Domestic Violence
-
అంత మాత్రానికే జీవితం ముగిసినట్లు కాదు
న్యూఢిల్లీ: వివాహ బంధం ముగిసినంత మాత్రాన జీవితమే అయిపోయినట్లు కాదని, ముందున్న భవిష్యత్తు గురించి ఆలోచించాలని విడాకుల జంటను ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా జంటను ఉద్దేశించి జస్టిస్ పీబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని బెంచ్(SC Bench) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.‘‘ఈ కేసులో విడాకులు తీసుకోవాలనుకుంటున్న జంటది(Divorce Couple) చిన్నవయసే. ఇలాంటి వాళ్లకు బోలెడంత భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్గు గురించి వాళ్లు ఆలోచించుకోవాలి. వివాహ బంధం ముగిసినంత మాత్రాన..వాళ్ల జీవితాలు అయిపోయినట్లు కాదు. వాళ్లు కొత్త జీవితాలను ప్రారంభిస్తూ ముందుకు సాగాలి’’అని న్యాయమూర్తులు సూచించారు .ఈ కేసులో వివాహం జరిగినా ఏడాదిలోపే ఆమె తిరిగి పుట్టింటికి పెళ్లడం దురదృష్టకరం. విడాకుల తర్వాతైనా ప్రశాతంగా జీవించండి అని ఆ జంటకు సూచించింది ధర్మాసనం.కేసు నేపథ్యం..2020 మే నెలలో మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన యువకుడికి, మధ్యప్రదేశ్కు చెందిన యువతికి వివాహం జరిగింది. అయితే అత్తింటి వేధింపులతో కొన్ని నెలలకే తిరగకముందే ఆమె పుట్టింటికి చేరింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై ఆమె ఫిర్యాదు చేసింది. బదులుగా ఆ భర్త కూడా ఆమెపై ఫిర్యాదు చేశాడు. అలా.. మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి.అలా చేస్తే సాగదీయడమే!వీళ్ల విడాకుల వ్యవహారం సుప్రీం కోర్టు(Supreme Court)కు చేరింది. అయితే ఇలా పోటాపోటీగా కేసులు వేయడం.. విడాకుల వ్యవహారాన్ని సాగదీయడమే అవుతుందని ఇరుపక్షాల లాయర్లతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో కేసులు ఉపసంహరించుకుంటామని వాళ్లు తెలిపారు. అదే సమయంలో ఆ జంట కలిసి జీవించే పరిస్థితులు లేవని.. ఆర్టికల్ 142 ప్రకారం విస్తృత అధికారాన్ని ఉపయోగించి విడాకులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది.వివాహ బందం కోలుకోలేని విధంగా విచ్ఛినమైతే.. ఆరు నెలలు కూడా ఆగాల్సిన అవసరం లేదు. కొన్ని షరతులతో ఆ నిరీక్షణ గడువును ఎత్తేయొచ్చు. ఈ కారణం కింద వారి ఆ పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం సుప్రీం కోర్టుకు సాధ్యమే. ఇందుకు ఆర్టికల్ 142 కింద కోర్టుకు అధికారం ఉంటుంది::: జనవరి 06 2025 రాజ్యాంగ ధర్మాసనం తీర్పు -
Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!
అడిగినంత కట్నం ఇచ్చి బిడ్డకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. పండగలకు వచ్చిపోతున్న ఆమెను చూసి.. మెట్టినింట్లో సంతోషంగా ఉంటోందని అంతా సంబుర పడ్డారు. కానీ, తోబుట్టువులకు కూడా చెప్పుకోలేని రీతిలో ఆమె వేధింపులు ఎదుర్కొంది. చివరకు.. ఓపిక నశించి అఘాయిత్యానికి పాల్పడింది!. తిరువనంతపురం: కేరళలలో సంచలనం సృష్టించిన విష్ణుజా(25) కేసులో(Vishnuja Case).. విస్మయం కలిగించే విషయాలు బయటకు వచ్చాయి. భర్త, అతని కుటుంబం పెట్టే హింస భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.మలప్పురం ప్రాంతానికి చెందిన విష్ణుజా(Vishnuja)కి 2023 మే నెలలో ప్రభిన్ అనే యువకుడితో వివాహమైంది. ఆ తర్వాత ఆ జంట ఎలంగూర్లో కాపురం పెట్టింది. ప్రభిన్ ఓ పేరుమోసిన ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నాడు. అయితే జనవరి 31వ తేదీన ఉదయం భార్యభర్తలిద్దరూ ఏదో విషయంలో గొడవ పడ్డారు. కాసేపటికే ప్రభిన్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం అయినా ప్రభిన్ ఇంటికి రాకపోవడంతో.. విష్ణుజా కూడా కిందకు దిగకపోవడంతో కింద పోర్షన్లో ఉండే ఆమె అత్త పైకి వెళ్లి చూసింది. ఎంతకీ స్పందన లేకపోవడంతో.. స్థానిక సాయంతో తలుపు పగలకొట్టింది. చూసేసరికి.. విష్ణుజా ఫ్యాన్ను ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది.స్నేహితుల స్టేట్మెంట్ ప్రకారం.. గత కొంతకాలంగా విష్ణుజాను భర్త శారీరకంగా, మానసికంగా హింసిస్తూ వచ్చాడు. ఈ విషయం అతని తల్లికి కూడా తెలుసు. ప్రభిన్ తీరు వల్ల ఈ విషయాలను ఆమె పుట్టింటి వాళ్లతో పంచుకోలేదు. ఎలాగైనా భర్తను మార్చుకోవానుకుంది. కానీ, ఆ మూర్ఖుడి మనసు కరగలేదు. సరికదా.. ఆ వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. క్షోభకు గురై..పెళ్లైన తొలినాళ్ల నుంచే విష్ణుజాను భర్త హింసిస్తూ వచ్చాడు. అందంగా లేదని.. తనకు నచ్చినట్లు తయారు కావట్లేదని సూటిపోటి మాటలతో వేధించేవాడు. ఆ వంకతోనే ఆమెను తన బైక్ మీద తిప్పేవాడు కూడా కాదు. పైగా తరచూ ఆమెను కొట్టేవాడు. ఇంత చదువు చదివి ఉద్యోగమూ లేదని తిట్టేవాడు. ఇంత జరుగుతున్నా.. ఆమె భరించింది. భర్త మెల్లిగా మారుతాడులే అనుకుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతూ వచ్చింది. ఈ క్రమంలో వేధింపుల విషయాన్ని ఆమె తన స్నేహితులతో పంచుకుంది. అయితే ఆ విషయం తెలిసిన ప్రభిన్ మరింత రెచ్చిపోయాడు. ఆమె ఫోన్, వాట్సాప్పై నిఘా పెట్టి.. ఆమె ప్రతీ చర్యను పరిశీలించి హింసించసాగాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ.. చివరకు ఆమె విగతజీవిగా మారిపోయింది. ఏనాడూ ఇంటికి రాలేదుఅయితే తమ కూతురిని ఆమె భర్త, అత్తలు వేధిస్తున్న విషయం.. చనిపోయాక స్నేహితుల ద్వారానే తెలిసిందని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. పెళ్లైనప్పటి నుంచి ప్రభిన్ ఏనాడూ మా ఇంటికి రాలేదు. అడిగితే.. చిన్న సమస్యే నాకు వదిలేయండి అని మా కూతురు చెబుతుండేది. చదువుకునే రోజుల్లోనే పార్ట్ టైం జాబ్తో మా కష్టాలను పంచుకున్న మా బిడ్డ.. పెళ్లయ్యాక ఆమె కష్టాలను మాత్రం మాకు చెప్పుకోలేకపోయింది’’ అని తండ్రి వసుదేవన్ కంటితడి పెట్టారు. అంతేకాదు..తన కూతురిని ప్రభిన్ హత్య చేసి ఉంటాడని ఆయన అనుమానిస్తున్నారు. అతనికి వేరే యువతితో సంబంధం ఉందని ఇప్పుడే తెలిసింది. బహుశా ఆ ఉద్దేశంతోనే నా కూతురిని ఆ కుటుంబం మొత్తం కడతేర్చి ఉండొచ్చు’’ అని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ కేసు తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. నిందితుడికి కఠినంగా శిక్షించాలని చర్చ జరుగుతోంది. గృహహింస చట్టాలను మరింత కఠినతరంగా అమలు చేయాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comచదవండి: టార్గెట్ రూ.333 కోట్లు!.. 100 మంది యువతులతో సన్నిహితంగా.. -
గ్రీన్ ఆర్మీ
ఉత్తరప్రదేశ్లో గతంలో ‘గులాబ్ గ్యాంగ్’ ఘనత విన్నాం. ఇప్పుడు ‘గ్రీన్ ఆర్మీ’. స్త్రీల మీద జరిగే దురాగతాలను స్త్రీలే ఉమ్మడిగా ఎదిరిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారణాసిలో క్రియాత్మకంగా ఉన్న ‘గ్రీన్ ఆర్మీ’ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ ఇటీవలి మన్కీ బాత్లో ప్రశంసించారు.వాళ్లంతా ఒక 50 మంది ఉంటారు. ఆకుపచ్చ చీరలో, చేతి కర్రతో వరుసగా నడుస్తూ ఊళ్లోకి వస్తారు. ఇక ఊళ్లోని మగాళ్లకు గుండె దడే. భార్యలను కొట్టేవాళ్లు, తాగుబోతులు, పేకాట రాయుళ్లు, మత్తు పీల్చేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్లు... ఎక్కడికక్కడ సెట్రైట్ కావాల్సిందే. ఎందుకంటే వారు ‘గ్రీన్ ఆర్మీ’. అందరి స్క్రూలు టైట్ చేసే ఆర్మీ. అందుకే మొన్నటి ‘మన్ కీ బాత్’లో వీరి గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘వీరి ఆత్మనిర్భరతకు, కృషికి అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపారు. దాంతో గ్రీన్ ఆర్మీలో కొత్త జోష్ వచ్చింది.వారణాసి చుట్టుపక్కలగ్రీన్ ఆర్మీ 2014లో పుట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న రవి మిశ్రా వారణాసి చుట్టుపక్కల పల్లెల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఉత్తర జిల్లాలలో గృహ హింస ఎక్కువగా ఉందని గమనించాడు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే వారు ఆత్మరక్షణ చేసుకోగలరని అనుకున్నాడు. కొందరు విద్యార్థులతో కలిసి నిర్మలాదేవి అనే గృహిణిని గృహ హింసను ప్రతిఘటించమని కోరాడు. రైతు కూలీగా ఆమె సంపాదించేదంతా ఆమె భర్త లాక్కుని తాగేవాడు. కొట్టేవాడు. నిర్మాలా దేవి విద్యార్థుల స్ఫూర్తితో ఆత్మరక్షణ నేర్చుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందిని జమ చేసింది. అందరూ కలిసి ఇక గృహ హింసను ఏ మాత్రం సహించమని ఎలుగెత్తారు. అంతేకాదు.. కర్ర చేతబట్టి మాట వినని భర్తలకు బడితె పూజ చేశారు. నిర్మలాదేవి భర్త దారికొచ్చాడు. దాంతో గ్రీన్ ఆర్మీ పేరు వినపడసాగింది.270 పల్లెల్లో...వారణాసిలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు 270 గ్రామాల్లో గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు ఉన్నారు. 2000 మంది స్త్రీలు ఇందులో భాగస్వాములు. ప్రతి ఊరిలో ఇరవై నుంచి యాభై మంది స్త్రీలు ఆకుపచ్చ చీరల్లో దళంగా మారి క్రమం తప్పక ఇంటింటికీ వెళ్లి సమస్యల ఆచూకీ తీస్తారు. వాటికి పరిష్కారాలు వెదుకుతారు. స్త్రీల మీద చెయ్యెత్తడం అనేది వీరు పూర్తిగా ఊళ్లల్లో నిర్మూలించారు. ఇక తాగుడు పరిష్కారం కోసం తాగుబోతులకు కౌన్సెలింగ్ ఇవ్వడంప్రారంభించారు. పేకాట, డ్రగ్స్కైతే స్థానమే లేదు. గ్రీన్ ఆర్మీతో స్థానిక పోలీస్ కాంటాక్ట్లో ఉంటుంది. ఎవరైనా గ్రీన్ ఆర్మీకి ఎదురు తిరిగితే పోలీసులు వచ్చి చేయవలసింది చేస్తారు. వరకట్న సమస్య ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉంది. ‘మీకు కట్నం ఎందుకు ఇవ్వాలి... సరంజామా ఎందుకివ్వాలి’ అని గ్రీన్ ఆర్మీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దాంతో గొంతెమ్మ కోరికలు పూర్తిగా తగ్గాయి. ఇచ్చింది పుచ్చుకుంటున్నారు.ఆడపిల్లే అదృష్టంకొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే శోకం వ్యక్తం చేస్తారు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటారు. కాని గ్రీన్ ఆర్మీ బయలుదేరి ఈ శోకానికి ముగింపు చెప్పింది.‘ఆడపిల్ల అంటే లక్ష్మీ అని ఇంటికి భాగ్యమనీ బాగా చదివిస్తే సరస్వతి అని, శక్తిలో దుర్గ అని... ఆడపిల్లను మగపిల్లాడితో సమానంగా చూడాల’ని ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు రక్షణగా నిలబడ్డారు. ఇవన్నీ సాంఘికంగా చాలా మార్పు తెచ్చాయి. అందుకే ఒక్కరు కాకుండా సమష్టిగా ప్రయత్నిస్తే విజయాలు వస్తాయి. గ్రామీణ జీవితంలో స్త్రీలకు ఇంకా ఎన్నో ఆటంకాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కర్రచేత బట్టి ఆర్మీగా మారకపోయినా స్త్రీలు సంఘాలు ఏర్పరుచుకుంటే సమస్యలు దూరం కాకపోవడం ఉండదు. గ్రీన్ ఆర్మీ ఇస్తున్న సందేశం అదే. -
#Mentoo: ఓ డాక్టర్.. ఓ పోలీస్.. ఇలా ఎందరో?
చట్టం ముందు అందరూ సమానమే.. ఇది అనుకోవడానికే తప్ప ఆచరణలో లేదనేది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట. ఇంతకాలం పేద-ధనికలాంటి తారతమ్యాలు వినిపిస్తే.. ఇప్పుడు ఆడ-మగగా మారిందది. అతుల్ సుభాష్ అనే టెక్కీ బలవన్మరణం నేపథ్యంతో ఈ చర్చ మరింత వేడిని రాజేస్తోంది. బెంగళూరు, ఢిల్లీ.. ఇలా మెట్రో నగరాల్లో జస్టిస్ ఫర్ అతుల్ పేరిట సంఘీభావ ప్రదర్శనలు చేసే స్థాయికి చేర్చింది. భార్య కుటుంబం పెట్టిన వేధింపులు.. తప్పుడు కేసులను భరించలేక.. వ్యవస్థతో పోరాడటంలో తడబడిన అతుల్ సుభాష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కానీ, అతని చివరి కోరికగా.. న్యాయం కోసం అతని తరఫున మేం పోరాడతాం అంటూ కొందరు భర్తలు రోడ్డెక్కారు. దేశ జనాభాలో ట్యాక్సులు కట్టేవాళ్లలో మగవాళ్లదే సింహభాగం. కానీ, చట్టాలు మాత్రం కేవలం మహిళల పక్షమే వ్యవరిస్తున్నాయని అంటున్నారు. సమాజంలో పురుషుల ప్రాణాలూ ముఖ్యమేనని.. వారికీ చట్టపరమైన రక్షణ కావాలని ముక్తకంఠంతో కోరుతున్నారు వాళ్లు. అయితే.."70 Crore men pay tax in India, not even one welfare scheme for men is funded by our own taxes."Delhi joins Bengaluru in nation wide protests for Atul Subhash's suicide due to harassment by wife and judiciary. pic.twitter.com/RZwJgql0sf— Mick Kay (@mick_kaay) December 14, 2024 అతుల్ ఘటన తర్వాత.. ఈ బర్నింగ్ టాపిక్కు మరో రెండు ఘటనలు తోడయ్యాయి. కర్ణాటకలో హులిమవు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెడ్కానిస్టేబుల్ హెచ్సీ తిప్పన్న(34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి రైలు పట్టాలపై పడుకుని చితికిపోయాడు. భార్య, ఆమె కుటుంబం పెట్టే నరకం భరించలేకే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తిప్పన్న రాసిన ఓ సూసైడ్ నోట్ చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు..డిసెంబర్11వ తేదీన.. రాజస్థాన్లో హోమియోపతి డాక్టర్ అజయ్ కుమార్(35) కృతినగర్లోని తన క్లినిక్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు భార్య వేధింపులే కారణమంటూ లేఖ రాశాడు. భార్యను పచ్చిబూతులు తిడుతూ రాసిన ఆ లేఖలో.. ప్రస్తుత వైవాహిక వ్యవస్థను, ఆ వ్యవస్థ కారణంగా తాను ఎదుర్కొన్న న్యాయపరమైన చిక్కులను, తన నిస్సహాయతను ఆ లేఖలో ప్రముఖంగా ప్రస్తావించాడు. జస్టిస్ ఈస్ డ్యూబెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో ఏఐ ఇంజినీర్గా పని చేస్తున్న యూపీవాసి అతుల్ సుభాష్.. నగరంలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భార్య, ఆమె కుటుంబం తనను ఎంతగా వేధించిందో పే..ద్ద సూసైడ్ నోట్ రాసి.. గంటన్నరపాటు వీడియో తీసి Justice Is Due అని శరీరానికి అంటించుకుని మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు. సుప్రీం కోర్టు తన గోడును వినాలని.. తనకు న్యాయం దక్కని తరుణంలో.. తన అస్తికలను కోర్టు బయటే మురికి కాలువలో కలపాలని.. ఒకవేళ న్యాయం దక్కితే పవిత్ర గంగలో కలపాలని డెత్ నోట్లో కోరాడతను. ఈ క్రమంలో పేజీల కొద్దీ అతుల్ వ్యధ.. ముఖ్యంగా తన కొడుకును ఉద్దేశించి రాసిన లేఖ.. చివరి బహుమతి.. అన్నీ చాలామందిని భావోద్వేగానికి గురి చేసింది.ఇక.. తన సోదరుడి మరణం వెనుక ఆయన భార్య నిఖితా సింఘానియా కుటుంబ ప్రొద్భలం ఉందని అతుల్ సోదరుడు మారతహల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిఖిత కోసం అతుల్ చేయగలిగిందంతా చేశాడని.. అయినా తన సోదరుడి ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడతను. ఈ కేసు దీంతో.. బెంగళూరు పోలీసులు ఆమె స్వస్థలం ఔన్పూర్కు పంపించారు. గత మూడు రోజులుగా ఆ టీం దర్యాప్తు జరుపుతోంది. అయితే.. నిందితురాలు నిఖిత ఇంటికి తాళం వేసి ఉండడంతో గోడకు నోటీసులు అంటించారు. కచ్చితంగా పోలీసుల ఎదుట హాజరుకావాల్సిందేనని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అతుల్ మృతి తర్వాత.. రెండ్రోజులకు కొన్ని మీడియా సంస్థలు నిఖిత నివాసానికి చేరుకున్నాయి. ఆమె అందుబాటులో లేకపోగా.. సోదరుడు, తల్లి మాత్రం మీడియాను ఉద్దేశించి దుర్భాషలాడారు. ఆపై రెండ్రోజులకే వాళ్లు కూడా పరార్ కావడం గమనార్హం.ఒక భార్య.. ‘ఏడు’ భరణం కేసులువైవాహిక చట్టాల దుర్వినియోగంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. అలాంటి ఘటనలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఈ ఏడాది ఆగష్టులో చట్టంతో ఆడుకున్న ఓ భార్య ఉదంతం చర్చనీయాంశమైంది..ఒకావిడ తన భర్త నుంచి భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ భర్త ఆమెకు ఏడో భర్త. అప్పటికే ఆరుగురు మాజీ భర్తల నుంచి విడాకులు తీసుకుని. భరణం కోసం కోర్టును ఆశ్రయించింది. ఇక.. ఏడో భర్త నుంచి భరణం అడిగిన కేసులో న్యాయమూర్తి ఆ అంశాన్ని ప్రస్తావించారు.SERIAL 498A ACCUSER A WOMAN IN KARNATAKA HAS MARRIED 7 TIMESSTAYED WITH EACH MAX 1 YEARFILED 498A, MAINTENANCE CASES ON ALLTAKEN MONEY FROM 6 HUSBANDSNOW FIGHTING CASE WITH 7TH Despite having all records with him, MiLord not sending her to JailJAI HO EQUALITY 🙏 pic.twitter.com/3zpdBFNP1m— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) July 26, 2024ప్రతీ భర్తతో ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఆమె కాపురం చేసి.. విడాకులకు వెళ్లిందని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ విషయం ప్రస్తావిస్తూ.. చట్టంతో మీరు ఆడుకుంటున్నారు అని మహిళను సదరు జడ్జి మందలించారు. అలాగే.. ఆ ఆరుగురి నుంచి ఆమె భరణం భారీగానే పుచ్చుకుందట. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. కర్ణాటకలోనే మరో ఉదంతంలో..ఓ మహిళ తన మాజీ భర్త నుంచి నెలకు రూ.6,16,300 భరణం ఇప్పించమని కోర్టును కోరింది. అయితే ఈ పిటిషన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి.. అంత ఖర్చులు ఉంటే డబ్బులు సంపాదించుకోవాలంటూ ఆ మహిళకు సూచించింది. ఇదే సమయంలో భరణం అనేది భర్తకు శిక్ష కాదని గుర్తు చేసింది.ఇదీ చదవండి: అతుల్ మృగంలా ప్రవర్తించాడు: నికిత ఆరోపణ -
‘వేధింపుల’ చట్టానికి కళ్లెం?
మానసిక ఒత్తిళ్లకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాన్ కెస్లర్ చాన్నాళ్ల క్రితం ఒక అధ్యయనం సందర్భంగా తేల్చారు. మహిళలు ఆ ఒత్తిళ్ల పర్యవసానంగా విషాదంలో మునిగితే మగవాళ్లూ, పిల్లలూ ఆగ్రహావేశాలకు లోనవుతారని చెప్పారు. ఒత్తిళ్లకు స్పందించే విషయంలో పిల్లలూ, మగవాళ్లూ ఒకటేనని ఆమె నిశ్చితాభిప్రాయం. ఈ ధోరణికామె ‘ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు. అయితే ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారని చెప్పలేం. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ తన భార్యతో వచ్చిన తగాదాకు సంబంధించిన కేసుల్లో తనకూ, తన తల్లిదండ్రులకూ ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దానికి ముందు విడుదల చేసిన 90 నిమిషాల వీడియో, 24 పేజీల లేఖ ఇప్పుడు న్యాయవ్యవస్థలో సైతం చర్చనీయాంశమయ్యాయి. తనపైనా, తనవాళ్లపైనా పెట్టిన 8 తప్పుడు కేసుల్లో, వాటి వెంబడి మొదలైన వేధింపుల్లో యూపీలోని ఒక ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఉన్నారన్నది ఆ రెండింటి సారాంశం.బలహీనులకు జరిగే అన్యాయాలను నివారించటానికీ, వారిని కాపాడటానికీ కొన్ని ప్రత్యేక చట్టాలూ, చర్యలూ అవసరమవుతాయి. అలాంటి చట్టాలు దుర్వినియోగమైతే అది సమాజ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ వంకన అసలైన బాధితులకు సకాలంలో న్యాయం దక్కదు సరికదా... బలవంతులకు ఆయుధంగా మారే ప్రమాదం ఉంటుంది. మహిళలపై గృహ హింస క్రమేపీ పెరుగుతున్న వైనాన్ని గమనించి 1983లో భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 498ఏ చేర్చారు. అనంతర కాలంలో 2005లో గృహహింస చట్టం వచ్చింది. 498ఏ సెక్షన్ గత ఏడాది తీసు కొచ్చిన భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్)లో సెక్షన్ 84గా ఉంది. అయితే అటుతర్వాత కుటుంబాల్లో మహిళలపై హింస ఆగిందా? లేదనే చెప్పాలి. సమాజంలో కొనసాగే ధోరణులకు స్పందన గానే ఏ చట్టాలైనా వస్తాయి. ఎన్నో ఉదంతాలు చోటుచేసుకున్నాక, మరెన్నో ఉద్యమాలు జరిగాక, నలుమూలల నుంచీ ఒత్తిళ్లు పెరిగాక మాత్రమే ఎంతో ఆలస్యంగా ఇలాంటి చట్టాలు వస్తాయి. బల హీనులకు ఉపయోగపడే అటువంటి చట్టాల్ని దుర్వినియోగం చేసే వారుండటం నిజంగా బాధాకరమే.జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం 498ఏ వంటి చట్టాలు ఈమధ్యకాలంలో దుర్వినియోగమవుతున్న ఉదంతాలు పెరగటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత కక్షతో అత్తింటివారిపైనా, భర్తపైనా తప్పుడు కేసులు పెట్టే తీరువల్ల వివాహ వ్యవస్థ నాశన మవుతున్నదని వ్యాఖ్యానించింది. ఇప్పుడే కాదు... 2014లో కూడా సుప్రీంకోర్టు ఒక సంద ర్భంలో ఇలాంటి వ్యాఖ్యానమే చేసింది. ‘భర్తలపై అలిగే భార్యలకు సెక్షన్ 498ఏ రక్షణ కవచంగా కాక ఆయుధంగా ఉపయోగపడుతోంద’ని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇకపై శిక్షాస్మృతిలోని సెక్షన్ 41కి అనుగుణంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని కూడా సూచించింది. నిజమే... ఎలాంటి చట్టాలైనా నిజమైన బాధితులకు ఉపయోగపడినట్టే, అమాయకులను ఇరికించడానికి కూడా దోహదపడుతాయి. చట్టాన్ని వినియోగించేవారిలో, అమలు చేసేవారిలో చిత్తశుద్ధి కొరవడితే జరిగేది ఇదే. ఆ తీర్పు తర్వాత గత పదేళ్లుగా వేధింపుల కేసులు నత్తనడక నడుస్తున్నాయి. అందులో నిజమైన కేసులున్నట్టే అబద్ధపు కేసులు కూడా ఉండొచ్చు. మనది పితృస్వామిక సమాజం కావటంవల్ల పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి కుటుంబ బాధ్యతలు మీద పడేవరకూ ఏ దశలోనూ ఆడవాళ్లపై హింస మటుమాయమైందని చెప్పలేం. వాస్తవానికి ఇందులో చాలా రకాల హింసను మన చట్టాలు అసలు హింసగానే పరిగణించవు. ఆర్థిక స్తోమత, సమాజంలో హోదా వంటివి కూడా మహిళలను ఈ హింస నుంచి కాపాడలేకపోతున్నాయన్నది వాస్తవం. ఒకనాటి ప్రముఖ నటి జీనత్ అమన్, భారత్లో మొట్టమొదటి లేడీ ఫిట్నెస్ ట్రైనర్గా గుర్తింపు సాధించిన నవాజ్ మోదీలు ఇందుకు ఉదాహరణ. వీరిద్దరూ తమ భర్తల నుంచి తీవ్రమైన గృహహింసను ఎదుర్కొన్నారు. జీనత్కు కంటి కండరాలు దెబ్బతిని కనుగుడ్డు బయటకు రాగా, దాన్ని య«థాస్థితిలో ఉంచటానికి గత నలభైయేళ్లలో ఎన్ని సర్జరీలు చేయించుకున్నా ఫలితం రాలేదు. నూతన శస్త్ర చికిత్స విధానాలు అందుబాటులోకొచ్చి నిరుడు ఆమెకు విముక్తి దొరికింది. ఒకప్పుడు కట్టుబాట్లకు జడిసి, నలుగురిలో చులకనవుతామన్న భయంతో ఉండే మహిళలు ఉన్నత చదువుల వల్లా, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం రావటం వల్లా మారారు. వరకట్న వేధింపులు, ఇతర రకాల హింసపై కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అదే సమయంలో కొందరు దుర్వినియోగం చేస్తున్న మాట కూడా వాస్తవం కావొచ్చు. అలాంటివారిని గుర్తించటానికీ, వారి ఆట కట్టించటానికీ దర్యాప్తు చేసే పోలీసు అధికారుల్లో చిత్తశుద్ధి అవసరం. ఈ విషయంలో న్యాయస్థానాల బాధ్యత కూడా ఉంటుంది. లోటుపాట్లు తప్పనిసరిగా సరిచేయాల్సిందే. కానీ ఆ వంకన అలాంటి కేసుల దర్యాప్తులో జాప్యం చోటు చేసు కోకుండా ఇతరేతర మార్గాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఏటా ప్రతి లక్షమంది మహిళల్లో దాదాపు ముగ్గురు వరకట్న హింసకు ప్రాణాలు కోల్పోతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. వరకట్న నిషేధ చట్టం వచ్చి 63 ఏళ్లవుతున్నా ఇదే స్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత చట్టాలను నీరగార్చకుండానే ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఆలోచించాలి. -
మ్యారిటల్ రేప్ నేరం కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: భార్యతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త సంభోగంలో పాల్గొనడాన్ని(మ్యారిటల్ రేప్) నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భార్య వయసు 18 ఏళ్లు దాటి ఉంటే ఆమెతో భర్త బలవంతంగా లైంగిక కార్యం జరిపినా నేరం కాదని వెల్లడించింది. ఒకవేళ ఆమె వయసు 18 ఏళ్లలోపు ఉంటే ఆ లైంగిక కార్యం నేరమేనని ఉద్ఘాటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ బుధవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 74, 75, 76, 85తోపాటు గృహహింస నుంచి మహిళలకు రక్షణ కలి్పంచే చట్టం–2005 వివాహిత మహిళలకు పలు హక్కులు, రక్షణలు, గౌరవం కలి్పస్తున్నాయని వెల్లడించారు. -
భర్తపై తప్పుడు కేసు.. సుప్రీం కోర్టు సీరియస్
భార్య పెట్టిన వేధింపులు భరించలేక అతుల్ సుభాష్ అనే బెంగళూరు టెక్కీ బలవనర్మణానికి పాల్పడడం.. నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తాను రాసిన సూసైడ్ నోట్ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరాలన్నది అతని కోరిక. అయితే ఈ ఘటన జరిగి 48 గంటలు గడవకముందే.. వైవాహిక చట్టాల దుర్వినియోగంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.న్యూఢిల్లీ: వ్యక్తిగత పగలతో భర్త, అతని కుటుంబంపై ఓ మహిళ ‘‘వరకట్న వ్యతిరేక చట్టం’’ ప్రయోగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది అవసరంగా భర్తలను వేధించడం కిందకే వస్తుందని, ఇలాంటి కేసుల విషయంలో ఇకపై తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించింది. ‘‘498ఏ సెక్షన్(వరకట్న వ్యతిరేక చట్టం).. గృహ హింస, వరకట్న వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికే. కానీ, ఈ మధ్యకాలంలో మార్పు కనిపిస్తోంది. చాలామంది మహిళలు తమ గొంతెమ్మ కోర్కెలు నెరవేర్చుకోవడానికి దీనొక్క ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి ధోరణిని ఎంతమాత్రం సహించబోం’’ అని జస్టిస్ బీవీ నాగరత్న, ఎన్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం పేర్కొంది.ఇదీ చదవండి: పేజీల కొద్దీ సూసైడ్ నోట్.. కదిలించిన ఓ భర్త గాథతెలంగాణకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అయితే ఆ తర్వాత ఆ భార్య.. భర్త, అతని కుటుంబం తనను వేధిస్తోందంటూ 498ఏ కింద వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ భర్త హైకోర్టును ఆశ్రయించినా.. ఊరట దక్కలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే తమ పరిశీలనలో ఈ విషయం గుర్తించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.‘‘ఇక్కడ వ్యక్తిగత కక్షతో భర్తపై ఆమె చట్టాన్ని ఆయుధంగా ప్రయోగించాలనుకుంది. ఈ కేసులో భర్తపై నిరాధార ఆరోపణలు చేసిందామె. భర్తను, అతని కుటుంబాన్ని వేధించాలనే ఆమె ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి కేసుల్లో విచారణ సజావుగా జరగాలి. లేకుంటే.. చట్టప్రక్రియల దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు విఫలమైంది. ఈ కేసును కొట్టివేయకపోవడం ఆ ఉన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర తప్పిదం.’’ అని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే.. అలాగని.. అన్ని కేసులపై తాము ఈ వ్యాఖ్య చేయడం లేదని, ఇలాంటి వైవాహిక చట్టాల్ని దుర్వినియోగం చేయడంపై మా ఆందోళన’’ అని న్యాయమూర్తులిద్దరూ స్పష్టం చేశారు.ఐపీసీ సెక్షన్ 498ఏ.. జులై 1వ తేదీ నుంచి కాలం చెల్లింది. ఆ స్థానంలో భారతీయ న్యాయ సంహిత(BNS) సెక్షన్ 86 అందుబాటులోకి వచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఘటన జరిగిన మూడేళ్లలోపు ఎప్పుడైనా ఫిర్యాదు నమోదు చేయొచ్చు. -
న్యాయ సలహా : మిమ్మల్ని వెళ్లగొట్టే హక్కు వారికి లేదు!
నా వయసు 45 సంవత్సరాలు. మా పెళ్లి జరిగి పాతికేళ్లకు పైగా అయింది. పెళ్లయిన నాటినుంచి నాకు భర్త నుంచి ఆదరణ లేదు సరికదా, చీటికిమాటికీ నాపై చెయ్యి చేసుకోవడం, అత్తమామలు, ఆడబిడ్డల నుంచి ఆరళ్లు... పిల్లలు పుట్టి, పెద్దవాళ్లయినా నాకీ మానసిక, శారీరక బాధలు తప్పడం లేదు. అదేమంటే నన్ను ఇంటిలోనుంచి వెళ్లగొడతానని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. – కె. సుజాత, శంషాబాద్పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి వెళ్ళి, గృహిణిగా వుండే స్త్రీలే మన సమాజంలో ఎక్కువ. అలా గృహిణిగా వుంటున్న స్త్రీలని ఏదో వారికి సేవ చేయటానికి మాత్రమే కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేశారు అనే పురుషాహంకార భావజాలాలు కల్గిన భర్తలు, అత్త–మామలూ కూడా ఎక్కువే! ఉద్యోగం వదిలేసి, తనకంటూ స్వంత ఆదాయం లేకుండా కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేశాక ‘‘నేను వదిలేస్తే నీకు జీవితం లేదు.. వుండటానికి నీడ కూడా దొరకదు.. నీకు విడాకులు ఇస్తాను, రోడ్డున పడతావ్’’ అంటూ బెదిరిస్తూ మహిళలపై అజమాయిషి చలాయించేవారిని తరచు చూస్తుంటాం. ముందూ వెనుకా ఎవరి సహాయం లేకుండా, పెద్దగా చదువుకోకుండా, ఉద్యోగంలో చాలా గ్యాప్ వచ్చి లేదా పుట్టినింటినుంచి పెద్దగా ఆదరణ లేదు అని అనుకున్న స్త్రీలైతే భర్త వదిలేస్తే వారి పరిస్థితి ఏమిటి అని భయపడుతూ, వారికి ఎదురయ్యే గృహహింసను కూడా మౌనంగా భరిస్తూ ఉంటారు.నిజానికి అలా భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మహిళలకు ఎంతో బాగా ఉపయోగపడే, రక్షణ కల్గించే చట్టమే ‘గృహ హింస చట్టం, 2005’. ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం, భర్త (లేదా అత్త–మామలు) నివసిస్తున్న ఇంట్లోనే, విడాకుల కేసు లేదా మరేయితర కేసులు నడుస్తున్నప్పటికీ గృహహింసకు గురైన మహిళకు కూడా సమానంగా నివసించే హక్కు వుంటుంది. కొన్ని సందర్భాలలో ఐతే భార్య/ గృహ హింసకి గురవుతున్న స్త్రీ రక్షణ కొరకు భర్తను ఇంట్లోనుంచి వెళ్లిపోవాలి అని కూడా కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. భర్త పేరిట ఇల్లు ఉన్నా గాని, అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కల్పిస్తుంది ఈ చట్టం. అలా కుదరని పక్షంలో భర్త నివసించే ఇంటికి సమానమైన ప్రత్యామ్నాయ వసతిని కల్పించవలసి ఉంటుంది. అంతేకాక, మరలా గృహహింసకు పాల్పడే వీలు లేకుండా భర్త – తన కుటుంబ సభ్యులపై కూడా ఇంజక్షన్ ఇస్తూ కోర్టు ‘ ప్రొటెక్షన్ ఆర్డరు / రక్షణ ఉత్తర్వులు ’’ ఇవ్వవచ్చు. కాబట్టి, భర్త వదిలేస్తే ఇక తనకి జీవితం వుండదు అనుకునే ధోరణి అవసరం లేదు. గృహ హింసని భరించాల్సి అవసరం అంతకంటే లేదు. గృహహింస చట్టం, 2005 అనేది ఒక ప్రత్యేక చట్టం. ఇందుకుగాను మీరు నేరుగా మెజిస్ట్రేట్ ను గానీ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖను గానీ సంప్రదించ వచ్చు. ఐపీసీ 498అ (కొత్త చట్టం – సెక్షన్ 85 బీ.ఎన్.ఎస్) కు, గృహ హింస చట్టానికి సంబంధం లేదు. ఆరోపణలు, గృహహింస ఒకటే అయినప్పటికీ రెండు కేసులు వేర్వేరుగా పిర్యాదు చేయాలి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
ఇంటి దీపాన్ని.. ఇల్లే ఆర్పుతోందా!
సాధారణంగా పేదరికం, నిరుద్యోగం, అప్పులు, అవమానాలు, కుంగుబాటు, వైవాహిక సమస్యలు.. వంటివి ఆత్మహత్యలకు పురిగొల్పుతాయి. అయితే వాటిలో గృహహింస కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య అనేది వ్యక్తిగత చర్య అయినప్పటికీ అది అనేక సామాజిక కారణాలతో ప్రభావితం అయ్యి ఉంటుంది. వ్యక్తిగత దుర్బలత్వం సామాజిక ఒత్తిళ్ల నుంచి వచ్చేదై ఉంటుంది. దీనిని మానసిక అనారోగ్యంగానూ అర్థం చేసుకోవచ్చు. ఇందులో కుటుంబ కలహాలు, సామాజిక అస్థిరతలు సమాన పాత్ర పోషిస్తాయి.గృహహింసలో ప్రధానంగా...గృహహింస కారణంగా 64 శాతం మంది మహిళలు ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నట్టు ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ జరిపిన అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం విడాకులు, వరకట్నం, ప్రేమ వ్యవహారాలు, వివాహం రద్దు లేదా వివాహం చేసుకోలేకపోవడం (భారతదేశంలో వివాహ విధానాల ప్రకారం), అవాంఛిత గర్భం, వివాహేతర సంబంధాలు, ఈ సమస్యకు సంబంధించిన విభేదాలు.. ఇలాంటివన్నీ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘పరువు’ అనే కారణంతో కుటుంబ ఆత్మహత్య సంఘటనలు తరచు సంభవిస్తుంటాయి.మానసిక రుగ్మతలుఆత్మహత్య కారణంగా మరణించేవారిలో దాదాపు 90 శాతం మంది మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి. చెన్నైలో చేసిన అధ్యయనంలో 80 శాతం, బెంగళూరులో 43 శాతం మంది మానసిక రుగ్మతలతో బాధపడతున్నట్లు తెలిసింది. సమాజంలో/ కుటుంబంలో అణచివేతకు గురైనవారు డిప్రెషన్, ఇతర మానసిక వ్యాధి లక్షణాలను ఉన్నట్టు గుర్తించారు. వీరిలో ఎక్కువశాతం మంది డిప్రెషన్వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారు.మద్యపానం వల్ల..ఆత్మహత్యలలో మద్యపానం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆత్మహత్య చేసుకునే సమయంలో 30–50 శాతం మంది పురుషులు మద్యం మత్తులో ఉండగా, స్త్రీలను వారి భర్తల మద్యపాన వ్యసనమే ఆత్మహత్యకు పురికొల్పుతున్నట్లు వెల్లడైంది. ఆత్మహత్య అనేది ఎన్నో అంశాలు కలిసిన అతి పెద్ద సమస్య. అందుకే నివారణ చర్యలు కూడా అన్ని వైపుల నుంచి జరగాలి. ఇక జాతీయ స్థాయిలో ఆత్మహత్య నివారణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి, సహకారం, సమన్వయం, నిబద్ధత అవసరం. మానసిక ఆరోగ్య రంగంలో సామాజిక, ప్రజారోగ్యమే లక్ష్యంగా ఉండాలి. మానసిక ఆరోగ్య నిపుణులు ఆత్మహత్యల నివారణలో చురుకైన పాత్ర పోషించాలి.చేయూత అవసరం..→ గృహహింస బాధితులకు వారి చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కారణం అవుతుంటారు. భరించడం అనే స్థాయి నుంచి తమ బతుకు తాము బతకగల ధైర్యం, స్థైర్యం పెం΄÷ందించుకోవాలి. → టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నూతన జీవనం వైపుగా అడుగులు వేయాలి. ఇందుకు కుటుంబ సభ్యులు చేయూతను అందించాలి. → స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలలో అవగాహన తరగతులు నిర్వహించాలి. → ఉపాధ్యాయులు, పోలీసులు, నాయకులు, నమ్మకమిచ్చే అభ్యాసకులు... ఇలా అందరూ బాధ్యత గా వ్యవహరించాలి.→ ప్రాణాలతో బయటపడిన వారిని సంఘటితం చేసి, వారిని ఈ అవగాహన తరగతులలో పాలుపంచుకునేలా చేయాలి.– పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్గమనిక:ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
నారీ అదాలత్ ఏం చెబుతోంది?
