారి తన జీవితకాల గరిష్టస్థాయి అయిన 11,760 పాయింట్లను తాకేందుకు ప్రయత్నం చేయవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. అయితే ఇందుకు 11,570–11,532 స్థాయిలో ఈ సూచీ నిలదొక్కుకోవాల్సి ఉంటుందని, ఇక్కడ నిలిస్తేనే అప్ట్రెండ్కు అవకాశం ఉందని అన్నారయన. 5 సెషన్లలో రూ.8,634 కోట్ల విదేశీ నిధులు విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఈనెల్లోనూ జోరుగా కొనసాగుతోంది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ)లు గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.8,634 కోట్లను భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈనెల్లో వీరు ఈక్విటీ మార్కెట్లో రూ.8,989 కోట్లను ఇన్వెస్ట్చేసి.. డెట్ మార్కెట్ నుంచి రూ.355 కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో నికర పెట్టుబడి 8,634 కోట్లుగా నమోదైంది. మార్చిలో రూ.45,981 కోట్లను పెట్టుబడిపెట్టిన వీరు.. ఈనెల ప్రారంభంలో కూడా అదే జోరును కొనసాగించారు. భారత్–పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడం, దేశ స్థూల ఆర్థిక అంశాలు మెరుగుపడడం, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానుందన్న అంచనాల నేపథ్యంలో విదేశీ నిధులు పెరుగుతున్నాయని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ హిమంశు శ్రీవాత్సవ విశ్లేషించారు. -
దలాల్ స్ట్రీట్లో భారీ నష్టాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు దసరా పండుగ ఉత్సాహాన్ని ఉసూరుమనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే భారీగా నష్టపోయాయి. ఒకదశలో సెన్సెక్స్ 500 పాయింట్ల వరకూ పతనమైంది. ప్రస్తుతం 350పాయింట్లు క్షీణించి 34,429 వద్ద, నిఫ్టీ 119 పాయింట్లు కోల్పోయి 10,333 వద్ద కొనసాగుతున్నాయి. ఫార్మా తప్ప అన్ని రంగాల్లోనూ అమ్మకాల ధోరణి నెలకొంది. ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ, ఆటో రంగాలు నష్టపోతున్నాయి. మైండ్ ట్రీ 9శాతం కుప్పకూలగా.. హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో 4-1.25 శాతం బలహీనంతో కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), యస్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ , హీరోమోటో నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు ఇన్ఫ్రాటెల్, గెయిల్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్పీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఐవోసీ, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ లాభపడుతున్నాయి. -
నోట్ల రద్దు తర్వాత ఇన్వెస్టర్లకు అంత సంపదా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజల చేతుల్లో ఉన్న రూ.1000, రూ.500 నోట్లన్నింటిన్నీ ఒక్కసారిగా చిత్తు కాగితాలుగా మారుస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక నిర్ణయం వెలువడి నేటికి ఏడాది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజలందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ నోట్లను మార్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు. ఈ ప్రకటన అనంతరం దేశీయ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. ఎనిమిది సెషన్స్లో 1800 పాయింట్ల మేర సెక్సెక్స్ పతనమైంది. ప్రధాని ప్రకటించిన ఈ నిర్ణయంతో దేశీయ ఆర్థిక వృద్ధి కుంటుపడుతుందని, వినియోగత్వం దెబ్బతింటుందని విశ్లేషకులు ఆందోళన చెందారు. కానీ పరిస్థితులన్నీ వెనువెంటనే మారిపోయాయి. పెద్ద నోట్ల రద్దు స్వల్పకాలికంగా దెబ్బతీసినా.. దీర్ఘకాలంలో సానుకూల ప్రభావాన్నే చూపుతుందని పలు సర్వేలు, పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. దీంతో మెల్లమెల్లగా మార్కెట్లు కూడా కోలుకోవడం ప్రారంభమయ్యాయి. మనీ మార్కెట్లు, ఫైనాన్సిల్ సిస్టమ్ పునరుద్ధరించబడ్డాయి. అప్పటి నుంచి బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.35 లక్షల కోట్ల మేర పెరిగింది. గతేడాది నవంబర్ 8న రూ.111.45 లక్షల కోట్ల ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్, ఈ ఏడాది నాటికి రూ.146.23 లక్షల కోట్లకు చేరింది. డిజిటల్ లావాదేవీలు, బ్యాంకు డిపాజిట్లు పెరుగడం మార్కెట్లకు పాజిటివ్గా నిలిచినట్టు విశ్లేషకులు చెప్పారు. ఈ కాలంలో పలు ఇన్వెస్టర్ల సంపద బాగా పెరిగినట్టు తెలిసింది. గతేడాది నవంబర్ 8 నుంచి ఈ ఏడాది నవంబర్ 6 వరకు ఇండియాబుల్స్ వెంచర్స్ షేర్లు ఏకంగా 1,147 శాతం మేర పెరిగి, చార్ట్ టాపర్గా నిలిచాయి. హెచ్ఈజీ 1011 శాతం, గోల్డ్స్టోన్ ఇన్ఫ్రాటెక్ 720 శాతం, గ్రాఫైట్ ఇండియా 686 శాతం, గోవా కార్బన్ 653 శాతం, రైన్ ఇండస్ట్రీస్ 559 శాతం, జిందాల్ వరల్డ్వైడ్ 559 శాతం, కాలిఫోర్నియా సాఫ్ట్ 550 శాతం మేర పైకి ఎగిశాయి. అంతేకాక 150 పైగా ఇతర స్టాక్స్ కూడా ఎన్ఎస్ఈలో 100 నుంచి 550 శాతం మేర పెరిగాయి. ఈ కాలంలో కేవలం 50 శాతం స్టాక్స్ మాత్రమే కిందకి పడిపోయాయి. ప్రధాని ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు షాకింగ్ నిర్ణయం అనంతరం ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు రూ.10వేల కోట్లు పైగా భారత్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలిసింది. అదేవిధంగా దేశీయ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు రూ.లక్షల కోట్లకు పైగా సంపదను మార్కెట్లోకి చొప్పించినట్టు వెల్లడైంది. ఇవన్నీ పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ నుంచి మార్కెట్లను బయట పడేలా చేశాయి. -
నాలుగు రోజుల్లో 6.4 లక్షల కోట్లు ఆవిరి
ముంబై: కేవలం నాలుగు రోజుల్లోనే దేశీయ మదుపుదారుల నుంచి రూ 6.4 లక్షల కోట్లు చేజారాయి. అమెరికా, ఉత్తర కొరియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం, ఆర్థిక వృద్ధి రేటు అంచనాలపై భయాందోళనలతో స్టాక్ మార్కెట్ కుదేలైంది. అమ్మకాల ఒత్తిడితో కేవలం నాలుగు రోజుల్లోనే రూ 6.4 లక్షల కోట్ల మదుపరుల సొమ్ము ఆవిరైంది. ఆగస్ట్ 7న రూ 139. 5 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ వారం తిరగకుండానే రూ 133 లక్షల కోట్లకు పతనమైంది. గడిచిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1100 పాయింట్లు కోల్పోయింది. మరోవైపు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ 331 షెల్ కంపెనీల్లో ట్రేడింగ్ను నిలిపివేయడం కూడా షేర్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపింది. చైనాతో డోక్లాం వివాదం కూడా మదుపుదారుల సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలిన క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా లక్ష కోట్ల డాలర్ల మేర ఇన్వెసర్లు నష్టపోయారు. -
షేర్స్, మ్యూచువల్ ఫండ్స్కు ఇక అది తప్పనిసరి