భారతీయ న్యాయ సంహిత తాజాగా అమలులోకి వచ్చింది. అలాగే స్త్రీలకు సత్వర న్యాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ‘నారీ అదాలత్’ పేరుతో ప్రత్యేక పంచాయతీ వ్యవస్థను పరిచయం చేయబోతోంది. పైలట్ప్రాజెక్ట్గా అసోం, జమ్ము–కశ్మీర్లలో ప్రవేశపెట్టనున్నారు. ఇది కోర్టులా న్యాయం చేస్తుందా? లేదా ‘ఖాప్ పంచాయతీ’లా పంచాయతీ పెడుతుందా? అసలు ‘నారీ అదాలత్’ ఏంటి?నళిని ప్రైవేట్ టీచర్. తమ ఊళ్లోనే ఉన్న కాన్వెంట్లో పని చేస్తోంది. వృత్తి అంటేప్రాణం. వాళ్లది గ్రామ పంచాయతీ. వ్యవసాయ కుటుంబం. ఇంట్లోనే పాడి. భార్యగా, ఇంటి కోడలిగా ఆ బాధ్యతలన్నీ నళినే చూసుకోవాలని ఆమె మీద ఒత్తిడి.. భర్త, అత్తగారి నుంచి! ఆఖరికి వాకిలి ఊడ్చి, కళ్లాపి జల్లి, ముగ్గు వేసే పనినీ నౌకరుతో చేయిస్తోందని భర్త కంప్లయింట్. ఆ ఒత్తిడి హింసగా మారి నళిని మానసిక ఆరోగ్యం మీదా ప్రభావం చూపిస్తుడంటంతో ఆమె గృహ హింస చట్టాన్ని ఆశ్రయించక తప్పలేదు. ‘విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్’లో భర్త మీద ఫిర్యాదు చేసింది. భార్యాభర్తలిద్దరికీ రెండుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా నళిని భర్తది ఒకటే మాట.. ఆమె ఉద్యోగం మానేయాలని! దానికి నళిని ససేమిరా అన్నది. దాంతో ‘విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్’(తాము కౌన్సెలింగ్ చేసిన విధానం, అయినా ఫలితం రాని వైనాన్ని రాసిన నివేదిక) ను కోర్ట్కి సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా గృహ హింస చట్టం కింద కోర్ట్ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. గృహ హింస చట్టంలో ఆరోపణ రుజువైతే బాధితులకు ఆర్థిక భద్రత కల్పించాలి. వాళ్లకున్నప్రాథమిక హక్కుని గౌరవించాలి. ఇది మహిళలకు ఆ యాక్ట్ ద్వారా కోర్టులు అందించే న్యాయం. నళిని ఉండే ఊర్లో ‘నారీ అదాలత్’ అమలయితే ఆ పంచాయతీ ఎలా ఉండొచ్చు?‘నారీ అదాలత్’లోని సభ్యుల్లో సగం మంది గ్రామ పంచాయత్ నుంచి ఉంటారు. మిగిలిన సగంలో టీచర్లు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సామాజిక కార్యకర్తలు మొదలైన వారుంటారు. వీళ్లను గ్రామస్థులే నామినేట్ చేస్తారు. ఈ కమిటీ అంతా మహిళలతోనే ఉంటుందా? లేక స్త్రీ, పురుషులతో కలసి ఉంటుందా అనేదాని మీద ఎక్కడా పూర్తి వివరం లేదు. సరే.. నళినీ కేసు నారీ అదాలత్ స్వీకరించినప్పుడు అదాలత్ సభ్యులపై నళిని అత్తగారి కుటుంబం పలుకుబడి ప్రభావం చూపదా? అలాగే పురుషస్వామ్య సంస్కృతి ప్రభావం వల్ల అదాలత్లోని సభ్యులకు కుటుంబం, స్త్రీ, ఆమె విధుల పట్ల సంప్రదాయ ఆలోచనలు, కచ్చితమైన అభి్రపాయాలు ఉండొచ్చు.ఈ నేపథ్యంలో నళిని విషయంలో ఎలాంటి తీర్పు వెలువడవచ్చు? ఆమె హక్కులు, వ్యక్తిత్వాన్ని గుర్తించే, గౌరవం లభించే అవకాశం ఎంత వరకు ఉంటుంది? దీనివల్ల దళిత, గిరిజన మహిళల మీద వేధింపులు పెరగవచ్చు, రాజకీయ ప్రయోజనాలూ మిళితమవచ్చు. కరప్షన్కి చాన్స్ ఉండొచ్చు. అసలు ఇది ఊళ్లల్లో పెద్ద మనుషుల పంచాయతీకి ఏ రకంగా భిన్నమైనది? దాన్ని ప్రభుత్వం గుర్తించలేదు.. ఈ అదాలత్లను ప్రభుత్వమే నిర్వహిస్తోంది అనే భేదం తప్ప! దీన్ని ఆసరాగా చేసుకుని నారీ అదాలత్ సభ్యులు నిందితుల లేదా వాళ్ల తరఫు పెద్ద మనుషుల ప్రలోభాలకు లొంగి బాధితురాలిని ఇబ్బంది పెట్టే ప్రమాదం మెండు.స్థానిక పోలీసులూ రెచ్చిపోయే అవకాశమూ అంతే అధికం. రే΄÷్పద్దున లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు, ఈవ్టీజింగ్, స్టాకింగ్ లాంటి సమస్యలను తీసుకుని మహిళలు పోలీస్ స్టేషన్కి వెళితే నిందితుల ప్రలోభాలకు తలొగ్గి స్టేషన్కి ఎందుకు వచ్చారు? నారీ అదాలత్లున్నాయి కదా అక్కడే తేల్చుకు΄పొండి అనే చాన్సూ ఉంటుంది. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది? ఈ క్రమంలో మహిళల కోసం వచ్చిన ప్రత్యేక చట్టాల ఉనికే దెబ్బతినే ప్రమాదం కనపడుతోంది. ఏదేమైనా ఇలాంటి ప్రయోగాలు లోతైన అధ్యయనం, విస్తృతమైన చర్చలతో, ఒక నిర్దిష్ట రూపం దాల్చాకే అమల్లోకి వస్తే మంచిది అని అభి్రపాయపడుతున్నారు పలువురు న్యాయప్రముఖులు, సామాజిక కార్యకర్తలు! – సరస్వతి రమట్రయల్ అండ్ ఎర్రర్గానే... కోర్టులకు పనిభారం తగ్గించేందుకే కేంద్రం ఖాప్ పంచాయత్లను పోలిన నారీ అదాలత్లను ఏర్పాటు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇది ఏ రకంగానూ విమెన్ ఫ్రెండ్లీ కాదు. ఇప్పటివరకు విన్న, చదివిన దాన్ని బట్టి ఇదో ట్రయల్ అండ్ ఎర్రర్గా మిగిలిపోనున్నది. ఎందుకంటే గ్రామస్థాయిలో న్యాయవాదులచే శిక్షణ ΄పొందిన లీగల్ వలంటీర్ వ్యవస్థ ఉంది.మండల, జిల్లా స్థాయిల్లో లీగల్ సర్వీస్ అథారిటీ కేంద్రాలు, సఖీ సెంటర్లున్నాయి. ఇప్పటికే ప్రతి పోలీస్స్టేషన్కి అనుబంధంగా ఉన్న కౌన్సెలింగ్ సెంటర్స్ వల్ల పోలీసులు ఫిర్యాదులే తీసుకోవట్లేదు. ఎంత తీవ్రమైన సమస్యలనైనా కౌన్సెలింగ్ సెంటర్స్కే రిఫర్ చేస్తున్నారు. అక్కడ కొన్ని పరిష్కారం అయ్యి కొన్ని కాక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది రచ్చబండను పోలిన ఈ నారీ అదాలత్లు ఏం న్యాయం చేయగలవు! – ఇ. పార్వతి, ఫ్యామిలీ కౌన్సెలర్అసంబద్ధమైన ఆలోచన‘నారీ అదాలత్’ లాంటి అఫీషియల్ ఖాప్ పంచాయత్లు మహిళల హక్కుల ఉల్లంఘనకు పాల్పడతాయి. వీటివల్ల మహిళల ప్రైవసీ, డిగ్నిటీ, మర్యాదలకు భంగం వాటిల్లవచ్చు. అంతేకాదు పరువు పేరుతో వాళ్లప్రాణాలకూ ముప్పు ఉండొచ్చు. ఇదొక అసంబద్ధమైన ఆలోచన. జూన్ 30 వరకు అమలులో ఉన్న క్రిమినల్ చట్టాల ప్రకారం.. కుటుంబ వివాదాలకు సంబంధించిన అన్ని కేసులు ఇంకా చె΄్పాలంటే ఏడేళ్లలోపు శిక్షలు పడ్డ అందరికీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. అంటే బాధితులకు న్యాయాన్ని అందించడంతో పాటు నిందితుల హక్కులనూ గుర్తిస్తుందన్నమాట. కుటుంబ కలహాలు, గృహ హింస కేసుల్లో కౌన్సెలింగ్ ఫెయిలైతే సదరు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు రిపోర్ట్ పంపిస్తారు. దాని ప్రకారం వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చట్టం చెబుతోంది. ఇలాంటి కేసుల్లో కొత్త శిక్షాస్మృతీ దాన్నే ఫాలో కావాలి. కానీ కొత్త క్రిమినల్ చట్టాలు, ముఖ్యంగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్నెస్సెస్) లోని కొన్ని రూల్స్ వల్ల అలా జరగకపోవచ్చు. సాధారణంగా ఏ ఫిర్యాదు అందినా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అయితే కుటుంబ కలహాల కేసులు, ఆర్థిక నేరాలు వంటి కొన్ని ఆరోపణలలో ఏడు రోజుల వరకు ప్రిలిమినరీ ఎంక్వయిరీ చేయవచ్చు. కానీ అది నిజనిర్ధారణకు కాదు. కాగ్నిజబుల్ కేసు అనిపిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీరాలి. కానీ బీఎన్నెస్సెస్ ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వయిరీ పవర్ పోలీసులకు వచ్చింది. కాబట్టే వాళ్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఆస్కారం తక్కువుంటుంది. ఇదివరకైతే పోలీసులు సహకరించకపోతే ఎఫ్ఐఆర్ వేయమని జిల్లా మేజిస్ట్రేట్ దగ్గర పిటిషన్ దాఖలు చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు బీఎన్నెఎస్సెస్లోని సెక్షన్ 223 (1) ప్రకారం నిందితుడి పక్షం వినకుండా మెజిస్ట్రేట్.. ఎఫ్ఐఆర్ కోసం పోలీసులకు ఆదేశాలిచ్చే అవకాశం లేదు. దాంతో బలవంతులైన పురుషులకు బయటపడే మార్గాలను వెదుక్కునే చాన్స్ దొరుకుతోంది. వీటివల్ల 498 వంటి కేసుల్లోనూ ఎఫ్ఐఆర్ ఆలస్యం అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఇలా కోర్టు పరిధిని తగ్గించే ఇలాంటి ప్రయత్నాలేవీ సమాజానికి మంచివి కావు. – శ్రీకాంత్ చింతల, తెలంగాణ హైకోర్టు న్యాయవాది -
ఒకపుడు చనిపోవాలనుకుంది.. ఇపుడు ఐఏఎస్ అధికారిగా!
గృహ హింసను భరించలేక భర్త నుంచి విడిపోయి, ఆర్థిక భారాన్ని, కన్నీటి సాగరానికి ఎదురీది సక్సెస్ను అందుకోవడం మహిళలకు తెలిసినంతగా బహుశా మరెవ్వరికీ తెలియదేమో. అన్ని ప్రతికూలతలను అధిగమించి అచంచల సంకల్పంతో జీవితాలను మార్చుకోవడంలో వారి పట్టుదల, శ్రమ అసాధారణం. అలాంటి స్ఫూర్తిదాయకమైన మహిళా ఐఏఎస్ అధికారి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని మండై గ్రామంలోని గిరిజన కుటుంబంలో పుట్టింది సవిత ప్రధాన్. ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న ఆ కుటుంబంలో సవితకు లభించిన స్కాలర్షిప్ ఆమె చదువుకు ఆధారం. అలా కష్టపడి 10తరగతి పూర్తి చేసి తన గ్రామంలో టెన్త్ చదివిన తొలి అమ్మాయిగా నిలిచింది. ఆ తర్వాత ఆమెకు 7 కి.మీ దూరంలో కాలేజీలో చేరింది. ఆమె ఫీజు కట్టేందుకు తల్లి పార్ట్ టైం ఉద్యోగం చేసేది. డాక్టర్ కావాలన్న ఆశయంతో సైన్స్ని ఎంచుకుంది. కానీ 16 ఏళ్లు వచ్చాయో లేదో పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు. బాగా డబ్బున్న కుటుంబం అన్న ఒకే ఒక్క కారణంతో సవితకు ఇష్టం లేకుండానే ఆమె పెళ్లి జరిగి పోయింది. ఇక్కడే సవిత జీవితం మరో మలుపు తిరిగింది. పెళ్లి తరువాత జీవితం దుర్బరంగా మారిపోయింది. అటు అత్తమామ వేధింపులు, ఇటు భర్త హింస మొదలైంది. కొట్టి చంపేస్తానని బెదిరించేవాడు భర్త. గర్భవతిగా ఉన్నపుడు కూడా తిండి సరిగ్గా పెట్టేవారు. రొట్టెల్ని దాచుకుని దొంగచాటుగా తినేది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా ఇది ఆగలేదు. నరకం చూసింది. ఈ బాధలు తట్టుకోలేక ఇక జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకుంది. సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకోబోతుండగా కిటికీలోంచి అత్తగారు చూసింది. అయినా ఏమాత్రం జాలి చూపలేదు సరిగదా. మరింత వేధించ సాగింది. దీనికి తోడు రాక్షసుడివగా మారిన భర్త చివరికి తన కుమారుడిని కూడా కొట్టడం మొదలు పెట్టాడు. దీంతో ధైర్యాన్ని కూడగట్టుకున్న సవిత తన పిల్లల కోసం బ్రతకాలని గట్టిగా భావించింది. కేవలం 2700రూపాయలతో పిల్లలిద్దరితో ఇంటినుంచి బైటపడింది. తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి బ్యూటీ సెలూన్ను మొదలు పెట్టింది. ఇది చాలక పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. ఇళ్లలో పనిచేసేది.. దొరికిన పని అల్లా చేసేది. ఇది ఇలా సాగుతూండగానే తల్లిదండ్రులు ,తోబుట్టువుల సాయంతో భోపాల్లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో బీఏ డిగ్రీ చేసింది. డిగ్రీ చదువుతుండగానే సివిల్ సర్వీసెస్ గురించి తెలిసి వచ్చింది. మంచి జీతం, జీవితం రెండూ ఉంటాయని గ్రహించింది. ఇక అంతే కృషి, సంకల్పంతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. 24 ఏళ్ల వయస్సులో ఏఐఎస్ సాధించింది. తొలుత చీఫ్ మున్సిపల్ ఆఫీసర్గా ఆ తర్వాత వరుస ప్రమోషన్షను సాధించింది. ప్రస్తుతం, ఆమె గ్వాలియర్ అండ్ చంబల్ ప్రాంతాలకు తొలి అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. పెళ్లి కూడా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మరో పెళ్లి కూడా చేసుకుంది. అంతేకాదు తనలాంటి మహిళలకు, అమ్మాయిలకు ధైర్యాన్నిచ్చేలా ‘హిమ్మత్ వాలీ లడ్కియాన్’ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. ఏ అమ్మాయి మౌనంగా బాధపడకూడదనేదే ఆమె ఉద్దేశం. తన జీవిత పోరాటాన్నే పాఠంగా బోధిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది సవిత. -
భారత సంతతి కుటుంబం మృతి కేసులో కీలక అంశాలు
న్యూయార్క్: అమెరికాలోని మసాచుసెట్స్లో భారత సంతతి సంపన్న కుటుంబం చనిపోయిన కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్ కమల్ (57), ఆయన భార్య టీనా(54) కుమార్తె అరియానా(18) వారి విశాలమైన భవనంలో శవాలై కనిపించారు. రాకేష్ మృతదేహం దగ్గర తుపాకీ ఉండటంతో గృహ హింసలో వీరు మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. రాకేష్ కమల్ తన భార్య టీనా, కూతురు అరియానాతో మసాచుసెట్స్లో విశాలమైన భవనంలో నివసిస్తున్నారు. ఆ భవనంలో 11 పడక గదులు, 13 బాత్రూమ్లు ఉన్నాయి. అయితే.. వీరు గత రెండు రోజులుగా కనిపించకోవడంతో సమీప బంధువు వెళ్లి చూశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాకేష్ కుటుంబం మొత్తం మృతదేహాలుగా పడి ఉన్నారు. రాకేష్ మృతదేహం వద్ద ఆయన తుపాకీ కూడా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. రాకేష్ కుటుంబం ఆర్థిక సమస్యలతో మరణించి ఉండవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. టీనా, ఆమె భర్త గతంలో ఎడునోవా అనే ఎడ్యుకేషన్ కంపెనీని నడిపారు. వారి కంపెనీ 2016లో ప్రారంభించబడింది. కానీ డిసెంబర్ 2021లో కాలేజీని రద్దు చేశారని పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో భవనంలో కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అరియానా తెలివైన యువతి.. రాకేష్, టీనా కుమార్తె అరియానా మిల్టన్ అకాడమీ నుండి పట్టభద్రురాలైంది. ఆమె మరణం గురించి తెలుసుకోవడం చాలా బాధ కలిగించిందని అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. అరియానా చాలా తెలివైన అమ్మాయి అని విద్యాలయ ఫ్రొఫెసర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: బాంబు దాడిలో.. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహార్ మృతి? -
పెళ్లైన గంటల్లోనే భార్యపై దాడి.. వివేక్ బింద్రాపై గృహహింస కేసు
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ వివేక్ బింద్రాపై కేసు నమోదైంది. పెళ్లైన కొన్ని గంటలకే భార్యను వేధింపులకు గురిచేయడంతో పోలీసులు వివేక్ బింద్రాపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. వివేక్ బింద్రాకు యానిక అనే మహిళతో డిసెంబర్ 6న వివాహం జరిగింది. వీరు నోయిడాలోని సెక్టర్ 94 సూపర్ నోవా రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. డిసెంబర్ 7 తెల్లవారుజామున, బింద్రా అతని తల్లి ప్రభ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవను ఆపేందుకు ఆయన భార్య యానికా ప్రయత్నించడంతో బింద్రా ఆమెపై దాడికి దిగాడు. యానిక శరీరంపై పలుచోట్ల గాయాలు కాగా ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఈ విషయంపై బాధితురాలు సోదరుడు వైభవ్ క్వాత్రా నోయిడాలోని సెక్టర్ 126 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేగాక వివాహం జరిగిన కొన్ని గంటలకే, బింద్రా యానికను ఒక గదిలోకి తీసుకెళ్లి, ఆమెపై అసభ్యపదజాలంతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె జుట్టును లాగి, దాడి చేసినట్లు తెలిపారు. యానికా చెవికి గాయం అవ్వడంతో వినికిడి సమస్య ఏర్పడినట్లు వెల్లడించారు. బింద్రా ఆమె ఫోన్ను కూడా పగలగొట్టినట్లు చెప్పారు. దీనిపై నోయిడా పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం బింద్రా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక దేశంతో పేరు ప్రఖ్యాతలు సాధించినమోటివేషనల్ స్పీకర్ వివేక్ బింద్రా.. బడా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీబీపీఎల్) సీఈవో కూడా. అతనికి యూట్యూబ్, ఇన్స్టాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. చదవండి: వికటించిన క్రిస్మస్ డిన్నర్.. 700 మందికి అస్వస్థత -
Priya Varadarajan: ప్రతి స్త్రీ దుర్గ వలే...
ప్రతి స్త్రీలో ఒక దుర్గ ఉంటుంది. కాని ఆ దుర్గను అదిమి పెట్టేలా కుటుంబం, సమాజం ఆమెను తీర్చి దిద్దుతాయి. దాంతో తన మీద ఏ అన్యాయం జరిగినా చెప్పలేని స్థితికి చేరుతుంది. ‘నువ్వు దుర్గవి. పోరాడు’ అని చెప్తారు బెంగళూరులోని ‘దుర్గ ఇండియా’ టీమ్ సభ్యులు. ప్రియా వరదరాజన్ అనే యాక్టివిస్ట్ ఏర్పాటు చేసిన ఈ గ్రూప్ స్త్రీలను కుటుంబ హింస నుంచి... లైంగిక వేధింపుల నుంచి కాపాడటానికి పని చేస్తోంది. వారి పోరాటానికి శక్తినిస్తోంది. ‘ప్రతి ఒక్కరూ మార్పు కోసం ఎదురు చూస్తారు. మనమే మార్పు కోసం ప్రయత్నిద్దామని ఎందుకు అనుకోరు... ఎదురు చూస్తూ కూచుంటే మార్పు వస్తుందా?’ అంటారు ప్రియా వరదరాజన్. బెంగళూరులో ‘దుర్గ ఇండియా’ అనే సంస్థ స్థాపించి స్త్రీల సమస్యలపై పని చేస్తున్న ప్రియ ఇటీవల బెంగళూరు మాల్లో ఒక వ్యక్తి స్త్రీలను అసభ్యంగా తాకడం గురించి ప్రస్తావిస్తూ ‘పబ్లిక్ ప్లేసుల్లో– బహిరంగ ప్రదేశాల్లోగాని ఆన్లైన్లోగాని స్త్రీల గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తే అలాంటి వారిపై చర్య తీసుకునేందుకు ఆ బాధిత మహిళకు అండగా నిలవడం మేము చేసే పని. చట్టాలు ఎన్ని ఉన్నా, పోలీసులు, మహిళా పోలీసులు ఎందరు ఉన్నా మహిళలకు సాటి మహిళ అండగా ఉంటే కలిగే ధైర్యం వేరు. తోటి మహిళలతో వారు చెప్పుకునేవి వేరు. అలాంటి వారికి యోగ్యులైన కౌన్సెలర్లతో కౌన్సెలింగ్ చేయించి దిలాసా ఇప్పిస్తాము. అంతే కాదు బాధితులను వెంటబెట్టుకొని– ఆ స్టేషన్కుపో ఈ స్టేషన్కు పో అనే బాధ లేకుండా బెంగళూరులో వన్ స్టాప్ సెంటర్స్లో ఫిర్యాదు చేయిస్తాము. తోడుగా మేమొస్తే బాధితులు ఫిర్యాదు చేయడానికి జంకరు. ఎటొచ్చీ వారికి తోడు నిలిచే స్త్రీల బృందాలు అన్నిచోట్లా ఉండాలి’ అంటుంది ప్రియ. ఐ యామ్ ఎవ్రి ఉమన్ పదేళ్ల క్రితం ప్రియా వరదరాజన్ ‘ఐ యామ్ ఎవ్రి ఉమన్’ పేరుతో ఒక బ్లాగ్ రాయడం మార్పు కోసం ఆమె వేసిన మొదటి అడుగు. ఆ బ్లాగ్కు క్రమంగా చాలామంది మహిళా ఫాలోయర్లు వచ్చారు. వారు తమ అనుభవాలను ప్రియతో పంచుకోసాగారు. ‘అందరిదీ ఒకే కథ. అందరూ మరొక స్త్రీ లాంటి వారే అని నాకు అర్థమైంది. స్త్రీల కోసం పని చేయాల్సిన అవసరం తెలియజేసింది. స్త్రీల కోసం పని చేయడం అంటే వారి పట్ల భావజాలాన్ని మార్చడమే’ అంటుంది ప్రియ. మగాడు ఎందుకు అలా చేస్తాడు? ‘గతంలో సమాజంలో స్త్రీలకు ఏదైనా సమస్య వచ్చి ఆమె బయటకు చెప్పినప్పుడు– ఆమెలో ఏ దోషం ఉందో అన్నట్టుగా నిందను ఆమె మీదే వేసేవారు ఉండేవారు. వారి భావజాలాన్ని మార్చడమే చేయవలసింది. స్త్రీకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ మగాడు ఆమెతో అలా ఎందుకు చేశాడు అని ఆలోచించేలా చేస్తే సగం మార్పు వచ్చినట్టే. ఇంట్లో, వీధిలో, ఆఫీసులో స్త్రీలు ఆత్మాభిమానంతో ఉండాలంటే మగాళ్లు మారాలి. అందుకు ఒకరోజు సరిపోదు. ఒకరు పని చేస్తే సరిపోదు. ప్రతి ఒక్కరం ఏదో ఒక మేరకు పని చేయాల్సిందే’ అంటుంది ప్రియ. అందరినీ ‘దుర్గ’లుగా మారుస్తూ అన్యాయం జరిగితే వెరవకుండా ప్రతిఘటించమని ప్రియ ఆధ్వర్యంలో ‘దుర్గల’ బృందం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్కూళ్లలో, కాలేజీలలో, బస్తీలలో తిరుగుతూ స్త్రీలకు తమ హక్కులను, చట్టపరమైన రక్షణను, సహాయం చేసే బృందాలను తెలుపుతుంది. ‘నేను ఒంటరిదాన్ని కాను అని స్త్రీ అనుకుంటే చాలు... ఆమె పోరాడగలదు’ అంటుంది ప్రియ. ఇంత ప్రయత్నం చేసే ప్రియ లాంటి వారి సంఖ్య ఎంత పెరిగితే దుర్గలకు అంత శక్తి పెరుగుతుంది. -
'అసహజ శృంగారం కోసం వేధిస్తున్నాడు' ఐఏఎస్ అధికారిపై ఆమె ఫిర్యాదు!
ఛత్తీస్గఢ్: గృహ హింసకు పాల్పడుతున్నాడని ఓ ఐఏఎస్ అధికారిపై అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. కట్నం తీసుకురావాలని, అసహజ శృంగారం చేయాలని వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. 2014 తెలంగాణ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి సందీప్ ఘా. 2021లో బాధితురాలితో బిహార్లోని దర్భాంగ జిల్లాలో వివాహం జరిగింది. అయితే.. ఇటీవల తన భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన భార్య పోలీసులను ఆశ్రయించింది. అసహజ శృంగారం, కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఆ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాల మేరకు కోర్బా జిల్లాలో ఆయనపై గృహ హింస కేసు నమోదైంది. ఇదీ చదవండి: ఇతర మతస్థుడితో కుమార్తె పెళ్లి.. పిండ ప్రదానం చేసిన తల్లిదండ్రులు -
పెరుగుతున్న గృహ వేధింపులు!
సామాజికంగా ఎన్ని మార్పులు చేసుకుంటున్నా.. గృహ హింసలో మాత్రం తగ్గుదలఉండడం లేదు. అదనపు కట్నం కోసం వేధింపులు, తాగుబోతు భర్తలు, అత్తింటి వారి వేధింపులకు గురయ్యే మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఏటా పెరుగుతున్న గృహ హింస సంబంధిత ఫిర్యాదుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. అయితే గతంలో మాదిరిగా ఇంటి పరువు, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయోనన్న భయాన్ని గృహిణులు వీడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్ గత ఐదేళ్లలో నమోదైన గృహ హింస ఫిర్యాదులను పరిశీలిస్తే.. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 43 ఫిర్యాదుల నమోదైతే..ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 162 మంది మహిళలు గృహ హింసకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల్లో కొందరు నేరుగా మహిళా భద్రత విభాగానికి, పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా, మరికొందరు మహిళా భద్రత విభాగం వాట్సాప్ నంబర్కు, ఈ–మెయిల్ ద్వారా, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖలో ప్రత్యేకించి మహిళా భద్రత కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు, షీటీమ్స్, ఇతర చర్యలతో మహిళల్లో పోలీసులపై భరోసా పెరగడం వల్ల కూడా వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు ఇస్తున్నారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. గృహ హింస ఫిర్యాదులు పెరగడానికి, మహిళల్లో పెరిగిన అవగాహన, భరోసాయే కారణమని పేర్కొన్నారు. మహిళా భద్రత విభాగానికి వచ్చే గృహ హింస ఫిర్యాదులపై సఖి, భరోసా సెంటర్ల ద్వారా, అవి అందుబాటులోని లేని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లలో ప్రైవేటు కౌన్సిలర్ల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సమస్య తీవ్రతను బట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదుల్లో కొన్నిటిని కుటుంబీకుల మధ్య సయోధ్య కుదుర్చడం ద్వారా పరిష్కరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
వీధినపడిన బొలంగీర్ రాజ కుటుంబీకుల అంతర్గత విబేధాలు
భువనేశ్వర్: బొలంగీర్ జిల్లా రాజ వంశీకుల కుటుంబ కలహాలు వీధికెక్కాయి. ఈ కుటుంబంలో యువరాజు అర్కేష్ నారాయణ సింఘ్దేవ్ దంపతుల వివాదం రాజభవనం దాటి పోలీసు ఠాణాకు చేరింది. అర్కేష్ వ్యతిరేకంగా ఆయన భార్య అద్రిజా గృహహింస ఆరోపణతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను అర్కేష్ సింఘ్దేవ్ ఖండించారు. దాదాపు 6నెలల క్రితం ఈ ఫిర్యాదు నమోదైంది. ఈ నేపథ్యంలో తాను ఇల్లు వదిలి వెళ్లిపోయానని ఆయన తెలిపారు. ‘ఆమె నాపై గృహహింస కేసు పెట్టడంతో నేను ఇల్లు వదిలి వెళ్లిపోయాను. ప్రస్తుతం, ఆమె సోదరి అక్కడ నివసిస్తున్నారు. ఆమె తండ్రి కూడా ప్రతినెలా 15 రోజులు రాజ భవానాన్ని సందర్శించేవారు. అవసరమైన వస్తువులు తీసుకునేందుకు నెలకోసారి మాత్రమే ఇంటికి వెళ్తున్నాను. పోలీసుల సలహా మేరకు ఆమె, నా భద్రతను నిర్థారించడానికి ఇంట్లో సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేయించా. అయితే వాటిని అద్రిజా ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులకు పంపించా’నని అర్కేష్ వివరించారు. మూడు రోజుల క్రితం అద్రిజా తండ్రి తమ వద్దకు వచ్చి చేసిన డిమాండ్ పట్ల ప్రతికూలించినట్లు అర్కేష్ నారాయణ సింఘ్దేవ్ తెలిపారు. వివాదం కోర్టు విచారణ పరిధిలో ఉన్నందున న్యాయస్థానం నిర్ణయం మేరకు కొనసాగడం జరుగుతుందని పదేపదే ప్రాధేయపడినా.. ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, సహరాపూర్లోని కొందరు ల్యాండ్ మాఫియాతో తన మామకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. తన ఇంటిపైకి దౌర్జన్యంగా 10మంది వ్యక్తులను పంపించారని, ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించగా.. అవసరమైతే 100 మందితో వస్తానని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అద్రిజా ఓ న్యూస్ ఛానెల్తో మాట్లాడుతూ తన భర్త 2022 ఆగస్టులో విడాకులు కోరినట్లు తెలిపారన్నారు. డీజీపీని కలిసి.. ఇదిలా ఉండగా.. అర్కేష్ సింఘ్దేవ్ భార్య అద్రిజా భర్తతో పాటు మామ అనంగ ఉదయసింఘ్ దేవ్, బావ కళికేష్ నారాయణ్ సింఘ్దేవ్, అత్త విజయ లక్ష్మీదేవి, మేఘనా రాణా లపై 2022 సెప్టెంబర్ 30న రాజ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్తింటి వారు తనను ఇంటి నుంచి బయటకు నెట్టేయాలని, ఒడిశాను సందర్శించకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెట్టినింటి వారి సిబ్బంది కూడా దుర్భాషలాడుతూ గోప్యతకు భంగం కలిగించడంతో పాటు తన గదివైపు కెమెరా ఏర్పాటు చేసి ప్రతి కదలికపై నిఘా ఏర్పాటు చేశారని ఆరోపించారు. అయితే తన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె ఇటీవల ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) సునీల్ బన్సాల్ను కలిశారు. ఈ కేసును ప్రస్తుతం డెహ్రాడూన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఏస్పీ)కి అప్పగించారు. వీపీ సింగ్ మనుమరాలు.. అర్కేష్ సింఘ్దేవ్ గతంలో కాంట్రాక్ట్ కిల్లర్తో తనను చంపడానికి ప్రయత్నించారని అద్రిజా డెహ్రాడూన్ లోని స్థానిక మీడియాకు వివరించారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని పోలీసుల వద్దకు వెళ్లి, రక్షణ కోరారు. మాజీ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్సింగ్(వీపీ సింగ్) మనవరాలైన అద్రిజా ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో ఉత్తరాఖండ్లో ఉంటున్నారు. అర్కేష్, అద్రిజాల 2017 నవంబర్లో జరిగింది. -
అలాంటి వాడు మీకూ అల్లుడుగా వస్తే ఏమవుతుందో ఆలోచించారా?
స్త్రీ గడప దాటితే పదిలం కాదని పెద్దలు నూరిపోశారు. కాబోలు అని స్త్రీలు అనుకున్నారు. నేడు స్త్రీలు ఇంటిలోనే తీవ్ర అభద్రతను ఎదుర్కొంటున్నారని ఉదంతాలు చెబుతున్నాయి. ‘మహిళలపై హింస–నివారణ చర్యల అంతర్జాతీయ దినం’ సందర్భంగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన తాజా నివేదికలో ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకు ఒక స్త్రీ అయిన వారి చేతిలో ప్రాణాలు కోల్పోతోంది. అంటే గంటకు ఐదుగురు ఇంట్లోని వాళ్ల వల్ల చనిపోతున్నారు. ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న శ్రద్ధా వాకర్ హత్య ఇల్లు ఎంత ప్రమాదకరంగా ఉందో చెప్పింది. స్త్రీని సొంత ఆస్తిగా తాము దండించదగ్గ ప్రాణిగా మగవాడు భావించే వరకు ఈ హింస పోదు. విస్తృత చైతన్యం కోసం ప్రయత్నించడమే ఇప్పుడు చేయవలసిన పని. సామూహిక నిరసన దీనికి విరుగుడు. కుమార్తెను చంపి ‘పరువు’ను నిలబెట్టుకున్నాననుకుంటాడు తండ్రి. భర్త భార్యను ముక్కలు ముక్కలు చేసి ‘క్షణికావేశం’లో చేశానని వ్యాఖ్యానిస్తాడు. అన్నయ్యకు ఎప్పుడూ చెల్లెల్ని చెంపదెబ్బ కొట్టే హక్కు ఉంటుంది. బయట భయం వేస్తే స్త్రీలు ఇంట్లో వారికి చెప్పుకుని ధైర్యం పొందాలనుకుంటారు. ఇంట్లో వాళ్లే హింసాత్మకంగా మారితే ఆమె ఎవరితో చెప్పుకోవాలి? భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలకు ‘అయిన వారి’ బెడద ఎక్కువైందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక– అంటే రెండు రోజుల క్రితం నివేదిక తెలియచేస్తోంది. 2021 లో ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురైన స్త్రీలు 81,000 మంది. వీరిలో 56 శాతం అంటే 45,000 మంది అయిన వారి (భర్త, తండ్రి, సోదరుడు, బంధువు, స్నేహితుడు) చేతిలో మృత్యువాత పడ్డారు. ‘ఇది చాలా ఆందోళన కలిగించే విషయం’ అని ఐక్యరాజ్య సమితి సర్వోన్నత ప్రతినిధి ఆంటోనియో గుట్రెస్ అన్నారు. 2021లో సహజ మరణం పొందే స్త్రీలు ఎలా ఉన్నా ప్రతి పదిమందిలో నలుగురు కేవలం ఉద్దేశపూర్వకంగా చంపబడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి వాడు అల్లుడుగా వస్తే ఏమవుతుందో ఆలోచించారా? అసలు స్త్రీ మీద హింస ఎందుకు చేయాలి? అదీ మన కుటుంబ సభ్యురాలిపై ఎందుకు చేయాలి? దీనికి అనుమతి ఉందని పురుషుడు ఎందుకు అనుకోవాలి? భర్త భార్యను కొడుతూ ఉంటే ‘వాడి పెళ్లాం... వాడు కొట్టుకుంటాడో కోసుకుంటాడో’ అని ఇరుగు పొరుగువారు ఎందుకు అనుకోవాలి. ఇంకా ఎంతకాలం అనుకోవాలి. ఇంట్లో బాల్యంలో ఆడపిల్ల తప్పు చేస్తే ఇంటి మగపిల్లాణ్ణి పిలిచి ‘నాలుగు తగిలించరా’ అని చెప్పే తల్లులు, తండ్రులు ఆ నాలుగు తగిలించి మరో ఇంట్లో పెరిగినవాడు తమకు అల్లుడుగా వస్తే ఏమవుతుందో ఆలోచించారా? హింస ద్వారా స్త్రీని అదుపు చేయాలని పురుషుడు అనుకున్నంత కాలం ఇలాంటి ధోరణి కొనసాగుతూనే ఉంటుంది. కుటుంబంలో అందరూ కుటుంబ మర్యాదకు బాధ్యులే. కాని స్త్రీకి ఆ భారం ఎక్కువ ఉంచారు. ఆమె ఎప్పటికప్పుడు తన ప్రవర్తనతో, పరిమితం చేసుకున్న ఇష్టాలతో, అనుమతించిన మేరకు నడుచుకుంటూ కుటుంబ మర్యాద కాపాడాలి. ‘మగాడికి ఎదురు తిరగడం’ అంటే అంటే ఆమె జీవితం ఆమె పూర్తిగా జీవించడానికి వీల్లేదు. అలాంటి ప్రయత్నం ‘మగాడికి ఎదురు తిరగడం’గా భావించబడుతుంది. ‘మగాడికి ఎదురు తిరగడం’ అంటే ‘సమాజానికి ఎదురు తిరగడమే’. ఎందుకంటే సమాజం కూడా ‘మగ స్వభావం’ కలిగినదే. అందువల్ల మగాడు, సమాజం కలిసి స్త్రీకి ‘బుద్ధి’ చెప్పాలనుకుంటాయి. అంటే భౌతికంగా దండించాలనుకుంటాయి. మనిషి నాగరికం అయ్యాడనుకున్న ఇంత కాలం తర్వాత కూడా పురుషుడితోపాటు సమాన సంఖ్యలో ఉన్న ఒక జాతి జాతంతా హింసాయుత పీడనకు లోను కావడం విషాదం. ఇల్లు హింసకు ఆలవాలం కావడం పెను విషాదం. దీనిని మార్చాలి. పురుషులను సరిదిద్దడానికి స్త్రీలు నోరు తెరవాలి. చట్టాల మద్దతు తీసుకోవాలి. ధైర్యంగా తమపై హింసను ఎదిరించగలగాలి. మహిళలపై జరిగే హింస నశించాలని ఆశిద్దాం. చదవండి: 5AM Club: వాళ్లంతా ఉదయం ఐదింటికే నిద్రలేస్తారు! ప్రయోజనాలెన్నో! Cinnamon Health Benefits: దాల్చిన చెక్క పొడి పాలల్లో వేసుకుని తాగుతున్నారా? సినామాల్డెహైడ్ అనే రసాయనం వల్ల -
బాబోయ్ కాపాడండి.. నా భార్య హింసిస్తోంది.. ట్విట్టర్లో ఓ భర్త ఫిర్యాదు
సాక్షి, బెంగళూరు(కృష్ణరాజపురం): నా భార్య నాపై కత్తితో దాడి చేసింది, ఎవరైనా సాయం చేయండి అని ఓ వ్యక్తి ట్విట్టర్లో ఫిర్యాదు చేశాడు. ఇంటి గుట్టును బయటపెట్టుకున్న బాధితునిపై సానుభూతి వ్యక్తమవుతోంది. వివరాలు... యదునంద్ ఆచార్య అనే వ్యక్తి తన భార్య తనపై దాడికి పాల్పడిందని ట్విట్టర్ ద్వారా ఘోష వినిపించాడు. తనకు సహాయం అందదని, ఎందుకంటే తానొక పురుషుడనని, నారి శక్తి ప్రభావం వల్ల తన చేతికి గాయం అయిందని రక్తమోడుతున్న అరచెయ్యి ఫోటోను ట్వీట్ చేశాడు. గృహహింస కింద ఫిర్యాదు స్వీకరించాలని ప్రధాని ఆఫీసును, కేంద్ర మంత్రిని, బెంగళూరు పోలీస్ కమిషనర్ని కోరాడు. భార్య తనపై గృహ హింసకు పాల్పడుతోందని మొర పెట్టుకున్నాడు. అయితే దీనికి భౌతికంగా ఫిర్యాదు చేయాలని నగర పోలీసు కమిషనరేట్ సూచించడం విశేషం. ఆచార్య ట్వీట్కు రామదాస్ అయ్యర్ అనే మరో వ్యక్తి స్పందించాడు. చేతికి కట్టుకట్టిన ఫోటోను పోస్టు చేస్తూ దసరాకు తన భార్య ఇచ్చిన బహుమానం ఇది అని పేర్కొన్నాడు. -
ముక్కలవుతున్న మూడుముళ్ల బంధం.. తాళి బంధాన్ని తెంచేస్తూ..
ధర్మేచ..అర్థేచ..కామేచ..మోక్షేచ..అహం ఏవం నాతిచరామి..అని పెళ్లి ప్రమాణం చేసి ఏడు జన్మలు ఏకమయ్యే ఏడడుగుల బంధంలో రెండు మనసుల గుండె చప్పుడు ఏకమైతే వివాహ బంధం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది. వివాహ బంధం అందమైన పుస్తకం లాంటిది. ఏదైనా జరిగే పొరపాటు పుస్తకంలో ఒక పేజీ మాత్రమే. అటువంటప్పుడు పుస్తకాన్ని సవరించుకోవాలి. పొరపాటు ఉందని మొత్తం పుస్తకాన్నే చించేయకూడదు. జీవితాంతం తోడుంటానని అగి్నసాక్షిగా తాళిబంధంతో ఒక్కటైన దంపతులు ముచ్చటగా మూడేళ్లయినా కలిసి ఉండకుండానే విడాకులు తీసుకుంటున్నారు. ప్రేమ, ఆప్యాయతలతో ఆనందంగా ఉండాల్సిన వారు అపోహలు, అనుమనాలతో విడిపోతూ తాళి బంధాన్ని ఎగతాళి చేస్తున్నారు. విజయనగరం: నీవే నా ప్రాణం, నీవు లేకపోతే చచ్చిపోతానంటూ పెళ్లి అయిన తొలినాళ్లలో ఎంతో ప్రేమ చూపే వారు..తర్వాత అన్నీ మరిచిపోయి ఒకరిని ఒకరు చీదరించుకుంటూ.. కోపగించుకుంటూ..చివరికి విడాకుల వరకు వెళ్తున్నారు. స్వల్ప కారణాలతో కొందరు కోర్టు మెట్లు ఎక్కుతుంటే, అవగాహన లేక కొందరు భార్యాభర్తలు విడిపోతున్నారు. గృహహింస విభాగం, పోలీసుల కౌన్సెలింగ్తో మరి కొందరు సర్దుకుపోతున్నారు. మరి కొందరైతే మూర్ఖంగా వ్యవహరిస్తూ భవిష్యత్తు అంధకారం చేసుకోవడంతో పాటు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, అప్యాయతలను దూరం చేస్తున్నారు. ఎన్ని కౌన్సెలింగ్లు ఇచ్చినా ఫలితం శూన్యం విభేదాలు వచ్చిన దంపతులను కలపడానికి ఎన్ని కౌన్సెలింగ్లు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు ఏర్పడడం వల్ల సంప్రదాయాలు, సత్ససంబంధాల గురించి తెలియడం లేదు. ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవించుకోకపోవడంతో పాటు కొందరు మొండిగా వ్యవహరిస్తున్న కారణంగా భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. నేను చెప్పిందే వినాలనే ధోరణిలో అధికంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. వారికి సర్దిచెప్పేందుకు పెద్దలు లేకపోవడం, ఒక వేళ ఉన్నా వారి దృష్టికి సమస్యలు తీసుకు వెళ్లేందుకు భార్యాభర్తలు ఇష్టపడని కారణంగా రోజురోజుకు విడాకుల పెరుగుతూ వస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో విడిపోవాలనుకునే భార్యాభర్తలకు పోలీసులు, గృహాహింస విభాగం కౌన్సిలర్లు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అందులో కొంతమంది మాత్రమే కలిసి జీవించేందుకు ఇష్టపడుతున్నారు. మరి కొంతమంది విడాకులు తీసుకోవడంకోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వేరు కాపురాలపై యువతుల ఆసక్తి ఉమ్మడి కుటుంబంలో కలిసి జీవించేందుకుఅధికశాతం మంది యువతులు సుముఖత చూపడం లేదు. అదేమని అడిగితే అత్తమామాలు, అడపడుచుల దెప్పి పొడుపులు ఉంటాయని చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని అలోచిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో కుమార్తె హాయిగా జీవించగలదనే భరోసా కల్పించలేకపోతున్నారు. ఎవరికి వారే మొండి పట్టు గతంలో సంప్రదాయలను గౌరవిస్తూ ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇస్తూ పిల్లలకు ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా నిలిచేవారు. ఏవైనా సమస్యలు వస్తే ఉమ్మడి కుటుంబాలు కావడంతో ఇద్దరికీ సర్దిచెప్పి వారి మధ్య మనస్పర్ధలను తొలగించడానికి కుటుంబ పెద్దలు ప్రయతి్నంచేవారు. అప్పటికీ మాట వినకపోతే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి భార్యభర్తలను ఒక్కటి చేసేవారు. ప్రస్తుతం వివాహ బంధం అందుకు విరుద్ధంగా ఉంది. గృహహింసకు వచ్చిన ఫిర్యాదుల వివరాలు 2006వ సంవత్సరంలో గృహహింస విభాగాన్ని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయంలో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈఏడాది ఆగస్టు నెలాఖరు వరకు జిల్లాలో 858 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 150 మంది కౌన్సెలింగ్తో రాజీపడ్డారు. 128 మంది ఫిర్యాదులు ఉపసంహరించుకున్నారు. 580 ఫిర్యాదులు కోర్టులో కేసు ఫైల్ అయ్యాయి. వాటిలో 74 కేసులు కోర్టుకు హాజరైన తర్వాత రాజీ అయ్యాయి. మరో 93 కేసులు కోర్టులో విత్డ్రా అయ్యాయి. 107 కేసులు డిస్మిస్ అయ్యాయి. 72 కేసులు కోర్టులో పరిష్కారమయ్యాయి. 122 మంది విడాకులు తీసుకున్నారు. 78 మంది మనోవర్తి తీసుకుంటున్నారు. సర్దుకుపోయే గుణం అవసరం సర్దుకుపోయే గుణం భార్యాభర్తలు అలవర్చుకున్నప్పుడు కాపురం సాఫీగా సాగిపోతుంది. భార్యాభర్తల మధ్య నెలకొన్న నెలకొన్న సల్ప వివాదాలకు సర్దిచెప్పేవారు ఆయా కుటుంబాల్లో నేడు ఉండడం లేదు. ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జి.మాధవి, లీగల్ కౌన్సిలర్, గృహహింస విభాగం -
World Emoji Day: సరదా నుంచి సందేశం వరకు...
అమెరికన్ రచయిత్రి, జర్నలిస్ట్ నాన్సీ గిబ్స్ ఇమోజీలపై తన ఇష్టాన్ని ఇలా ప్రకటించుకుంది... ‘నిఘంటువులలో పదాలు వ్యక్తీకరించలేని భావాలు, ఇమోజీలు అవలీలగా వ్యక్తీకరిస్తాయి. అదే వాటి ప్రత్యేకత. బలం’ ఇమోజీ...అంటే ‘సరదా’ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం అవి సందేశ సారథులుగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. మహిళలకు సంబంధించిన సమస్యల నుంచి సాధికారత వరకు...భావ వ్యక్తీకరణకు ప్రపంచంలోని ఎన్నో సంస్థలు ఇమోజీలను వాడుకుంటున్నాయి... కోవిడ్ సమయంలో... మహిళలపై గృహహింస పెరిగిందని గణాంకాలు చెప్పాయి. మరొకరి నీడను కూడా చూసి భయపడుతున్న కాలంలో తమ గురించి ఆలోచించకుండా, భయపడకుండా మహిళలు సేవాపథంలో అగ్రగామిగా ఉన్నారు. పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్కేర్ వర్కర్స్ మూడు రెట్లు ఎక్కువ రిస్క్ను ఎదుర్కొన్నారు... ఇట్టి విషయాలను చెప్పుకునేందుకు పెద్ద వ్యాసాలు అక్కర్లేదని చెప్పడానికి ఐక్యరాజ్య సమితి ప్రయత్నించింది. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరు రకాల ఇమోజీలను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ‘గర్ల్ పవర్’ ‘జెండర్ ఈక్వాలిటీ’లపై ఇమోజీలు తీసుకువచ్చింది. యూనికోడ్ ఇమోజీ సబ్కమిటీ స్త్రీ సాధికారతను ప్రతిఫలించే, సాంకేతికరంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని సూచించే ఇమోజీలకు ప్రాధాన్యత ఇచ్చింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ ‘ఎవ్రీ ఉమెన్’ హ్యాష్ట్యాగ్తో ప్రత్యేకమైన ఇమోజీని తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను వ్యతిరేకిస్తూ ‘జెనరేషన్ ఈక్వాలిటీ’ ‘16 డేస్’ ‘ఆరేంజ్ ది వరల్డ్’ ‘హ్యూమన్ రైట్స్ డే’ హ్యాష్ట్యాగ్లతో ఇమోజీలు తీసుకువచ్చింది. చెప్పుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాంకేతిక సంస్థలు, సామాజిక సంస్థలు ఇమోజీలను బలమైన సందేశ వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. ‘ఇమోజీ’ అనేది మేజర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్గా మారిన నేపథ్యంలో... గతంలోలాగా... ‘చక్కగా చెప్పారు’ ‘చక్కగా నవ్వించారు’ ‘ఏడుపొచ్చింది’... ఇలాంటి వాటికే ఇమోజీ పరిమితం కాదు. కాలంతో పాటు ఇమోజీ పరిధి విస్తృతమవుతూ వస్తోంది. అందులో భాగంగా సామాజిక కోణం వచ్చి చేరింది. -
AGWA: నీ జీవితానికి నువ్వే కథానాయిక
జీవితంలో ఎదురయ్యే అనుభవాలను పాఠాలుగా నేర్చుకుని మరోసారి పొరపాట్లు చేయకుండా సమస్యల సుడిగుండాల్ని అధిగమిస్తుంటారు చాలామంది. శుభాపాండియన్ కూడా సమస్యల నుంచి బయట పడేందుకు చాలానే కష్టపడింది. తన జీవితంలో నేర్చుకున్న పాఠాలను మరికొందరి జీవితాలకు అన్వయించి వారి జీవితాలను సుఖమయం చేస్తోంది. తనతోపాటు వేలమంది మహిళలను చేర్చుకుని ఎంతో మందికి చేయూతనిస్తోంది. మధురైలో పుట్టిపెరిగిన శుభా పాండియన్ పెళ్లయ్యాక చెన్నై వచ్చింది. బీకామ్ చదివిన శుభా చెన్నై నగరంలో ఎన్నో ఆశలు, కలలతో అడుగుపెట్టింది. ఇంగ్లిష్ రాదు. ఎటువంటి ఉద్యోగానుభవం లేదు. కానీ ఎలాగైనా ఎదగాలన్న తపన ఉంది. చెన్నై వచ్చిన ఏడాదిలోపే భర్త మరణం శుభాను రోడ్డున పడేసింది. పసిగుడ్డును పోషించుకునే భారం తనమీదే పడడంతో కష్టం మీద చిన్న ఉద్యోగం వెతుక్కుంది. ఒంటరి తల్లిగా అనేక అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటోన్న శుభాకు తోటి మహిళా ఉద్యోగులు అండగా నిలబడి మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. దీంతో కార్పొరేట్ సెక్టార్లో తనకంటూ ఒకస్థానాన్ని ఏర్పరచుకుని ఉద్యోగిగా నిలదొక్కుకుంది. ఆగ్వా... అనేక సమస్యలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న శుభకు తోటి మహిళలు ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ప్రేరణ ఇచ్చింది. ఈ ప్రేరణతోనే తనలాగా ఒంటరిగా బాధపడుతోన్న ఎంతోమంది మహిళలకు చేయూతనిచ్చేందుకు కొంతమంది మహిళల సాయంతో 2008లో ‘ఆగ్వా’ పేరిట నెట్వర్క్ను ఏర్పాటు చేసింది. సాయంకోసం ఎదురు చూస్తున్న వారికి సాయమందిస్తూ, వారిని మానసికంగా దృఢపరిచి, ఆర్థికంగా ఎదిగేందుకు శిక్షణ ఇప్పించి నిస్సహాయ మహిళలకు అండగా నిలబడింది. గృహహింసా బాధితులను ఆదుకోవడం, ‘క్యాంపస్ టు కార్పొరేట్’ పేరిట ఉద్యోగాల్లో ఉన్నతంగా రాణించేందుకు మెళకువలు నేర్పించడం, అల్పాదాయ మహిళలను ఒకచోటకు చేర్చి వారితో చిన్నచిన్న వ్యాపారాలు చేయించడం, కుట్టుమిషన్లు, వెట్గ్రైండర్స్ ఇప్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడడం, కంప్యూటర్ స్కిల్స్ నేర్పించడం, టైలరింగ్, పేపర్ బ్యాగ్ల తయారీ వంటి వాటిద్వారా ఆగ్వా ప్రారంభించిన ఐదేళ్లల్లో్లనే ఎనిమిదివేలకుపైగా మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు చేయూతనిచ్చింది. కేవలం పన్నెండు మందితో ప్రారంభమైన ఆగ్వా క్రమంగా పెరుగుతూ నేడు తొమ్మిదివేల మందికి పైగా మహిళలతో పెద్దనెట్వర్క్గా విస్తరించింది. మహిళాసాధికారత.. గిఫ్టింగ్ స్మైల్స్ ఆగ్వా నెట్వర్క్ 2016 నుంచి ఇప్పటిదాకా కష్టాలలో ఉన్న మహిళలకు మానసిక బలాన్నిచ్చి వారి కాళ్లపై వారిని నిలబెట్టేందుకు 31 కాన్ఫరెన్స్లు, 270 ఉచిత వెబినార్లు నిర్వహించి ఇరవై ఏడు వేలమంది మహిళలకు పరోక్షంగా దారి చూపింది. ఇవేగాక ఫుడ్ బ్యాంక్లకు ఆహారం అందించడం, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం, పిల్లల ఆటవస్తువులు, పుస్తకాలు, స్వీట్లు, కలర్ బాక్స్లు, షూస్, విరాళాలు సేకరించి చెన్నై వ్యాప్తంగా ఉన్న నిరుపేద పిల్లలకు అందించింది. ప్రారంభంలో మహిళాభ్యున్నతికోసం ఏర్పాటైన ఈ నెట్వర్క్ నేడు దేశవ్యాప్తంగా ఉన్న వందలమంది వలంటీర్లు, సామాజిక వేత్తలతో కలసి వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కెరీర్లో ఎదుగుతూనే... శుభా తన కెరీర్లో ఎదుగుతూనే ఆగ్వాను సమర్థంగా నడిపించడం విశేషం. బహుళ జాతి కంపెనీలైన.. కాగ్నిజెంట్, అవీవా, సీఎస్ఎస్, డియా సెల్యూలార్ వంటి పెద్ద కంపెనీలలో ఉన్నతస్థాయి పదవుల్లో పనిచేసింది. ఈ అనుభవంతో మరింత మందిని కార్పొరేట్ కెరీర్లో ఎదిగేందుకు ప్రొఫెషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్లు నిర్వహించి, ఎంతో మందిని కార్పొరేట్ వృత్తినిపుణులుగా తీర్చిదిద్దుతోంది. ఈ ప్రోగ్రామ్లో మహిళలేగాక, దివ్యాంగులు, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన వారు కూడా ఉండడం విశేషం. ఏదైనా సాధించగలవు ఈ ప్రకృతిలో నీటికి చాలా శక్తి ఉంది. మహిళ కూడా నీరులాంటిది. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని సంతరించుకుని తన శక్తిని పుంజుకుంటుంది. అందుకే స్పానిష్ పదం ఆగ్వా అనే పేరును నా నెట్వర్క్కి పెట్టాను. మా నెట్ వర్క్లో 25 నుంచి 73 ఏళ్ల వయసు మహిళలంతా కలిసి పనిచేస్తున్నాం. వివిధ వృత్తి వ్యాపారాల్లో రాణిస్తోన్న వీరంతా నెట్వర్క్లో పనిచేస్తూ ఎంతో మందికి సాయం అదిస్తున్నారు. ఆగ్వా ఉమెన్ ఫౌండేషన్, అగ్వా ఉమెన్ లీడర్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మా నెట్వర్క్ను విస్తరించాం. మనకుంది ఒకటే జీవితం. దానిని పూర్తిగా జీవించాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావనేది అనవసరం. నీ కథను నువ్వే రాసుకునే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. నీ జీవితానికి నువ్వే హీరోయి¯Œ వని ఎప్పుడూ మర్చిపోకూడదు. అప్పుడే ఏదైనా సాధించగలవు. – శుభా పాండియన్ -
Google: గూగుల్ కీలక నిర్ణయం
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు సమాచారం గోపత్య విషయంలో కీలక ప్రకటన చేసింది. గూగుల్ వినియోగదారులు అబార్షన్ క్లినిక్లు, గృహ హింస షెల్టర్స్, ప్రైవసీ కోరుకునే ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు వారి లోకేషన్ హిస్టరీనీ తొలగిస్తామని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రదేశాల్లో ఎవరైనా వినియోగదారులు సందర్శించినట్టు తమ సిస్టమ్స్ గుర్తిస్తే వెంటను ఆ ఎంట్రీలను తొలగిస్తామని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెన్ ఫిట్జ్పాట్రిక్ వెల్లడించారు. రాబోయే కొన్ని వారాల్లో ఇది అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇక.. సంతానోత్పత్తి కేంద్రాలు, పలు వ్యసనాల్లో కౌన్సెలింగ్ కేంద్రాలకు సంబంధించి చికిత్స తీసుకునే ప్రదేశాలు, బరువు తగ్గించే క్లినిక్స్కు వెళ్లిన డేటాను కూడా సేవ్లో ఉండదని ఆయన తెలిపారు. అయితే, అగ్రరాజ్యం అమెరికాలో అబార్షన్కు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసిన తర్వాత గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, మే నెలలో డెమోక్రటిక్ చట్టసభ సభ్యుల బృందం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈవో) సుందర్ పిచాయ్కు లేఖ రాశారు. సంతానోత్పత్తి కేంద్రాలకు వెళ్లే వారి స్మార్ట్ఫోన్ లొకేషన్ డేటాను బహిర్గతం చేయకుండా నిలిపివేయాలని వారు ఆ లేఖలో కోరినట్టు సమాచారం. #abortionishealthcare More good news related to tech and abortions. Google said Friday that it would delete its users’ location history whenever they visit an abortion clinic, domestic violence shelter or other similarly-sensitive…https://t.co/kLFFTLsVMZ https://t.co/ipM5X5gN5c — Regina Phelps 🇺🇦 (@ReginaPhelps) July 1, 2022 -
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: హింసించే భర్తకు గుడ్బై
గృహ హింస అంటే భార్య ఒంటి మీద గాయాలు కనిపించాలి అనుకుంటారు చాలామంది. బాగనే కనిపిస్తున్నావుగా... కాపురం చేసుకోవడానికి ఏం నొప్పి అంటారు చాలామంది. ‘కాని మనసుకు తగిలే గాయాల సంగతి ఏమిటి అని అడుగుతుంది’ మేఘనా పంత్. గృహ హింస అంటే భర్త కొట్టకుండా తిట్టకుండా పెట్టే హింస కూడా అంటుందామె. మానసిక భావోద్వేగాలు అదుపు చేసుకోలేని భర్తతో ఐదేళ్లు బాధలు పడి ఆ పెళ్లి నుంచి బయటపడి ఆ అనుభవాలతో ‘బాయ్స్ డోన్ట్ క్రై’ నవల రాసింది మేఘనా. ‘ఒక స్త్రీ విడాకులు తీసుకుంటూ ఉంటే హాహాకారాలు చేసే సమాజం ధోరణి మారాలి’ అంటున్న మేఘన జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో తన/వివాహిత స్త్రీల జీవితాలలోని సంఘర్షణలపై వ్యాఖ్యానం చేసింది. ‘నాకు చదువుంది. చైతన్యం ఉంది. లోకజ్ఞానం ఉంది. అయినా నేను నా వివాహంలో గృహ హింసను అనుభవిస్తున్నాను అని తెలుసుకోవడానికి ఐదేళ్లు పట్టింది’ అంది మేఘనా పంత్. తాను రాసిన నవల ‘బాయ్స్ డోన్ట్ క్రై’ గురించి జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో జరిగిన చర్చలో ఆమె మాట్లాడింది. ‘మన దగ్గర బాధితురాలిని కూడా ఒక స్టీరియోటైప్ను చేశారు. గృహ హింస ఎదుర్కొంటున్న గృహిణి అనగానే భర్త కొట్టిన దెబ్బలకు కన్ను వాచిపోయి, చర్మం కమిలిపోయి లేదా ఎముకలు విరిగి హాస్పిటల్ పాలయ్యి... ఇలా అయితేనే సదరు గృహిణి బాధ పడుతున్నదని భావిస్తారు. పైకి అంతా బాగున్నా మన దేశంలో దాదాపు 20 కోట్ల మంది స్త్రీలు గృహహింసను ఎదుర్కొంటున్నారు. కాని పెళ్లిలో ఆ మాత్రం భర్త చేతి లెంపకాయలు మామూలే అన్నట్టు సర్దుకుపోతుంటారు’ అందామె. మేఘనా పంత్ ముంబైలో చదువుకుంది. ఎన్డిటివిలో రిపోర్టర్గా పని చేసింది. కథా రచయిత. 2007లో ఆమెకు వివాహం అయితే 2012లో ఆ పెళ్లి నుంచి బయటకు వచ్చింది. ‘నాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకో అని మొదట అన్నది మా అమ్మ. నేను వైవాహిక జీవితంలో పడుతున్న బాధను చెప్పుకున్నప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చెయ్ అని మొదట చెప్పిందీ మా అమ్మే. ఇప్పుడు పర్వాలేదు కాని పదేళ్ల క్రితం వరకూ కూడా విడాకులు అనగానే ఇక ఆ స్త్రీ జీవితం నాశనం అని, ఆ స్త్రీ ఏదో తప్పు చేస్తున్నదని భావించడం ఎక్కువగా ఉండేది. ఇప్పుడూ భావించే వర్గాలు ఉన్నాయి. తల్లిదండ్రులే అందుకు ఒప్పుకోరు. నేనేమంటానంటే ఆమె జీవితాన్ని ఆమెను నిర్ణయించుకోనివ్వండి అని’ అంటుందామె. మేఘనా కథనం ప్రకారం ఆమె భర్తకు మానసిక భావోద్వేగాలపై అదుపు లేదు. ‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు. నా భర్తకు బైపోలార్ డిజార్డర్ ఉండేది. అతను నా పెళ్లికి రెండు వారాల ముందే నా మీద చేయి చేసుకున్నాడు. అసలు అప్పుడే పెళ్లి ఆపాల్సింది. కాని భారీ ఖర్చు చేసి పెళ్లి ఏర్పాట్లు చేయడం మన దేశంలో ఆనవాయితీ. అదంతా నష్టపోవాలా అనే పాయింటు ముందుకు వస్తుంది. పెళ్లి ఆపేయడం పెద్ద నామోషీ కూడా. అయితే మన ఇంటి అమ్మాయి నరకం పాలవ్వడం కంటే పెళ్లి ఆగి నామోషీ ఎదుర్కొనడం మంచిది. అలానే నా సలహా– పెళ్లికి పెట్టే ఖర్చు పూర్తిగా తగ్గించి ఆ మొత్తాన్ని ఆమె భవిష్యత్తు గురించి ఆమె కెరీర్ గురించి వెచ్చిస్తే చాలా మేలు. ముంబై నుంచి మా కాపురం న్యూయార్క్కు మారాక నా భర్త నన్ను నా తల్లిదండ్రుల నుంచి స్నేహితుల నుంచి కూడా దూరం చేశాడు. స్త్రీని ఒంటరి చేయడం హింస అవునా కాదా? 2012లో నా తొలి నవల ‘ఒన్ అండ్ ఏ హాఫ్ వైఫ్’ విడుదలైన రోజు రాత్రి అతను ఎంతో వింతగా ప్రవర్తించాడు. నాకు పిరియడ్స్ మొదలైతే నాప్కిన్ కూడా పెట్టుకోనివ్వలేదు. ఆ క్షణమే అనుకున్నాను ఈ జీవితం నుంచి బయటపడాలని’ అందామె. వివాహం నుంచి బయటకు వచ్చాక మేఘనా పూర్తి స్థాయి రచయితగా మారింది. స్త్రీల తరఫున అనేక వ్యాసాలు, షోస్ చేసింది. ఆమె నవల ‘ది టెర్రిబుల్, హారిబుల్, వెరి బ్యాడ్ గుడ్ న్యూస్’ నవల ‘బద్నామ్ లడ్డు’ పేరుతో సినిమాగా రానుంది. ఆమె తాజా నవల ‘బాయ్స్ డోన్ట్ క్రై’ కూడా వెబ్ సిరీస్కు ఎంపికైంది. ‘ఈ పేరు ఎందుకు పెట్టాను. అబ్బాయిలను చిన్నప్పటి నుంచి నువ్వు ఏడవకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, మగాడంటే స్త్రీలతో ఇలా వ్యవహరించాలి అని పెంచుతాము. వాళ్లు కూడా తాము స్త్రీలతో మోటుగా వ్యవహరించడానికి అర్హులు అన్నట్టుగానే పెరుగుతారు. ఇది మారాలి. మగాళ్లు ఏడిస్తే ఏం పోతుంది? పెళ్లి నచ్చని ఆడాళ్లు విడాకులు తీసుకుంటే ఏం పోతుంది? మనల్ని మనం ప్రేమించుకుని మన జీవితాన్ని చక్కదిద్దుకునే హక్కు ఉంది. ఇప్పుడు నాకు వివాహం అయ్యింది. నన్ను గౌరవించే భర్త దొరికాడు. నాకు ఇద్దరు కూతుళ్లు. అఫ్కోర్స్.. వైవాహిక జీవితంలో హింసను ఎదుర్కొంటున్న భర్తలు కూడా ఉన్నారు. వారి బాధను కూడా పరిగణించాలి. స్త్రీలన్నా బయటకు చెప్పుకుంటారు. మగాళ్లకు ఆ ఓదార్పు కూడా లేదు. స్త్రీలకైనా పురుషులకైనా ఈ బాధ అక్కర్లేదు’ అంటుందామె. ‘సర్దుకుపోవడం’ అనే ఒక సనాతన ధోరణిలోనే ఉన్న మన సమాజం మేఘనా వంటి రచయిత్రుల మాటలకు ఉక్కిరిబిక్కిరి కావచ్చు. కాని పెళ్లిలోని ఉక్కిరిబిక్కిరి భరించలేనిదిగా మారినప్పుడు కూడా ఎందుకు సర్దుకుపోవాలి అనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే. ‘బాయ్స్ డోన్ట్ క్రై’ దాదాపుగా మేఘనా జీవిత కథ. మార్కెట్లో ఉంది. చదవండి. ‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు. వేదికపై మేఘనా పంత్ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మేఘనా పంత్ -
అదర్ సైడ్.. నేను సైతం...
బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు... యామీ గౌతమ్. ‘ఇప్పుడు నా కెరీర్పై పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాను’ అనే మాట సెలబ్రిటీల నోటి నుంచి వింటుంటాం. యామీ మాత్రం తన కెరీర్తో పాటు సామాజిక విషయాలపై దృష్టి కేటాయించాలనుకుంటుంది. అందుకు ఉదాహరణ... మజిలీస్, పరి అనే స్వచ్ఛందసంస్థలతో కలిసి ఆమె పనిచేయాలని నిర్ణయించుకోవడం. అత్యాచార, లైంగికదాడి బాధితులకు అండగా నిలిచే సంస్థలు ఇవి. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మజిలీస్ విషయానికి వస్తే, 1991లో ఫ్లావియ ఈ సంస్థను ప్రారంభించారు. ఆమె ఒకప్పుడు గృహహింస బాధితురాలు. ‘మజిలీస్’లో 25 మంది సభ్యులు ఉన్నారు. ఎక్కువమంది లాయర్లే. దిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ కార్యాలయంలో యామీ గౌతమ్ అత్యాచార బాధితులకు అండగా నిలవడమే కాదు, స్త్రీ సాధికారత, హక్కులు, చట్ట, న్యాయ సంబంధిత విషయాల గురించి అవగాహన కలిగించడంతోబాటు ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ చేపడుతుంది మజిలీస్. అయితే చాలాసార్లు ఈ సంస్థకు నిధుల కొరత అవరోధంగా ఉంటోంది.. యామీలాంటి పేరున్న నటులు చేయూత ఇస్తే ఆ సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. ‘అత్యాచారాలకు సంబంధించిన వార్తల గురించి వింటున్నప్పుడు మనసు బాధతో నిండిపోయేది. ఆ మానసిక పరిస్థితి నుంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉండేది. పని ఒత్తిడిలో ఆ బాధను తాత్కాలికంగా మరిచిపోయినా నా ముందు ఎప్పుడూ ఒక ప్రశ్న మాత్రం నిలుచుండేది. మనం ఏమీ చేయలేమా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే స్వచ్ఛందసంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఇది ఆరంభం మాత్రమే. మహిళల భద్రతకు సంబంధించిన విషయాలలో మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాను’ అంటుంది యామీ. బాలీవుడ్లో పది సంవత్సరాల అనుభవాన్ని గడించిన యామీ గౌతమ్ తొలి రోజులు నల్లేరు మీద నడకేమీ కాదు. రక రకాల సమస్యలు ఎదుర్కొంది. ఇదంతా ఒక ఎత్తయితే తన మీద తనకు అపనమ్మకం. ‘మన మీద మనకు అపనమ్మకం ఏర్పడ్డప్పుడు, ఇక వేరే శత్రువు అంటూ అక్కర్లేదు. మనల్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లే ప్రతికూలశక్తి దానికి ఉంది. మా అమ్మ మాటల బలంతో ఆ ప్రతికూల భావన నుంచి బయటికి రాగలిగాను. అందుకే నా మాట సహాయం కోరి వచ్చే వారికి నువ్వు కచ్చితంగా నెగ్గగలవు, నీలో ఆ శక్తి ఉంది అని ధైర్యం ఇస్తుంటాను’ అంటున్న యామీ తొలిరోజుల్లో స్క్రిప్ట్ వినేటప్పుడు... ‘ఈ సినిమాలో నా పాత్ర ఏమిటీ?’ అనే వరకు పరిమితమయ్యేది. ఇప్పుడు మాత్రం ‘ఈ సినిమాలో నా పాత్ర ఇచ్చే సందేశం ద్వారా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా?’ అనే కోణంలో ఆలోచిస్తుంది. ‘లాస్ట్’ సినిమాలో క్రైమ్ రిపోర్టర్, ‘దాస్వీ’లో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలు పోషించడం ఆమె ఆలోచన« దోరణిలో వచ్చిన మార్పుకు అద్దం పడతాయి. తాజా చిత్రం ‘ఏ థర్స్ డే’కు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నైనా జైస్వాల్ అనే అత్యాచార బాధితురాలి పాత్రలో నటించింది యామీ గౌతమ్. వ్యవస్థ లోపాలను ప్రశ్నించడంతో పాటు, మన కర్తవ్యాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది. -
నిశ్శబ్దం గొంతు విప్పింది!
కోవిడ్ నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ విధించిన కాలం అది. జాతీయ మహిళా కమిషన్కు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చిపడుతున్నాయి. ఇవన్నీ గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులే! రోజురోజుకూ ఫిర్యాదుల వరద పెరుగుతుందే తప్ప తగ్గలేదు... ఈ విషయం పుణేకి చెందిన ఫిల్మ్మేకర్ దీప్తి గాడ్గేను ఆలోచనల్లోకి తీసుకువెళ్లింది. ‘లాక్డౌన్ సమయంలో ప్రతి ముగ్గురిలో ఒకరు గృహహింసకు గురయ్యారు...అనే విషయం తెలిసినప్పుడు బాధ అనిపించింది. నాలోని బాధను వ్యక్తీకరించడానికే ఈ లఘుచిత్రాన్ని తీశాను’ అని చెబుతుంది దీప్తి. ‘స్వమాన్’ పేరుతో ఆమె తీసిన అయిదు నిమిషాల నిడివిగల షార్ట్ఫిల్మ్ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫెస్టివల్లో ప్రత్యేక ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాదు... రోమ్లో జరిగే గోల్డెన్ షార్ట్ ఫిల్మ్ఫెస్టివల్, కాలిఫోర్నియాలో జరిగే ఉమెన్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, టోక్యో షార్ట్ ఫిల్మ్ఫెస్టివల్కు ఎంపికైంది. ‘ఇది ఎవరి కథా కాదు. పూర్తిగా కల్పితం’ అని దీప్తి చెబుతున్నప్పటికీ... గృహహింస ఎదుర్కొన్న ఎంతోమంది బాధితుల జీవితానికి దర్పణంగా అనిపిస్తుంది. ఒకరోజు దీప్తి మార్నింVŠ వాక్కు వెళుతున్నప్పుడు ఒక మహిళ రోడ్డుపక్కన దిగాలుగా కూర్చొని ఉంది. పెద్దింటి మహిళ అని ఆమె ఆహార్యం సూచిస్తుంది. రాత్రంతా నిద్ర లేనట్లు కళ్లు చెబుతున్నాయి. ఉండబట్టలేక...‘మీకు ఏమైనా సహాయం చేయగలనా?’ అని అడిగింది. ‘లేదు’ అంది ఆమె ముక్తసరిగా. కాస్త ముందుకు వెళ్లిన దీప్తి వెనక్కి తిరిగిచూస్తే... ఆమె కనిపించలేదు! ఆ బాధితురాలి గురించే ఆలోచిస్తూ నడుస్తోంది...ఆమె బాధితురాలు అనేది కాదనలేని వాస్తవం. అయితే ఆమెకు తాను ఎదురొన్న హింస గురించి చెప్పుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే పరువు సమస్య. గృహహింస ఎదుర్కొంటున్న వాళ్లలో చాలామంది మహిళలు ‘లోకం ఏం అనుకుంటుందో!’ ‘భర్తపై ఫిర్యాదు చేస్తే పిల్లల భవిష్యత్ ఏమిటీ’... ఇలా రకరకాల కారణాలతో రాజీ పడుతుంటారు. ఈ ధోరణి గృహహింసను మరింత పెంచుతుంది. తన ఆలోచనలకు అయిదునిమిషాల వ్యవధిలో చిత్రరూపం ఇవ్వడం అనేది కత్తి మీద సామే. అయితే ‘స్వమాన్’ రూపంలో ఆ పని విజయవంతంగా చేసి శభాష్ అనిపించుకుంది దీప్తి. ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మా షార్ట్ఫిల్మ్కు చక్కటి ప్రశంసలు లభించడం ఒక ఎత్తయితే, సామాన్య మహిళల మెప్పు పొందడం అనేది మరో ఎత్తు’ అంటుంది ఈ లఘుచిత్ర నిర్మాణ బాధ్యతలు చూసిన డా.అనిత. ‘కథలో నాటకీయతకు తావు ఇవ్వకూడదు అనుకున్నాను. చిన్న సంభాషణ లు మాత్రమే ఉపయోగించాను. ఇందులో కథానాయిక ఆశ గృహ హింస ను ఎదుర్కొంటుంది. అందరిలాగే తనలో తాను కుమిలిపోతుంది. చివరికి మాత్రం గొంతు విప్పి గర్జిస్తుంది. ఈ చిత్రం చూసి ఒక్క మహిళ స్ఫూర్తి పొందినా నేను విజయం సాధించినట్లే’ అంటుంది దీప్తి. -
Michael Slater: గృహహింస ఆరోపణలు.. మాజీ క్రికెటర్ అరెస్టు
Ex-Cricketer Michael Slater Arrested: గృహహింస ఆరోపణల నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లాటర్ అరెస్టైనట్లు సమాచారం. సిడ్నీలోని మాన్లీలో గల తన నివాసంలో స్లాటర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన ఓ ఘటన ఆధారంగా అందిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేసినట్లు న్యూసౌత్ వేల్స్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు... ‘‘అక్టోబరు 12న... గృహహింస ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈస్టర్న్ సబర్బ్స్ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు ఆధారంగా బుధవారం ఉదయం 9 గంటల 20 నిమిషాలకు అతడిని అరెస్టు చేశాం’’అని ప్రకటన విడుదల చేశారు. అయితే, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన మైకేల్ స్లాటర్.. టెస్టు బ్యాటింగ్ టాపార్డర్లో చోటు దక్కించుకున్నాడు. కెరీర్లో మొత్తంగా 5312 పరుగులు చేసిన స్లాటర్.. 2004లో ఆటకు వీడ్కోలు పలికాడు. బ్రాడ్కాస్టర్గా, టెలివిజన్ పండిట్గా గుర్తింపు సంపాదించాడు. చదవండి: T20 World cup 2021: ధోనికి వయస్సు అయిపోలేదు.. మాకు పోటీ ఇవ్వగలడు: కేఎల్ రాహుల్ -
స్టార్ సింగర్ అక్రమ సంబంధాలు: అడిగితే మందు బాటిల్తో
Yo Yo Honey Singh Domestic Violence Case: స్టార్ సింగర్ యోయో హనీ సింగ్పై ఆయన భార్య షాలిని తల్వార్ గృహహింస, లైంగిక వేధింపులు, ఆర్థిక మోసం, మానసిక హింస కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో 'గృహ హింస నుంచి మహిళల రక్షణ' చట్టం కింద మంగళవారం ఆమె పిటిషన్ సైతం దాఖలు చేసింది. 120 పేజీలున్న ఈ పిటిషన్లో హనీసింగ్ ఆగడాల గురించి షాలిని వివరించింది. అతడి యాటిట్యూడ్ వల్ల ఎంత మానసిక క్షోభ అనుభవించాననేది పేర్కొంది. '2011లో హనీమూన్ అయిపోయిన తర్వాత హర్దేశ్ సింగ్(హనీ సింగ్ అసలు పేరు) సడన్గా మారిపోయాడు. ఏమైంది? ఎందుకిలా మారిపోయావని ప్రశ్నిస్తే.. తనకు ఇష్టం లేకపోయినా కేవలం నాకిచ్చిన మాట కోసం ఈ పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. హనీమూన్ ట్రిప్లో నన్ను ఒంటరిగా వదిలేసి తాగుబోతులా తిరిగేవాడు. ఈ ప్రవర్తన గురించి అడిగితే నా జుట్టు పట్టుకుని కొట్టి, నోరు మూసుకోమని చెప్పేవాడు. అతడికి ఇతర అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉంది, అందుకే నన్ను తనవెంట టూర్లకు తీసుకెళ్లేవాడు కాదు. మా పెళ్లి విషయాన్ని ఎప్పుడూ సీక్రెట్గా ఉంచాలనుకునేవాడు. అందుకే వేలికి రింగ్ కూడా పెట్టుకునేవాడు కాదు. కానీ ఇంటర్నెట్లో మా ఫొటోలు లీక్ అవడంతో దానికి నేనే కారణమంటూ నన్ను దారుణంగా కొట్టాడు. అవి ఓ సినిమా షూటింగ్ స్టిల్స్ అని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. 'బ్రౌన్ ర్యాంగ్' పాట కోసం వర్క్ చేసిన ఒక మహిళతోనూ హనీ సింగ్కు అఫైర్ ఉంది. ఈమేరకు ఇద్దరూ కలిసి దిగిన కొన్ని అభ్యంతరకర ఫొటోలు నా కంటపడ్డాయి. వాటి గురించి నిలదీస్తే నా మీదకు మందు బాటిళ్లు విసిరాడు. ఆ తర్వాత వేరే ఆడవాళ్లతో కలిసి దిగిన ఫొటోలు చాలానే కనబడ్డాయి. నా పట్ల నా భర్త అతి క్రూరంగా ప్రవర్తించాడు. ఇదిలా వుంటే ఒకరోజు నేను బట్టలు మార్చుకుంటుంటే మామయ్య నేరుగా నా గదిలోకి వచ్చి నన్ను అసభ్యంగా తాకాడు. ఆ ఇంట్లో నన్ను హింసించారని నిరూపించేందుకు నా దగ్గర ఇంకా ఎన్నో సాక్ష్యాలున్నాయి' అని షాలిని తెలిపింది. గృహ హింస నుంచి మహిళలకు రక్షణ చట్టం కింద హనీ సింగ్ నుంచి రూ.10 కోట్ల పరిహారాన్ని ఇప్పించాలని పిటిషన్లో డిమాండ్ చేసింది. దీనిపై ఆగస్టు 28లోపు సమాధానం చెప్పాలంటూ హనీ సింగ్కు కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే! -
నా కడుపులో తన్నాడు, మెడ పట్టుకుని గెంటేశాడు!: నటి
Arzoo Govitrikar: భర్త వేధింపులు, హింసను భరించలేకపోతున్నానంటోంది హిందీ నటి అర్జూ గోవిత్రికర్. ఈ క్రమంలో భర్త సిద్ధార్థ్ శబర్వాల్ నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. కాగా అర్జూ 2019లో గృహహింస కింద భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఈ రెండేళ్ల కాలంలో అతడిలో మార్పు లేకపోగా మరింత హింసకు పాల్పడుతుండటంతో విడిపోవడానికే నిశ్చయించుకుంది. ఈ సందర్భంగా అర్జూ గోవిత్రికర్ మీడియాతో మాట్లాడుతూ.. 'అవును, నేను విడాకుల కోసం దరఖాస్తు చేశాను. ఇప్పటివరకు నేను భరించింది చాలు. ఎంతో ప్రయత్నించి చూశాను కానీ సిద్దార్థ్తో కలిసుండటం సాధ్యపడదు అనిపిస్తోంది. మా మధ్య పెరుగుతున్న దూరం గురించి నేనెప్పుడూ మీడియాతో మాట్లాడలేదు. కానీ ఈరోజు మాట్లాడి తీరతాను. నా భర్త నన్ను మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి ప్రయత్నించాడు. అతడు నాపై చేయి చేసుకున్నాడు, కట్టుకున్నదాన్ని అని చూడకుండా కడుపులో తన్నాడు. అంతెందుకు, నన్ను విచక్షణారహితంగా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నేనెప్పుడూ ఆ గాయాలను బయటకు చూపించాలనుకోలేదు. పెళ్లైన రెండేళ్ల తర్వాత సిద్ధార్థ్ తొలిసారిగా నా మీద చేయెత్తాడు. ఆ తర్వాత కొడుకు పుట్టిన మూడేళ్లకు అతడు వేరే గదిలో నిద్రించడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో అతడికో రష్యన్ ప్రియురాలు ఉందని తెలిసింది. అతడు ఒంటరిగా ఆ గదిలో ఆమెతో చాటింగ్ చేస్తున్నాడని అర్థమైంది. ఇదే విషయాన్ని నేరుగా అతడి దగ్గరకు వెళ్లి నిలదీశాను, కానీ ప్రయోజనం లేకపోయింది. కానీ వాళ్లు కలిసుంటున్నారా? విడివిడిగా ఉంటున్నారా? అన్నది నాకు తెలీదు. అతడి చాటింగ్, నా మీద దాడి చేసిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఈ ఆధారాలే నాకు అంతో ఇంతో న్యాయం చేస్తాయని ఆశిస్తున్నాను' అని అర్జూ చెప్పుకొచ్చింది. తనను కులం పేరుతో కూడా దూషించేవాడని ఆమె ఆరోపిస్తోంది. ఇక ఈ ఆరోపణలను సిద్ధార్థ్ తోసిపుచ్చాడు. 'ఆమెకు ఏం కావాలో అది చెప్పనివ్వండి. ఈ విషయంపై నేనేమీ మాట్లాడదల్చుకోలేదు' అని పేర్కొన్నాడు. కాగా అర్జూ గోవిత్రికర్ బాగ్బాన్, నాగిని 2లో నటించింది. -
ప్రముఖ సింగర్పై గృహహింస, లైంగిక వేధింపుల కేసు
ఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటుడు యోయో హనీ సింగ్పై ఆయన భార్య షాలిని తల్వార్ గృహహింస, లైంగిక వేధింపులు, ఆర్థిక మోసం, మానసిక హింస కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో 'గృహ హింస నుంచి మహిళల రక్షణ' చట్టం కింద మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. తిస్ హజారీ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శ్రీమతి తానియా సింగ్ ముందు కేసు నమోదు చేయబడింది. ఈ క్రమంలో కోర్టు హనీ సింగ్కు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 28లోపు సమాధానం చెప్పాల్సిందిగా ఆదేశించింది. హనీ సింగ్, అతడి భార్య పేరు మీద ఉన్న ఉమ్మడి ఆస్తుల జోలికి వెళ్లడానికి వీలు లేకుండా.. షాలిని తల్వార్కు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు ఏడేళ్ల క్రితం అనగా 2014లో ‘రాస్టార్’ అనే రియాలిటీ షోలో హనీ సింగ్ తన భార్యను జనాలకు పరిచయం చేశాడు. బాలీవుడ్లోని పలు భారీ ప్రాజెక్ట్స్లో పని చేయడానికి ముందే హనీ సింగ్ వివాహం అయిందని తెలిసి చాలా మంది షాక్ అయ్యారు. ఇక దీపికా పదుకోనె, సైఫ్ అలీఖాన్ జంటగా నటించిన ‘కాక్టెయిల్’ చిత్రంలోని ఆంగ్రేజీ బీట్ పాటతో హనీ సింగ్ బాగా ప్రాచుర్యం పొందారు. ఈ పాట సూపర్ హిట్ అవ్వడమే కాకా 2011లో టాప్ సాంగ్గా నిలిచింది. ఆ తర్వాత నుంచి హనీ సింగ్ బాలీవుడ్ కెరీర్ సాఫీగా కొనసాగుతుంది. ఇక భార్య ఇచ్చిన ఫిర్యాదులతో అతడి కెరీర్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి. భార్య ఫిర్యాదు మీద హనీ సింగ్ ఇంకా స్పందించలేదు. -
పింక్ ప్రొటెక్షన్ ‘సర్వే’యలెన్స్ చెక్ చేస్తారు... చెక్ పెడతారు
జ్వరాలు ఉన్నాయేమోనని ఇంటింటి సర్వే చేయడం తెలుసు. కాని ఇక మీదట కేరళలో గృహ హింస జరుగుతున్నదా అని ఇంటింటినీ చెక్ చేస్తారు. కాలేజీల దగ్గర పోకిరీల పని పడతారు. కట్నం మాటెత్తితే లోపల వేస్తారు. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే చిప్పకూడు తినిపిస్తారు. స్త్రీలకు విరోధులుగా మారిన పురుషులకు గుణపాఠం చెప్పడానికి కేరళ ప్రభుత్వం సోమవారం ‘పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్’ ప్రారంభించింది. ఆ వివరాలు... పోలీస్ వెహికిల్ అంటే మగ డ్రైవర్, మగ ఇన్స్పెక్టర్, మగ కానిస్టేబుల్స్... ఇలాగే ఉంటుంది అన్ని చోట్లా. కాని కేరళలో ఇక మీదట ‘పింక్’ కార్లు కూడా కనిపిస్తాయి. లేడీ డ్రైవర్, లేడీ ఇన్స్పెక్టర్, లేడీ కానిస్టేబుల్స్.... వీళ్లే ఉంటారు. ఈ పింక్ కార్లు రోడ్ల మీద తిరుగుతుంటాయి. తమ కోసం ఈ వాహనాలు రక్షణకు పరిగెత్తుకొని వస్తాయి అనే నమ్మకాన్ని స్త్రీలకు ఇస్తాయి. కేరళలో ఇటీవల గృహ హింస కేసులు, వరకట్న చావులు మితి మీరాయి. ఇప్పటికే అక్కడ స్త్రీల రక్షణకు వివిధ మహిళా పోలీసు దళాలు విధుల్లో ఉన్నా సోమవారం (జూలై 19) ‘పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్’ పేరుతో అక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృఢమైన సందేశం ఇచ్చేలా కొత్త దళాలను తిరువనంతపురంలో ప్రారంభించారు. మూడు సంరక్షణలు స్త్రీలకు మూడుచోట్ల భద్రత కల్పించాలని కేరళ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఒకటి పబ్లిక్ ప్లేసుల్లో (రోడ్లు, పార్కులు, బస్స్టాప్లు..), రెండు ప్రయివేటు ప్లేసుల్లో (నివాస గృహాలు, హాస్టళ్లు...), మూడు సోషల్ మీడియాలో (ఫేస్బుక్, ట్విటర్..)... ఈ మూడు చోట్ల స్త్రీలకు ఏ మాత్రం అసౌకర్యం జరగడానికి వీల్లేకుండా ‘పింక్ ప్రొటెక్షన్’ కింద మహిళా దళాలు అలాగే పురుష దళాలు పరస్పర సహకారంతో పని చేయాలని అక్కడ చర్యలు మొదలయ్యాయి. ఇంటికి వచ్చే ‘పింక్ జనమైత్రి’ గృహ హింస, వరకట్న వేధింపులకు చెక్ పెట్టడానికి కేరళలో మొదలెడుతున్న వినూత్న రక్షణ చర్య ‘పింక్ జనమైత్రి’. సాధారణంగా ఇళ్లల్లో గృహ హింస జరుగుతూ ఉన్నా, వరకట్న వేధింపు జరుగుతూ ఉన్నా అది ఆ ఇంటికి, ఇరుగు పొరుగు వారికీ తెలుస్తూ ఉంటుంది తప్ప స్టేషన్ వరకూ చేరదు. అనేక కారణాల వల్ల, చట్టం సహాయం తీసుకోవచ్చని స్త్రీలకు తెలియకపోవడం వల్ల పోలీసులకు ఈ వేధింపు తెలియదు. అది దృష్టిలో పెట్టుకుని కేరళలోని ప్రతి జిల్లాలోని ప్రతి ఊళ్లోని పంచాయితీ సభ్యులతో ‘పింక్ జనమైత్రి’ కార్యక్రమం కింద మహిళా పోలీసులు ‘టచ్’లో ఉంటారు. ఊళ్లో ఏ ఇంట్లో అయినా స్త్రీలపై హింస జరుగుతుందా ఆరా తీస్తారు. అలాగే ఇంటింటిని సర్వే చేస్తూ ఆ ఇంటి మహిళలతో మాట్లాడతారు. మహిళలు విషయం దాచాలనుకున్నా వారి వొంటి మీద దెబ్బపడి ఉంటే ఆ దెబ్బ పెద్ద సాక్ష్యంగా నిలిచే అవకాశం ఉంది. దాంతో ఆ హింసకు పాల్పడిన కుటుంబ సభ్యులపై చర్యలు ఉంటాయి. ముఖ్యంగా ఇది వరకట్న వేధింపులు ఎదుర్కొనే కోడళ్లకు పెద్ద తోడు అయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులను కూడా ఇంట్లో అడుగుపెట్టనీకుండా కోడళ్లను రాచి రంపాన పెట్టే భర్త, అత్తామామలు ఉంటారు. కాని పోలీసులను రావద్దు అనడానికి లేదు. కోడలు నోరు విప్పి ఏం చెప్పినా అంతే సంగతులు. పింక్ షాడో పెట్రోల్, పింక్ రోమియో కేరళలో స్త్రీలకు నీడలా ఉంటూ వేధించే పురుషులకు సింహ స్వప్నంగా నిలిచేదే ‘పింక్ షాడో పెట్రోల్’. ఇందుకోసమే పింక్ వెహికిల్స్ను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్లు పూర్తిగా మహిళా పోలీసులతో తిరుగుతాయి. ‘మా వెహికిల్ వస్తుంటే అల్లరి వెధవలు తోక ముడిచి పారిపోతున్నారు’ అని ఆ వెహికల్స్లో విధి నిర్వహిస్తున్న ఒక మహిళా ఇన్స్పెక్టర్ చెప్పింది. ‘అమాయక యువతులకు మాయమాటలు చెప్పి పార్కులకు సినిమాలకు తిరిగే మేక వన్నె పులులు కూడా ఇప్పుడు మా బండ్లు ఎక్కడ పసి గడతాయోనని ఒళ్లు దగ్గర పెట్టుకుంటున్నారు.’ అని కూడా ఆమె అంది. పింక్ షాడో పెట్రోల్ మొదలయ్యాక కేరళలో బీచ్ల వద్ద జరిగే క్రైమ్ బాగా తగ్గింది. ఇక ఆడపిల్లలను సిటీ బస్సుల్లో, కాలేజీల దగ్గర, స్కూళ్ల దగ్గర అల్లరి పెట్టేవారి భరతం పట్టడానికే ‘పింక్ రోమియో’ మహిళా పోలీసు దళం పని చేస్తుంది. వీరికి బుల్లెట్లు, సైకిళ్లు కూడా పోలీసు శాఖ సమకూర్చింది. పింక్ హెల్మెట్లతో వీరు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ విధులలో ఉంటారు. అలాగే 24 గంటలూ అందుబాటులో ఉండే హెల్ప్లైన్ నంబర్ కూడా ఉంటుంది. భావజాలం మారాలి ‘ఎన్ని దళాలు ఎన్ని విధాలుగా పని చేసినా అవి దుర్మార్గ పురుషులను నియంత్రించొచ్చుగాని వారిని పూర్తిగా మార్చలేవు. మారాల్సింది పురుషులే. తమకు తాముగా వారు స్త్రీల పట్ల ఎలా వ్యవహరించాలో వారిని ఎంత గౌరవించాలో తెలుసుకోవాలి. అప్పుడే అత్యాచారాలు, హింస, వేధింపులు ఆగుతాయి’ అని పింక్ ప్రాజెక్ట్లో పని చేస్తున్న ఒక మహిళా ఆఫీసర్ అన్నారు. అవును. అబ్బాయిలకు హైస్కూలు వయసు నుంచే ఇంట్లో, బయట స్త్రీలతో ఎలా వ్యవహరించాలో నేర్పించాల్సిన బాధ్యత కుటుంబానికి ఉంది. వారిని జెండర్ సెన్సిటైజ్ చేయాల్సిన బాధ్యత విద్యా వ్యవస్థకు ఉంది. ఈ రెండు చోట్ల పురుష భావజాలం సంస్కరింపబడిన నాడు పింక్ ప్రొటెక్షన్ అవసరమే ఉండదు. -
కర్ణాటకలో మహిళల దైన్యం.. పోలీసుస్టేషన్లకు క్యూ
సాక్షి, బెంగళూరు: కరోనా మహమ్మారితో ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు, లాక్డౌన్ వల్ల ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం తదితర కారణాలతో గృహహింస పెచ్చరిల్లుతోంది. అందుకు అతివే బాధితురాలు అవుతోంది. ఇది కర్ణాటకలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 3 నెలల్లో 458 వరకట్న కేసులు,52 మంది మృతి మూడు నెలల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 458 వరకట్న కేసులు నమోదు కాగా వీరిలో 52 మంది మహిళలు మరణించారు. భర్త చేతిలో హత్యకు గురికావడమో, లేదా ఆత్మహత్య చేసుకోవడమో జరిగింది. మహిళలపై దౌర్జన్యాలకు సంబంధించి మొత్తం 574 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పాక్షిక లాక్డౌన్ అమలైన సుమారు 10 రోజుల నుంచి 159 మందికి పైగా మహిళలు వరకట్న వేధింపులతో పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కారు. మే నెలలో కేసులు ఇంకా పెరగవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. కొన్ని కేసులను పరిశీలిస్తే కట్నం కోసం వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. డబ్బు తేలేదని విడాకుల నోటీస్ బెంగళూరులోని జయనగరలో 28 ఏళ్ల మహిళకు నాలుగేళ్ల కిందట ప్రైవేటు ఉద్యోగి శ్రీకాంత్తో వివాహమైంది. కరోనా వల్ల ఏర్పడిన లాక్డౌన్తో ఇంట్లోనే ఉంటూ భార్యను వేధించసాగాడు. కనీసం తిండి కూడా పెట్టకుండా, పుట్టింటి నుంచి రూ. 3 లక్షలు తేవాలని ఒత్తిడి చేశాడు. ఆమె డబ్బు తేలేదని విడాకులు నోటీస్ పంపాడు. రూ.64 లక్షలు ఇచ్చినా తృప్తి లేదు బెంగళూరు కేఆర్ పురానికి చెందిన 34 ఏళ్ల మహిళకు 2015లో ఇంజనీర్ ప్రకాష్తో వివాహమైంది. ఇల్లు కొందామంటే ఆమె రూ. 64 లక్షలు అప్పుచేసి భర్తకు ఇచ్చింది. అయినప్పటికీ మళ్లీ డబ్బు తేవాలని భర్త వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలింతపై పాశవిక దాడి పట్టెగారేపాళ్యకు చెందిన 25 ఏళ్ల మహిళకు మూడేళ్ల కిందట ప్రైవేటు కంపెనీ ఉద్యోగి శివకుమార్తో వివాహమైంది. పెళ్లి సమయంలో కట్న కానుకలు భారీగానే ముట్టజెప్పారు. అయినా మళ్లీ తేవాలని ఒత్తిడి చేయసాగాడు. గర్భిణి అని కూడా చూడకుండా సతాయించాడు. ప్రసవానికి పుట్టింటికి వెళ్లి తిరిగిరాగా, డబ్బులు, బంగారం తీసుకురాలేదని రక్తం వచ్చేలా కొట్టాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కర్ణాటకలో గృహహింస కేసుల వివరాలు ఏడాది కేసులు మృతులు 2017 1,532 206 2018 1,524 198 2019 1,716 189 2020 1487 177 2021 (మార్చి) 458 52 -
వాడిని చంపేయండి.. వదలొద్దు!