ముంబై : స్టాక్మార్కెట్లో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేస్తున్నారా? అయితే ఇక మీరందరూ కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దలాల్ స్ట్రీట్లో జరిగే అవకతవకలని, పన్ను ఎగవేతలను, బ్లాక్ మనీని వైట్గా చేసుకునే ప్రక్రియను నిర్మూలించడానికి త్వరలోనే సరికొత్త నిబంధనలు రాబోతున్నాయి. అవేమిటంటే.. ఇప్పటికే పలు ప్రయోజనాలకు, పథకాలకు తప్పనిసరి చేస్తూ వస్తున్న ఆధార్ను, దలాల్స్ట్రీట్లోకి అడుగుపెట్టడానికి తప్పనిసరి చేయబోతున్నారు. షేర్లను, మ్యూచువల్ ఫండ్స్ను కొనుగోలుచేయడానికి ఇక ఆధార్ త్వరలోనే తప్పనిసరి కాబోతుందని తెలుస్తోంది. దీనికోసం ప్రభుత్వం, సెక్యురిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడైంది. ఆధార్తో స్టాక్ మార్కెట్ ద్వారా బ్లాక్మనీని వైట్మనీగా మార్చుకునే ప్రక్రియకు కళ్లెం వేయొచ్చని ప్రభుత్వం, సెబీ భావిస్తోంది. కేవలం పాన్ మాత్రమే పన్ను లీక్స్ను అరికట్టలేదని ప్రభుత్వం గుర్తించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. స్టాక్ మార్కెట్ లావాదేవీల కోసం తాము తీసుకునే చర్యలతో తప్పుడు కార్యక్రమాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఫైనాన్సియల్ మార్కెట్ లావాదేవీలకు ఏకైక గుర్తింపు సంఖ్య లాగా పాన్ను ఆధార్ భర్తీ చేస్తుందో లేదో ఇంకా స్పష్టంకాలేదు. అయితే అవినీతి రహిత దేశంగా భారత్ను మార్చడానికి ఫైనాన్సియల్ మార్కెట్ లావాదేవీలతో ఆధార్ను లింక్చేయడం ఎంతో ముఖ్యమైన అంశమని ఐఐఎఫ్ఎల్ గ్రూప్ చైర్మన్ నిర్మల్ జైన్ తెలిపారు. ఇటీవలే ప్రభుత్వం పాన్కు, బ్యాంకు అకౌంట్లకు, మొబైల్ ఫోన్ నెంబర్లకు ఆధార్ను తప్పనిసరి చేసింది. బ్యాంకు ఖాతాదారులు తమ ఆధార్ను లింక్ చేసుకునే గడువును ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు విధించింది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లలో ఆన్లైన్ కేవైసీలకు ప్రస్తుతం దీన్ని వాడుతున్నారు. -
దలాల్ స్ట్రీట్ లో దందా: భారీగా పన్ను ఎగవేత
స్టాక్ మార్కెట్లో భారీగా పన్ను ఎగవేత కేసులు వెలుగులోకి వచ్చాయి. దీర్ఘకాలిక మూలధన లాభాల్లో ఉన్న పన్ను ప్రయోజనాలను దుర్వినియోగం చేస్తూ దాదాపు 11వేల కేసులు పెన్నీ స్టాక్ ట్రేడింగ్ కు పాల్పడినట్టు తెలిసింది. పన్ను ఎగవేతలకు పాల్పడుతున్న సంస్థల జాబితాను తయారుచేసిన సెక్యురిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ), ఈ జాబితాను పన్ను అధికారులకు పంపింది. దీనిలో మూలధన లాభాల ప్రొవిజన్స్ ను దుర్వినియోగం చేస్తూ 34వేల కోట్ల రూపాయల పన్నులను 11వేల సంస్థలు ఎగొట్టినట్టు ఆదాయపు పన్నుశాఖకు తెలిపింది. ఈ డేటాను పన్ను అధికారులతో షేర్ చేసుకున్న సెబీ, 11వేల సంస్థలపై విచారణను రివీల్ చేసింది. ఈ సంస్థలు ఎలాంటి కార్యకలాపాలు జరుపకుండా గత మూడేళ్లలో ఒక్కోటి 5 లక్షలకు పైగా లిస్టెడ్ కంపెనీలషేర్లను కొనుగోలుచేసినట్టు పేర్కొంది. మూడేళ్ల డేటా అనాలటిక్స్, ట్రేడింగ్, సర్వైలెన్స్ డేటా ఆధారంగా వీటిని గుర్తించినట్టు సెబీ పేర్కొంది. ఆదాయపు పన్ను శాఖ కూడా సెబీ పన్ను ఎగవేతదారుల జాబితాను పంపినట్టు ధృవీకరించింది. పన్ను ఎగొట్టడానికి ఈ సంస్థలు స్టాక్ మార్కెట్ ను దుర్వినియోగపరుస్తున్నాయని, మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నాయని ఐటీ అధికారులు చెప్పారు. 12 నెలల కంటే ఎక్కువ రోజులు పెట్టుబడులు పెట్టి, షేర్లను విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉండదు. ఈ నిబంధనను అడ్డంపెట్టుకుని, కంపెనీలు ఈ దుర్వినియోగాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. దీనిలో ఎక్కువ కోల్ కత్తా, ముంబై, అహ్మదాబాద్, సూరత్, ఢిల్లీకి చెందిన పన్ను ఎగవేతదారులే ఉన్నట్టు సెబీ పేర్కొంది. -
యోగి మహిమ: ఆ స్టాక్ దూసుకెళ్తోంది!