బంజారాహిల్స్: ‘విజయ అనే నేను.. నా భర్త పెట్టే బాధలు భరించలేక చనిపోతున్నాను. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రోజూ చావకొడుతూనే ఉన్నాడు. మళ్లీ నన్ను డ్యూటీకి పొమ్మంటాడు. డ్యూటీకి పోతే అక్రమ సంబంధాలు అంటగడుతూ ఒంటి మీద బట్టలు లేకుండా కొట్టేవాడు. నన్ను చంపడానికి చూశాడు. నేను చనిపోయినా నా భర్తను మాత్రం వదలకండి చంపేయండి. మా ఆయన తన అన్న చంద్రయ్య అండతో నన్ను వేధించేవాడు. దాన్ని చంపేస్తే మీ అక్కబిడ్డనిచ్చి పెళ్ళి చేస్తాననేవాడు. నా చావుకు ముఖ్య కారణం ఈ అన్నదమ్ములు. నా పిల్లలు మా అమ్మానాన్న, అన్న, తమ్ముడితో ఉండాలని కోరుకుంటున్నాను’అంటూ... ఓ వివాహిత సూసైడ్ నోట్ రాసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్ యూసుఫ్గూడ సమీపంలోని ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్గాంధీ నగర్లో విజయ (31) భర్తతో కలిసి ఉంటోంది. వీరికి ఇద్దరు కొడుకులు. 14 సంవత్సరాల క్రితం ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయిన నాటి నుంచి భర్త చిత్రహింసలు పెట్టేవాడు. దీంతో జీవితంపై విరక్తితో ఆమె మంగళవారం తెల్లవారుజామున తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు మరణానికి అల్లుడు ఆంజనేయులు కారణమని మృతురాలి తల్లి మణెమ్మ ఫిర్యాదు చేసింది. పెళ్లి జరిగిన తెల్లవారి నుంచే అల్లుడు తమ కూతురిని అనుమానిస్తూ హింసించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఆంజనేయులును అదుపులోకి తీసుకు న్నారు. ఈ నెల 26న రాత్రి 8 గంటలకు తన కూతురు ఫోన్ చేసి పిల్లలు జాగ్రత్త అంటూ చెప్పిందని, మరో రెండు గంటలకే అల్లుడు కొడుతున్నాడని చెప్పి ఏడ్చిం దని మణెమ్మ వాపోయింది. ఆ సమయంలో తన అల్లుడు ఫోన్ లాక్కొని మీ కూతురిని చంపేస్తానని చెప్పాడని, తెల్లవారి చూసేసరికి శవమై కనిపించిందని చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పంజాబ్ అబ్బాయి.. హైదరాబాద్ అమ్మాయి.. కట్ చేస్తే!) -
భర్త రెండో పెళ్లికి ప్లాన్.. ప్రాణాలు తీసుకున్న భార్య
వివాహమై నాలుగేళ్లకే వేసిన మూడుముళ్లు భారంగా మారాయి. ఆ దాంపత్య జీవితానికి ప్రతిరూపాలుగా మూడేళ్లు బాబుతోపాటు తొమ్మిది నెలల బాబు ఉన్నారు. బోసినవ్వుల ఆ చిన్నారుల బుడిబుడి అడుగులు చూసి మురిసిపోవాల్సిన ఆ కుటుంబంలో ‘విడాకుల’ అలజడి రేగింది. సర్దిచెప్పాల్సిన అత్త,మామలు ఆది నుంచీ అదే పాట పాడడం, వారి మాటలకు భర్తకూడా చివరిలో తందానా అనడంతో మనస్తాపానికి గురై రెండు పదుల వయసులోనే తనువు చాలించేసింది. భోగాపురం: కట్టుకున్న భర్త, అత్తమామల వేధింపులు తాళలేక వెంపాడ రమాదేవి (21) ఫ్యానుకు ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన మండలంలోని రావివలస గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...మండలంలోని రావివలస గ్రామానికి చెందిన వెంపాడ రాములబంగారికి (అలియాస్ శ్యామ్) దల్లిపేట గ్రామానికి చెందిన రమాదేవికి నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరి కాపురం కొన్నేళ్లే అన్యోన్యంగా సాగింది. వీరికి కౌశిక (3), వాయిత్ (9 నెలలు) ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లి అయిన రెండేళ్ల తరువాత వీరి కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వస్తుండేవి. భర్తతోపాటు అత్త,మామలు తరచూ రమాదేవిని వేధించడం మొదలుపెట్టారు. 15 రోజుల కిందట తన కుమారుడికి రెండో వివాహం చేసేందుకు అత్త అప్పలనరసమ్మ, మామ రమణ కలిసి తన కుమారుడు రాములబంగారికి విడాకులు ఇవ్వాలంటూ కాగితంపై సంతకం పెట్టమని రమాదేవిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడింది. ఈ విషయం తెలుసుకున్న రమాదేవి తల్లిదండ్రులు వారి బంధువులు కలిసి గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో వారిద్దరికీ సర్దిచెప్పి పంపిచారు. ఈక్రమంలో మళ్లీ సోమవారం అత్తమామలతో పాటు భర్త కూడా విడాకులు ఇవ్వాలని రమాదేవిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన రమాదేవి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అందరితో కలుపుగోలుగా ఉండే ఈమె చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ యు.మహేశ్, తహసీల్దారు డి.రాజేశ్వరరావు, గ్రామ సర్పంచి ఉప్పాడ, శివారెడ్డి సంఘటన స్థలానికి చెరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సీహెచ్సీకి తరలించి మృతురాలు తండ్రి దల్లి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
బంజారాహిల్స్: పెళ్లయిన తొమ్మిది నెలలకే..
సాక్షి, బంజారాహిల్స్: వివాహమైన తొమ్మిది నెలలకే ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. జీడిమెట్లకు చెందిన శైలజ (23)కు ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని సంజయ్నగర్కు చెందిన డ్రైవర్ నవీన్తో తొమ్మిది నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో ఒప్పందం ప్రకారం కట్న కానుకల కింద శైలజ తల్లిదండ్రులు 2 తులాల బంగారం, రూ.10 వేలు బాకీ పడ్డారు. ఈ నేపథ్యంలో పెళ్లైన మరుసటి రోజు నుంచే శైలజకు వేధింపులు మొదలయ్యాయి. ఆమె అత్త తిరుపతమ్మ, భర్త నవీన్ శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. పలుమార్లు భర్త కొట్టడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి అత్తకు, భర్తకు నచ్చజెప్పి అత్తారింటికి పంపించారు. మూడు వారాలుగా ఆమెకు మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. ప్రతిరోజూ కొట్టడం, దూషిస్తుండటంతో భరించలేని శైలజ మంగళవారం అర్ధరాత్రి తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అత్త, భర్తతో పాటు మరిది ప్రవీణ్ హత్య చేశారని, నిందితులను శిక్షించాలని మృతురాలి తండ్రి యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు శైలజ అత్త తిరుపతమ్మను, భర్త నవీన్ను అదుపులోకి తీసుకున్నారు. మరిది ప్రవీణ్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఖైరతాబాద్: ఆన్లైన్ క్లాసుల్లో అశ్లీల ఫోటోలు షేర్ చేస్తూ.. సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి ఆత్మహత్య -
మనసు కుదుట పడింది కాఫీ తాగండి
ఆ కేఫ్కి కష్టమర్లు మంచి రేటింగే ఇచ్చారు. ఫేస్బుక్ 5కు 5 పాయింట్లు ఇచ్చింది. కోల్కతా ప్రజలకు తెలుసు తమకు ఆ కేఫ్ను ప్రోత్సహించాలని. అందుకే అక్కడకు వెళతారు. మాక్టైల్స్ తాగుతారు. పఫ్లు తింటారు. బేకరి ఐటమ్స్ పార్శిల్ కట్టించుకుంటారు. 7 నుంచి 9 మంది స్త్రీలు ఎప్పుడూ అక్కడ చిరునవ్వుతో పని చేస్తూ ఉంటారు. కూర్చోవడానికి అనువుగా ఉండి ప్రశాంతంగా ఉండే బేకరి కేఫ్ పేరు ‘క్రస్ట్ అండ్ కోర్’. దక్షిణ కోల్కతాలోని ‘చేట్ల’ ప్రాంతంలో ఉంటుంది. ఏమిటి దాని విశేషం? మానసిక సమస్యల నుంచి బయటపడిన ఏ ఆధారం లేని స్త్రీలు అక్కడ పని చేస్తారు. ఇలా వారి కోసమే నడిచే బేకరి దేశంలో ఇదే కావచ్చు. మానసిక హింస భౌతిక హింసలో గాయం అయితే మందు రాస్తే తగ్గిపోవచ్చు. కాని మానసిక హింస తాలూకు దుష్ప్రభావాలు దీర్ఘకాలం ఉంటాయి. అవి క్రమేపి మానసిక రుగ్మతలుగా మారతాయి. వాటికి వైద్యం చేయించుకోవాలని చాలామంది మహిళలకు తెలియదు. ఒకవేళ తెలిసినా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకువెళతారు కాని సైకియాట్రిస్ట్ల దగ్గరకు వెళ్లరు. చివరకు ఆ రుగ్మతలు ముదిరిపోతాయి. ఏమీ తెలియని స్థితిలో ఇళ్ల నుంచి బయటపడి సమాజం దృష్టిలో ‘పిచ్చివాళ్లు’ అన్న ముద్ర పడి తిరుగుతుంటారు. ఇలా తిరిగే స్త్రీల కోసం కోలకతాలో ‘ఈశ్వర సంకల్ప’ అనే ఎన్.జి.ఓ పని చేస్తోంది. వీళ్లు ‘సర్బరి షెల్టర్’ అనే ఒక హోమ్ను నడుపుతున్నారు. ఇందులో అచ్చంగా మానసిక సమస్యలతో రోడ్ల మీద తిరిగే స్త్రీలను తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తారు. వీరికి వైద్యం చేయించి బేకింగ్లో శిక్షణ ఇచ్చి ఈ బేకరిలో ఉపాధి కల్పిస్తున్నారు. 2018లో ఇలా మానసిక సమస్యల నుంచి బయటపడిన స్త్రీల కోసం ‘క్రస్ట్ అండ్ కోర్’ బేకరినీ తయారు చేశారు. గత మూడేళ్లుగా ఈ బేకరి విజయవంతంగా నడుస్తూ ఉంది. గృహహింసతో మానసిక సమస్యలు ‘సర్బరి షెల్టర్’లో ఆశ్రయం పొంది బేకరిలో పని చేస్తున్న మహిళలందరూ దారుణమైన గృహహింసకు పాల్పడిన వారే. భర్త, అత్తింటివారు పదేపదే భౌతికదాడికి పాల్పడటం, మానసికంగా భయభ్రాంతం చేయడం వల్ల అదీ ఒకరోజు రెండు రోజులు కాదు మూడునాలుగేళ్లు వరుసగా చేయడం వల్ల మతి చలించి ముఖ్యంగా ‘స్క్రిజోఫోబియా’ బారిన పడి ఇళ్లు వదిలినవాళ్లే అంతా. వీరు చాలారోజులు రైల్వేస్టేషన్లలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ చివరకు ఈ హోమ్కు పోలీసుల ద్వారా చేరుతారు. ‘వాళ్లకు ఒక్కొక్కరికి సంవత్సరం నుంచి రెండేళ్ల పాటు వైద్యం చేయిస్తాం. అప్పుడు నార్మల్ అవుతారు. ఆ తర్వాత కూడా మందులు తప్పనిసరిగా కొనసాగిస్తూ పని చేసుకోవాల్సి ఉంటుంది’ అని హోమ్ నిర్వాహకులు చెప్పారు. కొత్త జీవితం ‘నేను బిస్కెట్లు బాగా చేస్తాను. కేక్లు అవీ చేయడం రాదు’ అని ఈ కేఫ్లో పని చేసే ఒక మహిళ చెప్పింది. ‘నేను కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను. నాదంటూ ఒక ఇల్లు ఉండాలి’ అందామె. మిగిలిన వారిలో ముంబై నుంచి తప్పిపోయి వచ్చినవారు, అస్సాం వైపు నుంచి వచ్చిన వారు ఉన్నారు. వీరి వయసులో 26 నుంచి 45 వరకూ ఉన్నాయి. ‘మీ కేఫ్లో ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి’ అనే చిన్న మాటకు వాళ్లు చాలా బ్రైట్గా నవ్వుతారు. ఆ చిన్న ప్రశంస వారికి పెద్ద ఆరోగ్యహేతువుతో సమానం. ‘మానసిక సమస్యల నుంచి బయటపడిన వారు కొంత బెరుకుగా, ఎదుటివారి మీద ఆధారపడేలా ఉంటారు. వీరిని సమాజం కలుపుకుని మద్దతు ఇవ్వకపోతే తమలో తాము ముడుచుకుపోతారు. నలుగురిలో కలవడానికే భయపడిపోతారు. కేఫ్ పెట్టడం ద్వారా వీరు నలుగురినీ కలిసేలా చేసి వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాం’ అని కేఫ్లో సూపర్వైజర్గా పని చేసే మహిళ చెప్పారు. ఈ సూపర్వైజర్ మాత్రం ‘నార్మల్’ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ. ఈమె తనతో పని చేసే ఈ మహిళలను కనిపెట్టుకుని ఉంటుంది. ఈ కేఫ్కు వెళితే బయట ‘మేము ప్రతికూలతలను జయించాం. మేము చాంపియన్స్’ అని ఉంటుంది. నిజమే. వారు చాంపియన్స్ మనసు చీకటి గుయ్యారాల్లో జారి పడిపోయినా తిరిగి వెలుతురు వెతుక్కుంటూ దానిని దారికి తెచ్చుకున్నారు. సమస్యలు, సవాళ్లు తద్వారా మానసిక బలహీనత ఎవరికైనా సహజం. దానికి వైద్యం తీసుకోవాలి. స్నేహితుల సపోర్ట్ తీసుకోవాలి. అన్నింటిని దాటి కొత్త జీవితం మొదలెట్టాలి. క్రస్ట్ అండ్ కోర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. – సాక్షి ఫ్యామిలీ -
ఫోన్ కాల్తో పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒకే ఒక్క ఫోన్ కాల్తో మహిళలకు చట్టబద్ధమైన పరిష్కారం లభిస్తోంది. ఏ మహిళకు కష్టమొచ్చినా వెంటనే పోలీస్ సహాయాన్ని కోరే స్థాయికి చైతన్యం పెరిగింది. రాష్ట్రంలో డయల్ 100, డయల్ 112, దిశ కాల్ సెంటర్లకు లభిస్తున్న స్పందనే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న ఏపీ పోలీస్ శాఖ.. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపడుతోంది. ప్రధానంగా అత్తమామలు, ఆడపడుచు, భర్త పెట్టే గృహహింస కేసులపై పోలీసులు తక్షణ చర్యలు చేపడుతున్నారు. గడచిన ఏడాది కాలంలో గృహహింస కాల్స్ అధికంగా వస్తుండగా.. వాటిపై పోలీసు శాఖ తక్షణ చర్యలు చేపడుతుండటం విశేషం. మహిళలు, విద్యార్థినులు డయల్ 100, 112, దిశ కాల్ సెంటర్ను పెద్ద సంఖ్యలోనే వినియోగించుకుంటున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. మహిళలపై వేధింపులు, దాడులు వంటి తదితర అంశాలకు సంబంధించి 100, 112, దిశ కాల్ సెంటర్లలో దేనికైనా ఫోన్కాల్ వచ్చిన క్షణం నుంచే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. కాల్ సెంటర్లో ఫిర్యాదు ఆటోమేటిక్గా వాయిస్ రికార్డు అవుతుండగా.. కాల్ సెంటర్ సిబ్బంది బాధితురాలు ఉండే ప్రాంతానికి సమీపంలోని పోలీస్ స్టేషన్కు తక్షణమే సమాచారం అందిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగుతున్న పోలీస్ టీమ్ బాధిత మహిళలకు తక్షణ సాయం అందించే చర్యలు చేపడుతోంది. గృహహింస వంటి కేసుల్లో సాధ్యమైనంత వరకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వేధింపులు తదితర నేరాలపై గట్టి చర్యలు చేపట్టి ఉక్కుపాదం మోపుతున్నారు. బాధిత మహిళల సమాచారాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. కౌన్సెలింగ్, హెచ్చరికలు, బైండోవర్ వంటి పద్ధతుల్లో నిందితులను దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా కేసుల్లో బాధిత మహిళ కోరితేనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. -
నటుడు, ఎంపీపై కేసులు పెట్టిన భార్య
భువనేశ్వర్ : నటుడు, బిజు జనతా దళ్ ఎంపీ అనుభవ్ మొహంతిపై ఆదివారం గృహహింస, వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. భార్య, నటి వర్ష ప్రియదర్శి ఈ మేరకు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుభవ్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అనుభవ్, అతడి స్నేహితులిద్దరు తనను కటక్లోని తమ నివాసంలోని ఓ గదిలో బంధించారని, పోలీసులు సహాయంతో బయటపడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, గతంలో కూడా పలుమార్లు భర్తపై ఆమె కేసులు పెట్టారు. కొన్ని నెలల క్రితం.. అనుభవ్, వర్ష గొడవపడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. భర్త తన క్యారెక్టర్ను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించారు. ( స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారం ) అనుభవ్ తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆగస్టు 7న కోర్టులో గృహహింస కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో అనుభవ్ తనకు భార్యనుంచి విడాకులు కావాలంటూ ఢిల్లీలోని పటియాలా కోర్టుకెక్కారు. అయితే తమ విడాకుల కేసును కటక్ ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా కేసు నేపథ్యంలో అనుభవ్ డీజీపీకి ఓ లేఖ రాశారు. ‘‘ నాకు, నా కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంది. దయచేసి మమ్మల్ని కాపాడండి’’ అని లేఖలో పేర్కొన్నాడు. -
అంజుమ్ సుల్తానాకు అండగా నిలుస్తాం
సాక్షి హైదరాబాద్: గృహహింస బాధిత మహిళల హక్కులకు రక్షణ, న్యాయం అందించి అండగా నిలిచేందుకు ఓ సంస్థ ప్రారంభమైంది. ‘కాన్ఫిడరేషన్ మూవ్మెంట్ ఎగినెస్ట్ డొమెస్టిక్ వయొలెన్స్’ పేరుతో స్థాపించిన ఈ సంస్థ గృహహింసకు వ్యతిరేకంగా పని చేయనుంది. మేజర్ ప్రొఫెసర్ సుల్తానా ఖాన్ సోమవారం మీడియా ప్లస్ ఆడిటోరియంలో విలేకరులతో మాట్లాడుతూ.. చట్టంలోని లొసుగులను కొంతమంది సొమ్ముచేసుకుని భార్యాపిల్లలపై దాష్టీకాలకు తెగబడుతున్నారని తెలిపారు. అంజుమ్ సుల్తానా అనే బాధిత మహిళకు జరిగిన అన్యాయం గురించి తెలిపారు. అంజుమ్కి ముగ్గురు పిల్లలు పుట్టిన అనంతరం భర్త ఆమెను వదిలేశాడని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా అతను మరో మహిళను వివాహం చేసుకున్నాడని తెలిపారు. అంజుమ్ లాంటి బాధితులు సమాజంలో చాలా మంది ఉన్నారని, తీవ్రమైన గృమహింసకు గురవుతున్న వారు తమ సమస్యలను తెలియజేయడానికి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి మహిళలకు సరైన న్యాయం జరగకపోవటం సమాజానికి శ్రేయస్కరం కాదని తెలిపారు. గృహహింస బాధత మహిళల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి తమ సంస్థ తరఫున న్యాయం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. మహిళలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా సామాజిక మహాజన సంఘర్షణ సమితి, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆల్ మైనారిటీస్ ఎమ్మార్పీఎస్, యాంటీ కరప్షన్ మహిళా కమిటీ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, కవులు, రచయిత్రులు పాల్గొన్నారు. -
అతివలకు అండగా 'సఖి'
ఆదిలాబాద్టౌన్: నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలు, యువతులపై దాడులు, వేధింపులు, గృహహింస, అత్యాచారం, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు ‘సఖి’ సహాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తోంది. మహిళా చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. తమపై దాడులు జరుగుతున్నా బయటకు చెప్పుకోలేనివారు సఖి కేంద్రానికి సమాచారం అందిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచి సహాయాన్ని అందిస్తోంది. మహిళల్లో మనోధైర్యం పెంపొందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయ సలహాలు, పోలీసు, వైద్యసహాయం అందిస్తున్నారు. 2017లో సఖి కేంద్రం ఏర్పాటు మహిళలకు అండగా నిలిచేందుకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2017 డిసెంబర్ 16న సఖీ కేంద్రాన్ని ప్రారంభించారు. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు షీ టీమ్తో పాటు సఖి కూడా సేవలు అందిస్తోంది. చిన్నపిల్లల నుంచి పండు ముసళ్ల వరకు సఖి కేంద్రం సమస్య పరిష్కరిస్తోంది. అత్తామామలు, భార్యాభర్తల గొడవలు, యువతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ఐదురోజుల పాటు ఆశ్రయం కూడా కల్పిస్తోంది. లైంగిక వేధింపులు, గృహ హింస, బాల్య వివాహాలు, ఆడపిల్లల అమ్మకం, పనిచేసే చోట వేధింపులు, తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయం జరిగేలా చేస్తోంది. ఉమెన్ హెల్ప్లైన్ నంబర్ 181 వేధింపులకు గురవుతున్న మహిళలకు న్యాయం చేసేందుకు సఖి కేంద్రం సేవలు అందిస్తోంది. అందుల్చో భాగంగానే ఉమెన్ హెల్ప్లైన్ పేరిట టోల్ఫ్రీ నంబర్ 181 ఏర్పాటు చేసింది. ఇబ్బందులు పడుతున్న మహిళలు టోల్ఫ్రీ నంబర్ 181కు సమాచారం అందిస్తే సహాయం అందిస్తోంది. ఎవరైనా అక్కడినుంచి రాలేని పరిస్థితిలో ఉంటే వారికోసం ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేసి కేంద్రానికి తీసుకువస్తారు. 24 గంటల పాటు ఈ కేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉంటారు. కేసుల పరిష్కారంలో ముందంజ 2017 నుంచి ఇప్పటివరకు 722 కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో 569 కేసులను పరిష్కరించగా 153 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 710 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. 116 మందికి న్యాయసేవ, 85 మందికి వైద్య సహాయం, 54 మందికి పోలీసు సహాయం అందించారు. దాదాపు 70వేల మందికి అవగాహన కల్పించినట్లు సఖి కేంద్రం నిర్వాహకులు యశోద చెబుతున్నారు. ఈయేడాది 258 కేసులు నమోదు కాగా 170 కేసులు పరిష్కరించినట్లు ఆమె పేర్కొన్నారు. విస్తృతంగా ప్రచారం సఖీ కేంద్రం సభ్యులు అందిస్తున్న సేవలపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలు, గ్రామాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సమైక్య సంఘాల సభ్యులకు మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ మహిళలను చైతన్య పరుస్తున్నారు. గ్రామాల్లో వాల్పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మహిళలకు తమ హక్కులతో పాటు తమను తాము ఏవిధంగా రక్షించుకోవాలనే అంశాల గురించి వివరిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి వేధింపులకు గురవుతున్న మహిళలు, యువతులు సఖి కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి. దాడులకు గురైన వారికి ఉచితంగా న్యాయ సలహాలు, పోలీసు, వైద్యసహాయం అందిస్తున్నాం. అవసరమైన వారికి కేంద్రంలో ఐదురోజుల పాటు వసతి కూడా కల్పిస్తాం. బాధితులను తీసుకురావడానికి ఒక వాహనం కూడా ఏర్పాటు చేశాం. – మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి, ఆదిలాబాద్ -
‘బాబోయ్..నా భార్య నుంచి కాపాడండి’
కోల్కతా : గృహ హింస కేసు అనగానే భార్యను భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అనుకుంటాం. అలా కాకుంటే అత్తామామలో, ఆడపడుచులో హింసించడం చూసుంటాం. అంటే ఇప్పటివరకు మహిళలే ఈ గృహహింస కేసుల్లో బాధితులుగా ఉండటం చూసుంటాం. కానీ దీనికి వ్యతిరేకంగా భార్యపై గృహహింస కేసు పెట్టాడు ఓ భర్త. భార్య పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నానని, తనను కాపాడాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోల్కతాకు చెందిన జ్యోతిర్మయి మజుందార్ ఓ సాఫ్టవేర్ ఇంజనీర్. తల్లిదండ్రులు, భార్యతో కలిసి కోల్కతా నగరంలో నివాసం ఉంటుంన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులను సొంతగ్రామమైన బైద్యబతిలో వదిలిపెట్టి వచ్చాడు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఇటీవల తల్లిదండ్రులను కోల్కతాకు తీసుకువచ్చాడు. అత్తమామను తీసుకురావడం భార్యకు ఇష్టం లేదు. వారి వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని, అందుకే ఇంటికి తీసుకురావొద్దని భర్తను హెచ్చరించింది. అయినప్పటికీ అత్తమామను ఇంటికి తీసుకురావడంతో ఆ రోజు నుంచి భర్తను చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టింది. రోజు చెంపదెబ్బలు కొట్టడం. పిన్నులతో గుచ్చడం, సిగరేట్లతో కాల్చడం చేసేది. భార్య చిత్రహింసలు భరించలేక చివరకు జ్యోతిర్మయి మజుందార్ భీదాన్నగర్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య చిత్రహింసలు పెడుతోందని, ఆమెను గృహహింస కేసు కింద అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. భార్యపెట్టే చిత్రహింసను వీడియో రికార్డు చేసి పోలీసులకు చూపించాడు. అయితే చట్టాలు మహిళకు రక్షణగా మాత్రమే ఉందని చెప్పి చిన్న కంప్లైట్ రాసుకొని పంపించేశారు. పోలీసులు తనకు న్యాయం చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించానని జ్యోతిర్మయి పేర్కొన్నారు. -
నిలదీయండి.. నిలబడండి!
వసుదైక కుటుంబం, ఇంట్లోనే అందరూ ఉంటే అంతకన్నా కావలసిందేమిటి? ఇల్లే స్వర్గం... ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి.. ఇవన్నీ భావావేశాలు, అందమైన కవితలు. అర్థాంగి, సుమంగళి, సతీఅనసూ య వంటి పాతకాలం సినీ పైత్య ప్రకోపాలు. ప్రవచనానంద స్వాముల పవిత్ర నినాదాలు. మానవత్వం పరిమళించే కొన్ని సంస్కారవంతమైన కుటుంబాలకు మాత్రమే పరిమితమైన వాస్తవాలు. మనదేశంలో లాక్డౌన్ మొదలయిన తరువాత నెలరోజుల్లో 500 గృహహింస కేసులు వచ్చాయట. ప్రపంచమంతటా 20 శాతం పెరిగాయని ఐక్యరాజ్యసమితి లెక్క. జాతీయ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేసి వివాహితల్లో ప్రతి మూడో మహిళ గృహహింసకు గురవుతున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భర్తల వల్ల 31 శాతం మహిళలు శారీరక, లైంగిక, మానసిక హింసలకు గురవుతున్నారు. 27శాతం భర్తలు భార్యలను కొడుతున్నారు. 13 శాతం మానసికంగా చిత్రవధ చేస్తున్నారని సర్వే తెలిపింది. ఆర్థిక హింస గురించి వీరు పట్టించుకోలేదు. వండి పెడుతుంటే బుద్ధిగా ఉండలేక ఇంతులను హింసించడం పతనమవుతున్న కుటుంబ సంబంధాల ప్రతీక. కోడల్ని వేధించడం, భార్యను సాధించడం. భర్తలను కూడా సాధిస్తున్నారని ఎవరైనా అనొచ్చు. కాని అటువంటి ఫిర్యాదులున్నట్టు దాఖలా లేదు. ఇటీవల రాచకొండ పోలీసులు ఒక గృహిణిని గృహహింస నుంచి కాపాడారు. 498ఎ ఐపిసి దుర్వినియోగం అవుతున్నదని భార్యా బాధితుల సంఘాలు తీవ్రంగా ప్రచారం చేసినా ఈ దేశపు ఆడపడుచులకు ఆ సెక్షన్ అవసరం ఇంకా తీరలేదనే రుజువులు రోజూ కనిపిస్తాయి. కోవిడ్ కాలంలో, కోవిడ్ తరువాత అనే తేడాలు పెద్దగా లేవు. కోవిడ్ కాలంలో అందరూ ఇంట్లోనే ఉంటారు కనుక వేధించడానికి అనేక సదుపాయాలున్నాయి. ఇంటి హింస ఎదురైతే తమకు ఫోన్ చేయాలని పోలీసు అధికారులు ప్రకటించారు. పోలీసులు టెలికౌన్సెలింగ్ ద్వారా సలహాలు ఇస్తున్నారు. కరోనా మనుషులను ఒంటరి చేస్తున్నది. జీవిత భాగస్వాములే కాదు, కన్నకొడుకులు కూతుళ్లు.. తల్లిదండ్రులకు కూడా కరోనా ఉందన్న అనుమానంతో దూరంగా ఉండమంటున్నారు. దాన్ని సామాజిక దూరం అని పిలుస్తున్నారు. కుటుంబాల మధ్య దూరం పెంచి, వృద్ధులైన కన్న తల్లిదండ్రులు దగ్గినా సరే భయపడే పుత్రరత్నాల ధైర్యసాహసాలు బయపడుతున్నాయి. హాస్పిటల్ వారు ఆదరిస్తే అదృష్టం. లేకపోతే దిక్కులేదు. కరోనా అంటురోగంతోపాటు ప్రబలుతున్న ఇంటి రోగం ఈ గృహహింస. శారీరకంగా, మానసికంగా, ఆడవారిని హింసించే సంఘటనలు పెరిగాయని జాతీయ మహిళా కమిష న్ కూడా హెచ్చరించింది. ఆర్థికహింస కూడా ఉంటుంది కాని బయటపడదు. కనిపించదు. బెదిరింపులు, దాడులు, అవమానించడం, తిట్టడం, కొట్టడం, నీ సంగతి చూస్తా అనడం, తిండి పెట్టకపోవడం, మంచి నీళ్లకు కూడా బాధించడం, అక్రమ సంబంధాలు, రోగాలు అంటగట్టడం ఇవన్నీ హింసకిందికే వస్తాయి. పట్టించుకోకుండా వదిలేస్తే, ఒత్తిడి వల్ల మానసిక శారీరక రుగ్మతలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. పిల్లలుంటే వారు మరింత ఒత్తిడికి గురవుతారు. కనుక ఈ దుర్మార్గుల నుంచి మహిళలు ఆత్మరక్షణ చేసుకోవలసిందే. కొడుకుల తిట్లకు అవమానాలకు తల్లులు గురికావడం కూడా కోవిడ్ రోజుల్లో మామూలై పోయింది. ఇటువంటి ఫిర్యాదులు కూడా చేసి తల్లులు, వయోధిక వృద్ధుల సంక్షేమ చట్టం సాయంతో, కొడుకులను కూడా సరిచేసుకునే అవకాశం ఉపయోగించుకోవాలి. కోవిడ్ కదా ఎవ్వరికి చెప్పుకున్నా ఏం లాభం అని అనుకోకుండా వెంటనే మిత్రుడికో ఆప్తుడైన బంధువుకో, ఇరుగుపొరుగువారికో చెప్పుకోవడం వల్ల ఒంటరిగా మారి దెబ్బతినే అవకాశాలు తగ్గే వీలుంది. జాతీయ మహిళా కమిషన్ వాట్సప్ ద్వారా కూడా అలర్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. 07217735372కు బాధితులు అలర్ట్ సందేశాలు పంపవచ్చని జాతీయ మహిళా కమిషన్ ఒక నోటీసు జారీ చేసింది. SఏఉఖౖఉSS అనే ఎన్జీవో కూడా అందుబాటులో ఉంటానని ప్రకటించింది. నారీడాట్కామ్ వారు హెల్ప్లైన్ సౌకర్యం కల్పించారు. నందితాదాస్ అనే నటి, దర్శకురాలు ‘లిజెన్ టు హర్’ అని ఈ వేధింపులపైన ఒక చిన్న సినిమా కూడా తీశారు. మహిళలు తమను కాపాడుకోవడానికి ట్విట్టర్ వేదికను కూడా వాడుకోవచ్చు. హైదరాబాద్లో షీటీంలతో పోలీసులు రక్షణ కార్య క్రమాన్ని చేపట్టారు. పోలీసు అదనపు కమిషనర్ క్రైమ్స్ అండ్ ఎస్ఐటీ ఆధ్వర్యంలో 100 షీటీంలు పనిచేస్తున్నాయి. ఎక్కడ మహిళలను వేధించే అవకాశాలున్నాయో ముందే గుర్తించి అక్కడ నిఘా ఎక్కువ చేసామని చెబుతున్నారు. నేరాల తీవ్రత తక్కువైతే కౌన్సిలింగ్ చేస్తారు, దారుణ నేరాలు చేస్తే నిర్భయ చట్టం కింద కేసులు పెడతారు. 100 నెంబర్కు వచ్చే ఫిర్యాదులను షీ విభాగం తీసుకుంటుంది. దౌర్జన్యం చేసే వారితోనే బాధితులు కూడా ఒకే కప్పుకింద నివసించవలసి రావడం చాలా ప్రమాదకరమైన దురదృష్టం. భయపడితే నిర్భయ చట్టం కూడా ఉపయోగపడదు. కుటుంబమైనా రాష్ట్రమైనా, దేశమైనా నిలదీయకపోతే నిలబడడం సాధ్యంకాదు. ప్రశ్నిస్తేనే పౌరసత్వమైనా, మానవత్వమైనా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
కొడుకును కనలేదని వేధింపులు
డోన్ టౌన్: కుమారుడిని కనలేదని భర్త, అత్త వేధింపులకు గురిచేస్తున్నారని ఓ వివాహిత శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. రూరల్ ఎస్ఐ మధుసూదన్రావు తెలిపిన వివరాలు.. బేతంచెర్ల మండలం రహిమాన్పురం గ్రామానికి చెందిన సుభద్రకు ఏడేళ్ల క్రితం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన రామాంజనేయులతో పెళ్లి అయింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే కుమారుడిని కనలేదని భర్త, అత్త వేధిస్తున్నారని బాధితురాలు సుభద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అందంగా ఉండొద్దు, గుండు చేయించుకో
సాక్షి, బెంగళూరు : కరోనా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన అనంతరం కర్ణాటకలో మహిళలపై దౌర్జన్యం కేసులు హెచ్చుమీరుతున్నాయి. భర్త, కుటుంబ సభ్యులు దాడులకు వెనుకాడడం లేదు. అలాంటిదే ఈ ఉదంతం. సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఒక హైకోర్టు లాయర్ సైకోగా మారాడు. తన భార్య అందంగా కనిపించకూడదని, ఆమె జుట్టు కత్తిరించి చిత్రహింసలకు పాల్పడ్డాడు. అయితే ఇందుకు అంగీకరించని కట్టుకున్న భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. బాధితురాలు వనితా సహాయవాణిని ఆశ్రయించడంతో పైశాచిక భర్త బాగోతం బయటపడింది. వీరికి 8 ఏళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రారంభంలో ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. తరువాత అనుమానం పెంచుకుని భార్యను పీడించసాగాడు. ఆర్థికంగా వెనుకబడిన బాధితురాలి తల్లిదండ్రులు భర్తతో సర్దుకుపోవాలని కుమార్తెకు బుద్ధిమాటలు చెప్పారు. భార్య అందంగా ఉండరాదని ఆమెకు బలవంతంగా జుట్టు కత్తిరించాడు ఆ లాయరు భర్త. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడు నిన్ను ఎవరూ చూడకూడదు. నేను చెప్పినట్లు వినకపోతే సహించేది లేదంటూ రోజూ కొట్టేవాడు. బాధితురాలు పోలీస్స్టేషన్ను ఆశ్రయించగా, భర్తను పిలిచి రాజీ కుదిర్చి పంపారు. జనవరిలో మళ్లీ ఆమె జుట్టును కత్తిరించడానికి భర్త యత్నించాడు. అయితే పిల్లల కోసం హింసను భరించింది. గుండు చేయించుకోవాలని హింస చివరకు గుండు గీయించుకోవాలని ఆమెను బెదిరించాడు. ససేమిరా అనడంతో కొట్టి ఇంట్లోనుంచి బయటికి గెంటివేశాడు. ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ఆమె పరిచయస్తుల సలహా మేరకు మహిళా సహాయవాణిని సందర్శించి తన గోడు వెళ్లబోసుకుంది. అక్కడి నుంచి సహాయవాణి సిబ్బంది ఆమెను విద్యారణ్యపుర స్వధార్ గృహానికి తరలించారు. విచారణకు హాజరు కావాలని భర్తకు నోటీసులు పంపారు. ఆ లాయర్ తన తండ్రిని విచారణకు పంపించి తప్పించుకోవడానికి యత్నించాడు. తన పలుకుబడితో నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో భార్య పైనే ఫిర్యాదు చేశాడు. పెరుగుతున్న ఫోన్కాల్స్ రాష్ట్రంలో 193 సాంత్వన కేంద్రాలు రోజుకు 24 గంటలూ పనిచేస్తున్నాయి. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో బాధితులకు ఫోన్ ద్వారా సాంత్వన పలుకుతున్నారు. రెండునెలల్లో హెల్ప్లైన్ కు 1,294 కు పైగా ఫోన్ కాల్స్ రాగా అందులో 200కు పైగా ఫోన్కాల్స్ భర్త, కుటుంబ సభ్యుల దౌర్జన్యాలకు సంబంధించినవి. బాధిత బాలికలు, మహిళలకు సిబ్బంది ఏం చేయాలో చెప్పి ప్రమాదం రాకుండా చూస్తున్నారు. తాత్కాలికంగా స్వధార్ గృహాల్లో బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. -
ఓ రైటర్ కథ
లాక్ డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉపయోగించుకుంటున్నారు. వంటకాలతో ప్రయోగాలు, కొత్త భాషపై పట్టు సాధించడం వంటివి చేస్తున్నారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. ‘ఎ రైటర్’ టైటిల్ తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ ను 24 గంటల్లో చిత్రీకరించారట. గృహ హింస కాన్సెప్ట్తో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. ఇందులో రచయిత పాత్ర చేశారు పాయల్. ‘‘లాక్ డౌన్ వల్ల కెమెరా ముందుకి వెళ్లడం కుదరడం లేదు. ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం ఆ బాధను కొంత తగ్గించింది. నా అభిమానులందరికీ ఈ షార్ట్ ఫిల్మ్ అంకితం చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు పాయల్. ఈ షార్ట్ ఫిల్మ్ కి పాయల్ మిత్రుడు సురభ్ దిగ్ర దర్శకత్వం వహించారు. 16 నిమిషాలున్న ఈ ఫిల్మ్ ను యు ట్యూబ్ లో చూడొచ్చు. -
ఆర్జీవీ ట్వీట్.. మండిపడ్డ సింగర్!
మద్యం కొనుగోలు చేసే మహిళలు గృహ హింసపై ఫిర్యాదు చేయడానికి అనర్హులంటూ వివాదస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ సోమవారం ట్వీట్ చేశాడు. లాక్డౌన్ దేశంలో పేరుగుతున్న గృహ హింస కేసుల నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి మద్యం దుకాణాల ప్రారంభానికి అనుమతించడంతో పలువురు సినీ ప్రముఖులు ఆసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే మహిళలపై గృహ హింస కేసులు పెరిగిన క్రమంలో ప్రభుత్వం మద్యం దుకాణాల తెరిస్తే ఈ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని, అంతేగాక దీని ప్రభావం కుటుంబ సభ్యులపై, పిల్లలపై తీవ్రంగా చూపుతుందని వారు ధ్వజమెత్తారు. అయితే దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. వైన్ షాపుల ఎదుట మహిళలు వరుసలో నిలబడి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ‘‘చూడండి మద్యం షాపుల వద్ద ఎవరు క్యూలో ఉన్నారో. అవును పాపం తాగే పురుషుల నుంచి మహిళలను రక్షించడం చాలా ముఖ్యం’’ అంటూ తనదైన శైలిలో ఆర్జీవీ ట్వీట్ చేశాడు. (రంగోలికి సోనా మద్దతు.. సెలబ్రిటీల ఫైర్!) Dear Mr RGV,time for u to get into the line of people who desperately need a real education.1 that lets u understand why this tweet of yours reeks of sexism & misplaced morality.Women have a right to buy & consume alcohol just like men. No one has a right to be drunk & violent. https://t.co/5AUcTrAJrZ — ShutUpSona (@sonamohapatra) May 4, 2020 ఇక ఆర్జీవీ ట్వీట్కు బాలీవుడ్ సింగర్ సోనా మోహపత్రా స్పందిస్తూ.. ‘‘డియర్ మిస్టర్ ఆర్జీవీ. అసలైన విద్యావంతులు ఎలా ఉండాలని నేర్పించే వ్యక్తుల వరుసలో మిమ్మల్ని ఈ ట్వీట్ చేరుస్తుంది. మీ ట్వీట్ ఎందుకు సెక్సిజం, నైతికత రీక్స్ అర్థానికి వీలుగా ఉంది. మహిళలకు, పురుషుల మాదిరిగా మద్యం కొనుగోలు, మద్యం సేవించే హక్కు ఉంది. అయితే మద్యం సేవించాక హింసాత్మకంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు’’ అంటూ ఆర్జీవీపై ఆమె మండిపడ్డారు. కాగా మే 4 నుంచి లాక్డౌన్ మరోసారి పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా లాక్డౌన్ మూడవ దశలో కొన్ని రంగాలకు సడలింపులు ఇస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. ఇందులో మద్యం, పాన్, పొగాకు అమ్మకాలకు కూడా అనుమతించింది. అయితే మద్యం షాపులు తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్, నటి మలైకా అరోరా, రవీణా టాండన్లు వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. (వైన్ షాపుల మూతపై వర్మ ట్వీట్) -
మహిళలకు మళ్లీ నాటి పరిస్థితి?
సాక్షి, హైదరాబాద్: సమాజంలో అసమానతలు, లింగ వివక్షకు కరోనా వైరస్ పరోక్షంగా కారణమవుతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అభిప్రాయపడ్డారు. తొలి దశలో ప్రపంచవ్యాప్తంగా పురుషుల ఆరోగ్య స్థితిని కరోనా దెబ్బ తీస్తుందని, ముఖ్యంగా వృద్ధులను బలి తీసుకుంటుందని భావించామని, క్రమంగా రూటు మార్చుకున్న కరోనా మహిళల భద్రతకే సవాలుగా మారిందని ఆయన తెలిపారు. కరోనా పరిణామ క్రమంపై గుటెర్రస్ అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించి రాసిన ఓ వ్యాసాన్ని ఐరాస తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. ఈ వ్యాసంలో ఆయన కరోనా కారణంగా మహిళా శక్తి అర్ధ శతాబ్దం వెనక్కు వెళ్ళినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. (ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు) గుటెర్రస్ వ్యాసంలోని ముఖ్యాంశాలు: ‘ఇప్పటికే లాక్ డౌన్, క్వారంటైన్ వల్ల మహిళలపై ప్రపంచవ్యాప్తంగా గృహ హింస పెరిగింది. అయితే మహిళలపై హింస పెరగకుండా ఇప్పటికే ప్రపంచంలోని 143 దేశాలు రక్షణ చర్యలు మొదలుపెట్టాయి. కానీ, కరోనా కారణంగా తలెత్తనున్న ఆర్థిక సంక్షోభం ప్రపంచ మహిళల ముఖ చిత్రం మార్చబోతోంది. ఇటీవలి సంక్షోభ కాలంలో మహిళలపై భౌతిక అరాచకం పెరిగిపోతోంది. వారి హక్కులు, స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. నేను 1960ల్లో విద్యార్థిగా ఉన్నప్పుడు మహిళల శ్రమ చూశాను. మోయలేని బరువులు నెత్తిన పెట్టుకుని కూలీ పనికి వెళ్లడం గమనించాను. నేను రాజకీయాల్లోకి రావడానికి అది కూడా కారణం అయింది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని, మహిళలకు సమాన ఉపాధి, వేతనం లభించాలని కోరుకున్నా. తరువాత కాలంలో నేను ఆశించినది జరిగింది. (కరోనా విపత్తు: భారీ ఉపశమనం) కానీ, కరోనా వైరస్ మళ్లీ పాత పరిస్థితుల్లోకి వారిని నెడుతోందని అనిపిస్తోంది. పనిమనిషిగా, దినసరి కూలీగా, తోపుడు బండి వ్యాపారిగా, చిన్న తరహా ఉద్యోగినిగా మహిళ పురుషుడికన్నా ఎక్కువ శ్రమ చేస్తుంది. ఐఎల్ఓ అంచనా ప్రకారం రానున్న మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల ఉద్యోగాలు పోతాయని అంటున్నారు. మొదట ప్రభావం చూపేది మహిళల మీదనే అని నా అభిప్రాయం. మరో విషయం ఏమిటంటే కరోనా బాలికా విద్యను కూడా ప్రభావితం చేయనుంది. ఎబోలా వైరస్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా (వైరస్ ప్రభావం ఉన్న దేశాల్లో) బాలికా విద్య 50 నుంచి 34 శాతానికి తగ్గిపోయిన విషయం విస్మరించలేనిది. ఈ అంశాలన్నింటిపై రాజకీయ నాయకత్వం దృష్టి పెట్టాలి. బాలికా విద్యతో పాటు, మహిళలకు సామాజిక భద్రత, హెల్త్ ఇన్సూరెన్స్, సిక్, చైల్డ్ కేర్ సెలవులు, నిరుద్యోగ భృతి కల్పనలాంటి విషయాలపై పని చేయాలి. కరోనా దృష్టాంతం తర్వాత ప్రపంచం ఆ దిశలో ముందుకెళ్లినప్పుడే మహిళా హక్కులు పరిరక్షింపబడతాయి.’ (వైరల్ వీడియా షేర్ చేసిన ప్రధాని మోదీ) -
గృహ హింసా.. ఫోన్ చేస్తే రక్షణ
సాక్షి, అమరావతి: దీర్ఘకాల లాక్డౌన్ నేపథ్యంలో గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలు ఒక్క ఫోన్ చేస్తే పూర్తి రక్షణ చర్యలు తీసుకుంటామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ఉచిత మహిళా సహాయతా నెంబరు 181 కు బాధితులు ఫోన్ చేసి సహాయం పొందవచ్చునని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. గృహహింస బాధితుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు. ► ఇప్పటికే పని చేస్తున్న దిశ వన్స్టాఫ్ కేంద్రాల్లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. బాధిత మహిళలకు ఈ కేంద్రాల్లో ఆరోగ్య, వైద్య, మానసిక, న్యాయ సహాయాలను నిపుణుల ద్వారా అందిస్తాం. ఈ కేంద్రాల్లో అందించే సేవలన్నీ ఉచితమే. ► అవసరమైన వారికి అత్యవసర వసతిని ఒకే చోట కల్పిస్తాం. అలాగే రాష్ట్రంలోని 23 స్వధార్ గృహాల్లో సైతం వసతి, రక్షణ కల్పిస్తాం. ► బాధితులకు సహాయం అందించేందుకు జిల్లాల వారీగా అధికారులను నియమించాం. వారి నెంబర్లకు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందవచ్చు. -
అక్కడ భార్యలను వేధిస్తే క్వారంటైన్కు..
ముంబై : భర్తల చేతిలో వేధింపులకు గురయ్యే భార్యలకు ఊరట కల్పించేలా మహారాష్ట్రలో పుణే అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్తో గృహ హింస పెరగిందనే వార్తలతో పుణేలో గ్రామీణాభివృద్ధి యంత్రాంగం వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చింది. ఇళ్లలో భార్యలు, మహిళలను వేధించే పురుషులను క్వారంటైన్కు తరలించాలని నిర్ణయించింది. లాక్డౌన్తో ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ భర్తల చేతిలో గృహహింసకు గురవుతున్నారనే వార్తలతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పుణే జిల్లాపరిషత్ సీఈఓ ఆయుష్ ప్రసాద్ వెల్లడించారు. మద్యం షాపుల మూసివేతతో దిక్కుతోచని స్ధితిలో పురుషులు ఈ ఉన్మాదానికి తెగబడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దేశవ్యాప్త లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో మహిళలపై గృహ హింస కేసులు పెరిగాయని జాతీయ మహిళా కమిషన్ గణాంకాలు వెల్లడించిన నేపథ్యంలో పుణే జిల్లా పరిషత్ ఈ ప్రకటన చేసింది. మహిళలు లాక్డౌన్తో ఇళ్లలోనే ఉన్నందున వారిని భర్తలు ఎవరైనా వేధిస్తే నిందితులను క్వారంటైన్కు పంపుతామని ప్రసాద్ హెచ్చరించారు. తొలుత కౌన్సెలర్లు, పోలీసుల సాయంతో నచ్చచెపుతామని, అయినా భర్తల ప్రవర్తనలో మార్పు రాకుంటే క్వారంటైన్కు తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం తాము పంచాయితీ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి ఇంటింటికీ వెళ్లి వాకబు చేయిస్తామని చెప్పారు. వేధింపుల వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు లాక్డౌన్ సమయంలో బయటకు రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు వారి ఇంటివద్దే శానిటరీ నాప్కిన్స్, మందులు సరఫరా చేస్తామని తెలిపారు. చదవండి : ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? -
బోరబండలో రోడ్డుపైనే మహిళపై దాడి!
సాక్షి, హైదరాబాద్ : రోడ్డుపైనే ఓ మహిళను ఇష్టానుసారంగా కొట్టాడు ఓ వ్యక్తి. దీనికి సంబంధించి వీడియోను కార్తీక్ రేవూరి అనే ఓ నెటిజన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేయడంతో వెలుగు చూసింది. భారత దేశంలో ఇంకా ఇలాంటి బాధకరమైన సంఘటనలు పునరావృతమవున్నాయంటూ వీడియోను కార్తీక్ పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు ఓ వ్యక్తి ఉన్నారు. వీరిలో యువకుడు ఓ మహిళతో గొడవపడుతూ బండిపైనుంచి దిగి దాడికి పాల్పడ్డాడు. ట్విటర్ పోస్ట్కు స్పందించి పోలీసులు పూర్తి వివరాలు తెలపాలని కార్తీక్ను కోరగా, బోరబండలో ఈ సంఘటన జరిగినట్టు బదులిచ్చాడు. అయితే లాక్డౌన్ కారణంగా గృహహింస ఎక్కువవుతోందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా, రోడ్డుపైనే దాడి చేసినా అక్కడున్న వారెందుకు స్పందించలేదని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
గృహ హింసకు ఎర్ర చుక్క పరిష్కారం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణ కోసం తీసుకొచ్చిన లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉంటున్న ఆడవారిపైగృహ హింసకు పాల్పడుతున్న పురుషులను పట్టుకునేందుకు ఎర్ర చుక్క ఉపయోగపడుతోంది. అర చేతిలో రెడ్ డాట్ (ఎర్ర చుక్క)ను చూపిస్తూ మెయిల్ చేస్తే, బాధితురాలు ఉన్న ప్రాంతానికి పోలీసులు చేరుకునేలా వెఫ్ట్ అనే ఫౌండేషన్ ఈ పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఎర్ర చుక్కను సోషల్ మీడియా ద్వారా గానీ, ఈ మెయిల్ ద్వారా గానీ చూపించడం లేదా 181 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయడం ద్వారా గానీ గృహ హింస జరుగుతోందని అధికారులకు తెలియజేయవచ్చని వెఫ్ట్ ఫౌండేషన్ ను ప్రారంభించిన రావత్ తెలిపారు. లాక్ డౌన్ సమయంలో కొందరు మహిళలకు బయటి కంటే ఇంట్లోనే ఎక్కువ ప్రమాదం దాగి ఉందని అభిప్రాయపడ్డారు. ఎర్ర చుక్క గుర్తును ప్రపంచ వ్యాప్తం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయ మహిళా కమిషన్, ఐరాస మహిళా విభాగంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. (లాక్డౌన్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు!) -
అరచేతిలో 'షీ సేఫ్'!
సాక్షి, సిటీబ్యూరో: ‘మీరు గృహ హింసకు గురవుతున్నారా.. ఆన్లైన్ వేదికగా ఆకతాయిలు వేధిస్తున్నారా.. సైబర్ నేరాల బారిన పడ్డారా.. జీవితంపై విరక్తి చెంది తీవ్ర ఒత్తిడిలో ఉన్నారా..’కారణాలేమైతేనేం మీ మొబైల్లో ‘షీ సేఫ్’యాప్ నిక్షిప్తం చేసుకుంటే చాలు. నేరాలు, ఒత్తిడి తదితరాల బారి నుంచి ఎలా బయటపడాలో మార్గదర్శక్లు దగ్గరుండి మరీ మీకు మార్గదర్శనం చేసి అవసరమైన సహాయాన్ని అందిస్తారు. అది పోలీసుపరంగా, న్యాయపరంగా, షీ టీమ్ల పరంగా.. ఇలా ఎవరి వల్ల ఆ సమస్య పరిష్కారమవుతుందో అటువైపుగా మార్గదర్శనం చేసి ఆ బాధల నుంచి విముక్తి కల్పిస్తారు. ఇలా మహిళల భద్రతకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సరికొత్తగా రూపొందించిన ‘షీ సేఫ్’యాప్ అతివలకు ఎంతో ఉపయుక్తకరం కానుంది. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్న ఈ యాప్ను వచ్చే మహిళా దినోత్సవం పురస్కరించుకొని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అధికారికంగా అందుబాటులోకి తెచ్చేలా చూస్తున్నారు. ఆ తర్వాత రాచకొండ, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంత ముఖ్య వివరాలను జోడించి ఈ యాప్ను సరికొత్తగా అతివల భద్రత కోసం తీసుకొచ్చే అవకాశాలున్నాయి. మార్గదర్శనం చేస్తారు ఈ యాప్ను నిక్షిప్తం చేసుకున్న మహిళలు ఎవరైనా గృహహింస, ఆన్లైన్ వేధింపులు, సైబర్ నేరాల విషయాల్లో మార్గదర్శక్ల సహాయం కోరవచ్చు. మీరు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ఈ యాప్లోని ఎస్వోఎస్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మార్గదర్శక్లు, షీ బృందాలు, మహిళా పోలీసు స్టేషన్లు, భరోసా కేంద్రాలు, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుతుంది. హాక్ ఐను కూడా దీంతో అనుసంధానం చేశారు. అలాగే మహిళల భద్రత గురించి ఎస్సీఎస్సీ నిర్వహించే భద్రత కార్యక్రమాలు, అవగాహన సదస్సు వివరాలను తెలుసుకోవచ్చు. ‘సేఫ్ స్టే’చేయవచ్చు.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ముఖ్యంగా ఐటీ కారిడార్లో 2 లక్షల మందికి పైగా సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏ హాస్టల్స్ ఉండేందుకు సురక్షితమనే వివరాలను కూడా ‘ప్రాజెక్టు సేఫ్ స్టే’ఫీచర్లో పొందుపరిచారు. ఇప్పటికే ఏఏ హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలున్నాయి, భద్రత ఎలా ఉంది, సందర్శకుల రిజిస్టర్ నమోదు చేస్తున్నారా తదితర అంశాలపై అధ్యయనం చేసిన ఎస్సీఎస్సీ, సైబరాబాద్ పోలీసులు వందకుపైగా హాస్టళ్ల పేర్లను చేర్చారు. ఇలా ఐటీ కారిడార్లో ఏఏ హాస్టళ్లలో ఉండటం మంచిదనే విషయాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు. ఫొటో తీసి అప్లోడ్ చేయండి.. మీరు సంచరించే ప్రాంతాల్లో ఎక్కడైనా వీధి దీపాలు వెలగకుండా చీకటిగా ఉంటే ఆ దృశ్యాన్ని సెల్ఫోన్ ద్వారా చిత్రీకరించి ఈ యాప్లో అప్లోడ్ చేసే ఫీచర్ను అందుబాటులో ఉంచారు. ఇలా మీరు ఆ చిత్రాన్ని, ప్రాంతాన్ని నమోదు చేస్తే ఎస్సీఎస్సీ సభ్యులు సంబంధిత విభాగాల ద్వారా ఆయా ప్రాంతాల్లో లైట్లు వెలిగేలా చూస్తారు. అలాగే ప్రయాణం చేస్తున్న సమయంలోనే ఈ–లెర్నింగ్స్, భద్రత అవగాహన మాడ్యూల్స్ను యాక్సెస్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. అలాగే ఐటీ కారిడార్లో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగుల కోసం నడుపుతున్న షీ షటిల్ బస్సుల ప్రయాణ వివరాలు అందుబాటులో ఉంచారు. అలాగే హాక్ ఐ యాప్ కూడా ఈ అప్లికేషన్ ద్వారా యాక్సెస్ చేసుకునేలా రూపకల్పన చేశారు. సైబరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్కి కూడా యాక్సెస్ చేశారు. హాక్ ఐ అత్యవసర పరిస్థితుల్లో.. హాక్ ఐ అనేది అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించడానికి మరియు ఏదైనా సంఘటనలను నివేదించడానికి సంబంధించిన యాప్. అయితే షీ సేఫ్ యాప్ ముఖ్యంగా మహిళలు బాధలో ఉన్నప్పుడు మార్గదర్శక్లను సంప్రదించవచ్చు. తద్వారా సాయం పొందొచ్చు. మహిళలను అప్రమత్తంగా ఉంచటానికి ఇందులో రోజువారీ నోటిఫికేషన్లు వస్తుంటాయి. నిరంతరం మహిళల భద్రత గురించి వివరాలుంటాయి. ఈ యాప్ మహిళల భద్రతకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది. డౌన్లోడ్ చేసుకోండిలా... గూగుల్ ప్లే స్టోర్కు వెళ్లి ‘షీ సేఫ్’అని టైప్ చేయగానే యాప్ వస్తుంది. దీన్ని స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ స్టోర్ ద్వారా కూడా నిక్షిప్తం చేసుకునేలా ఫీచర్లు రూపొందించారు. -
కారులో గర్ల్ఫ్రెండ్పై దాడి చేశాడని చితకబాదారు
కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాలో గత శుక్రవారం ఒక కన్వెన్సన్ హాల్లో ఫ్యూరీ కాంపిటీషన్ కార్యక్రమం నిర్వహించారు. ఫర్రీస్ అంటే వివిధ రకాల జంతువులను పోలిన వేషదారణతో కల్పిత పాత్రలను ధరించి కథలు, నాటకాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ఫర్రీస్ వేషం ధరించిన ఇద్దరు వ్యక్తులు సిగరేట్ తాగేందుకని బయటకు వచ్చారు. అప్పుడే వారి ముందు ఒక నీలం రంగు కారు వెళ్లి కొంచెం దూరంలో ఆగింది. ఆ తరువాత కారులోంచి ఎవరో అరుస్తున్నట్లు శబ్దాలు వినిపించడంతో దగ్గరికి వెళ్లి చూశారు. కారులో ఒక యువకుడు తనతో పాటు ఉన్న యువతిని ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో కారు డోరును తెరిచే ప్రయత్నం చేయగా అది రాకపోవడంతో లోపల ఉన్న యువతి అతన్ని నెట్టివేసి డోర్ అన్లాక్ చేసింది. దీంతో లోపల ఉన్న వ్యక్తిని ఇద్దరు కలిసి బయటికి లాగారు. ఆమెను ఎందుకలా కొడుతున్నావని ప్రశ్నింస్తుండగానే వారిపై దాడికి దిగాడు. దీంతో ఫర్రీస్ అతని ఈడ్చి కిందపడేసి పిడిగుద్దుల వర్షం కురింపించారు. విషయం తెలుసుకున్న మరో ఇద్దరు కూడా వీరిద్దరికి తోడయ్యి అతనిపై దాడి చేశారు. కాగా సమాచారం అందుకున్న శాన్జోస్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వారందరిని విడిపించి అతన్ని అరెస్టు చేశారు. అరెస్టైన వ్యక్తి పేరు డెమిట్రీ హార్డ్నెట్ అని, అతనికి 22 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. తన గర్ల్ప్రెండ్ను కారులో ఇష్టమొచ్చిన రీతిలో కొట్టడంతో ఫ్యూరిస్ వేషదారులు ఎందుకలా కొడుతున్నావు అని ప్రశ్నింనందుకు వారిపై దాడి చేశాడని, అందుకే తిరిగి ప్రతిదాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. కాగా డెమిట్రీ హార్డ్నెట్పై గృహహింస కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఫర్రీస్ చేసిన పనిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. pic.twitter.com/7QVA01UYO1 — ROBBIE! 🏝️ (@robbiesets) January 18, 2020 -
కదిలించే కథలు
వంద పదాల సారాన్ని ఒక్క దృశ్యం చూపిస్తుంది. జీవితకాలపు సందేశాన్ని పదిసెకండ్ల ఫిల్మ్ ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు సెల్యులాయిడ్ తరం కాదు.. సెల్యులర్ టైమ్! ఏదైనా అరచేతి ఫోన్లో ప్రత్యక్షం కావాలి. సెకన్లలో తెలిసిపోవాలి. ఇవ్వాళ్టి మార్కెట్ స్ట్రాటజీ కూడా బ్రివిటీనే. ఈ జనరేషన్ కోరుకుంటున్న ఆ డిమాండ్ను అనుసరించే ఫేస్బుక్ ఓ కొత్త ప్రయత్నాన్ని పోస్ట్ చేసింది. దాని పేరే థంబ్స్టాపర్స్. పదిసెకన్లలో కమర్షియల్ యాడ్స్ను ప్రమోట్ చేసే సిస్టమ్. ‘‘షార్ట్స్టోరీస్ మూవ్ హార్ట్స్’’ పేరుతో వాటిని ప్రదర్శించడం మొదలు పెట్టేసింది కూడా. ప్రముఖ దర్శకురాలు కిరణ్రావు తీసిన రెండు షార్ట్ఫిల్మ్స్తో. ధైర్యం చేయడానికి క్షణం చాలు.. గృహహింసకు వ్యతిరేకంగా కిరణ్రావు తీసిన షార్ట్ఫిల్మ్కి క్యాప్షన్ అది. భర్త చేతిలో శారీరక హింసకు గురైన ఓ గృహిణికి ఒక యువతి ఫోన్ ఇస్తుంది .. 100 నంబర్ డయల్ చేసి. ఒక లిప్తపాటు తాత్సారం చేసి ప్రెస్ బటన్ నొక్కుతుంది ఆ గృహిణి. అప్పుడు వస్తుందీ కాప్షన్.. ధైర్యం చేయడానికి క్షణం చాలు అని. ఇంటి నుంచే మొదలవ్వాలి.. ఇది ఆమె తీసిన ఇంకో షార్ట్ఫిల్మ్... జెండర్ డిస్క్రిమినేషన్ మీద. ఒక అమ్మ తన కొడుకు, కూతురికి రెండుగ్లాసుల్లో పాలు పోసి ఇస్తుంది. కూతురి గ్లాస్లో కన్నా కొడుకు గ్లాస్లో పాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని గమనించిన ఆ అబ్బాయి తన గ్లాస్లోంచి చెల్లి గ్లాస్లోకి పాలు వంపి.. రెండు గ్లాసుల్లో పాలను సమం చేస్తాడు. మార్పు మొదలవడానికి రెండు క్షణాలు చాలు అనే వ్యాఖ్యతో ఈ షార్ట్ఫిల్మ్ ముగుస్తుంది. గొంతుచించుకోకుండా నిరసన తెలపొచ్చు.. సిటీబస్లో.. నిలబడ్డ ఒక అబ్బాయి తన ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి ఛాతీ వంక అదేపనిగా చూస్తూంటాడు. ఆ అమ్మాయి పక్కనే కూర్చున్న ఇంకో అబ్బాయి అది గమనించి తన షర్ట్ కాలర్ను ఛాతి కిందకు జారుస్తూ ‘‘ఇప్పుడు చూడు’’అన్నట్టుగా సైగ చేస్తాడు నిలబడ్డ అబ్బాయితో. అంతే అతను గతుక్కుమని చూపు తిప్పుకుంటాడు. ‘‘నాట్ ఆల్ ప్రొటెస్ట్స్ ఆర్ లౌడ్’’ అనే కాప్షన్ వస్తుంది. మాతృత్వానికి జెండర్ లేదు.. రుతుక్రమం గురించి నెట్లో సెర్చ్ చేసి కూతురికి వివరిస్తూంటాడు తండ్రి. ‘‘మదర్హుడ్ హాజ్ నో జెండర్’’ అనే మెస్సేజ్తో ముగుస్తుంది ఈ షార్ట్ఫిల్మ్. సామర్థ్యమే ముఖ్యం జిమ్లో.. ఒక స్థూలకాయురాలు.. అలవోకగా శీర్షాసనం వేస్తుంది అందరూ ఆశ్చర్యపోయేలా. అప్పుడు వస్తుంది కాప్షన్ ఎబిలిటీ మ్యాటర్స్ అని. అందమైన లోకం ఒక ట్రాన్స్ ఉమన్ పెట్టుకున్న చెవి జుంకాలు చూసి ‘‘ఎక్కడ కొన్నావ్.. చాలా బావున్నాయ్.. నీ అందాన్ని పెంచేలా’’ అంటూ కితాబిస్తుంది ఓ యువతి. ఆనందంగా ‘థాంక్స్’ చెప్తుంది ఆ ట్రాన్స్ ఉమన్. ‘‘యాన్ ఈక్వల్ వరల్డ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్’’ అనే వ్యాఖ్యతో ఎండ్ అవుతుంది ఆ షార్ట్స్టోరీ. -
ఐశ్వర్యను ఇంట్లోకి అనుమతించారు
పట్నా: నాటకీయ పరిణామాల మధ్య బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్ను ఇంటిలోనికి అనుమతించారు. కోడలి నిరసనతో రబ్రీ దేవి దిగివచ్చారు. వివాహమైన కొద్ది నెలలకే తేజ్ ప్రతాప్ విడాకులు కోరుతూ.. కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాక భార్యతో విడాకులు ఇప్పిస్తేనే ఇంటికి వస్తానంటూ.. వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తన భర్త డ్రగ్స్కు బానిసయ్యాడని ఆరోపించిన ఐశ్యర్య మొదటి సారి అత్తింటివారు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. అత్త రబ్రీ దేవి, ఆడపడుచు మీసా భారతి తనకు ఆహారం కూడా పెట్టకుండా వేధించడమే కాక ఇంట్లో నుంచి గెంటేశారని తెలిపారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాల్సిందిగా అత్తింటి బయట కూర్చుని నిరసన తెలిపారు ఐశ్వర్య. ఆమె తండ్రి చంద్రికా రాయ్ కూడా ఐశ్వర్యతో పాటు కూర్చుని.. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా మరికొందరు కలిసి రబ్రీ దేవి ఇంటి ముందు ధర్నాకు దిగారు. లాలూ, రబ్రీ దేవిలకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. దాంతో రంగంలోకి దిగిన డీజీపీ గుప్తేశ్వర్ పాండే వివాదాన్ని పరిష్కరించడంతో సోమవారం మధ్యాహ్నం ఐశ్వర్యను ఇంట్లోకి అనుమతించారు. రబ్రీ దేవి, మీసా భారతి తనను వేధిస్తున్నారని.. తిండి కూడా పెట్టడం లేదని ఐశ్వర్య ఆరోపించిన సంగతి తెలిసిందే. మీసా భారతి మూలంగానే తనకు, తన భర్తకు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని ఐశ్వర్య ఆరోపించారు. రబ్రీదేవి సమక్షంలోనే మీసా భారతి తనను ఇంటి నుంచి గెంటేశారని వాపోయిన సంగతి తెలిసిందే. -
తిండి కూడా పెట్టకుండా వేధించారు
సాక్షి, పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్ అత్తింటి వారిపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, తన అత్త రబ్రీదేవి తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆడపడుచు మిసా భారతి తీవ్రంగా గృహహింసకు పాల్పడ్డారని, తనకు తిండికూడా పెట్టకుండా వేధించడంతోపాటు చివరకు తన సంసార జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన భర్త తేజ్ ప్రతాప్, మరిది తేజస్వి ప్రతాప్ యాదవ్ మధ్య విబేధాలు సృష్టించడానికి భారతి ప్రయత్నిస్తున్నారని ఐశ్వర్య పేర్కొన్నారు. రబ్రీ దేవి తన కుమార్తె పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఐశ్వర్య తండ్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రిక రాయ్ ఆరోపించారు. దీనపై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించిన ఆయన తన కుమార్తెకు అత్తగారి ఇంట్లో అన్ని హక్కులు పొందాలని కోరుకుంటున్నామన్నారు. (ఆదివారం సాయంత్రం వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు) మరోవైపు రాజ్యసభ సభ్యురాలు మిసా భారతి ఐశ్వర్యా రాయ్ ఆరోపణలను ఖండించారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉంటున్న తాను ఆమెను ఎలా వేధించగలను అని ప్రశ్నించారు. తానెపుడు ఆమెను సోదరిలా భావించానంటూ ఐశ్యర్య ఆరోపణలు నిరాధారమైనవనీ కొట్టిపారేశారు. తల్లిదండ్రుల ఆదేశాల మేరకే ఇదంతా చేస్తోందనీ, తద్వారా తన ఆరోపణలకు మరింత బలం చేకూరాలని భావిస్తోందన్నారు. కాగా 2018, మే నెలలో అంగరంగ వైభవంగా ఐశ్వర్య, తేజ్ ప్రతాప్ వివాహం జరిగింది. అయితే, కొద్ది నెలలకే వీరిద్దరి మధ్య కలతలు మొదలయ్యాయి. తన భర్త తేజ్ ప్రతాప్ డ్రగ్స్కు బానిసయ్యాడని ఆరోపించిన ఐశ్వర్య గృహ హింస నుంచి తనను కాపాడాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అలాగే గత ఏడాది నవంబర్లో తేజ్ ప్రతాప్ విడాకుల కోసం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య, ఆమె తండ్రి చదవండి : కన్నీటితో మెట్టినింటిని వీడిన ఐశ్వర్య.. -
టక్కున చేరుకొని.. అక్కున చేర్చుకొని..
అది ఫిలింనగర్ బస్టాప్. ఓ మహిళను ఆమె భర్త కర్రతో విచక్షణారహితంగా కొడుతున్నాడు. ఆమె రోదిస్తూ కాళ్లావేళ్లాపడుతున్నా కనికరించడంలేదు. చుట్టుపక్కల వారంతా చోద్యం చేస్తున్నారే, కానీ ఏ ఒక్కరూ ఆపేందుకు ప్రయతి్నంచడంలేదు. హైదరాబాద్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సతీమణి వ్యాన్ ఫ్లెమింగ్ అదే సమయంలో ఫిలింనగర్ మీదుగా జూబ్లీహిల్స్కు కారులో వెళుతున్నారు. వెంటనే కారు దిగి వెళ్లి దాడిని వారించారు. అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. బాధితురాలిని ఫ్లెమింగ్ అక్కున చేర్చుకొని ఓదార్చారు. ఏం జరిగిందని ఆరా తీశారు. తన భర్త రోజూ కొడుతున్నాడని, గదిలో బంధిస్తున్నాడని చెబుతూ బాధితురాలు కన్నీరుమున్నీరైంది. స్నేహితులకు సమాచారం ఇచ్చి ఎవరికి ఫిర్యాదు చేయాలంటూ ఫ్లెమింగ్ అడిగారు. దీనిపై ఆండ్రూ ఫ్లెమింగ్ కూడా స్పందించారు. గురువారం జరిగిన ఈ ఘటనపై ఉమెన్ సేఫ్టీ ఐజీకి సమాచారం అందించారు. – బంజారాహిల్స్ -
‘ఎన్ని గాయాలైనా నవ్వుతూనే ఉంటా’
ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడే తల్లిదండ్రులు..పెళ్లీడు రాగానే అప్పు చేసైనా సరే ఆమెను అత్తవారింటికి పంపేందుకు ఉబలాటపడుతుంటారు. కూతురు ఉద్యోగం చేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడుతున్నప్పటికీ పెళ్లి చేసి ఓ ‘అయ్య’ చేతిలో పెట్టినపుడే హాయిగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోగలుగుతారు. అంతటితో తమ బాధ్యత తీరిపోయింది అనుకోకుండా ఎల్లప్పుడూ ఆమె క్షేమసమాచారాలు తెలుసుకుంటూ పుట్టినిల్లు తనకు అండగా ఉంటుందనే భరోసాను ఇస్తారు. ఇంతటి ప్రేమానురాగాలు కురిపిస్తున్న తల్లిదండ్రులకు.. అత్లింట్లో తాను ఆరళ్లు ఎదుర్కొంటున్నాననే విషయాన్ని చెప్పడానికి ఏ కూతురికైనా మనసెలా ఒప్పుతుంది. చెబితే బెంగతో వాళ్లు ఏమైపోతారోననే బాధ ఓవైపు.. వేధింపులు తాళలేక పుట్టింటికి చేరితే సమాజం నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలు కుంగదీస్తాయనే భయం మరోవైపు ఆమెను మిన్నకుండిపోయేలా చేస్తాయి. అందుకే శారీరకంగా, మానసికంగా భర్త ఎంతగా వేధించినా ఎంతో మంది ఆడవాళ్లు ఆ విషయం గురించి బయటపెట్టరు. నవ్వుతూనే చేదు అనుభవాల తాలూకు గాయాలను గుండెల్లో దాచుకుంటూ కాలం వెళ్లదీస్తారు. ఈ విషయాలన్నింటినీ గురించి వివరిస్తూ జెనన్ మౌసా అనే జర్నలిస్టు షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. వీడియోలో భాగంగా ఓ అమ్మాయికి పెళ్లైన కొత్తలో పూలతో స్వాగతం పలికిన భర్త.. ఈ తర్వాత తనను గాయపరిచే తీరు...ఆ క్రమంలో ముఖం మీద పడిన గాయాల తాలూకు మచ్చలను దాచేందుకు.. ఆమె మేకప్ వేసుకుంటూ నవ్వుతూ ఉండటం.. చిట్టచివరికి బాధ తాళలేక గట్టిగా ఏడ్వడం కనిపిస్తుంది. గృహహింస గురించి అవగాహన కల్పించే శక్తివంతమైన క్లిప్ ఇది అంటూ జెనన్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం పలువురిని ఆలోచింపజేస్తోంది. ‘హింసకు గురయ్యే మహిళ బహుళ రూపాలు. మనం చూసేదంతా నిజం కాకపోవచ్చు. మేకప్తో కప్పబడిన ఆమె ముఖం లోపలి పొరలు ఎంతగా కమిలిపోయాయో ఎవరికి తెలుసు. గృహహింస అనే రాక్షస క్రీడకు బలవుతూ వాటిని పంటిబిగువున దిగమింగుతున్న ఆడవాళ్లు ఎందరో. నిజానికి మీరలా ఉండటం సరైంది కాదు. గొంతు విప్పాలి. పెళ్లి పిల్లలతో పాటుగా ఆర్థిక స్వాత్రంత్యం కూడా మహిళలకు ముఖ్యం’ అనే విషయాన్ని గమనించాలి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇందులో అత్యధిక మంది పురుష నెటిజన్లు ఉండటం హర్షించదగ్గ విషయం. What a powerful clip to raise awareness about domestic abuse. 💔pic.twitter.com/O3gECLqMwn — Jenan Moussa (@jenanmoussa) August 24, 2019 -
అయ్యయ్యో.. ఎంత కష్టం!
ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ పశ్చిమ)/పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): ఆరు నెలల గర్భిణి.. కష్టం తెలియకుండా చేదోడు వాదోడుగా ఉంటూ పండంటి బిడ్డ కోసం ఎదురు చూడాల్సిన భర్త, అత్తే ఆమె పాలిట శాపంగా మారారు.. కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి డబ్బు.. డబ్బు.. అంటూ కట్న పిశాచులై పీడించుకు తిన్నారు.. రెండేళ్లలో మూడు అబార్షన్లు.. మళ్లీ ఇప్పుడు గర్భం.. ఆరో నెల.. వారి బాధలు భరించలేక దూరంగా ఉంటున్నా కూడా వదల్లేదు.. వైద్యం చేయిస్తామంటూ కారులో ఎక్కించుకుని వెళ్లి పైశాచికంగా దాడి చేశారు. కడుపులో తమ వారసత్వాన్ని మోస్తోందన్న స్పృహ లేకుండా ఒంటిపై వాతలు తేలేలా కొట్టారు.. వారి బారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించి తన కష్టాలు ఏకరువు పెట్టిన ఓ అభాగ్యురాలి దీన గాధ ఇది.. ఆదర్శ వివాహం అంటూ వచ్చారు.. ఆమె పేరు రాజేశ్వరి. ఈమెకు ఓ అన్న. అతని పేరు చంద్రశేఖర్. వీరికి తల్లిదండ్రులెవరో తెలియదు. వీరికి మూడు, ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు పోలీసులు డాబా గార్డెన్స్ ప్రేమ సమాజం (అనాథ శరణాలయం)లో చేర్పించారు. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం వరకు రాజేశ్వరి వారి సహాయంతోనే చదువుకుంది. యుక్త వయసు వచ్చాక ప్రేమ సమాజంలో ఉండటానికి నిబంధనలు ఒప్పుకోకపోవడంతో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని విశాఖలోని ఎన్ఏడీ కొత్తరోడ్డులో సొంతంగా బ్యూటీపార్లర్ పెట్టుకుంది. రాజేశ్వరి ప్రేమ సమాజంలో ఉన్నప్పుడు.. అక్కడే ఉన్న వృద్ధాశ్రమంలో ఉంటున్న తన అమ్మమ్మను చూసేందుకు పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన దామోదర్, అతడి తల్లి లలిత తరచూ వచ్చి వెళుతుండేవారు. ఆ క్రమంలో వారు రాజేశ్వరితో పరిచయం పెంచుకున్నారు. రాజేశ్వరిని తన కుమారుడు దామోదర్ పెళ్లి చేసుకుంటాడని లలిత.. రాజేశ్వరి అన్న చంద్రశేఖర్తో చెప్పింది. కట్నకానుకలు ఇచ్చుకోలేమని చెప్పిన చంద్రశేఖర్తో అటువంటివేం అక్కర్లేదని, ఆదర్శ వివాహం చేసుకుంటామని.. అన్నీ తామే చూసుకుంటామని చెప్పి వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి వారం రోజులు ఉందనగా.. తమకు డబ్బు సర్దుబాటు కాలేదని, ఎలాగైనా సర్దుబాటు చేయాలని దామోదర్ తల్లి లలిత కోరడంతో రాజేశ్వరి, చంద్రశేఖర్లు రూ.1.20 లక్షలు ఇచ్చారు. దామోదర్కు అంతకు ముందే పెళ్లి.. వివాహం జరిగాక కొంతకాలం పాటు రాజేశ్వరిని బాగా చూసుకున్నారు. ఆ తర్వాత అత్త, భర్త అదనపు కట్నం కోసం నరకం చూపడం మొదలెట్టారు. ఇదే క్రమంలో ఆమె నడుపుతున్న బ్యూటీ పార్లర్, ఐదు తులాల బంగారం గొలుసును అమ్మించి దామోదర్ కారు కొనుక్కున్నాడు. దామోదర్కు స్వాతి అనే యువతితో ఇదివరకే వివాహం జరిగినట్లు తెలుసుకున్న రాజేశ్వరి.. భర్తను నిలదీసింది. దీంతో వారు మరింతగా హింసించడం మొదలెట్టారు. వివాహమైన రెండేళ్లలో మూడు సార్లు అబార్షన్ చేయించారు. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి అయిన రాజేశ్వరి.. అత్త, భర్త పెడుతున్న హింసలకు తట్టుకోలేక అత్తవారిల్లు వదిలి ఎన్ఏడీ కూడలిలో ఒంటిరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఆస్పత్రికి తీసుకెళ్తానంటూ మంగళవారం భర్త ఆమె వద్దకు వచ్చి కారులో ఎక్కించాడు. అప్పటికే కారులో ఉన్న తల్లి లలితతో కలిసి విపరీతంగా కొట్టుకుంటూ పురుషోత్తపురం వరకూ తీసుకెళ్లారు. అక్కడ కారు నుంచి తప్పించుకున్న రాజేశ్వరి.. పెందుర్తి పోలీస్స్టేషన్కు చేరుకుని భర్త, అత్తలపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్వరి పరిస్థితిని గమనించి కేజీహెచ్కు వెళ్లాలని సూచించడంతో ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో చేరి చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎయిర్ పోర్టు జోన్ సీఐ జె.శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. -
ఇంట్లో శత్రువులు!