ఇటీవల దలాల్ స్ట్రీట్లో కొన్ని స్టాక్స్ భారీగా దూసుకెళ్తున్నాయి. లిస్టింగ్ రోజే బంపర్ రికార్డులు మోత మోగిస్తున్నాయి. అదే బాటలో యోగి మహిమతో ఓ స్టాక్ సంచలనాలు సృష్టిస్తుందట. అది వెంకీస్(ఇండియా) లిమిటెడ్. ఇండియాలో లిస్టు అయిన ఏకైక ఫౌల్ట్రీ సంస్థ. ఈ స్టాక్లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారి పెట్టుబడులు కేవలం 73 సెషన్స్లోనే 2.80 లక్షల రూపాయలకు ఎగిశాయని వెల్లడైంది. ఈ స్టాక్ ఇంతలా పైకి పెరగడానికి ప్రధాన కారణం ఉత్తరప్రదేశ్ ఇటీవల ఎన్నికైన కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథేటన. అక్రమ కబేళాలపై యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యలు ఈ స్టాక్కు బూస్టు ఇస్తున్నాయని విశ్లేషకులంటున్నారు. ఫౌల్ట్రీ, ఫౌల్ట్రీ ప్రొడక్ట్లు, పశువుల ఆరోగ్యం, నూనె గింజలు వంటి ఉత్పత్తులను వెంకీస్ ఇండియా విక్రయిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యా అక్రమ కబేళాలపై తీసుకుంటున్న చర్యలతో నార్త్ ఇండియాలో చిక్కెన్ ధరలు చుక్కలు చూస్తున్నాయి. దీంతో ఆ స్టాక్ కూడా 180 శాతం పైకి ఎగిసి 1,244 రూపాయలుగా నమోదైంది. యూపీ, ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఫౌల్ట్రీ ధరలు కేజీకి 180 రూపాయలు నుంచి 240 రూపాయలు పెరిగాయని తెలిసింది. గత కొన్ని త్రైమాసికాలుగా ఈ స్టాక్ విదేశీ పెట్టుబడిదారులకూ ఇష్టంగా మారిందని విశ్లేషకులు చెప్పారు. వెంకీస్ ఇండియా ఆర్జించే సగానికి పైగా రాబడులు ఫౌల్ట్రీ బిజినెస్ల నుంచే వస్తున్నాయట. -
నగదుంటే మొదట వాటిని కొనేయండి!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై దలాల్ స్ట్రీట్లోని విశ్లేషకులందరూ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతుంటే, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టరు రాకేశ్ ఝున్ఝున్వాలా మాత్రం బుల్ ఆశలు రేకెత్తిస్తున్నారు. 'నగదు రద్దు అనేది చరిత్ర సృష్టిస్తుంది. ఒకవేళ మీ దగ్గర నగదుంటే, వెళ్లి ఈక్విటీ మార్కెట్లో స్టాక్స్ కొనుగోలు చేయండి' అంటూ పిలుపునిచ్చారు. నిఫ్టీ 50 మళ్లీ తన స్థానాన్ని పునరుద్ధరించుకుంటుందని, కిందకి పడిపోవడం కేవలం పరిమితమేనని చెబుతున్నారు. నిఫ్టీ 8200కి ఎగుస్తుందని పేర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దు షాక్ నుంచి మార్కెట్లు చాలా త్వరగా సాధారణ స్థితికి వస్తాయని ఝున్ఝున్వాలా అభిప్రాయపడుతున్నారు. దేశీయంగా పెద్ద నోట్ల రద్దు, అంతర్జాతీయంగా అనూహ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం వంటి వాటివల్ల ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. అంతేకాక ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడం వల్ల కూడా విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోయాయని అన్నారు. కానీ పెద్ద నోట్ల రద్దు చరిత్రను సృష్టిస్తుందని తెలియగానే, ఎఫ్ఐఐల ట్రెండ్ రివర్స్ అయిందన్నారు. సానుకూలమైన కేంద్ర బడ్జెట్ మార్కెట్లు పైకి ఎగియడానికి దోహదం చేస్తుందని ఝున్ఝున్వాలా ఆశిస్తున్నారు. వచ్చే బడ్జెట్లో ఎలాంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుందని తాను భావించడం లేదన్నారు. పీఎస్యూ బ్యాంకుల స్థానాన్ని ప్రైవేట్ రంగ షేర్లు లాగేసుకుంటాయని, ప్రజలు సొరుగుల్లో దాచిన నగదును బ్యాంకుల్లోకి మార్చే సమయం ఆసన్నమైందన్నారు. గత ఆరేళ్లుగా చెత్త పనితీరును కనబరుస్తున్న ఫార్మా రంగంలో కొనుగోలు మద్దతు లభించిందన్నారు. తను కలిగి ఉన్న షేర్లలో ఇండిగో బేరిస్ ట్రెండ్ను చూస్తుందనుకోవడం లేదని, పెద్ద నోట్ల రద్దు టైటాన్ను మరింత పాజిటివ్గా మారుతుందని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. -
2017లో దలాల్ స్ట్రీట్కు శని గండమా?