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ యుగంలో సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్న మహిళామణులకూ గృహహింస తప్పడంలేదు. ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన భాగ్యనగరంలో ఏటా సుమారు వెయ్యి మంది మహిళలు ఈ తరహా హింస బారిన పడుతున్నట్లు సొసైటీ ఆఫ్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో ప్రధానంగా భర్త, అత్త, మామలు, ఆడపడుచులు ఐటీ, బీపీఓ రంగాల్లో పనిచేస్తున్న మహిళల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటూ వారిని మానసికంగా హింసిస్తున్నారని తేలింది. ఆర్థిక, సామాజిక అంశాల్లో మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కల్పించడం, వారి స్వేచ్ఛను కట్టడి చేయడం.. చివరకు సోషల్ మీడియా వినియోగం విషయంలోనూ వారి పట్ల వివక్ష చూపడం, తరచూ వారి ఫోన్లు, స్నేహితులు, బంధువులతో జరిపే ఫోన్ చాటింగ్ను వారికి తెలియకుండా పరిశీలించడం, సామాజిక సంబంధాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం, సూటిపోటి మాటలు, వ్యక్తిగత జీవితంపై అనుమానంతో తరచూ వేధింపులకు గురిచేయడం.. కొన్నిసార్లు వారిపై హింసకు పాల్పడడం వంటివి చోటుచేసుకుంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఇలాంటి వారికి భరోసా కల్పించేందుకు సుమారు 220 మంది మార్గదర్శకులను రంగంలోకి దించినట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. కౌన్సెలింగ్తో నష్టనివారణ చర్యలు.. గృహహింసపై తమకు అందిన ఫిర్యాదులపై కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు తెలిపారు. తొలుత కౌన్సెలింగ్తో సరిపెడుతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రాని పక్షంలో వారికి పోలీసుశాఖ నిర్వహిస్తున్న భరోసా కేంద్రాలకు ఇలాంటి కేసులను బదిలీ చేస్తున్నామన్నారు. మహానగరం పరిధిలో సుమారు వెయ్యి వరకు ఐటీ, బీపీఓ సంస్థలున్నాయి. వీటిలో పనిచేసేవారిలో సుమారు మూడు లక్షలమంది వరకు మహిళలున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. గతేడాది సుమారు వెయ్యి మంది ఇలాంటి గృహహింసను తాళలేక తమను సంప్రదించినట్లు తెలిపారు. వారి వ్యక్తి గత జీవితానికి ఇబ్బంది కలగని రీతిలో తమను సంప్రదించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నామన్నారు. తమ కౌన్సెలింగ్తో సుమారు 30 శాతం మందిలో మార్పు కనిపించిందని తెలిపారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన షీ టీమ్స్, భరోసా కేంద్రాలు సమర్థంగా పనిచేస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల సహకారమే కీలకం.. ఐటీ, బీపీఓ తదితర రంగాల్లో పనిచేస్తున్న మహిళలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. మరోవైపు గడువులోగా ప్రాజెక్టులను పూర్తిచేయాలన్న ఒత్తిడితో పనిచేస్తుంటారు. వీరి పనివేళల్లోనూ అనూహ్య మార్పులుంటాయి. ఒకవైపు ఇంటి పని.. మరోవైపు ఆఫీస్ ఒత్తిడితో చిత్తవుతున్న మహిళలకు కుటుంబ సభ్యుల సహకారమే కీలకమని సైకాలజిస్టులు స్పష్టంచేస్తున్నారు. వారికి మానసిక సాంత్వన కల్పించడం, వారి రోజువారీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను అధిగమించేందుకు వారికి భరోసా, నైతిక మద్దతునిచ్చేందుకు ఇతోధికంగా సహకరించాలని సూచిస్తున్నారు. -
నరకం నుంచి బయటికి
పెళ్లయిన ప్రతి ముగ్గురిలో ఒక స్త్రీ.. గృహహింసకు గురవుతున్న దేశం మనది! చట్టాలు, కోర్టులు, పోలీసు వ్యవస్థ.. ఎన్ని ఉన్నా, ఇంటి నాలుగు గోడల మధ్య భర్త, ఇతర కుటుంబ సభ్యులు పెట్టే నరకయాతనను అడ్డుకోలేకపోతున్నాయి. ఒకవేళ ఏ బాధితురాలైనా తనను తాను కాపాడుకోడానికి, తన పిల్లల్ని తీసుకుని బయటి ప్రపంచంలోకి పారిపోయి వచ్చినా.. తల్లీపిల్లలకు రక్షణ ఎవరిస్తారు? చేయడానికి ఆమెకు పని ఎవరు చూపిస్తారు? మళ్లీ అక్కడ కూడా ఇంటిలాంటి సమాజమే వారిని వెంటపడి వేధిస్తే? ఇంట్లో ఉండడమే నయమనిపిస్తే?! ‘‘లేదు, లేదు.. నయం అనిపించదు. నరకంలోకి వెళ్లినా ఇల్లు నయం అనిపించదు’’ అని జులేఖా, షైమీన్, రాణి, మమత, జ్యోతి, సునీత, ప్రీతి అంటున్నారు. వీళ్లందరిదీ ఒకటే కథ.. గృహహింస. వీళ్లందరినీ చేరదీసింది ఒకే సంస్థ.. ‘గౌరవి’. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 2014లో ప్రారంభమైన ‘గౌరవి’ గత నాలుగేళ్లుగా.. ఇంటి హింసను తట్టుకోలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన బాలికలకు, గృహిణులకు ఆశ్రయం ఇస్తోంది. ‘హోమ్ షుడెన్ట్ హర్ట్’ (ఇల్లు బాధించకూడదు) అనే క్యాంపెయిన్తో ఏ ఆసరాలేని ఆడపడుచులను ఆదుకుంటోంది. ‘గౌరవి’ చేయూతతో బోరుబావుల్లోంచి ప్రాణాలతో బయటికి వచ్చినట్లుగా కొత్త జీవితాన్ని ఆరంభించి, ఆదర్శంగా నిలుస్తున్న కొంతమంది మహిళల సంక్షిప్త వ్యథనాలివి. ‘తోడుగా నేను లేనా’ అన్నాడు! జులేఖాకు 19 ఏళ్లకే పెళ్లైంది. ఆ వెంటనే భర్త ఆమెను భౌతికంగా హింసించడం మొదలైంది. భార్యను కొట్టడం కూడా దాంపత్య జీవితంలో ఒక భాగమే అనుకున్నట్లు, అదొక దైనందిన వైవాహిక ధర్మంగా ఆమెను కొట్టేవాడు! గదిలోకి తోసి, తలుపులు వేసి నరకం చూపించేవాడు. ఆమె ఓర్చుకున్నా ఆమె దేహం ఎన్నాళ్లని తట్టుకుంటుంది. ఓ రోజు భర్త దెబ్బలకు నిలువునా కూలిపోయింది. అమ్మానాన్న వచ్చి వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె కోలుకుని ఇంటికి రాకముందే ఆమె భర్త రెండోపెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. అత్తింట్లో ఒంటరిగా ఉండిపోయింది. ‘తోడుగా నేను లేనా’ అని ఓ రాత్రి ఆమె మామ (భర్త తండ్రి) ఆమె పడుకుని ఉన్న గదిలోకి వచ్చాడు. అప్పట్నుంచి కొత్త నరకం మొదలైంది. ఇల్లొదిలి పారిపోయింది. తనకుంటూ చిన్న ఉపాధిని ఏర్పరచుకుంది. మహిళలెవరైనా తనకు తారసపడితే వారిని చేరదీసి ఒక దారి చూపిస్తోంది. నా కూతుర్ని నాలా కానివ్వను షైమీ పై నిత్యం ఆమె భర్త చెయ్యి చేసుకునేవాడు. అవసరం లేకున్నా అలవాటుగా ఆ పని చేసేవాడు. ఉదయాన్నే లేవలేకపోయినందుకు, ఒంట్లో బాగోలేదు అన్నందుకు, ఫోన్లో పుట్టింటి వాళ్లతో మాట్లాడినందుకు భర్త ఆగ్రహించేవాడు. కర్రనో, కుర్చీనో.. చేతికి అందిన దాన్ని తీసుకుని ఆమెపై విసిరేవాడు. షైమీన్ గర్భిణిగా ఉండగా ఓ రోజు బలంగా కడుపులో కొట్టడంతో గర్భస్రావం జరిగి, ఆమె ప్రాణం పోయినంత పని జరిగింది. మళ్లీ గర్భం దాల్చినప్పుడు ఆడబిడ్డను కన్నందుకు ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. షైమీన్ కోర్టుకు వెళ్లింది. కోర్టు అతడి నుంచి ఆమెకు 4,500 రూపాయల పరిహారం ఇప్పించింది. షైమీన్ ఇప్పుడు స్వయం ఉపాధితో తనను, తన కూతుర్ని పోషించుకుంటోంది. ‘‘నా కూతుర్ని నాలా కానివ్వను. ఆమెకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని, చక్కటి చదువును అందిస్తాను’’ అంటోంది. సంపాదిస్తేనే భార్యకైనా గౌరవం రాణి రెండో బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు ఆమె భర్త ఆమెను చావబాదాడు! ‘మళ్లీ కనుక కూతుర్నే కన్నావంటే, ముగ్గుర్నీ కలిపి పాతేస్తాను’ అని హెచ్చరించాడు. రాణి భయపడిపోయింది. అప్పటికే ఆమెకు ఒక కూతురు. ఆమెకు అర్థమైంది. అతడు అన్నంత పనీ చేస్తాడని. ఆరేళ్ల వైవాహిక బంధాన్ని తెంపేసుకుని, ఇంట్లోంచి వెళ్లిపోయింది. కోర్టులో విడాకుల కేసు ఇంకా నడుస్తూనే ఉంది. కేసుతో సంబంధం లేకుండా, భర్త విదిలించే డబ్బుల కోసం చూడకుండా కష్టం చేసుకుంటూ తన కాళ్ల మీద తను నిలబడింది. ఇద్దరు ఆడపిల్లల్ని ఎలాంటి భయాలు లేకుండా మురిపెంగా పెంచుకుంటోంది. ‘‘డబ్బు సంపాదిస్తున్న భార్యను మాత్రమే మగవాళ్లు గౌరవంగా చూస్తారు. లేకుంటే.. చులకన చేస్తారు’’ అని రాణి అంటోంది, భర్త తనను ఎంత హీనంగా చూసిందీ గుర్తు చేసుకుంటూ. ఇప్పుడెవరికీ భయపడే పని లేదు మమత మరొక బాధితురాలు. ఆమెనే కాదు, పిల్లల్ని కూడా కొట్టేవాడు ఆమె భర్త. ‘ఇలాంటి భర్త వద్దు’ అనుకుని బయటికి వచ్చేసింది. పిల్లల్ని హాస్టల్లో చేర్చింది. నాలుగు రాళ్లు సంపాదిస్తోంది. ‘‘ఇప్పుడు నేనెవరికీ భయపడే పని లేదు. నా బతుకు నేను బతుకుతున్నాను. నా పిల్లలకు మంచి జీవితాన్ని ఇస్తాను’’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. ఫ్రెండ్స్ ముందు కొట్టేవాడు జ్యోతి చైల్డ్ కౌన్సిలర్గా చేస్తోంది. పన్నెండేళ్ల వైవాహిక జీవితంలోని దుర్భరమైన హింస నుంచి విముక్తి కోసం ఆమె గడప బయటికి అడుగుపెట్టింది. భర్త ప్రతి విషయంలోనూ ఆమెను నియంత్రించేవాడు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి.. ఏం తినాలి? ఎప్పుడు నిద్రపోవాలి.. అన్నీ అతడి ఆదేశానుసారం జరగాల్సిందే! చివరికి అతడి ఫ్రెండ్స్ ముందుకు కూడా ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. అతడికి విడాకులిచ్చేశాక జ్యోతి చైల్డ్ సైకాలజీ చదువుకుంది. చదువుకు తగ్గ జాబ్ వెతుక్కుంది. కొడుకును తన దగ్గరే ఉంచుకున్నాడు భర్త. ఇప్పుడా కొడుకు కోసం న్యాయ పోరాటం చేస్తోంది. ‘‘నా భర్త నుంచి విడిపోగానే నాకు రెక్కలు వచ్చినట్లుగా అయింది. చాలా ఆనందంగా అనిపించింది. ‘ఇకనుంచీ నా ఇష్టం వచ్చినట్లు నేను ఉండొచ్చు కదా’ అన్న ఆలోచన నాలో జీవితేచ్ఛను కలిగించింది. నా జీవితానికి ఒక అర్థం కనిపిస్తోంది’’ అని జ్యోతి సంతోషంగా చెబుతోంది. నా ఫొటో వేసి రాయండి సునీత భర్త ప్రతిరోజూ తాగి వచ్చి, సునీతతో అయినదానికీ, కానిదానికీ గొడవపడేవాడు. ఇక అతడితో కలిసి ఉండలేని పరిస్థితికి వచ్చేసింది సునీత. ఆ సమయంలో బంధువులు చొరవచూపి, భార్యాభర్తల్ని మ్యారేజ్ కౌన్సెలింగ్కి తీసుకెళ్లారు. ‘సరే, నేనిక తాగను. గొడవ పడను’ అని కౌన్సెలింగ్ ఇచ్చినవారి ముందు అంగీకరించి, ఇంటికొచ్చాక మళ్లీ మామూలుగానే తాగడం, సునీతను కొట్టడం మొదలుపెట్టాడు! సునీతకు విడాకులు తప్ప వేరే మార్గం కనిపించలేదు. కోర్టులో కేసు వేసింది. భర్త నుంచి ఇప్పుడు ఆమెకు భరణం కూడా అందుతోంది. ‘ది టెలిగ్రాఫ్’ పత్రిక ప్రతినిధులతో కూడా ఆమె ధైర్యంగానే చెప్పింది.. ‘‘నా ఫొటో వెయ్యండి, నా గురించి రాయండి. నాలాంటి మహిళలు కొందరికైనా నేనొక ప్రేరణ అయి, వారి జీవితాలు మెరుగయితే అంతకుమించిన సంతృప్తి నాకు ఏముంటుంది?’’ అంది సునీత. ఇరవై ఏళ్లకే ఇద్దరు పిల్లలు ప్రీతి భోపాల్లో ఒక ఫుడ్ కియోస్క్ నడుపుతోంది. రెండు పెళ్లిళ్లు విఫలమై, దారుణమైన జీవితాన్ని అనుభవించి ఇప్పుడు తన బతుకు తను బతుకుతోంది. పదేళ్ల వయసులో ప్రీతికి మొదటి పెళ్లి జరిగింది. వరుడు ఆమెకన్నా చాలా పెద్దవాడు. ఇరవైఏళ్ల వయసు వచ్చేనాటికి ప్రీతికి ఇద్దరు పిల్లలు. భర్త ఆనారోగ్యంతో చనిపోయాక, రెండో పెళ్లి చేసుకుంది. ఒక మగబిడ్డను కంది. అయితే రెండో పెళ్లి కూడా ఆమెకు నరకమే చూపించింది. భర్త ఎప్పుడూ తిట్టేవాడు, కొట్టేవాడు. అనుమానించేవాడు. ఒకరోజు ముగ్గురు పిల్లల్నీ తీసుకుని ఆ గృహనరకం నుంచి బయటపడింది ప్రీతి. ఇప్పుడు తినుబండారాల బండిని నడిపిన విధంగానే తన జీవితాన్నీ సాఫీగా నడుపుకుంటోంది. పిల్లల్ని చక్కగా చదివించుకుంటోంది. (సౌజన్యం: ది టెలిగ్రాఫ్) -
రుచించని పేరు
మంచి ఉద్దేశంతోనే ఆమె తన హోటల్కి ఆ పేరు పెట్టుకున్నారు. అయితే హోటల్లోని పదార్థాలను ఇష్టపడినంతగా ఆ హోటల్ పేరును స్థానికులు ఆస్వాదించలేకపోయారు. కరెలీన్ కెర్కు కష్టకాలం మొదలైంది! పాపం ఆవిడ, చక్కగా నడుస్తున్న తన రెస్టారెంట్ను విధిలేని పరిస్థితుల్లో వచ్చేవారం మూసి వేయవలసి వస్తోంది. గత రెండేళ్లుగా ఆమె తన రెస్టారెంట్లో చక్కగా వేయించిన రుచికరమైన చేపముక్కల్ని, కరకరలాడే బంగాళా దుంపల చిప్స్ని కస్టమర్స్కి సర్వ్ చేస్తూ, పేరుతోపాటు డబ్బునూ గడించారు. ఇప్పుడిక బోర్డు తిప్పేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. మహిళా హక్కుల సంఘాలవారు కరెలీన్ ఆ రెస్టారెంట్ను పెట్టినప్పటి నుంచి, మరీ ముఖ్యంగా గత మూడు నెలల నుంచి ఆ రెస్టారెంట్ పేరుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. చివరికి వారి పోరాటం ఫలించి, వెంటనే బోర్డును తొలగించి, వేరే పేరు పెట్టుకోవాలని కోర్టు ఆమెను ఆదేశించింది. దాంతో ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో ఉన్న ఆ రెస్టారెంట్ ప్రపంచవ్యాప్తం విశేషం అయింది. కరెలీన్ రెస్టారెంట్ పేరు ‘బ్యాటర్డ్ వైఫ్’. ‘తన్నులు తింటుండే భార్య’ అని ఈ మాటకు అర్థం. రోజూ ఇంట్లో చావుదెబ్బలు తినే ఆడవాళ్లను ఈ బోర్డు పరిహసించేలా ఉందని హక్కుల సంఘాల వాదన. అయితే, ‘‘భర్తల్లో ఆలోచన రేకెత్తించి, వారిలో పరివర్తన తెచ్చేందుకే ఈ పేరు పెట్టాను తప్ప వేరే ఉద్దేశం లేదని’’ కరెలీన్ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గృహ హింసపై మూడు నెలల క్రితం విడుదలైన ఒక నివేదిక మహిళా కార్యకర్తల వాదనకు బలం చేకూర్చింది. ఆస్ట్రేలియాలోని ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు గృహ హింసకు గురవుతున్నారని నివేదిక సారాంశం. ఇంత జరుగుతుంటే ఒక హోటల్కు ఇలాంటి పేరేమిటని మహిళా హక్కుల ఉద్యమకారులతో పాటు, వారి వల్ల ప్రభావితం అయిన నాయకులూ కరెలీన్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. చివరికి అనుకున్నది సాధించారు. వారం లోపు రెస్టారెంట్ పేరు మార్చాలని స్థానిక కోర్టు ఒకటి జారీ చేసిన ఉత్తర్వులు కరెలీన్కు గత మంగళవారం అందాయి. ‘‘నేనెంత దుఃఖంలో ఉన్నానో చెప్పలేను. నా రెస్టారెంట్ పేరును వెంటనే మార్చడం కుదరదు కనుక రెస్టారెంట్నే మూసి వేస్తున్నాను. ఇందుకు నన్ను నా కస్టమర్లు క్షమించాలి’’ అని కరెలీన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. మన ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు. ఆ ఉద్దేశానికి విరుద్ధమైన అర్థం వస్తుంటే కనుక తప్పు మనదే అవుతుంది. -
స్త్రీలోక సంచారం
గృహహింసను తట్టుకోలేక కువైట్లోని తన ఇంటి నుంచి పారిపోయి శనివారం నాడు థాయ్లాండ్కు శరణార్థిగా వచ్చిన 18 ఏళ్ల యువతి రహఫ్ ముహమ్మద్ అల్ఖునన్ పాస్పోర్ట్ను థాయ్ రాజధాని బ్యాంకాక్లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఇప్పుడా యువతి.. కువైట్–సౌదీ అరేబియా–థాయ్.. ఈ మూడు దేశాలతో పాటు, ఐక్యరాజ్యసమితి తక్షణం పరిష్కరించవలసిన ఒక సమస్యగా పరిణమించారు! రిటన్ టికెట్ లేకపోవడం వల్ల ఆమెను అనుమానించవలసి వచ్చిందని థాయ్ అధికారులు, ఆమె భద్రతను పర్యవేక్షించడానికి తప్ప ఆమె పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకునే ఉద్దేశం తమకు లేదని సౌదీ రాయబార అధికారులు, ఇప్పటికిప్పుడే ఆ యువతి మాటల్ని విశ్వసించి ఏ నిర్ణయమూ తీసుకోలేమని ఐరాస అధికారులు విడివిడి ప్రకటనలు విడుదల చేయగా, కువైట్లోని ఆమె కుటుంబం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాచారమూ లేదు. పద్దెనిమిదేళ్ల ఆ యువతి ప్రస్తుతం టూరిస్టుగా బ్యాంకాక్లోని ఒక హోటల్ గదిలో ఉన్నారు. సౌదీ అధికారులు తనను థాయ్లాండ్లో నిర్బంధించారని శనివారం రాత్రి ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికన్ మహిళల ఓటు హక్కు సాధన ఉద్యమ చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజు ఇది. మహిళలకు ఓటు హక్కును కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘సైలెంట్ సెంటినల్స్’ (నిశ్శబ్ద సైనికులు) అనే పేరుతో కొంతమంది మహిళలు 1917 జనవరి 10న వైట్ హౌస్ ఎదుట ప్రదర్శన జరిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఉడ్రోవిల్సన్ పాలన మొదలైన రోజును వారు తమ ప్రదర్శనకు ఎంపిక చేసుకోవడం విశేషం అయింది. ఆ క్రితం రోజే సైలెంట్ సెంటిన ల్స్ ఉడ్రోవిల్సన్ను ఆయన కార్యాలయంలో కలిసి ఓటు హక్కు కల్పించాలని కోరినప్పుడు.. ‘ప్రజామోదం పొందాక తప్పనిసరిగా కల్పించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చేవరకు తమ ఉద్యమం ఆగదని వారు ఆయనకు స్పష్టం చేసిన అనంతరం రెండో రోజు నుంచే వారానికి ఆరు రోజులు చొప్పున 1919 జూన్ 4 వరకు దేశమంతటా ప్రదర్శనలు జరిపారు. ఈ రెండున్నరేళ్ల ప్రదర్శనల కాలంలో అమెరికన్ ప్రభుత్వం సైలెంట్ సెంటినల్స్ పట్ల సున్నితంగా వ్యవహరించింది. ట్రాఫిక్కు తీవ్రమైన అంతరాయం కలిగించిన కొన్ని సందర్భాలతో మాత్రం అరెస్టులు చేసినప్పటికీ వెంటనే విడుదల చేసింది. చివరికి 19వ రాజ్యాంగ సవరణతో (1920 ఆగస్టు 18) మహిళలకు ఓటు హక్కు కల్పించింది. ‘సైలెంట్ సెంటినల్స్’ ను నడిపించిన మహిళ ఆలిస్ పాల్. ఆమె మహిళా హక్కుల కార్యకర్త. అమెరికన్ మహిళల ఓటు హక్కు సాధనలో ఆలిస్ పాల్ స్థానం, ప్రస్థానం చరిత్రాత్మకమైనవి. -
ఇల్లు చాలా డేంజర్
పనిచేసే చోట జరుగుతున్న వేధింపులపై స్త్రీలు ‘మీటూ’ అంటూ బయటికి వస్తున్నారు. ‘మా ఇంట్లో కూడా’ అని బాధిత మహిళలు బయటికి వచ్చే పరిస్థితి వస్తే కనుక అది కూడా చేజేతులా పురుషులు తెచ్చుకున్నదే అవుతుంది. మహిళలు ధరించే ఆభరణాల బరువును తులాల లెక్కన తూచగలం కానీ, మహిళలు భరించే గృహహింసల్ని ఏ తూనికలు, కొలతలతో తేల్చగలం? అయినప్పటికీ పాపం.. న్యూయార్క్లో ఉన్న ఐక్యరాజ్యసమితి, మనదేశంలోని ‘నేషనల్ క్రైమ్ బ్యూరో’ ఏడాదికిన్ని గృహహింసల మరణాలనీ, రోజుకింతమంది మహిళల ప్రాణాలు గాల్లో కలిసి పుట్టింటికి చేరుతున్నాయని చెప్పే ప్రయత్నమైతే చేస్తున్నాయి. ఎందుకీ ప్రయత్నం? దేశాల కోసం. మరింత మెరుగైన నివారణ చర్యలు చేపడతాయేమోనని. ఎందుకీ ప్రయాస? మగాళ్ల కోసం. తప్పు తెలుసుకుని కాస్తయినా మారతారేమోనని! అయినా ఈ గృహహింసల్ని, గృహహింస మరణాల్ని లెక్కేయడం ఎలా సాధ్య మౌతుందనిపిస్తుంది. జనాభా లెక్కల వాళ్లయినా, ఇంటికొచ్చి తలుపు తట్టి ‘ఎంతమంది ఉన్నారు?’ అని అడిగే కదా రాసుకుని వెళతారు. ఏదైనా అంతే. ఇళ్లు, కోళ్లు, కార్లు, స్టౌవ్లు, ఫ్రిజ్లు, ఫ్యాన్లు.. ఏవైనా. ఇవన్నీ చూసి.. ఉన్నవాళ్లింతమంది, లేనివాళ్లింతమంది అని టిక్ చేసుకుని వెళతారు. ఉండీ లేనట్లు కనిపించేవాళ్లు లెక్కలకు అందరు. గృహబలిమిని ఇలా ఏదో ఒక స్కేల్లో లెక్కేయగలరు గానీ, ‘గృహబలుల్ని’ ఎలానూ లెక్కేయలేరు. భర్త, అత్తమామలు కొడుతున్నారని బాధితురాలు బయటికి రావాలి. భర్త, అత్తమామలు కొట్టి చంపేశారని చనిపోయిన మహిళ అన్నో నాన్నో బయటికి రావాలి. వచ్చి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. పోలీస్లు ఎఫ్.ఐ.ఆర్. రాయాలి. అప్పుడే ఐరాసకు గానీ, నేషనల్ క్రైమ్ బ్యూరోకి గానీ లెక్క అందుతుంది. ఆ లెక్కల్ని తక్కెడలో వేసి పోయినేడాది కంటే ఈ ఏడాది ఇంత హింస పెరిగిందనీ, లేదంటే ఇంత హింస తగ్గిందనీ, ఆ దేశం ఈ దేశం కంటే బెటరనీ, ఈ దేశం ఆ దేశం కంటే వరస్ట్ అనీ డేటాను విశ్లేషించి, విడుదల చేస్తారు. మరి విశ్లేషణకు అందని డేటా మాటేమి? నాలుగ్గోడల మధ్యే సమాధి అయిపోతుంది.. ఏనాటికీ గొంతెత్తని, గొంతెత్తే పరిస్థితే లేని అసహాయురాలైన మహిళలా! ఇల్లు చాలా డేంజర్. ఎందుకంటే.. నాలుగ్గోడల మధ్య స్త్రీకి రక్షణా ఉంటుంది, రక్షణ లేని విషయాన్ని బయటపడనివ్వని అడ్డూ ఉంటుంది. లోపల అమ్మాయి ఎలా ఉందో లోపలికి వెళ్లకుండా తెలుసుకోలేం. లోపలికి వెళ్లినా అమ్మాయి బయటపడకుంటే అప్పుడూ తెలుసుకోలేం. వెలుగులోనే ఎంత అంధకారం! ‘నా తల్లి నవ్వులో ఎన్ని వెన్నెల పువ్వులో’.. అనుకుంటూ ఆమె కోసం ఊర్నుంచి తెచ్చినవేవో ఇచ్చి, కడుపునిండా తృప్తితో అమ్మానాన్న తిరిగి బసెక్కడానికి వచ్చేస్తే.. వారితో పాటు అమ్మాయి ఆక్రందన బస్సువరకూ వినిపిస్తుందా? ఊహు! స్త్రీకి బయట ఏదైనా జరుగుతుంటే ఏ పుణ్యాత్ములైనా అడ్డుపడే అవకాశం ఉంటుంది. ఏ ధైర్యవంతులైనా పోలీసులకు ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉంటుంది. అడ్డుపడేవాళ్లు, పోలీసులకు ఫోన్ చేసేవాళ్లూ ఎవరూ లేకపోయినా ఆ మహిళ ప్రాణరక్షణ కోసం కనీసం పరుగెత్తిపోయే అవకాశమైనా ఉంటుంది.. రోడ్డు మీద నాలుగు గోడలు ఉండవు కాబట్టి. ఇల్లు అలాక్కాదు. ఇల్లు తప్పించుకుపోనివ్వదు. బైట గేట్లేసి ఉంటాయి. లోపల ఇంటి తలుపులు వేసి ఉంటాయి. వెనక దారి ఉంటే అవీ మూసి ఉంటాయి. ఇంకెక్కడికి తప్పించుకోవడం? హాల్లోంచి కిచెన్లోకి, కిచెన్లోంచి బాత్రూమ్లోకి, బాత్రూమ్లోంచి ఇంకో గదిలోకి, ఆ ఇంకో గదిలోంచి.. బెల్ట్ చేత్తో పట్టుకున్న వాడి దగ్గరకి, వాడి బెల్టు జారకుండా చేత్తో పట్టుకుని ఉన్న వారి దగ్గరికి, కొట్టీ కొట్టీ వాడు అలసిపోతే, వాడిని లేపి కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్న వారి దగ్గరికి! కొడుతున్న దెబ్బలు, పెడుతున్న పెడబొబ్బలు పక్కింటికైనా వినిపించవు. ఎవరి గృహహింస వారిదైపోయాక ఇంకేం పక్కిళ్లు! ఈ ఏడాది జూన్లో.. ‘స్త్రీకి ప్రపంచంలోకెల్లా మోస్ట్ డేంజరస్ కంట్రీ.. ఇండియా’ అని ఒక రిపోర్ట్ వచ్చింది. లండన్లోని ‘థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్’ ఇచ్చింది ఆ నివేదిక. ‘మీ కోడల్ని చంపుకుతింటున్నారటగా’ అని అడిగితే.. ‘అబ్బెబ్బే ఇంకెవరి కోడలి గురించైనా మీరు విని ఉంటారు’ అని భుజాలు తడుముకున్నట్లు.. ఇండియా వెంటనే ఖండించింది. ‘ఏ దేశాన్ని చూసి ఏ దేశం అనుకున్నారో..’ అని రాయిటర్స్ ఫౌండేషన్ మీద మన ఉమన్ డెవలప్మెంట్ శాఖలోని అధికారులు సెటైర్ వేశారు. ఆర్నెల్ల తర్వాత ఇప్పుడు మరో నివేదిక వచ్చింది. అదే.. ఐరాస వాళ్లది. మహిళకు ప్రపంచంలోకెల్లా మోస్ట్ డేంజరస్.. ఆమె ఇల్లేనట! మనదేశ మహిళకు అని కాదు. ఏ దేశంలోనైనా గృహమే మహిళకు నరక సీమ అని ఐక్యరాజ్య సమితి రూఢీ చేసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఎవరూ వ్యతిరేకించలేదు. ఖండించలేదు. మౌనంగా ఉండిపోయారు.. కొత్త విషయం ఏముంది ఇందులో అన్నట్లు. ‘మీ ఇంట్లో ఆడవాళ్లపై హింస జరుగుతోంది’ అని న్యూయార్క్ నుంచి ఐరాస వచ్చి చెప్పాలా? ఇంటాయనకు తెలీదా! ఆయనకు సపోర్టుగా ఆమెను జుట్టు పట్టుకుని కొట్టే ఇంటి మనుషులకు తెలీదా? ఏమిటి దీనికి పరిష్కారం? ఇంట్లోంచి బయటికి వచ్చేయడం. ఒంటిపై.. కనిపించకుండా ఉండి, కుటుంబ గౌరవాన్ని కాపాడుతున్న గాయాలను బయటికి చూపించడం. స్త్రీ మాన మర్యాదల్ని భంగపరిచే ఇంటికి గౌరవం ఉన్నట్లు? దాన్ని దాచాల్సిన అవసరం ఏం ఉన్నట్లు? పనిచేసే చోట జరుగుతున్న వేధింపులపై స్త్రీలు ‘మీటూ’ అంటూ బయటికి వస్తున్నారు. ‘మా ఇంట్లో కూడా’ అని బాధితుల మహిళలు బయటికి వచ్చే పరిస్థితి వస్తే కనుక అది చేజేతులా పురుషులు తెచ్చుకున్నదే అవుతుంది. లెక్కలు కాకుండా ఐరాస ఇంకా ఏం చెప్పింది? ► ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళల ‘గృహమరణాలను’ ప్రపంచ దేశాలు ఆపలేకపోతున్నాయి. ► 2012 నుంచి మహిళల గృహమరణాలు మరీ ఎక్కువయ్యాయి. మహిళల గృహమరణాలను తగ్గించడానికి, నిర్మూలించడానికి ఐరాసా ఏం చెయ్యాలంది? ► పోలీసు వ్యవస్థకు, నేర విచారణ వ్యవస్థకు, ఆరోగ్య సేవల వ్యవస్థకు మధ్య సమన్వయం ఉండాలి. ► గృహమరణాల వెనుక ఏ విధమైన ఉద్దేశాలు ఉంటున్నాయో, వాటి మూల కారణాలేమిటో అధ్యయనం చేయాలి. ► గృహమరణాలను తగ్గించడానికి పురుషుల సహాయాన్నీ తీసుకోవాలి. పురుషాధిక్యం, స్రీవిధేయత అనే పూర్వపు భావజాలాలను మార్చే ప్రయత్నం చేయాలి. మన దేశంలో? మామూలే. డౌరీ డెత్స్. వరకట్న మరణాలు! ఇండియాలో సంభవిస్తున్న మహిళల గృహమరణాలలో ఎక్కువ భాగం వరకట్నం వేధింపుల వల్లనేనని యు.ఎన్.ఒ.డి.సి నివేదిక పేర్కొంది. ఇందుకోసం 2016 నాటి సర్వే వివరాలనే పరిగణనలోకి తీసుకుంది. ఆ ఏడాది భారతదేశంలో మహిళల బలవన్మరణాల రేటు 2.8 శాతంగా ఉంది. ఇది.. మహిళల పాలిట నరక దేశాలని మనం భావిస్తున్న కెన్యా కంటే (2.6), టాంజానియా కంటే (2.5), అజర్బైజాన్ కంటే (1.8), జోర్డాన్ కంటే (0.8), తజికిస్తాన్ కంటే (0.4) ఎక్కువ! మరొక సంగతి. 15–45 ఏళ్ల మధ్య వయసులోని భారతీయ మహిళల్లో 33.5 శాతం మంది గృహహింసకు గురవుతున్నారు. మన దేశ ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ లెక్కల ప్రకారం ఏటా సంభవిస్తున్న మహిళల గృహ మరణాలలో 40 నుంచి 50 శాతం వరకు వరకట్నం వల్ల సంభవిస్తున్నవే. ప్రపంచవ్యాప్తంగా 2017లో బాలికలు, యువతులు, మహిళల బలవన్మరణాలు 50,000: భర్త లేదా ఇతర కుటుంబ సభ్యుల చేతుల్లో, చేతలవల్ల దుర్మరణం పాలైన మహిళల సంఖ్య. 17,000: పై యాభై వేలల్లో భర్త, లేదా పూర్వపు భర్త పెట్టిన భౌతికహింస తాళలేక దుర్మరణం చెందిన మహిళల సంఖ్య. 87,000: లైంగిక వివక్ష కారణంగా ప్రాణాలు కోల్పోయిన మొత్తం మహిళలు, బాలికల సంఖ్య (పై 50 వేల మందితో కలిపి). 137: గృహహింస కారణంగా చనిపోతున్న మహిళల సంఖ్య.. రోజుకు. నివేదిక ఎవరిది? ఐక్యరాజ్యసమితి ‘ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్’ (యు.ఎన్.ఒ.డి.సి) ఎప్పుడు విడుదలైంది? నవంబర్ 25న. అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినం సందర్భంగా. ఎవరు ఎంత మూట కట్టుకున్నారు? ఆసియన్లు : 20,000 ఆఫ్రికన్లు : 19,000 అమెరికన్లు : 8,000 యూరోపియన్లు : 3,000 ఓషియానియన్లు : 300 ....................................................... లక్షకు మరణాల రేటు ఆఫ్రికా : 3.1 అమెరికా : 1.6 ఆసియా : 0.9 యూరప్ : 0.7 -
నా తల సింక్లో ఉంచి వేణ్ణీళ్ల ట్యాప్ తిప్పాడు
ప్ర. మా పెళ్లయి యేడాది అవుతోంది. అరేంజ్డ్ మ్యారేజ్. ఆయనకు అమెరికాలో ఉద్యోగం. పెళ్లయిన నెలకు డిపెండెంట్ వీసా మీద అమెరికా వెళ్లాను. ఓ పదిహేను రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత నుంచి అసలు రూపం చూపించడం మొదలుపెట్టాడు. వంట చేస్తుంటే ఉడుకుతున్న కూరలో మగ్గుడు నీళ్లు కుమ్మరించేవాడు. నేను స్నానాకి వెళితే బయట నుంచి బాత్రూమ్ డోర్ లాక్ చేసేవాడు. బాగా రెడీ అయినా తప్పే.. రెడీ కాకపోయినా తప్పే. అతని ఫ్రెండ్స్ ఇంటికి వస్తే పలకరిస్తే లైటింగ్ కొడుతున్నావా అనేవాడు. ఓసారి.. మీ అమ్మానాన్న.. అంటూ మా పేరెంట్స్ని తిడుతుంటే సహించలేక ఎదురు తిరిగాను. అంతే నా జుట్టుపట్టి లాగి తోసేశాడు. సోఫాకి నా తల కొట్టుకొని రక్తం వచ్చింది. అయినా ఆగకుండా... నా జుట్టు పట్టుకొని బాత్రూమ్లోకి ఈడ్చుకెళ్లి సింక్లో నా మెడను వంచి వేడి నీళ్ల ట్యాప్ తిప్పాడు. తట్టుకోలేక తప్పించుకునే ప్రయత్నంలో ఆయన్ని తోసేశాను. కిందపడ్డాడు. ఆవేశంతో లేచి అక్కడే ఉన్న సిజర్స్తో నా పెద్ద జడను కత్తిరించేశాడు. వాళ్ల వాళ్లకు ఫోన్ చేసి ‘‘నా పెళ్లాం నన్ను కొడుతోంది’’ అంటూ ఏడ్చాడు. ‘‘మీ అమ్మాయి రాక్షసి. కాపురం చేయడం నావల్ల కాదు, పంపించేస్తున్నాను’’ అని అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసి ఇండియాకు పంపించేశాడు. నేను ఆయన దగ్గరున్నది కేవలం ఆరు నెలలే. ఆయన పెట్టే హింస గురించి మా వాళ్లకు చెబితే హర్ట్ అవుతారని చెప్పకుండా దాచాను. కాని ఇక్కడికి వచ్చాక జరిగినదంతా చెప్పాను. మా పెద్దవాళ్లు నన్ను తీసుకొని హైదరాబాద్లోనే ఉన్న మా అత్తారింటికి వెళ్లారు. వాళ్లూ నాదే తప్పన్నట్టుగా చెప్పి మా పెద్దవాళ్లను ఇన్సల్ట్ చేశారు. మా వారికి ఫోన్ చేస్తే బూతులు తిట్టాడు మా వాళ్లను. తను ఇంకో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఆయనను ఇండియాకు రప్పించి, శిక్షించే మార్గం లేదా? నేనేం చేయాలి? – ఆరతి, హైదరాబాద్. జ. ఇదంతా డొమెస్టిక్ వయొలెన్స్ కిందకే వస్తుంది. ముందు మీరు మీ భర్త మీద కేస్ పెట్టండి. తర్వాత లుక్ అవుట్ కేస్ కింద కంప్లయింట్ ఇవ్వండి. అలాగే 498 ఏ, వయొలెన్స్, హెరాస్మెంట్ కిందా కంప్లయింట్ ఫైల్ చేయండి. మీ హజ్బెండ్ అమెరికాలో ఉన్నాడు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లోని ఎన్ఆర్ఐ సెల్కి, ఇండియన్ ఎంబసీకి దరఖాస్తు చేయండి. అంతేకాదు మీ భర్త అమెరికాలో ఏ స్టేట్లో ఉంటున్నాడో ఆ స్టేట్ లా గురించి తెలుసుకొని హెరాస్మెంట్కు పాల్పడ్డాడని అక్కడి అటార్నీతో మీ భర్తకు లీగల్ నోటీస్ ఇప్పించండి. అన్నిటికన్నా ఎక్కువ వర్కవుట్ అయ్యేది లుక్ అవుట్ నోటీసే. మీ భర్త ఎప్పుడు ఇండియాకు వచ్చినా ఈ లుక్ అవుట్ నోటీస్ కింద అతనిని వెంటనే అరెస్ట్ చేస్తారు. ఇదేకాక.. మీరు సెక్షన్ 125 కింద మెయిన్టెనెన్స్ కోసం కోర్ట్లో కేస్ వేసుకోవచ్చు కూడా. ఇందుకోసం చాలా తిరగాల్సి ఉంటుంది. అతనికి శిక్ష పడాలి అనుకుంటే మీకు ఈ ఓపిక అవసరం! – మమతా రఘువీర్, అడ్వకేట్, ఫౌండర్, తరుణి మాకు పంపండి: ఒక మహిళగా మీరు గృహహింస వంటి వేధింపులకు గానీ, సామాజికంగా వివక్షకుగానీ, సంబంధిత ఇతర సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యను రాసి మాకు మెయిల్ ద్వారా పంపించండి. ఆయా రంగాలకు చెందిన నిపుణులతో మీకు తగిన సూచనలు / సలహాలు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. మీరు మీ ప్రశ్నలను పంపాల్సిన మెయిల్ ఐడీ : nenusakthiquestions@gmail.com -
మహిళకు భరోసా... శిశువుకు రక్షణ
సాక్షి, హైదరాబాద్: గృహహింస... వేధింపులు... అత్యాచారాలు...రాష్ట్రంలో మహిళలపై నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతున్న దారుణాలివి. ఇలాంటి దాడులకు గురైన బాధితులకు అండగా నిలిచేందుకు సర్కారు సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లా కేంద్రంలో ‘సఖి’ (వన్–స్టాప్ సెంటర్) పేరిట ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల ద్వారా బాధితులకు అవసరమైన వైద్య, పోలీసు, న్యాయ సాయంతోపాటు కౌన్సెలింగ్, బస అందించనుంది. బాధితులు నేరుగా సఖి కేంద్రాలను ఆశ్రయిస్తే నిర్వాహకులే అన్ని విషయాలు చూసుకుంటారు. దాడికి గురైన మహిళ లేదా మైనర్లు, చిన్నారులకు తొలుత చికిత్స అందించడంతోపాటు వారికి షెల్టర్ కూడా ఇస్తారు. అంతేకాకుండా దాడికి కారకులైన వారిపై చర్యల కోసం అవసరమైన న్యాయ సహకారాన్ని సైతం అందించేలా చర్యలు తీసుకుంటారు. వీధిబాలలు, చిన్నారులపై జరిగే దాడులపైనా ఈ కేంద్రం స్పందిస్తుంది. వారికి ఆశ్రయం కల్పించి సంరక్షణ చర్యలు తీసుకుంటుంది. ప్రతి జిల్లాలో సఖి కేంద్రం... సఖి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి నిర్వహణ బాధ్యతంతా కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖదే. ఒక్కో కేంద్రానికి రూ.50 లక్షల వరకు కేంద్రం మంజూరు చేయనుంది. ఈ మొత్తంతో శాశ్వత భవనాలు నిర్మించి అక్కడ సేవలు అందించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోనూ సఖి కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రతిపాదనలు రూపొందించిన యంత్రాంగం... వాటిని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అయితే కేంద్రం పాత పది జిల్లాల ప్రకారం హైదరాబాద్ను మినహాయించి మిగిలిన తొమ్మిది జిల్లాల్లో ఈ కేంద్రాలను మంజూరు చేసింది. దీంతో ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, సంగారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో సఖి కేంద్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఈ కేంద్రాలను ప్రాథమికంగా తెరవగా అక్కడ మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో వాటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మరో 8 కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో యాదాద్రి, కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, సిద్దిపేట, మంచిర్యాల, జనగాం జిల్లాల్లోనూ సఖి కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వచ్చే ఏడాది అన్ని జిల్లాలకూ సఖి కేంద్రాలు మంజూరయ్యే అవకాశం ఉందని సఖి ప్రాజెక్టు రాష్ట్ర మేనేజర్ బి.గిరిజ తెలిపారు. -
ఆ రోజు నేను చనిపోయేదాన్ని...!
కాపాడవలసిన చేతులు... ప్రేమించాల్సిన చేతులు ఊతం కావలసిన చేతులు...భరోసా ఇవ్వాల్సిన చేతులు మాటిమాటికీ లేస్తుంటే... బుసలు కొడుతుంటే.. కాటేస్తుంటే... అలాంటి చేతులకు సంకెళ్లు వేయాల్సిందే ఇనుప గాజులు తొడగాల్సిందే. సాక్షి తలపెట్టిన మహోద్యమం, మహిళోద్యమం అయిన ‘నేను శక్తి’ లో భాగంగా గతవారం అంతా ‘లైంగిక వివక్ష’పై కేస్ స్టడీలు ఇచ్చిన ‘ఫ్యామిలీ’.. ఈరోజు నుంచి ‘గృహహింస’పై ప్రత్యేక కథనాలను అందిస్తోంది. పెళ్లంటే అందరి అమ్మాయిల్లాగే నేనూ ఎన్నో కలలు కన్నాను. ఒక కొత్త జీవితాన్ని ఊహించి ఆ ఇంట్లో అడుగుపెట్టాను. అన్ని విధాలా నన్ను చూసుకునే, ప్రేమించే వ్యక్తి ఉన్నాడనే భరోసాతో వెళ్లాను. కానీ పెళ్లయిన పదహారో రోజే అత్తారింట్లో అందరిముందు కొట్టాడు. పెళ్లిలో మా అమ్మ మర్యాదలు సరిగా చేయలేదని. నేను టెన్త్క్లాస్లో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు హఠాత్తుగా. ఏజీ ఆఫీస్లో పనిచేసేవారు. మేం ముగ్గురం పిల్లలం. నాకు ఒక చెల్లి, తమ్ముడు. అమ్మే కష్టపడి పెంచింది మమ్మల్ని. ‘‘మా అమ్మను ఒక్క మాట కూడా అనొద్దు’’ అని నేను అన్నందుకు నన్ను కొట్టాడు. దవడ ఇప్పటికీ నొప్పిగానే ఉంటుంది. ఆరోజే అనుకున్నాను ఇంక ఇది వద్దు అని. అయితే విడాకులు తీసుకొని ఇంటికెళితే అమ్మకు ఎంత కష్టం? పెళ్లి కావల్సిన చెల్లి ఉంది. సొసైటీ ఏమనుకుంటుంది? అనే ఆలోచన వెనక్కిలాగింది. అయినా ‘‘నాకు వద్దు. నేను వెళ్లిపోతా’’అని చెప్పా. అప్పుడు మా మామగారు.. ‘‘అమ్మాయి చెప్పింది కరెక్టే. సరిగ్గా చూసుకోగలిగితే చూసుకో. లేదంటే నేనే దగ్గరుండి డివోర్స్ ఇప్పిస్తాను’’ అని అన్నారు. ఆ మాటకు ‘‘లేదు, ఇంకోసారి ఈ మిస్టేక్ జరగదు. ఇది నాకు కావాలి’’ అని తను అన్నాడు. క్షమించాను. కాని అది క్లోజ్ కాలేదు. అతను చెయ్యి ఎత్తుతూనే వచ్చాడు. ఒకసారి మా అత్తగారితో కూడా షేర్ చేసుకున్నా. ‘‘మన ఇళ్లల్లో కొత్తేం కాదు ఇది.. నువ్వే కొంచెం చూసీ చూడనట్టు పో’’ అని చెప్పారు ఆమె. చూసీచూడనట్టూ వెళ్లా. తర్వాత నాకు తెలిసిందేంటంటే.. అతను ఇంకో అమ్మాయితో ఉన్నాడు.. వాళ్లకు సంతానం కూడా ఉందని. టామ్బాయ్లా.. మా నాన్నే కొట్టలేదెప్పుడూ నన్ను. సింగింగ్తో చదువులో బీగ్రేడ్ వచ్చిన రోజూ పల్లెత్తు మాటనలేదు. ‘‘బాధపడకురా.. నీకు చాలా స్ట్రెన్త్ ఉంది’’ అంటూ ఎంకరేజ్ చేయడం తప్ప. పైగా నన్ను ఓ టామ్బాయ్లా పెంచారు. సైకిల్ తొక్కేదాన్ని. స్పోర్ట్స్ బాగా ఆడేదాన్ని. సింపుల్గా, స్ట్రాంగ్గా ఉండడం ఆయనకు ఇష్టం. అలాగే పెంచాడు. నిజానికి మా మామగారు, మా నాన్న ఇద్దరూ కొలీగ్స్. చిన్నప్పటి నుంచీ చూసినవాళ్లే. పాడడం నచ్చే నన్ను చేసుకున్నాడు అతను (భర్త). ఫస్ట్లో చాలా ఎంకరేజ్ చేశాడు కూడా. అలాంటిది ఒక్కసారిగా ‘‘నీ ఫొటోలు చూడు ఎట్లా ఉన్నాయో? నీ బిహేవియర్ చూడు ఎట్లా ఉందో? నీకు ఎవడో ఉన్నడంట కదా..’’ అంటూ మొదలుపెట్టాడు. సామరస్యంగా మాట్లాడదామని ట్రై చేసినా సాగనిచ్చేవాడు కాదు. కొట్టడమే. ఆయన ఇంటికొస్తున్నాడంటనే దడ వచ్చేది. ‘‘ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావ్?’’ అని అడిగితే నా మీద రాంగ్ ఎలిగేషన్స్ వేయడం స్టార్ట్ చేశాడు. ఎక్కడికి వెళ్లినా ఆయనను తీసుకునే వెళ్లేదాన్ని. అయినా అలా మాట్లాడేవాడు. ఉన్నట్టుండి అప్రోచ్ అయి కొట్టేవాడు. పోలీసుల దగ్గరకు వెళ్లా.. ‘‘ఏం జరిగిందో నాతో చెప్పట్లేదు. ఆయనను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మా ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి’’ అని. చంపేస్తామని బెదిరించారు సూపర్ సింగర్ 7 నాకు పెద్ద చాలెంజ్. అప్పుడే అమ్మకు క్యాన్సర్, ఆయన గొడవలు స్టార్ట్ చేయడం అన్నీ ఒకేసారి. చాలా కుంగిపోయా. ఎందుకంటే ఆమే నాకు సపోర్ట్. బాధ తొలిచేసేది. ఒకసారి మా బావగారు అంటే ఆయన పెద్దనాన్న కొడుకు వాళ్లు వచ్చారు ఇంటికి మా సమస్యను సాటవుట్ చేద్దామని. వాళ్లందరి ముందూ కొట్టాడు రక్తంకారేలా. వాళ్లు ఆయన్ని ఆపకపోతే నేను చచ్చిపోయేదాన్ని ఆ రోజు. మా బాబుకి అప్పుడు ఆరేళ్లు. ‘అమ్మను కొట్టొద్దు నాన్నా. ప్లీజ్ కొట్టొద్దు నాన్నా’ అంటూ వాళ్ల నాన్న కాళ్లు పట్టుకున్నాడు. నా దగ్గరకు వచ్చి ‘అమ్మా కొట్టుకోకండి అమ్మా... కలిసి ఉండండి అమ్మా..’ అని వాడు ఏడుస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. నా తలంతా గాయాలే. మా బావగారు వాళ్లే ఐస్క్యూబ్స్ ఇచ్చి ‘‘వెళ్లి అమ్మాయికి పెట్టరా’’ అన్నారు. ఆయన తలకు ఐస్క్యూబ్స్ అద్దుతుంటే ‘‘ఎందుకిలా చేస్తున్నావ్? నిన్నేం ఇబ్బంది పెట్టను. చెప్పుకోవడానికి నాకెవరూ లేరు’’ అని బతిమాలాను. అయితే తెల్లవారి ఈ మాటలనే పట్టుకుని హేళన చేస్తుంటే అనుకున్నాను ఇంక చాలు అని. మాట్లాడ్డానికి కూడా ట్రై చేయక మళ్లీ పోలీసుల దగ్గరకు వెళ్లా. ‘‘కేసులేమీ లేకుండా ఒకసారి ఆయనను పిలిచి మాట్లాడండి’’ అని రిక్వెస్ట్ చేశా. కంప్లయింట్లు ఇచ్చి, పదిమందికీ తెలిసి అల్లరి కాకుండా లోపలే పరిస్థితి చక్కదిద్దుకుందామనే నా ప్రయత్నం అప్పటికీ. అందుకే ఆయన మీద డొమెస్టిక్ వయలెన్స్ కేసు వేయాలనే ఆలోచన కూడా రాలేదు. కాని ఇప్పుడనిపిస్తోంది. అప్పుడే ఆ పని చేసుండాల్సింది అని. ఆయనతో ఉన్న ఆమె పేరు బయటపెడితే చంపేస్తామని బెదిరించారు ఇద్దరూ. భయపడి అప్పుడు కేస్ ఫైల్ చేశాను. ఒక్కో రీజన్తో.. భరించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. భరించడం కూడా ఒక శాపం. ఒక్కసారి చెయ్యి ఎత్తిన మగవాడు మళ్లీ మళ్లీ ఎత్తుతూనే ఉంటాడు. ఇది నా అనుభవంతో చెప్తున్న సత్యం. వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్.. దాని వెనక కారణం ఏంటో గ్రహించాలి. మరీ పాజిటివ్ ఆటిట్యూడ్ కూడా మంచిది కాదు. నెమ్మదిగా ఆయనే మారతాడని, చెల్లెలి పెళ్లికావాలని, అమ్మకు మాట రాకూడదని, సమాజం ఏమనుకుంటుందోనని.. తర్వాత బాబు ఉన్నాడని ఒక్కో రీజన్తో కామ్గా ఉన్నా. తర్వాత నా వల్ల కాలేదు. మన దేశంలో స్త్రీత్వం అంటే డిపెండెన్సీ.. అదే అందం అంటూ ఆడపిల్లలను పెంచుతారు. కాని మనకు కావల్సింది ఆత్మవిశ్వాసం, ధైర్యం! నా చేయి పట్టుకొని నా కొడుకు.. ఎదురుగా జీవితమనే సముద్రం.. ఒంటరిగా ఆ సముద్రాన్ని ఈదాలనే వాస్తవం భయపెట్టినప్పుడు, రేపేంటి? అన్న ప్రశ్న కలవరం పుట్టిస్తే నావలా కనిపించేది ఆత్మస్థైర్యమే. సెల్ఫ్ పిటీలోకి పడిపోయి ఎమోషనల్ అయిపోతే ముందుకు వెళ్లలేం. ఆర్థిక ఇబ్బందులున్నాయి. కలిసి ఉన్నప్పుడు భర్త, నేను వేరువేరు అనుకోం కదా. నా అకౌంట్స్, ఐటీ రిటర్న్స్అన్నీ ఆయనే చూసుకునేవారు. అలా ఆస్తీ ఆయనే చూసుకున్నారు. అయినా నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ ఉంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కొట్టినా, తిట్టినా పడ్డాను. సెలబ్రెటీగా నేనెప్పుడూ బతకలేదు. ఇంట్లో అన్ని పనులు చేసే రికార్డింగ్కి వెళ్లేదాన్ని. ఆయన స్నేహితులొస్తే వండిపెట్టేదాన్ని. అత్తింట్లో అందరికీ మర్యాద ఇచ్చాను. నా కొడుకు వ్యాక్సినేషన్ దగ్గర్నుంచి స్కూల్లో చేర్పించేదాకా అన్నీ నేనే చూసుకున్నా ఇండిపెండెంట్గా. ఎక్కడా ఏ లోపం చేయలేదే? ఎందుకు నన్ను ఇంత మోసం చేయడం? ఇప్పుడు నా జీవితం నేను జీవిస్తున్నా. నేను ఇంత బలంగా.. సంతోషంగా.. నవ్వుతున్నానంటే కారణం నా కొడుకే. వాడు క్రికెట్ బాగా అడతాడు. పొద్దున్నే అయిదు గంటలకు కోచింగ్కు తీసుకెళ్తా. నేను నా కొడుకు మీద పెడుతున్న శ్రధ్ధను చూసి వాళ్ల నాన్నే జెలసీ ఫీలయ్యి ‘‘నువ్వు నీ కొడుకును పెంచినట్టు మా అమ్మ నన్ను పెంచి ఉంటే నేనిట్లా తయారయ్యేవాడిని కాను’’ అని అంటుండేవాడు. నాకున్న గొడవల్లో నాకు వచ్చిందాన్ని మరిచిపోకుండా ఉండడానికే సంగీత అకాడమీ. అదే నా ఆత్మసంతృప్తి. పాడడంలోనే నాకు మనశ్శాంతి. మన హక్కు మనమే.. ఎవరో వస్తారు.. ఏదో సాయం చేస్తారు అనుకుంటూ ఎదురుచూసే రోజులు పోయాయి. నీకు నువ్వే అన్నీ. మన హక్కును మనమే కాపాడుకోవాలి. మన చాయిస్ను మనం పర్స్యూ చేసుకోవాలి. ఇబ్బందిని ధైర్యంగా చెప్పాలి. ఇలాంటి క్యాంపెయిన్స్ వల్ల సమాజం ఎడ్యుకేట్ అవుతుంది. -సరస్వతి రమా డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ మనదేశంలో గృహహింస చట్టం 2006 నుంచి అమల్లోకి వచ్చింది. ఒక్కొక్క ఉపశమనానికి ఒక్కో కోర్ట్ని ఆశ్రయించకుండా అన్ని ఉపశమనాలకు ఒకే చట్టం అనేది ఇందులోని ముఖ్యమైన విషయం. స్త్రీలపై జరిగే మానసిక, శారీరక, ఆర్థిక, లైంగిక వేధింపుల నుంచి ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. అన్ని హింసల స్వరూప స్వభావాలను చర్చించి, విశదీకరించిందీ చట్టం. సహజీవనాన్నీ గుర్తించింది. ఇదొక శుభపరిణామం.. మహిళలకు ఆశాకిరణం! ది బెస్ట్: మహిళలు పోరాడి సాధించుకున్న ఈ చట్టం చాలా గొప్పది. ప్రభుత్వం కాస్త దృష్టి పెడితే దిబెస్ట్ అవుతుంది. మధ్యంతర ఉత్తర్వులు ఆర్థికపరంగా, నివాసపరంగా, కస్టడీ పరంగా, రక్షణపరంగా వెనువెంటనే వస్తున్నాయి. కేస్ల పరిష్కారమే ఆలస్యమవుతోంది. ఉత్తర్వుల సత్వర అమలుకు చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. డీవీ (డొమెస్టిక్ వయలెన్స్) చట్టం వచ్చాక 498ఏ కేసుల సంఖ్య కొంత శాతం తగ్గింది. సపరేట్ కోర్టులు కావాలి: డీవీ కేసులను విచారించడానికి సపరేట్ కోర్ట్లను ఏర్పాటు చేయాలి. క్రిమినల్ కేసులలో ఎఫ్ఐఆర్ లాంటిదే డీవీ కేసులలో డీఐఆర్. చట్టప్రకారమైతే కొన్ని గుర్తింపు ఉన్న ఎన్జీఓలు గృహహింస జరిగిన చోటుకు వెళ్లి, విచారించి ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలి. దాని ఆధారంగానే అధికారులు తదుపరి చర్యలు తీసుకొని కోర్ట్కు పంపాలి. కాని ఇది సవ్యంగా జరగడంలేదు. యాంత్రికంగా డీఐఆర్లు వేస్తున్నారు. అసలు కొన్ని చోట్ల అయితే విచారణలే లేవు. ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు పరిచే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. డీవీ చట్టం కింద జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తే నేరం. కాని నేరాన్ని నిరూపించాలన్నా, ఆ ఉత్తర్వులను అమలుపర్చుకోవాలన్నా పోలీసుల సహాయం తప్పనిసరి. కాబట్టి ప్రతి స్టేషన్లో కొందరు పోలీసులకు ఈ బాధ్యతను అప్పగించాలి. రెండవ స్థానంలో .. ♦ డొమెస్టిక్ వయలెన్స్ కేసుల విషయంలో దేశంలోనే రెండవస్థానంలో ఉంది హైదరాబాద్. ♦మహిళలకు సంబంధించి హైదరాబాద్లో దాఖలయ్యే కేసుల్లో 25 డీవీ కేసులే. ♦ చట్టం వచ్చిన ఈ పదేళ్లలో మన దేశంలో పదిలక్షల కేసులు నమోదయ్యాయి. ♦ ప్రతిరోజు ఒక్కో కోర్టులో కనీసం అయిదు డీవీ కేస్లు బుక్ అవుతున్నాయి. సర్వే: తమపై జరిగే హింస గృహహింస అని చాలామంది మహిళలు ఇంకా గుర్తించనేలేదు. వారికి తెలియదు కూడా. 80 శాతం మగవారు ఏదో ఒక సందర్భంలో భార్యలను కొడుతున్నామని అంగీకరించారు. అప్పుడప్పుడు అది తప్పు కాదని కొందరు అభిప్రాయపడ్డారు కూడా. - ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీకౌన్సిలర్ గట్టిగా ఎదురించాలి.. ఎక్కువ కుటుంబాల్లో భర్తలు తాగివచ్చి భార్యలపై దాడులకు పాల్పడుతున్నారు. శారీరకంగా వేధిస్తున్నారు. చాలా మంది మహిళలు పిల్లల కోసం ఈ హింసను భరిస్తున్నారు. తమపై జరిగే దాడులను మహిళలు ప్రతిఘటించాలి. నలుగురికీ చెప్పాలి. గట్టిగా ఎదురించాలి. అవసరమైతే బంధువుల సహాయం తీసుకోవాలి. అలా చేస్తేనే మగవారిలో భయం వస్తుంది. విదేశాల్లో కూడా గృహహింస ఉంటుంది. ఫిర్యాదు చేస్తే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయి. – పద్మ పాల్వాయి, సైకాలజిస్ట్ జీవితంలో ఎన్ని అపజయాలనైనా ఎదుర్కోవచ్చు.. కాని నీకు నువ్వు ఓటమికి లొంగిపోకు! – మాయా ఎంజెలో -
బతికొచ్చింది
హైదరాబాద్.. శంషాబాద్ ఎయిర్పోర్ట్.. ఇంటర్నేషనల్ అరైవల్స్. గుంపులు గుంపులుగా జనం.. ట్రాలీలు ట్రాలీలుగా లగేజ్తో బయటకు వస్తున్నారు. వాళ్లలో ఓ నడివయసు స్త్రీ కూడా ఉంది. ఆకుపచ్చ రంగు సల్వార్ కమీజ్తో బేలగా ట్రాలీని తోసుకుంటూ వచ్చింది. ఆ మొహంలో అలసట కనిపిస్తోంది. ఇంతలో ఆమెను చేరుకోవాల్సిన వాళ్లు చేరుకున్నారు. అక్కున చేర్చుకున్నారు. నీళ్ల సీసా అందివ్వగానే ఒక్క గుక్కన ఆ నీళ్లను తాగేసింది. ఆ ఒక్క గుక్కతో.. గొంతు దప్పికే కాదు, సొంతగడ్డను చేరాలనే పద్మ ఏడేళ్ల దాహమూ తీరినట్టయింది. ‘‘టిఫిన్ ఏం తింటారు?’’ అంటే.. ‘‘మనసు, కడుపు నిండినట్టయింది. ఏమొద్దు’’ అంది కళ్లనిండా నీళ్లతో. ‘‘కాస్త ఎంగిలి పడండి’’ అని బలవంతం చేస్తే.. ‘‘ఏడేళ్ల నుంచి ఇడ్లీ తినలేదు. అది ఇప్పించండి’’ అంది మొహమాటంగా. ఎప్పుడో.. బిడ్డకు ఏడేళ్ల వయసున్నప్పుడు బతుకుతెరువు కోసం గల్ఫ్కు వెళ్లింది పద్మ. దాదాపు ఏడేళ్లు ‘చెర’లో ఉంది. బిడ్డను గుండెకు హత్తుకొని తనివి తీరా ఏడ్వాలి. అదే ఇప్పుడు ఆమె తొందర. నాలుగు రాళ్ల కోసం ఎడారికి బల్ల పద్మ పాండే స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం, బల్లపేట. ఒక్కతే కూతురు. పెయింటర్ అయిన శ్రీనివాస్కు ఇచ్చి పెళ్లి చేశారు. ఓ కూతురు పుట్టింది. శ్రీనివాస్కు ఊళ్లో పెద్దగా పనిలేదు. ‘దుబాయ్లో పని ఉంది. రూపాయల్లో కంటే దీరమ్స్లో బాగా సంపాదించొచ్చు’ అని బల్లపేటలో అప్పటికే గల్ఫ్లో ఉంటున్నవాళ్లు చెప్పారు. అతడికి ఆశ కలిగింది. దుబాయ్ వెళ్లాడు. అలాగే పద్మ. అంతకుముందే ఆ ఊరి నుంచి డొమెస్టిక్ వర్కర్స్గా (పనిమనుషులుగా) ఎడారిబాట పట్టిన వాళ్లు అక్కడ సంపాదన బాగా ఉంటుందని ఆమెకు చెప్పారు. భూమి కొనుక్కుందాం.. ఇల్లు కట్టుకుందాం.. బిడ్డను బాగా చదివిద్దాం.. అనుకున్నారు పద్మ, శ్రీనివాస్లు. భార్యను బెహ్రెయిన్ వెళ్లమని చెప్పాడు భర్త. వెళ్లి రెండేళ్లు ఉండి వచ్చింది. కొంచెం సంపాదించుకుంది. ఓ ఆర్నెల్లకు దుబాయ్కి అవకాశం వస్తే దుబాయ్కీ వెళ్లింది. కాని బెహ్రెయిన్లా లేదు.. అక్కడ తను ఉంటున్న షేక్ ఇంట్లో పరిస్థితి. హింసపెట్టేవాళ్లు. ఉండలేక ఇండియా వచ్చేసింది. మళ్లీ ఆర్నెల్లకి కువైట్కు వెళ్లే చాన్స్ దొరికింది. వెళ్లింది. వేధింపులు సాధింపులే జీతం! కువైట్లో ఓ బాబా (షేక్) ఇంట్లో పనిమనిషిగా కొలువు. బాబా చాలా మంచివాడు. ఏడాదిన్నర పాటు జీతం బాగానే ఇచ్చాడు. బాగా చూసుకునేవాడు కూడా. కాని కాలం అలా సాగలేదు. బాబా చనిపోయాడు. పద్మ పరిస్థితి తలకిందులైంది. నిజానికి ఆమెకు రెండేళ్లే ఆ ఇంట్లో వర్క్ పర్మిట్ వీసా ఉంది. బాబా చనిపోయేనాటికి రెండేళ్లు పూర్తికావొచ్చాయి. ఆమెను తిరిగి ఇండియాకు పంపించేయాలి. అయితే బాబా భార్య అలా చేయలేదు. పద్మను పంపించకపోగా ఆమెను వేధించడం మొదలుపెట్టింది. జీతం ఇవ్వడం మానేసింది. రోజుకు ఒక్కపూటే తిండి. ఇండియా నుంచి తనవాళ్లు ఫోన్ చేసినా.. తనకు ఫోన్ చేయాలనిపించినా ఫోన్ ఇచ్చేది కాదు. యజమాను రాలు ఇంకో పెళ్లి చేసుకుంది. ఆమె పెట్టే టార్చర్కు కొత్తగా వచ్చిన షేక్, యజమానురాలి కొడుకూ తోడయ్యారు. కొట్టేవాళ్లు. తిట్టేవాళ్లు. ఇంట్లోంచి బయటకు వెళ్లనీయకుండా కాపలా కాసేవారు. కూరలు కోసే చాకును వేడి చేసి ఒంటి మీద వాతలు పెట్టేవాళ్లు. అలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా అయిదేళ్లు గడిపింది. కూతురుని, భర్తను, తన తల్లిదండ్రులు, అత్తమామలను తలచుకుంటూ ఏడ్చేది. పద్మ మీద బెంగతో వాళ్ల నాన్న మంచం పట్టి కన్నుమూశాడు. ఈ విషయమూ ఆమెకు తెలియదు. తాళం చెవి బతికించింది! ఓ రోజు బట్టలు ఆరేసి వచ్చిన పద్మకు టీపాయ్ మీద బయటి గుమ్మం తాళంచెవి పడేసి తన గదిలోకి వెళ్తున్న యజమానురాలి కూతురు కనిపించింది. ఆ అమ్మాయి గది తలుపేసుకోగానే.. చివికిపోయిన నాలుగు జతల దుస్తులను తన బ్యాగ్లో కుక్కేసుకొని ఆ తాళంచెవితో గుమ్మం తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది. అప్పటికే ఒంటినిండా గాయాలతో, నీరసంగా ఉంది. ఏ దారో తెలియదు. ఎక్కడికి చేరుకోవాలో అంతకన్నా తెలియదు. పరిగెత్తి పరిగెత్తి అలసి సొమ్మసిల్లిపోయింది ఒకచోట. దారినపోయే వాళ్లు తట్టిలేపి పలకరించారు. అక్కడికి వచ్చిన ఓ కువైట్ మహిళ ఆమె గురించి తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులకు తన వివరాలు.. యజమాని వేధింపులు అన్నీ చెప్పింది. వాళ్లు కంప్లయింట్ రాసుకున్నారు. తన వాళ్ల నంబర్ ఇచ్చింది. మాట్లాడారు. పద్మను చికిత్స కోసం హాస్పిటల్కు పంపారు. ఆ తర్వాత అక్కడున్న ప్రవాసీ భారతీయ సామాజిక కార్యకర్తల సహాయమూ పద్మకు అందింది. వాళ్లందరి సహకారంతోనే చివరికి ఇలా ఇండియాకు వచ్చింది. తన వాళ్లను కలుసుకుంది. దూరపు ఎడారి ఎండమావులతో భ్రమింప చేస్తుంది. కాసుల పంట పండుతుందని ఆశ పుట్టిస్తుంది. వెళితే ఒయాసిస్సు జాడా కూడా కనపడనివ్వక దాహంతో గొంతు పిడుచకట్టుకు పోయేలా తిప్పుతుంది. ఉన్న సొమ్ము ఏజెంట్ చేతిలో పెట్టి సొమ్మసిల్లి ఇల్లు చేరుతారు. కొండంత పేరుకుపోయిన అప్పుల భయంతో మళ్లీ పాత భ్రమతో ఇంకో ఎడారి దేశం పయనం అవుతారు. ఇది నిరంతర ప్రక్రియ. గల్ఫ్ గల్లా గలగలలు వలస బాట పొమ్మని పోరుతుంటాయి. మంచిదే. కానీ ఆచితూచి.. మంచిచెడులు ఆలోచించి.. అన్నీ తెలుసుకుని వెళితేనే లాభమూ.. క్షేమమూ! మళ్లీ ఇక ఏ దేశానికీ పోను! నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. నా మీద బెంగతో మానాన్న చనిపోయాడు. చివరిచూపు కాదు కదా, చివరి మాట మాట్లాడే భాగ్యానిక్కూడా నేను నోచుకోలేదు. ఏడేళ్లు బందిఖానాలో ఉన్నా. నా పని నచ్చకపోతే నన్ను పంపించేయండి అని మొత్తుకున్నా. అయినా పంపలేదు. జీతం ఇవ్వలేదు. నా వాళ్లకు దూరమయ్యా. ఆరోగ్యం పాడైంది. ఇక ఎప్పుడూ ఏ దేశానికీ వెళ్లను. నా కూతురు, అమ్మ, మా అత్తమామలు, నా భర్త.. ఇదే నాలోకం. వాళ్లను చూసుకుంటూ ఉంటా. పనిమనుషులుగా గల్ఫ్కి వెళ్లేవాళ్లు ముందే ఆ చట్టాలు, ఆ పద్ధతులు, ఆ భాష పట్ల అవగాహన కల్పించుకోవాలి. అన్నీ తెలుసుకునే వెళ్లాలి. – బల్ల పద్మ పాండే – సరస్వతి ర -
ఆమెకు గౌరవమేదీ?
మహిళలను అగౌరవపరచడం, కించపరచడంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. 2016లో ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ 509 కింద 1,831 కేసులు నమోదు కాగా, తెలంగాణలో 1,003 కేసులు నమోదయ్యాయి. 924 కేసులతో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రూపొం దించిన ‘క్రైమ్ ఇన్ ఇండియా’ నివేదికను గురువారం కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ ఢిల్లీలో విడుదల చేశారు. ఎన్సీఆర్బీ నివేదిక వివరాలివీ.. – సాక్షి, హైదరాబాద్ 1,311 హైదరాబాద్లో గృహ హింస కేసులు దోపిడీలు, హత్యలు, దొంగతనాలు, కిడ్నాపులు తదితర కేసులు రాష్ట్ర విభజన తర్వాత తగ్గాయి. అయితే మహిళలపై అత్యాచారాలు, కిడ్నాపులు, ఇతర కేసుల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. నమోదైన కేసుల్లో 8.1 శాతం మంది నిందితులకు మాత్రమే శిక్షలు పడ్డాయి. ఇక గృహ హింస కేసుల్లో హైదరాబాద్ మెట్రో సిటీలో కేసులు పెరిగాయి. రాష్ట్రం మొత్తంగా 7,202 కేసులు నమోదు కాగా, కేవలం హైదరాబాద్లోనే 1,311 కేసులు నమోదయ్యాయి. ఇందులో మొదటి స్థానంలో ఢిల్లీ (3,645) ఉండగా, రెండో స్థానంలో హైదరాబాద్ ఉంది. మూడో స్థానంలో జైపూర్ (1,008) ఉంది. మరోవైపు బాల్యాన్ని చిదిమేస్తున్న కేసుల్లోనూ రాష్ట్ర పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. 2016లో జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద నమోదైన 491 కేసులతో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. 344 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. ఆర్థిక నేరాల్లోనూ అంతే.. ఆర్థిక నేరాల్లోనూ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. 2014లో 9,413 కేసులు నమోదు కాగా 2015లో 8,979, 2016లో 9,286 కేసులు నమోదయ్యాయి. ఆర్థిక నేరాల్లో రాజస్తాన్ మొదటి స్థానంలో, ఢిల్లీ రెండో స్థానంలో ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో తగ్గుదల కని పించినా మొదటి 5 స్థానాల్లో తెలంగాణ ఉంది. 1,741 కేసులతో తొలి స్థానంలో కర్ణాటక, 1,066 కేసులతో రెండో స్థానంలో ఉత్తర్ప్రదేశ్, 750 కేసులతో జార్ఖండ్ మూడో స్థానంలో, 513 కేసులతో ఏపీ నాలుగో స్థానంలో, 480 కేసులతో తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నాయి. కేసులు వందల్లో ఉంటే శిక్షల శాతం మాత్రం కేవలం 6.5 శాతానికే పరిమితమైంది. మైనర్లపై లైంగిక వేధింపుల్లో టాప్ లైంగిక వేధింపుల నియంత్రణ (పోస్కో) చట్టం కింద 2016లో అత్యధిక కేసులు తెలంగాణలోనే నమోదయ్యాయి. ఏడాదిలో చిన్నారులపై జరిగిన దాడులు, వేధింపులు, తదితర కేసులన్నీ 2,909 కాగా, వీటిలో లైంగిక దాడులకు సంబంధించి 178 కేసులు న్నాయి. దేశవ్యాప్తంగా పోస్కో యాక్ట్ 12, ఐపీసీ 509 కింద తెలంగాణలోనే 178 కేసులు నమోదు కాగా, తర్వాతి స్థానంలో యూపీలో 123 కేసులు నమోదయ్యాయి. మరోవైపు సీనియర్ సిటీ జన్లపై జరిగిన దాడులకు సంబంధించి రాష్ట్రంలో 2014లో 422, 2015లో 1,519, 2016లో 1,382 కేసులు నమోదయ్యాయి. ఇందులో చంఢీగఢ్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ఉన్నాయి. చీటింగ్ కేసుల్లో సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ తొలిస్థానంలో ఉంది. 57 మంది పోలీసులపై కేసులు పోలీస్ శాఖలో నేరాలకు పాల్పడ్డ 57 మంది పోలీస్ అధికా రులు, సిబ్బందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 33 మం దిని అరెస్ట్ చేయగా, 29 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. 1.48 లక్షల కేసులు దర్యాప్తులోనే.. రాష్ట్ర పోలీస్ శాఖ పరిధిలో 2016లో 1,08,991 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు నమోదైన కేసుల్లో దర్యాప్తులో దశలో ఉన్నవి 39,233 కేసులు. మొత్తంగా 2016 డిసెంబర్ 31 వరకు 1,48,224 లక్షల కేసుల దర్యాప్తు పెండింగ్లో ఉంది. ఆధారాలు లేక 838 కేసులు మూసివేసే స్థితిలో ఉన్నాయి. 420 కేసులు తప్పుడు కేసులని రాష్ట్ర పోలీసు శాఖ కోర్టుకు తెలిపింది. భారీగా నకిలీ నోట్ల స్వాధీనం.. రాష్ట్రంలో నకిలీ నోట్లకు సంబంధించి 52 కేసులు నమోదు చేయగా, 74 మందిని అరెస్ట్ చేశారు. రూ.76 లక్షల నకిలీ కరె న్సీని స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా రూ.15.92 కోట్లు నకిలీకరెన్సీని సీజ్ చేసి 1,107 మందిని అరెస్ట్ చేశారు. సైబర్ నేరాల్లో 4 స్థానం 2016లో 593 కేసులతో సైబర్ నేరాల్లో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. చిన్నారులపై లైంగిక వేధింపులు, యువ తులను వేధించడం, తదితర నేరస్థులను గుర్తించడం పోలీస్ శాఖకు కష్టంగానే మారింది. అరెస్ట్ చేసిన కేసుల్లోనూ పెద్దగా శిక్షల శాతం పెరగక పోవడం నిందితులకు భయం లేకుండా చేస్తోంది. 2016లో సైబర్ నేరాల్లో రాష్ట్రంలో కన్విక్షన్ రేటు ‘సున్నా’గా ఉండటమే దీనికి ప్రధాన కారణం. సైబర్ నేరాల్లో మొదటి స్థానంలో అస్సాం, రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో కర్ణాటక ఉన్నాయి. తీవ్రత కలిగిన నేరాల వివరాలు నేరం 2014 2015 2016 హత్యలు 1,308 1,188 1,046 కిడ్నాపులు 1,152 1,044 1,302 -
అభాగినులకు అండ
విజయనగరం ఫోర్ట్: ఆశల పల్లకిలో మెట్టినింటికి చేరుకుంటున్నారు. అత్తింటి వేధింపుల్ని తట్టుకోలేక పోతున్నారు. అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు. అలాంటి అభాగినుల చేతికి పాశుపతాస్త్రం చేరింది. అత్తింటి వేధింపులను అరికడుతోంది. అదే గృహ హింస చట్టం–2005. ఈ చట్టం వచ్చాక ఎందరో బాధితులకు న్యాయం జరిగింది. అత్తింటి వేధింపులు భరించలేక ఇటీవల కాలంలో మహిళలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భర్త, అత్త వేధిస్తున్నారన్న మనస్తాపంతో చాలా మంది వివాహితలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నెం పున్నెం తెలియని వారి పిల్లలు దిక్కులేని వారవుతున్నారు. ఉచిత న్యాయ సహాయం వేధింపుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం 2005లో గృహహింస చట్టాన్ని తీసుకొచ్చింది. భర్త, అత్త లేదా ఇతర కుటుంబ సభ్యుల వేధింపులు గురయ్యేవారు నేరుగా గృహిహింస చట్టం సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తారు. ప్రస్తుతం గృహహింస కార్యాలయం విజయనగరం కేంద్రాస్పత్రిలోని ఆరోగ్యశ్రీ కార్యాలయం పక్కన ఉంది. గృహ హింస అంటే.. మానసికంగా మాటలతో ఉద్వేగపరిచినా గృహహింస కిందకు వస్తుంది. ఆర్థిక, లైంగిక హింస, బెదిరించడం, భయపెట్టడం, దౌర్జన్యం చేయడం, ఆరోగ్యం కుంటుపడేలా వ్యవహరించడం కూడా గృహహింస కిందకు వస్తాయి. ఈ చట్టం ప్రకారం బాధితురాలికి, ప్రతివాది మధ్య సంబంధం భార్యాభర్తల సంబంధమే కానవసరం లేదు. పుట్టుక వల్ల లేదా పెళ్లి, దత్తత వల్ల కలిసి ఉంటున్న వారైనా, ఒకే ఇంట్లో ప్రస్తుతం లేదా గతంలో కలిసి నివసిస్తున్న స్త్రీ పురుషులు కూడా ఈ చట్టపరిధిలోకి వస్తారు. ఆశ్రయం అందించే సంస్థలు గృహహింసకు గురైన మహిళలకు స్వధార్ హోంలో ఆశ్రయం కల్పిస్తారు. గృహహింస కార్యలయంలో అయిదుగురు సిబ్బంది ఉన్నారు. ఒక లీగల్ కౌన్సిలర్, ఒక సోషల్ కౌన్సిలర్, ఇద్దరు హోంగార్డులు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారు. నేరుగా ఫిర్యాదు చేయవచ్చు గృహహింసకు గురయ్యే మహిళలు నేరుగా లేదా ఫోన్లో ఫిర్యాదు చేయవచ్చు. మాటలతో లేదా శారీరకంగా వేధించినా అది గృహహింస పరిధిలోకి వస్తుంది. గృహహింస కార్యాలయాన్ని ఆశ్రయించిన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తాం. ఇద్దరికీ ముందుగా కౌన్సెలింగ్ చేస్తాం. రాజీ కుదరకపోతే కోర్టులో కేసు వేస్తాం. – జి.మాధవి, లీగల్ కౌన్సిలర్ సయోధ్యతోనే సమస్య పరిష్కారం వివాహానంతరం భార్యభర్తల మధ్య ఎలాంటి విభేదాలకు తావీయరాదు. ఇద్దరిలో ఏ ఒక్కరూ అహానికి పోరాదు. చిన్న చిన్న సమస్యలుంటే ఇంట్లోనే పరిష్కరించుకోవడం మంచిది. భార్యను అనుమానంతో, వరకట్నం కోసం వేధించడం లేదా దాడికి పాల్పడటం గృహహింస కిందకు వస్తుంది. – జిల్లెల రజని, గృహ హింస సోషల్ కౌన్సిలర్ -
గృహహింసతో పొంచి ఉన్న ముప్పు
న్యూయార్క్(యూఎస్ఏ): భారత్ జరుగుతున్న గృహహింసతో మహిళల ప్రాణాలకు పెనుముప్పు పొంచి ఉన్నట్లు ఓ అధ్యయనం తేల్చింది. కుటుంబసభ్యులు, భర్తల చేతిలో హింసకు గురవుతున్న భారతీయ మహిళలకు అమెరికా మహిళల కంటే 40 రెట్లు ప్రాణాపాయం ఉందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇండియా, అమెరికాల్లో జరిపిన పరిశీలనలో వెల్లడయింది. భర్త చేతుల్లో హింసకు గురవుతున్న ప్రతి నలుగురు బాధితుల్లో ఒక్కరు మాత్రమే వైద్యం చేయించుకుంటుండటమే ఇందుకు కారణమని ఈ పరిశోధన తేల్చింది. రోడ్డు ప్రమాదానికి గురైనా ఎత్తైన భవనాలపై నుంచి కిందపడిన భారతీయులకు అమెరికా దేశస్తుల కంటే దాదాపు ఏడు రెట్లు తక్కువగా వైద్య సాయం అందే అవకాశాలున్నట్లు గుర్తించామని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకురాలు మోహిని దాసరి వెల్లడించారు. వెంటనే వైద్యం అందని కారణంగా మరణాల శాతం ఎక్కువగా ఉంటోందని తేలింది. ఈ పరిశోధక బృందం 2013-2015 కాలంలో ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాలకు చెందిన 11,670 కేసులను, పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్బర్గ్లోని ట్రామా సెంటర్లలో నమోదైన 14,155 కేసులను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చింది. -
ప్రేమ వివాహం.. కాపురం చేసి గెంటేశాడు!
► న్యాయం కోసం మౌనదీక్షకు దిగిన భార్య విజయనగరం: ప్రేమించి పెళ్లి చేసుకొని నాలుగు నెలలు కాపురం చేసిన తర్వాత ముఖం చాటేసిన భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటానికి దిగింది. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం గౌరిపురం గ్రామానికి చెందిన చల్ల శంకర్ రావు, కాకి సుదీపను ఈ ఏడాది మార్చిలో పెద్దల సమక్షంలో ప్రేమపెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో వివాదాలు తలెత్తాయి. ఇంటి కోడలు సుదీపను అత్తవారింటి నుంచి మెడపట్టుకొని గెంటేశారు. ఎంతగానో వేడుకున్నా భర్త ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో మనోవేదనకు గురైన సుదీప తనకు న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు మౌన దీక్షకు దిగింది. తన భర్తకు మరో పెళ్లి చేయడానికి యత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఆమె మౌన దీక్షకు మహిళా సంఘాలు తమ మద్దతు తెలిపాయి. -
ఝలక్: భర్తకు ముస్లిం మహిళ తలాఖ్!
లక్నో: భర్త పెట్టే చిత్రహింసలు తాళలేక ఓ ముస్లిం మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు తలాఖ్ చెప్పింది. సాధారణంగా ముస్లిం పురుషులు తమ భార్యలకు విడాకులు ఇచ్చేందుకు తలాఖ్ చెబుతుంటారు. అయితే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో భార్య తలాఖ్ చెప్పిన విషయం శుక్రవారం వెలుగుచూసింది. పుట్టింటికి వచ్చి చాలా రోజులైన భర్త నుంచి ఎలాంటి సమాచారం లేదని, కనీసం తన కూతురు కోసమైనా మా పుట్టింటికి వచ్చి చూడలేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు మూడుసార్లు తలాఖ్ అనే పదాన్ని పలకడం ద్వారా ముస్లిం పురుషులు వైవాహిక బంధాన్ని తెంచేసుకునే పద్ధతిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రత్యేకంగా వేసవి సెలవులు కూడా రద్దు చేసుకుని పనిచేస్తోన్న విషయం తెలిసిందే. ఆరేళ్ల కిందట తన వివాహం జరిగిందిని చెప్పిన మహిళ భర్త, వారి కుటుంసభ్యులు అదనపు కట్నం కోసం చిత్రహింసలు పెట్టేవారని వాపోయింది. కూతురు పుట్టిన తర్వాత నుంచి వేధింపులు మరింత తీవ్రమయ్యాయని, పాపను ఒకసారి కిడ్నాప్ కూడా చేశాడంటోంది. అత్తింటి వారి ఆగడాలను భరించలేక ఇటీవల పుట్టింటికి వెళ్లినట్లు జాతీయ మీడియాకు చెప్పింది. తాను, తన పాప బతికున్నామో లేదో కూడా భర్త వాకబు చేయకపోవడంపై కన్నీటి పర్యంతమైంది. అతడితో జీవించాల్సిన అక్కర్లేదని భావించడంతో తాను భర్తకు తలాఖ్ చెప్పినట్లు వివరించింది. తనకు, తన భార్యకు పోషణ కోసం భర్త నుంచి నగదు(భరణం) ఇప్పించాలని కోర్టును ఆశ్రయిస్తానని చెప్పింది. షరియత్ చట్టాల ప్రకారం వివాహ సమయంలో చెప్పినట్లుగా చేశాను.. భార్యను, కుటుంబాన్ని పట్టించుకోని భర్త నుంచి విడిపోవడం సరైనదేని మత పెద్దలు చెప్పినట్లు గుర్తుచేసుకుంది. కట్నం కోసం వేదించిన వ్యక్తిపై ఐపీసీ 498 సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి తరఫు లాయర్ చెప్పారు. ఈ ఫిర్యాదుపై స్పందించి చట్టప్రకారం ఆమెకు న్యాయం చేయాలని, భర్త నుంచి పరిహారం ఇప్పించడం సబబేనని అభిప్రాయపడ్డారు. -
ఆ ఎమ్మెల్యే.. భార్యను కొట్టి వేధించేవారు!
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఢిల్లీ ప్రభుత్వ మాజీ న్యాయశాఖ మంత్రి సోమ్నాథ్ భారతి తరచు తన భార్యను వేధిస్తూ, కొట్టేవాడని పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. గృహహింస కేసులో ఆయనకు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఆయన భార్య లిపికా మిత్రా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ ఐఎస్ మెహతాకు పోలీసులు పైవిధంగా చెప్పారు. ఎమ్మెల్యే అయిన తన భర్తకు బెయిల్ ఇచ్చేముందు దిగువ కోర్టు తగిన విధంగా వ్యవహరించలేదని లిపికా మిత్రా కోర్టుకు విన్నవించారు. కోర్టు సూచనల మేరకు పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. లిపికా మిత్రా శరీరం మీద ఉన్న మచ్చలన్నీ కుక్క కాట్లు, కాలిన గాయాల వల్లేనని ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదికను కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే సోమ్నాథ్ భారతి తన భార్యను వేధించి, కొట్టి, తిట్టేవాడని, ఆమె ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా ఏమాత్రం ఊరుకోలేదని.. అలాగే కొనసాగించారని తెలిపారు. గర్భవతిగా ఉన్న సమయంలో లిపికా మిత్రా మధుమేహం, హైపర్ టెన్షన్తో బాధపడుతున్నట్లు వైద్య నివేదికలు స్పష్టం చేశాయన్నారు. అయితే తనపై తన భార్య చేస్తున్న ఆరోపణలను సోమ్నాథ్ భారతి ఖండించారు. -
భార్య చదువుకున్నా జీవనభృతి ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: భార్య చదువుకున్నంత మాత్రాన మధ్యంతర జీవనభృతిని నిరాకరించడం కుదరదని ఢిల్లీలోని సెషన్స్కోర్టు తీర్పునిచ్చింది. గృహహింస కేసులో దాఖలైన పిటిషన్ను విచారించిన అదనపు సెషన్స్ జడ్జీ వివేక్ గులియా, దిగువ మేజిస్ట్రియల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేశారు. మధ్యంతర భృతి పొందడానికి భార్య నిరాశ్రయురాలు కావాల్సిన అవసరం లేదన్నారు. భార్యకు నెలకు రూ.3,000 మధ్యంతర భృతి చెల్లించాల్సిందిగా ఆమె భర్తను ఆదేశించారు. 2015 జనరిలో పిటిషనర్కు వివాహమైన తర్వాత అదనపు కట్నం తేవాల్సిందిగా ఆమెను భర్త, అతని కుటుంబ సభ్యులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. దీంతో పెళ్లైన అయిదు నెలలకే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత మధ్యంతర భృతి కోసం మేజిస్ట్రియల్ కోర్టును ఆశ్రయించగా, పిటిషనర్కు తనను తాను పోషించుకోగల సామర్థ్యం ఉందని పటిషన్ను కోర్టు కొట్టేసింది. దీంతో ఆమె సెషన్స్కోర్టును ఆశ్రయించారు. -
సెల్ఫోన్లో మరణ వాంగ్మూలం
-
సెల్ఫోన్లో మరణ వాంగ్మూలం
వేధింపులు భరించలేక గృహిణి ఆత్మహత్య హైదరాబాద్: ‘భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులు భరించలేక చనిపోతున్నాను.. మన్నించమ్మా .. అంటూ తల్లి సెల్ఫోన్లో మరణ వాంగ్మూలాన్ని రికార్డు చేసి మరీ ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఎర్ర కుంట మినార్ కాలనీకి చెందిన ఆరీఫ్ తన కుమార్తె అంజుమ్ (20)ను.. యాకుత్పురాకు చెందిన వస్త్ర దుకాణ కార్మికుడు ఇర్ఫాన్ అలియాస్ ఆరీఫ్ (25)కు ఇచ్చి ఈ ఏడాది జనవరి 13న వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.50 వేల నగదుతో పాటు మూడు తులాల బంగారం ఫర్నిచర్ అందజే శారు. వివాహం అయిన కొన్నాళ్లకే భర్త, అత్త, ఆడపడుచులు అదనపు కట్నం తీసుకు రావా లని అంజుమ్ను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. పది రోజుల క్రితం ఆమె భర్త అదనపు కట్నం తీసుకురావాలని మీనార్ కాలనీలోని అత్తగారింట్లో వదిలేసి వెళ్లాడు. దీంతో గత పదిరోజులుగా తీవ్ర మానసిక వేదన అనుభవించిన ఆమె.. మంగళవారం రాత్రి తల్లి సెల్ ఫోన్ తీసుకొని అందులో తాను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడు తున్నానో వివరిస్తూ వీడియో రికార్డు చేసింది. అందులో భర్త ఆరీఫ్, అత్త ఆజియా ఉన్నీసా, ఆడపడుచులు అర్షియా, సాదియాలు తనను ఎలా వేధింపులకు గురిచేస్తున్నారో పూస గుచ్చినట్లు వివరించింది. అనంతరం బాత్రూమ్కు వెళ్లి తాడుతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. -
మహిళలపై గృహహింస దాడులే అధికం
రసాయన ప్రమాదాలకు గురైన మహిళలకు ఉచితంగా సర్జరీ చేయాలి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ మెక్ అలిస్టర్ సాక్షి, హైదరాబాద్: రసాయన దాడికి గురైన ప్రతి బాధితురాలికి న్యాయం జరగాలని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ మెక్ అలిస్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రసాయన ప్రమాదాల్లో వేధింపులు, గృహహింసకు సంబంధించిన వే ఎక్కువని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలకు గురైన మహిళలను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ప్రత్యేక కేటగిరీగా పరిగణించి ఉచితంగా సర్జరీలు చేయాలని కోరారు. నేర నివారణ, బాధితుల సంరక్షణపై చెన్నై కేంద్రంగా కొనసాగుతున్న పీసీవీసీ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసిడ్ దాడులు, కిరోసిన్, గ్యాస్ పేలుళ్లకు గురైన మహిళలను సంరక్షించేందుకు పనిచేస్తున్న సంస్థలకు బ్రిటిష్ కమిషన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఇలాంటి ప్రమాదాల విషయంలో తక్షణ సమాచారంతో పాటు మరణ వాంగ్మూలం కీలకమని, వీటి ఆధారంగా బాధితులకు న్యాయం జరిగేందుకు కృషి చేయొచ్చన్నారు. న్యాయ సేవల విభాగం ఆస్పత్రులతో సమన్వయం చేసుకుని బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చూడాలన్నారు. అనంతరం పీసీవీసీ సీఈఓ ప్రసన్న మాట్లాడుతూ రసాయన దాడులు, అగ్ని ప్రమాదాల బారిన పడ్డ మహిళలు మానసికంగా తీవ్ర ఆందోళనకు గురవుతారని, వారికి ఓదార్పు అవసరమన్నారు. ఇందులో భాగంగా తమ సంస్థ పనిచేస్తుందని.. చైన్నైలో దాదాపు 150 మందిని చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెప్పారు. -
ప్రముఖ దర్శకుడిపై గృహహింస కేసు!
విమర్శల ప్రశంసలందుకున్న ప్రముఖ చిత్ర దర్శకుడు సిద్ధార్థ శ్రీనివాసన్ గృహహింస కేసు ఎదుర్కొంటున్నారు. సాండ్స్ ఆఫ్ సోల్స్ (పైరన్ తల్లె) సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న శ్రీనివాసన్పై ఆయన భార్య దివ్యా భరద్వాజన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. తన తల్లిగారింటికి వెళ్లివచ్చిన తర్వాత తిరిగి ఇంట్లోకి రాకుండా తనను శ్రీనివాసన్ అడ్డుకుంటున్నారని, తన భర్త, అత్త మామ వేధిస్తున్నారని ఆమె కోర్టుకు నివేదించారు. తాను ఇంట్లోకి వచ్చేందుకు అనుమతించాలని, తనకు భరణం చెల్లించాలని ఆమె అభ్యర్థించారు. అయితే, కోర్టు ఆమె అభ్యర్థనను కొంతమేరకు మాత్రమే అంగీకరించింది. ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలో ఉన్న శ్రీనివాసన్ ఇంట్లోకి భార్యను అనుమతించాలని, ఆమెకు అటాచెడ్ టాయ్లెట్తో కూడిన ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలని ఆదేశించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి దివ్య గృహ హింస ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తున్నదని, ఇలాంటి పరిస్థితిలో సొంతిల్లు లేని ఆమెకు ఆశ్రయం, రక్షణ కల్పించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నామని, కాబట్టి భర్త ఇంట్లో ఆమె భాగం కింద గది కేటాయించాలని ఆదేశిస్తున్నామని అడిషనల్ సెషన్స్ జడ్జి వినోద్ కుమార్ పేర్కొన్నారు. 2013లో తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు భర్త శ్రీనివాసన్, ఆయన తల్లి అకస్మాత్తుగా చెప్పాపెట్టకుండా ఇల్లు విడిచి వెళ్లిపోయారని, దీంతో తనకు గత్యంతరం లేన తన తల్లి ఇంటికి వెళ్లానని, కాగా, ఇప్పుడు తాను తిరిగిరాగా, తన భర్త మకాం మార్చడమే కాదు.. కొత్తింట్లోకి తాను రాకుండా అడ్డుకున్నారని ఆమె కోర్టుకు తెలిపారు. విడాకులు ఇవ్వాలని తనను ఆయన బలవంతపెడుతున్నారని చెప్పారు. అయితే, ఆమెపై క్రూరంగా వ్యవహరించామన్న ఆరోపణలను శ్రీనివాసన్ తోసిపుచ్చారు. ఆమెను ఇంటి నుంచి గెంటివేయలేదని శ్రీనివాసన్ లాయర్ కోర్టుకు తెలిపారు. ఇద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉంటే మున్ముందు వివాదం మరింత పెరిగిపోవచ్చునని లాయర్ వాదించగా.. ఆ వాదనను కోర్టు కొట్టిపారేసింది. -
కానిస్టేబుల్ అరాచకం
-
ఆస్తులున్న మహిళలపై గృహహింస తక్కువ
గత దశాబ్ద కాలంలో, అంటే 2005-2006 నుంచి 2015-2016 మధ్యకాలంలో భారత్లో మహిళా సాధికారిత గణనీయంగా పెరిగింది. అయినా ఇంకా పెరగాల్సింది ఎంతో ఉంది. మహిళల పేరిట ఆస్తిపాస్తులు పెరగడం, బ్యాంకు ఖాతాలు పెరగడం, మహిళల మీద భర్తల హింస తగ్గడం, కుటుంబ నిర్ణయాల్లో మహిళల మాట చెల్లుబాలు అవడం, రుతుస్రావం సందర్భంగా ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకోవడం లాంటి అంశాలను మహిళా సాధికారతకు ప్రమాణాలుగా 'ఇండియాస్పెండ్' తీసుకొంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే సంస్థ సేకరించిన వివరాలతో ఇండియాస్పెండ్ సంస్థ ఈ విశ్లేషణలు చేసింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే సంస్థ మహిళల పేరిట లేదా జాయింట్ పేర్లపై ఉన్న భూములు, ప్లాట్లు, ఇళ్లు తదితర ఆస్తులను మొదటిసారి సర్వే చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎంతమంది మహిళలకు ఆస్తిపాస్తులున్నాయనే అంశాన్ని అంచనావేసింది. తద్వారా మరో ఆశ్చర్యకరమైన విషయం మొదటిసారి వెలుగులోకి వచ్చింది. ఆస్తిపాస్తులున్న మహిళలపై గృహహింస, ముఖ్యంగా భర్తల హింస బాగా తగ్గుతూ వచ్చింది. దేశంలోనే మణిపూర్ రాష్ట్రంలో మహిళల పేరిట ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్నాయి. అయినా అక్కడి మహిళపై భర్తల హింస ఎక్కువగా ఉంటోంది. దానికి కారణం.. ఆస్తులు లేని మహిళలపై గృహ హింస ఎక్కువగా ఉండటం ఒకటి, వెనకబడిన కులాల సంస్కృతి మరొకటి అని అంటున్నారు. మణిపూర్ మహిళల్లో 69.9 శాతం మందికి ఆస్తిపాస్తులుండగా, బీహార్లో 58.8 శాతం మంది మహిళుల పేరిట ఆస్తిపాస్తులున్నాయి. ఏడోస్థానంలో తెలంగాణ (50.50 శాతం), ఎనిమిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ (44.70) రాష్ట్రాలు నిలవగా, చివరి రెండుస్థానాల్లో అండమాన్ నికోబార్, సిక్కిమ్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆస్తిపాస్తుల విషయానికొస్తే 58.20 శాతంతో తెలంగాణ నాలుగో స్థానంలో, 45.10 శాతంతో ఆంధ్రప్రదేశ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. మహిళా సాధికారతలో ముఖ్య కొలమానాల్లో ఒకటైన బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండడంలో మహిళలు ఎంతో పురోభివృద్ధి సాధించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 35.80 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు కలిగి ఉండగా, 82 శాతంతో గోవా మొదటి స్థానంలో, 81.8 శాతంతో అండమాన్ నికోబార్ రెండోస్థానంలో 77 శాతంతో తమిళనాడు మూడో స్థానంలో ఉన్నాయి. దశాబ్దకాలంలో ఈ అంశంలో తమిళనాడులోనే ఎక్కువ పురోభివృద్ధి కనిపిస్తోంది. 2005–6 సంవత్సరంలో బ్యాంకు ఖాతాలు కలిగిన మహిళల సంఖ్య ఆ రాష్ట్రంలో కేవలం 15.9 శాతం కాగా, ఇప్పుడు వారి సంఖ్య 77 శాతానికి చేరుకొంది. అంటే 61.1 శాతం వృద్ధి ఒక్క దశాబ్దకాలంలోనే చోటుచేసుకుంది. హర్యానా, కర్ణాటక, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో గృహహింస పెరగ్గా, మిగతా రాష్ట్రాలో గృహహింస తగ్గింది. అన్ని రాష్ట్రాలకన్నా త్రిపురలో గృహహింస ఎక్కువగా తగ్గింది. 44.1 శాతం నుంచి 27.9 శాతానికి తగ్గగా, మేఘాలయలో 12.8 శాతం నుంచి 28.7 శాతానికి గృహహింస పెరిగింది. మొత్తం దేశంలో 29 రాష్ట్రాలకుగాను 14 రాష్ట్రాలను, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గణాంకాలను మాత్రమే 'ఇండియాస్పెండ్' సంస్థ విశ్లేషించింది. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమాచారాన్ని 'నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే' ఇంకా విడుదల చేయాల్సి ఉంది. -
గర్ల్ఫ్రెండ్ను హీరో పిచ్చికొట్టుడు కొట్టాడు
లాస్ ఎంజెల్స్: తన ప్రేయసిని ఇంట్లో పడేసి చావుదెబ్బలు కొట్టినందుకు ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ సీజ్మోర్ను పోలీసులు అరెస్టు చేశారు. గృహహింస కింద అతడిపై అభియోగాలు మోపారు. సేవింగ్ ప్రైవేట్ రియాన్, బ్లాక్ హాక్ డోన్ వంటి ప్రముఖ చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించిన ఆయనను మంగళవారం ఉదయం తర్వాత తమ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టామ్ ఇంటి నుంచి 911 నెంబర్ కు పదే పదే ఫోన్ కాల్స్ వచ్చాయి. అందులో బాగా ఏడుస్తున్నట్లు కేకలు వినిపించాయి. ఫైటింగ్ జరుగుతున్న రేంజ్ లో చప్పుళ్లు వినిపించాయి. దీంతో, శరవేగంగా అక్కడికి పోలీసులు వెళ్లగా ఓ యువతిపై చేయి చేసుకుంటూ టామ్ కనిపించాడు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత పోలీసులకు ఆమె అతడి గర్ల్ ఫ్రెండ్ అని తెలిసింది. తొలుత వాదులాడుకున్నవారు అనంతరం చేయిచేసుకునే వరకు గొడవ వెళ్లిందని గుర్తించారు. తన ముఖంపైనా, తలపైన కొట్టాడని పోలీసులకు ఆమె చెప్పింది. గాయాలు కూడా బాగానే పైకి కనిపించాయి. అయితే, మెడికల్ పరీక్షలకు వెళ్లేందుకు ఆమె నిరాకరించింది. -
భర్త ల్యాప్ టాప్ లాక్కున్నాడని..