న్యూఢిల్లీ : కొత్త సంవత్సరాదిలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమవుతోంది. ఎవరికి వారు తమకు కొత్త ఏడాది 2017 ఎలా ఉండబోతుంది? కొత్త కార్యాచరణలు ఏం చేపట్టాలి అని ప్లాన్స్ వేసుకుంటున్నారు. దలాల్ స్ట్రీట్ విశ్లేషకులు కూడా కొత్త సంవత్సరాది అంచనాల్లో మునిగిపోయారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొనే ఆటుపోట్లపై జ్యోతిష్యులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 2017 సంవత్సరమంతా పూర్తిగా ఒడిదుడుకులమయంగా సాగుతుందని దలాల్ స్ట్రీట్ జ్యోతిష్యులు చెబుతున్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం దేశీయ మార్కెట్లు మరింత సవాళ్లుగా మారాయని పేర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా పడిపోయిన మార్కెట్లు, ఆ దెబ్బకు పూర్తిగా కోలుకోలేక బేరిస్ ట్రెండ్లో సాగుతున్నాయి. అటు అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లకు సహకరించలేకపోతున్నాయి. ఈ బేరిస్ ట్రెండ్ 2017వరకు సాగుతుందట. ఒకవేళ లాభపడిన స్వల్పంగానే ఉంటుందని తెలుస్తోంది. 400 పాయింట్ల రేంజ్లో 7,730 కీలక మార్కు నుంచి 8,230 పాయింట్ల మధ్యలో కదలాడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. డీమానిటైజేషన్ అనంతరం నెలకొన్న గడ్డు పరిస్థితులు 2018 ఆగస్టు వరకు ఉంటాయని ముంబాయికి చెందిన సెలబ్రిటీ ఆస్ట్రో-న్యూమరాలజిస్ట్ సంజయ్ బి జుమాని చెప్పారు. 'మనం 71వ స్వాతంత్య్రంలోకి అడుగుపెడుతున్నాం. 71 అనే సంఖ్య 8తో సమానం. ఎనిమిది శనిని సూచిస్తుంది. ఎక్కువ బాధలు పెట్టే దేవుడిగా శనికి పేరుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా నవంబర్ 8వ తేదీన సాయంత్రం ఎనిమిది గంటలకే తీసుకున్నారు' అని విశ్లేషకులు ఎత్తిచూపుతున్నారు. బాధలు పెట్టిన అనంతరం శని శుభాలు చేకూరుస్తాడని, తర్వాత వచ్చే 72వ ఏడాది బాగుంటుందని లెక్కలేసి మరీ చెబుతున్నారు. ఎవరైనా 2017లో పెట్టుబడులు పెట్టదల్చుకుంటే, దేవుడిపై భారం వేసి ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. మంచి రంగంలో పెట్టుబడులు పెట్టేలా నిర్ణయించుకోవాలంటున్నారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారమైతే 2017 ఏడాది మిక్స్డ్గా ఉంటుందని, కానీ పెట్టుబడులకు పాజిటివ్ సంకేతం కాదంటున్నారు ఆస్ట్రాలజర్ ముర్తాజా అలీ. అయితే పెట్టుబడిదారుల కోసం ఏమైనా మంచి ఆప్షన్లు ఉన్నాయో లేవో వేచిచూడాల్సిందేనన్నారు. కేంద్ర బడ్జెట్ వచ్చేంతవరకు కూడా ఆటో, కన్జ్యూమర్ డురెబుల్స్, ఎఫ్ఎమ్సీజీలు పెట్టుబడులు పెట్టడానికి తగిన స్టాక్స్ కావని హెచ్చరిస్తున్నారు. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాక్ట్ర్చర్ కూడా నెగిటివేనంటున్నారు. సిమెంట్, స్టీల్ స్టాక్స్ను భయం లేకుండా కొనుగోలు చేయొచ్చని భరోసా ఇస్తున్నారు.