తాను ఎనిమిదో తరగతిలో టాప్ మార్కులు తెచ్చుకోవడంతో లభించిన ల్యాప్ టాప్ అది. తాగుడు బానిస అయిన భర్త దానిని లాక్కొని అమ్మేందుకు ప్రయత్నించాడు. భార్యకు చాలా కోపం వచ్చింది. క్షణికావేశంలో తాగినమైకంలో ఉన్న భర్తను ఓ పెద్దరాయి తీసుకొని విసిరికొట్టింది. ఆ దెబ్బ గట్టిగా తలకు తగలడంతో భర్త వెంటనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని కనొటాలో గురువారం జరిగింది. నిందితురాలికి 16 ఏళ్ల ప్రాయంలోనే హర్ఫుల్ (20) అనే వ్యక్తితో పెళ్లయింది. హర్ఫుల్ ఓ ఆటోమొబైల్ షో రూమ్ లో పనిచేస్తున్నాడు. హర్ఫుల్ తాగుబోతు కావడంతో అతనికి భార్యతో నిత్యం గొడవ జరిగేది. భార్యకు మూడేళ్ల కిందట ఎనిమిదో తరగతిలో టాప్ రావడంతో ల్యాప్ టాప్ బహుమతిగా లభించినది. ఆ అపురూపమైన బహుమతిని కూడా తాగుడు డబ్బుల కోసం అమ్మేందుకు హర్ఫుల్ ప్రయత్నించాడు. నువ్వు మూడేళ్ల కిందటే చదువు ఆపేశావు కనుక నీకు ల్యాప్ టాప్ తో అవసరం లేదని భార్యతో వాదించాడు. భార్యతో ఆ బహుమతిని వదులుకొనేందుకు సిద్ధపడలేదు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భర్త తన మాట ఎంతకూ వినకపోవడంతో ఇంట్లో కుండలకు కుదురుగా ఉండేందుకు పెట్టే పెద్ద రాయిని తీసుకొని భార్య విసిరికొట్టింది. అది హర్ఫుల్ తలకు తగలడంతో అతను వెంటనే కుప్పకూలడు. భార్య తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు హర్ఫుల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై జైపూర్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
అమెరికాలో భర్తల వేధింపులకు సంబంధించి vawa చట్ట ప్రకారం భార్యలకు రక్షణ
కేస్ స్టడీ రాఘవేంద్రరావు, రామలక్ష్మి దంపతులు సీనియర్ సిటిజన్స్. వారి ఒక్కగానొక్క కూతురు నీలిమకు ఆరునెలల కిందట ఘనంగా వివాహం చేసి, భర్తతో బాటు అమెరికాకు పంపించారు. అబ్బాయి అమెరికాలోనే చదువుకుని, అక్కడే మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. ఎన్నారై సంబంధం కదా అని కోటిరూపాయలదాకా కట్నం ముట్టచెప్పారు రాఘవేంద్రరావు. అయితే పెళ్లయి అమెరికా వెళ్లినప్పటినుంచి అమ్మాయి సంతోషంగా లేదని, భర్త తీవ్రమైన గృహహింసకు పాల్పడుతున్నాడీ, మానసికంగా, శారరకంగా వేధిస్తున్నాడని అతనికి తెలిసింది. అతి కష్టం మీద కూతురు వారికి ఈ విషయాలు చేరవేసింది. తాను భర్తపై న్యాయపోరాటం చేస్తానని, మీరు ధైర్యంగా ఉండ ండని చెప్పింది. అయితే తనకు అక్కడ ఏ చట్టాన్ని ఆశ్రయించాలో అర్థం కావట్లేదని తెలియజేసింది. అక్కడి గృహహింసకు సంబంధించి ఏ చట్టం ఉందో అవగాహన కోసం న్యాయవాదిని సంప్రదించారు రాఘవేంద్రరావు. అమెరికాలో భర్తల వేధింపులకు సంబంధించి ‘వయొలెన్స్ అగెనైస్ట్ ఉమెన్ యాక్ట్’ (గఅగిఅ) ఉందని, ఆ చట్టాన్ని అనుసరించి బాధితురాలైన గృహిణులకు రక్షణ, నివాసం, జీవనభృతి, న్యాయసహాయం లభిస్తాయని, అమెరికాలో ఉండి చట్టాన్ని ఆశ్రయించిన మహిళలకు వారి దరఖాస్తు మేరకు పర్మినెంట్ రెసిడెన్సీ హోదా కల్పిస్తారని న్యాయవాది తెలియజేశారు. కూతురికి ‘వావా’ చట్టం గురించి చెప్పి, అక్కడి లాయర్లను సంప్రదించమని చెప్పారు రాఘవేంద్రరావు దంపతులు. -
ఆ దేశాల్లో భార్యను కొట్టడం సబబే!
ప్రపంచదేశాల్లో ఎక్కడా మహిళలపై ఎలాంటి హింస కూడదని 40 ఏళ్ల క్రితమే ఐక్యరాజ్యసమితి ఓ తీర్మానం చేసింది. ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. ఇప్పుడు అదే ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఆగ్నేయ ఆసియాలోని తూర్పు టీమొఎల్ దేశంలో ఆడవాళ్లను గృహ హింసకు గురిచేయడం సబబేనని 81 శాతం టీనేజీ అమ్మాయిలే అంగీకరించారట. ఆ తర్వాతి స్థానాల్లో కిరిబాటి, సాల్మన్ ఐలాండ్స్, ఇథియోపియా, భూటాన్ లాంటి దేశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో గృహహింస తప్పుకాదని యాభై శాతానికి పైగా ప్రజలు భారత్, పాకిస్తాన్ దేశాల్లో కూడా అంగీకరిస్తున్నారు. భార్యలపై 71శాతం గృహ హింస కొనసాగుతున్న ఇథియోపియా దేశంలో భర్తను, భార్యను కొట్టడం తప్పేమీ కాదని 64.8 శాతం మంది మహిళలు అభిప్రాయపడుతున్నారు. వంట చేసేటప్పుడు కూర మాడిస్తే కొట్టరా? అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఆసియా పసిఫిక్ దేశాల్లో భార్యను కొట్టడం కొన్ని సందర్భాల్లో సమంజసమేనని టీనేజీ అమ్మాయిలతోపాటు 51 శాతం నుంచి 25 శాతం టీనేజీ అబ్బాయిలు అంగీకరించడం నేటి ఆధునిక ప్రపంచంలో ఆశ్చర్యకరమే. పురుషాధిక్య సమాజం నుంచి సంక్రమించిన గృహ హింస కొన్నిదేశాల్లో ఇప్పటికీ కొనసాగడమే కాకుండా దానికి సమాజం ఆమోదం లభించడం విచారకరమని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వ్యాఖ్యానించింది. అవిద్య, నిరుద్యోగం, వంశపారంపర్యంగా కుటుంబంలో కొనసాగుతున్న హింస తదితర కారణాల వల్లనే పలు ఆసియా పసిఫిక్ దేశాల్లో గృహ హింసకు ఆమోదం లభిస్తోందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాది కన్నా మహిళలపై గృహ హింస తగ్గిందని, ఆమోదం ఉన్న ఆసియా పసిఫిక్ దేశాల్లో కూడా తగ్గుముఖం పడుతోందని, భవిష్యత్తులో ఇది మరింత తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. -
నైతికంగానూ, చట్టప్రకారం కూడా ఆ వివాహం సబబు కాదు
మేము సిక్కు మతస్థులము. మా వివాహమై ఐదేళ్లయింది. నా భర్త బ్యాంక్ ఆఫీసర్. తోటి ఉద్యోగినితో అక్రమ సంబంధం ఏర్పరచుకుని, నన్ను వదిలేసి నిస్సిగ్గుగా ఆమెతోనే కాపురం పెట్టాడు. నేనెన్నో ప్రయత్నాలు చేశాను. అన్నీ విఫలమైనాయి. కోర్టులో విడాకుల కేసు వేయాలని ఉంది. చట్టాల పట్ల అవగాహన లేదు. విడాకుల విషయంలో సిక్కుమతస్థులకు ఎలాంటి చట్టం ఉంది? వివరాలు తెలియజేయగలరు. - హర్వీందర్ కౌర్, హైదరాబాద్ మన దేశంలో వివిధ మతస్థుల వారు నివసిస్తున్నారు. వారిమధ్య వివాహానికి సంబంధించిన వివాదాలు అంటే విడాకులు, మనోవర్తి, పిల్లల కష్టడీ, భార్యాభర్తలకు సంబంధించిన ఆస్తి వ్యవహారాలు మొదలైన విషయాల్లో కోర్టును ఆశ్రయించాలంటే వారి వారి వ్యక్తిగత న్యాయచట్టాలు అంటే పర్సనల్ లా స్ ఉన్నాయి. హిందువులకైతే హిందూ వివాహ చట్టం 1955 ఉంది. క్రైస్తవులకు సంబంధించి ‘కైస్తవ వివాహ చట్టం’, విడాకుల చట్టం రెండూ ఉన్నాయి. ముస్లిములకు సంబంధించి వారి పర్సనల్ లా అంటే షరియత్ చట్టం ఉంది. అంతేకాదు, ముస్లిం మహిళలు విడాకులు పొందడానికి మహమ్మదీయ వివాహాల రద్దు చట్టం 1939 ఉంది. మతాల మీద విశ్వాసం లేనివారికి, మతాంతర వివాహాలు కోరుకునేవారికి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ఉంది. ఇక మీ సంగతి. మీరు సిక్కులు కనక మీరు హిందూ మతస్థులుగా పరిగణింపబడి హిందూ వివాహచట్టం పరిధిలోకి వస్తారు. కనుక మీరు హిందూ వివాహ చట్టాన్ని అనుసరించి మీ భర్త నుండి విడాకులు పొందవచ్చు. మీతోబాటు జైనులు, బౌద్ధులు కూడా హిందూ వివాహ చట్ట పరిధిలోకే వస్తారు. పార్సీమతస్థులకు, యూదుమతస్థులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. మాకు ఒక్కడే సంతానం. మెడిసిన్ పూర్తి చేసి పీజీకి ప్రిపేర్ అవుతున్నాడు. ఇటీవల వాడు తన క్లాస్మేట్ ఒకమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి తాము ప్రేమించుకున్నామని, పెళ్లి చేయమని అడిగాడు. ఆమె ఒక ఎన్నారై. అమ్మానాన్నలు అమెరికాలో 20 సంవత్సరాల నుండి ఉంటున్నారట. అమ్మాయి చాలా చక్కగా ఉంది. మేము అమ్మాయి అమ్మానాన్నల గురించి విచారిస్తే దిగ్భ్రాంతికరమైన విషయం తెలిసింది. మా వారు మంచం పట్టే పరిస్థితి వచ్చింది. అసలు విషయం... ఆ అమ్మాయి... అంటే మా వాడు ప్రేమించిన అమ్మాయి మా వారి మొదటి భార్య కూతురు. విడాకుల తర్వాత ఆమె అమెరికా వెళ్లి మరల వివాహం చేసుకుని అక్కడే స్థిరపడింది. మా వాడికి ఎలా చెప్పాలి? - విజయలక్ష్మి, గుంటూరు ఆమె చెల్లెలవుతుందని లక్షణంగా చెప్పండి, వారు వివాహం చేసుకోకూడదనీ చెప్పండి. మనం ఎంత అభివృద్ధి సాధించినా, కాలం ఎంత మారుతున్నా, సామాజిక పరిస్థితులు ఎంత మారుతున్నా, మన సమాజంలో కొన్ని కట్టుబాట్లూ, నీతినియమాలు, రీతి రివాజులు ఉన్నాయి. మానవ సంబంధాలు వికృతమవ్వకుండా కొన్ని నిషేధాలు ధర్మబద్ధంగా చట్టబద్ధంగా ఏర్పరచుకున్నాము. హిందూ వివాహ చట్టప్రకారం కొన్ని షరతులు ఉన్నాయి. వాటిలో ఒకటి వధూవరుల మధ్య నిషేధించబడిన బంధుత్వాలు ఉండకూడదు. ఇది రక్తసంబంధీకులకు కూడా వర్తిస్తుంది. మీ అబ్బాయి, ఆ అమ్మాయి అసంపూర్ణ రక్తసంబంధీకులు అంటే హాఫ్ బ్లడ్ బ్రదర్ అండ్ సిస్టర్ అన్నమాట. అంటే ఒక తండ్రి ఇరువురు తల్లులకు పుట్టిన సంతానం అన్నమాట. ఇలాంటి వివాహాలు సెక్షన్ 5 హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లవు. కాబట్టి మోరల్గా, లీగల్గా కూడా వారిద్దరూ వివాహం చేసుకోకూడదు. చదువుకున్న పిల్లలు అర్థం చేసుకుని, సిగ్గుపడి సర్దుకుంటారు, సరిదిద్దుకుంటారు. సందేహ పడకండి. మాకు విడాకులై సంవత్సరం దాటింది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాము. నాకు ఒక పాప ఉంది. ఆమె నా కష్టడీలోనే ఉంది. అతను నెలకొకసారి పాపను చూసేందుకు విజిటింగ్ రైట్స్ పొందాడు. కానీ పాపను చూడ్డానికి వచ్చిన ప్రతిసారీ నన్ను వేధిస్తున్నాడు. కేసు పెట్టే ఓపిక లేదు. ఈ వేధింపులు కూడా గృహహింస కిందికి వస్తాయా? - కృష్ణవేణి, నెల్లూరు మీ సందేహం అర్థమైంది. భార్యాభర్తలుగా మీ బంధం తెగిపోయినా పాప తలిదండ్రులుగా మీ సంబంధం ఇంకా ఉంది. విడాకులు తీసుకున్న భార్య కూడా గృహ హింస చట్టం కింద బాధితురాలే. కనుక మీరు, పాపను చూడ్డానికి మీ మాజీ భర్త వచ్చినప్పుడు మిమ్మల్ని వేధిస్తున్నాడని, అటువంటి వేధింపుల నుంచి మీకు రక్షణ కల్పించమనీ కోర్టువారిని కోరండి. మీ సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని కోర్టు తగిన ఆదేశాలు ఇస్తుంది. అతని వేధింపులను సెల్ఫోన్లో చిత్రీకరించి లేదా రికార్డ్ చేసి కోర్టువారి ముందు పెట్టండి. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమస్యలనుండి బయట పడడానికి వాడుకోండి. లీగల్ కౌన్సెలింగ్ ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
మాజీ భర్తపై కేసు పెట్టిన నటి
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కరిష్మాకపూర్ దంపతుల వివాదం ఇంకా ఒక కొలిక్కి రాకముందే మరో సినీ, టీవీనటి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. బిగ్బాస్ స్టార్ దీప్శిఖా నాగ్ పాల్ తన మాజీ భర్త, నటుడు కేశవ్ అరోరాపై గృహహింస కేసు పెట్టింది. తనపై భౌతికంగా దాడి చేయడంతో పాటు చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ బంగూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 2012 లో వివాహం చేసుకున్న ఈ జంట మనస్పర్దల కారణంగా ఇటీవల విడాకులు తీసుకుంది. ఇంతలోనే మళ్లీ రచ్చకెక్కడం చర్చకు దారి తీసింది. విడాకుల తర్వాత అతనిలో మార్పు వస్తుందనుకున్నా.... కానీ అలాజరగలేదని దీప్సిఖ మీడియాకు తెలిపింది. మహిళా దినోత్సవం రోజు తనపై దాడి చేసి కొట్టాడని ఆరోపించింది. దాన్నిసహించడం తన వల్ల కాదని పేర్కొంది. ఈ విషయంలో తాను మౌనంగా వుంటే.. మిగతా మహిళల పరిస్థితి ఏంటని దీప్సిఖ ప్రశ్నించింది. అందుకే ఫిర్యాదు చేశానంది. తనకు న్యాయ కావాలని కోరుతోంది. రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంది.. కాగా బాలీవుడ్ లో పార్టనర్, కార్పొరేట్ లాంటి సినిమాల్లో నటించింది. నటుడు జీత్ ఉపేంద్ర ను పెళ్లి చేసుకున్న10 సంవత్సరాల తర్వాత 2007 లో విడిపోయారు. -
ఇంట్లో, బయట.. ‘ఆమె’పై హింస
ఆందోళన కలిగిస్తున్న నేరాల తీరు పెరుగుతున్న గృహ హింస కేసులు వరంగల్ క్రైం : గత నాలుగేళ్లతో పోలిస్తే మహిళలపై వేధిం పులు, వరకట్న హత్యలు, గృహ హింస కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. మహిళలపై నేరాలను అదుపు చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినా పరిస్థితిలో మార్పు రా వడం లేదు. అధికారిక గణాంకాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారుు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లలో నిండిపోరుున బూతు సాహిత్యం, అశ్లీల చిత్రాలు యువతను పెడదారి పట్టిస్తున్నారుు. సామూహిక అత్యాచారాలు, అత్యాచారయత్నాలు, కట్నం కోసం వేధించడం, తీసుకురాకుంటే హత్యకు పాల్పడడడం, భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకోవడం, ప్రేమించాలని వేధింపులు, మహిళల అక్ర మ ర వాణా, కిడ్నాప్ వంటి జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నారుు. ఇది మా కర్మ అనుకుని సర్దుకుపోయే మహిళలు కొందరుంటే.. ఆ బాధలు భరించలేక ఈలోకా న్ని విడిచి వెళ్లిన అభాగ్యులు అనేక మంది ఉన్నారు. నిర్భ య, గృహ హింస నిరోధక చట్టాల్లాంటివి ఉన్నప్పటికీ పో లీస్స్టేషన్, కోర్టు మెట్లెక్కడానికి మహిళలు, యువతులు ‘పరువు’ సమస్యతో ఇంకా వెనుకాడుతూనే ఉన్నారు. షీ టీమ్లు బలోపేతం కావాలి.. హైదరాబాద్ తరహాలో వరంగల్లో షీటీమ్లను ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటు తర్వాత మహిళలు, కాలేజీ యువతులపై వేధింపులు తక్కువయ్యాయి. బస్టాండ్లు, కళాశాల లు, ప్రముఖ కూడళ్లలో టీ షీమ్ బృందాలు పోకిరీల పనిపడుతున్నారు. వారి తల్లిదండ్రులను స్టేషన్లకు పిలిపించి తల్లిదండ్రుల ఎదుటే కౌన్సెలింగ్ చేయడంతో సత్ఫలితాలు వస్తున్నారుు. 2015 ఏప్రిల్లో షీ టీమ్లు ఏర్పాటయ్యూక ఇప్పటి వరకు 324 మంది పోకిరీలను పట్టుకున్నారు. ఇం దులో 250 మందిపై కేసు నమోదు చేసి జైలుకు పంపగా, మిగతా మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే వారిని యూంటీ ర్యా గింగ్, ఈవ్టీజింగ్ క్యాంపెరుున్లలో భాగస్వామ్యం చేస్తూ వారిలో మార్పు తీసుకొస్తున్నారు. -
వేధింపుల తో వివాహిత ఆత్మహత్య
భర్త వేధింపులు తాళలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మారేపల్లి సాయిరెడ్డి, సరిత దంపతులు దూలపల్లి వీకర్సెక్షన్ కాలనీలో ఉంటున్నారు. కిరాణా దుకాణం నడిపే సాయిరెడ్డి కొంతకాలంగా భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. జీవితంపై విరక్తి చెందిన సరిత బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సాయిరెడ్డిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
పక్కింట్లో గృహహింస? బాధితుల తరఫున మీరు కేసు వేయవచ్చు!
లీగల్ కౌన్సెలింగ్ మా పక్కింట్లో ఒక జంట నివసిస్తున్నారు. వారికి దాదాపు ముప్ఫయ్యేళ్లు ఉండవచ్చు. అతను ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె గృహిణి. వారు ఆ ఇంట్లో అద్దెకు దిగి ఆరునెలలైంది. విషయమేమిటంటే ఆమె ఎప్పుడూ బయటకు రాదు. ఎవరితోనూ కలవదు. దాదాపు నెలరోజుల నుండి రాత్రివేళల్లో ఆమె ఏడ్పులు, కేకలు వినిపిస్తున్నాయి. అది భార్యాభర్తల విషయం ఏమో అని మేము మొదట్లో పట్టించుకోలేదు. ఆ తర్వాత ఉండబట్టలేక ఆమెను అడిగితే అతి కష్టం మీద చెప్పింది. తనను భర్త ప్రతిరోజూ హింసిస్తున్నాడనీ, బయటకు రానివ్వడం లేదనీ. ఎవరికైనా తెలియజేద్దామంటే కనీసం తన దగ్గర ఫోన్ కూడా లేదని, ఎలాగైనా తనను కాపాడమని అడిగింది. అయితే విషయం పోలీసుల వరకు వెళ్లనివ్వవద్దని అభ్యర్థించింది. మేము ఏం చేయమంటారు? సలహా ఇవ్వగలరు. - కనకలత, హైదరాబాద్ మీరు వెంటనే మీ పక్కింట్లో గృహ హింస జరుగుతోందని ఫోన్ ద్వారాగానీ, ఈ మెయిల్ ద్వారా గానీ మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన రక్షణాధికారికి (ప్రొటెక్షన్ ఆఫీసర్)కు తెలియబరచండి. బాధితురాలు నిస్సహాయ స్థితిలో, బయటకు రాలేని సందర్భాల్లో, అత్యవసర పరిస్థితుల్లో బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు వారు ఆమె తరఫున ఫిర్యాదు చేయవచ్చు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు తప్పకుండా స్పందిస్తారు. వారు వెంటనే ఆ ఇంటికి వచ్చి తమకు అందిన సమాచారం నిజమని రుజువైతే గృహహింస సంఘటన నివేదిక తయారు చేసి గృహహింస చట్టప్రకారం తగు ఆదేశాలు పొందడానికి ఎలాంటి జాప్యమూ లేకుండా తగిన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే పోలీసుల సాయం తీసుకుంటారు. నేనొక సీనియర్ సిటిజన్ను. పైగా హార్ట్ పేషెంట్ను. వైద్యం నిమిత్తం శ్రీకాకుళం నుండి హైదరాబాద్కు రైలులో ప్రయాణించాను. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీ టికెట్ తీసుకున్నాను. మార్గంమధ్యలో రైల్వే అధికారులు చెకింగ్కు వచ్చి, వయస్సు ధృవీకరణ పత్రం చూపించమన్నారు. నేను నా హాస్పిటల్ రిపోర్టులు, హాస్పిటల్ ఐడీ చూపించాను. వారు అవి సరిపోవని ఛీత్కరిస్తూ నాకు పెనాల్టీ విధించారు. అంతేగాక డెబ్భయ్యేళ్ల వాడినని కూడా చూడకుండా నాపట్ల అగౌరవంగా ప్రవర్తించారు. నేనెంతో మానసిక వ్యధకు లోనయ్యాను. నేను నా పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్య తీసుకోవలసిందిగా రైల్వే ఉన్నతాధికారులను కోరవచ్చునా? అందుకు నేను ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వండి. - ఎం. పైడితల్లి, పాలకొండ అనాగరిక చర్యలు సేవల్లోని లోపాలే అని వినియోగదారుల రక్షణ చట్టం స్పష్టంగా చెప్పింది. మీరు టికెట్ కొని రైలులో ప్రయాణించారు కాబట్టి మీరు వినియోగదారుడే అవుతారు. సీనియర్ సిటిజన్స్ పట్ల గౌరవంగా మెలగడమనేది కనీస బాధ్యత. చాలామంది అలా చేయడం లేదు. ఇలాంటి విషయాలు జాతీయ కమిషన్ దృష్టి వరకు వెళ్లాయి. ఈ ప్రవర్తన మంచిది కాదని, దురుసు మరియు అగౌరవకరమైన ప్రవర్తనకు సంస్థలు బాధ్యత వహించవలసి ఉంటుందని అనేక సందర్భాలలో జాతీయ కమిసన్ సర్వీస్ ప్రొవైడర్లను హెచ్చరించింది. వారి ప్రవర్తనలో మార్పు రావాలని సూచించింది. సీనియర్ సిటిజన్లకు సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంస్థలను బాధితులకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా చాలా సందర్భాల్లో, చాలా కేసుల్లో తీర్పులు ఇవ్వడం జరిగింది. వినియోగదారులందరి పట్లా సంస్థల ప్రవర్తనా సరళి సుహృద్భావంతో ఉండాలి మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల పట్ల. మీ వేదన తీరాలంటే వినియోగదారుల ఫోరంలో కేసు వేయండి. మీరు ఫైన్కట్టిన రశీదు, మీ రైల్ టికెట్ జతపరచి కేసు వేయండి. ఇందుకు నామమాత్రపు కోర్టు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. మీకు తప్పక న్యాయం జరుగుతుంది. వయోవృద్ధులు కనుక మీ కేసు సత్వరం పరిష్కారమవుతుంది. మీకు నస్టపరిహారం అందుతుంది. నా పేరు రుక్సానా. మాకు వివాహమై 8 సంవత్సరాలయింది. ఆరేళ్లబాబు, ఏడేళ్ల పాప ఉన్నారు. నేను నా భర్తనుండి విడాకులు తీసుకున్నాను. నా పిల్లలకు సంరక్షకులెవ్వరు? పిల్లలు నా దగ్గర ఉండవచ్చునా? హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంరక్షణ విషయంలో తలిదండ్రులిద్దరూ సహజ సంరక్షకులే. అంటే నేచురల్ గార్డియన్స్. కానీ మహమ్మదీయ ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి మాత్రమే సహజ సంరక్షకుడు. పసిపిల్లల సంరక్షణ విషయంలో ప్రధాన బాధ్యత తండ్రిదే అయినప్పటికీ మగపిల్లలకు ఏడు సంవత్సరాల వయసు వరకు, ఆడపిల్లలకు యుక్తవయసు వరకు తల్లి అధీనంలో ఉండవచ్చు. ఈ కష్టడీని హిజానత్ అంటారు. విడాకులు పొందిన స్త్రీలకూ ఇది వర్తిస్తుంది. అయితే అబ్బాయికి ఏడు సంవత్సరాలు, అమ్మాయికి యుక్తవయసు రాకముందే మీరు మరలా వివాహం చేసుకుంటే పై అర్హతను మీరు కోల్పోతారు. అంటే పిల్లలు తండ్రి అధీనంలోకి వెళతారు. నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది. ఇంతవరకూ మా మధ్య ఎటువంటి శారీరక బంధమూ ఏర్పడలేదు. ఆయన సంసారానికి పనికిరారనే విషయాన్ని కప్పిపుచ్చి నన్ను మోసపూరితంగా పెళ్లి చేసుకున్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మా ఆయన, తమ తప్పును ఒప్పుగా చేసుకునేందుకు మా అత్తమామలు నాపైన లేనిపోని నిందలు మోపుతున్నారు. ఈ వైవాహిక బంధాన్ని కొనసాగించటం నాకు ఇష్టం లేదు. దీని నుంచి బయట పడాలంటే ఏం చేయాలి? -పి. కృష్ణావతి, పెదవడ్లపూడి మీ వారు సంసారానికి పనికి రారంటున్నారు, పైగా మీపైన లేనిపోని నిందలు మోపుతూ మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా బాధిస్తున్నాడంటున్నారు. దీనికి తోడు మీ అత్తమామలు కూడా మిమ్మల్ని సూటిపోటి మాటలంటూ మిమ్మల్ని బాధపెడుతున్నారంటున్నారు కాబట్టి మీరు ఈ విషయాలను వివరిస్తూ, మీ వివాహాన్ని రద్దు చేయవలసిందిగా కోరుతూ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయండి. మీరు చెప్పిన విషయాలను కోర్టులో నిరూపించగలిగితే కోర్టు మీ పెళ్లిని రద్దు చేస్తూ, మీకు విడాకులు మంజూరు చేస్తుంది. తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. కుక్క కాటుకి చెప్పుదెబ్బలా... కేస్ స్టడీ సుప్రియ, విజయ్లు భార్యాభర్తలు. వారి వివాహమై ఏడేళ్లయింది. ఒక పాప కూడా. అయితే ఇటీవల విజయ్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. చీటికి మాటికీ సుప్రియను మాటలతో, చేతలతో హింసిస్తున్నాడు. ఇంటికి ఆలస్యంగా రావడం, అర్ధరాత్రిళ్లు తగాదా పడటం, ఇంట్లోనుండి తక్షణమే వెళ్లిపొమ్మని ఆర్డరేయడం ఎక్కువైంది. సుప్రియ మౌనంగా భరించింది. అసలు కారణం కనుక్కునే ప్రయత్నం చేసింది కానీ వృథాప్రయాసే అయింది. ఒకరోజు అర్ధరాత్రప్పుడు బాగా తాగి వచ్చి ఆమెనూ, పాపనూ ఇంటినుండి గెంటివేశాడు విజయ్. ఎక్కడికెళ్లాలో పాలుపోలేదు సుప్రియకు. అమ్మానాన్నా వృద్ధులు. వారి మీద తమ బరువు బాధ్యతలు వేయడం ఇష్టంలేదు. దాంతో ఒక స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుని భర్త మీద గృహహింస కేసు పెట్టింది. కొంతకాలంపాటు తాను తలదాచుకోవడానికి అత్యవసరంగా ఒక గూడు కావాలి కాబట్టి భర్తతో కలిసి ఉన్న ఇంటిలో నివసించేలాగా ఆర్డర్ కావాలని కోర్టువారిని అభ్యర్థించింది. ఆ ఇల్లు ఎలాగూ భర్తదే. అతని పేరు మీదే ఉంది. కేసు దాఖలై విజయ్కు నోటీసు వెళ్లింది. మొదటి వాయిదా నాటికే ఆ ఇంటిని తల్లి పేరుమీద బదిలీ చేసి తనకసలు ఇల్లే లేదని, అది తల్లి ఇల్లనీ వాదించాడు విజయ్. భార్యాభర్తల మధ్య వివాదం మొదలైన తర్వాత అదీ కేస్ వేసిన తర్వాత దురుద్దేశ్యపూర్వకంగా ఆ ఇంటిని విజయ్ తల్లి పేరున బదలీ చేశాడనీ కనుక సుప్రియకు, పాపకూ నివాస హక్కులుంటాయనీ కోర్టువారు హెచ్చరించారు. - ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
'అక్కడ సీన్ చూసి అవాక్కయ్యారు'
ఆమ్స్టర్డ్యామ్: కొందరు చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ తెగపాడేస్తుంటారు. కొంతమంది పాడుతుంటే వినేవాళ్లకు కర్ణకఠోరంగా ఉంటుందనేది వాస్తవం. అయితే తమ గాత్ర మాధుర్యం ఎంత అసహ్యంగా ఉంటుందనేది ఆ పాడేవారికి తెలియదు. నెదర్లాండ్స్లో ఇలాంటి ఓ వ్యక్తి గొంతు విన్న ఇరుగుపొరుగు వారు ఏకంగా ఇంట్లో గృహహింస జరుగుతోందని భావించి పోలీసులకు ఫోన్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆమ్స్టర్డ్యామ్లోని ఓ అపార్ట్మెంట్ వాసులకు మంగళవారం రాత్రి ఓ భయంకరమైన గొంతు వినిపించింది. ఆ అరుపులు ఎక్కడి నుండి వస్తున్నాయా అని గమనించిన వారు ఓ ఫ్లాట్లో నుండి వస్తున్నట్లు గుర్తించారు. అంతే.. అక్కడ గృహహింస జరుగుతున్నట్లు భావించి పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లోపలివారు ఎంతకీ ఫ్లాట్ డోర్ తీయకపోవటంతో.. డోర్ బద్దలు కొట్టి మరీ లోపలకు ప్రవేశించి అక్కడ సీన్ చూసి అవాక్కయ్యారు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న వ్యక్తి ఓ రేంజ్లో పాటలు పాడుతూ కనిపించాడు. పోలీసులు లోపలికి వచ్చింది కూడా గమనించకుండా ఆ గానామృతం కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు పోలీసులు కనిపించడంతో ఏం జరిగిందో తెలుసుకున్న ఆ వ్యక్తి తన గాన మాధుర్యానికి లోలోపల నవ్వుకున్నాడు. ఆ వ్యక్తిపై ఇంతకు ముందు ఎలాంటి ఫిర్యాదులు, కేసులూ లేవు. ఇరుగుపొరుగులు ఇచ్చిన సమాచారంతో హంగామా సృష్టించిన పోలీసులూ.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు తలుపులు విరగ్గొట్టి మరీ పాటలు పాడుకుంటున్న వ్యక్తిని పట్టుకున్నందుకు కొద్దిసేపు నవ్వుకుని ..వెనుదిరిగారు. -
మగువలూ... హింసోన్మాదులు
మెన్టోన్ హింసా ప్రవృత్తికి కుల మత ప్రాంతీయ భేదాలేవీ లేవు. ఇది నిర్వివాదాంశం. ఇందులో గమనించాల్సిన మరో కోణం ఏమిటంటే, హింసా ప్రవృత్తికి లింగ భేదం కూడా లేదు. మగాళ్లలోనే కాదు, మగువల్లోనూ హింసోన్మాదులు ఉంటారు. ఇదేమీ కొత్త విషయం కాదు. చరిత్ర పుటలను తిరగేస్తే, రాకాసులకు సైతం భయంతో ఒళ్లు జలదరించే స్థాయిలో హింసాత్మక చర్యలకు పాల్పడ్డ మహిళల ఆనవాళ్లు దొరుకుతాయి. అలాంటి వీరనారీమణులలో దేశాలను ఏలి నియంతృత్వం చలాయించిన వాళ్లే కాదు, బందిపోటు ముఠాలకు నాయకత్వం వహించి జనాలను గడగడలాడించిన వాళ్లు, సీరియల్ కిల్లర్స్ కూడా ఉన్నారు. వివక్షాభరితమైన సమాజంలో నియంతలన్నా, నేరగాళ్లన్నా ముందుగా గుర్తొచ్చేది మగాళ్లే! ఎక్కడ నేరం జరిగినా ముందుగా అనుమానించేదీ మగాళ్లనే! మన పవిత్ర కర్మభూమిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. ఇదీ మగాళ్ల కర్మ. సంసారసాగరంలో పడి కొట్టుకుంటున్న మగాళ్ల పరిస్థితి మరీ దారుణం. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపాలనే గాంధీగారి సిద్ధాంతాన్ని పాటించేవాళ్లయితే ఫర్వాలేదు. ఎలాగోలా బతికేయవచ్చు. హింసకు ప్రతిహింసే సమాధానం అనే విప్లవ సిద్ధాంతాన్ని అమలు చేశారో... అంతే సంగతులు! ఏ తప్పుడు కేసులోనో ఇరుక్కుని ఊచలు లెక్కపెట్టే పరిస్థితి తప్పదు. మగాళ్లే ఎక్కువగా భౌతిక హింసకు పాల్పడతారనేది కేవలం వివక్షాపూరితమైన మీడియా దుష్ర్పచారం మాత్రమే. భౌతిక హింసాకాండలో మహిళామణులేమీ తక్కువ తినలేదు. కాకపోతే మగాళ్ల మీద నమోదైనన్ని ఫిర్యాదులు వాళ్లకు వ్యతిరేకంగా నమోదు కావంతే! రికార్డులకెక్కిన వాస్తవాలను కాస్త పరిశీలిద్దాం. గృహహింసకు సంబంధించిన భౌతిక హింసా బాధితుల్లో మగాళ్లు పాతిక శాతానికి పైనే ఉంటున్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో మగ బాధితులు 18 శాతం వరకు ఉంటున్నారు. ఇక మానసిక హింసా బాధితుల్లోనూ 18 శాతం మంది పురుషపుంగవులే ఉంటున్నారు. ఇవన్నీ ‘సేవ్ ఫ్యామిలీ ఫౌండేషన్’ జాతీయ స్థాయిలో సేకరించిన లెక్కలు. రికార్డులకెక్కని బాధితుల సంఖ్య ఇంతకు రెట్టింపే ఉంటుందని ఒక అనధికారిక అంచనా. ఇలాంటి బాధలను బయటకు చెప్పుకుంటే పరువు పోతుందనే భయంతో చాలామంది మగాళ్లు ఫిర్యాదులు చేయడానికి వెనుకాడుతారని, కేవలం ఆంతరంగికుల వద్దే గోడు వెళ్ల బోసుకుంటారని, అలాంటి వాళ్ల సంఖ్యను లెక్క కట్టడం అంత తేలిక కాదని కూడా ‘సేవ్ ఫ్యామిలీ ఫౌండేషన్’ ఉవాచ. -
వివాహిత ఆత్మహత్య
గుంటూరు జిల్లా గురజాలకు చెందిన శైలజ(19) అత్తింటి వేధింపులకు తాళలేక ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శైలజ తల్లిదండ్రులు చిలకలూరిపేటలో ఉంటారు. భర్త జాన్ మోమిన్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అదనపు కట్నం కోసం నిత్యం వేధించేవారని, వేధింపులకు తాళలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని శైలజ తల్లి సామ్రాజ్యం గురజాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడాది క్రితం వారు అడిగినంత కట ఇచ్చి పెళ్లి చేశామని, అయితే ఇంకా డబ్బు తెమ్మని రోజూ హింసించేవాడని సామ్రాజ్యం పోలీసులకు వివరించింది. తాము ఎన్నిసార్లు నచ్చజెప్పినా జాన్ మోమిన్ వినేవాడు కాదని ఆమె పేర్కొంది. పోలీసులు కేసు నమోదుచేసి జాన్ మోమిన్ను అదుపులోకి తీసుకున్నారు. సైలజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఆ విధంగా ముందుకుపోతున్నారు...
రిపోర్ట్ కొత్త సంవత్సరం వచ్చేసింది. సగటు మగ బతుకులు మరింత పాతబడటం తప్ప ఒరిగిందేముంది? అవే బతుకులు, అవే బాధలు. సంసార బాధా గరళాన్ని గళంలో దాచుకుని బయటకు ఎంతటి ధీరగంభీర భంగిమలను ప్రదర్శిస్తేనేం? లోలోపలి కన్నీటి కాసారాలలోని సుడిగుండాలను చూసేదెవరు? గృహహింసా బాధితుల్లో దాదాపు సగం మంది మగపుంగవులే కదా! భార్యాబాధితులేనా? భార్యాబంధువుల బాధితులు కూడా. ఇండియన్ పీనల్ కోడ్లో 511 సెక్షన్లు ఉంటే ఉండొచ్చు గాక... సెక్షన్ 498 (ఎ) ఒక్కటి చాలు మగాళ్లకు పీడకలలు తెప్పించడానికి. ఉదయాన్నే కప్పు కాఫీ పడనిదే కడుపులో కదలిక రాదు. అర్ధరాత్రి దాటిన వరకు టీవీ సీరియళ్లలో తలమునకలైన శ్రీమతికి అప్పుడే మెలకువ రాదు. కాఫీ కోసం నిద్రాభంగం కలిగిస్తే, కథ కురుక్షేత్ర యుద్ధానికి దారితీసే ప్రమాదాలు లేకపోలేదు. ఆఫీసు టైము తరుముకొస్తున్న వేళ తటస్థించే అటువంటి అనివార్య యుద్ధరంగంలో ఓటమిని అంగీకరించి, శ్వేతపతాకాన్ని ప్రదర్శించడమే వివేకం. అలా కాకుండా, నేను మగాడిని కాదా...? నాకూ పౌరుషం ఉండదా..? ఆవేశంలో నోరు జారినా, చేయి ఎత్తినా ఇక అంతే సంగతులు! అడ్డంగా 498 (ఎ) కింద బుక్కయినట్లే! ఇలాంటి అగత్యాన్ని నివారించుకునే క్రమంలోనే దేశంలోని మెజారిటీ మగాళ్లు కుక్కిన పేలల్లా బిక్కచచ్చి బండబారిన బతుకులు బతుకుతున్నారు. మగాళ్లపై నమోదవుతున్న గృహహింస కేసుల్లో చాలా వరకు తప్పుడువే. అందుకే ఈ బాపతు కేసులు దర్యాప్తు చేసేటప్పుడు కాస్త ఆచి తూచి వ్యవహరించాలంటూ సర్వోన్నత న్యాయస్థానమే మార్గదర్శకాలు జారీ చేయాల్సి వచ్చిందంటే, దేశంలో ‘మగా’నుభావుల బతుకులు ఎలా వెళ్లమారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది నాణేనికి ఒకవైపు. రెండోవైపు చూసుకుంటే, భార్యల చేతిలో గృహహింస ఎదుర్కొంటున్న భర్తల సంఖ్య మూడుకోట్లకు పైనే ఉందని సర్కారు లెక్కలే చెబుతున్నాయి. ఇలాంటి బాధలు అనుభవిస్తున్న మగాళ్లు వాటిని చెప్పుకోలేరు. సమాజంలో చులకనైపోతామనే భయం వాళ్లది. పరిస్థితి ఇంత భయంకరంగా ఉన్నా, ‘మర్ద్కో దర్ద్ నహీ హోతా’ (మగాడికి బాధ ఉండదు) అనే దిక్కుమాలిన భ్రమలోనే మన సమాజం ఆ విధంగా ముందుకుపోతోంది. -
మగోడు
మగాడు కంటతడి పెట్టకూడదు... మగాడు బాధతో కుమిలిపోకూడదు... మగాడు నిబ్బరంగా ఉండాలి... ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి... ఇలాంటి మాటలను చిన్నప్పటి నుంచి నూరిపోస్తారు మగపిల్లలకు. ఆ మాటలు నిజమేననే భ్రమలో బతికేసే ‘మగా’నుభావులు గుండెల్లోనే అగ్నిపర్వతాలను దాచుకుంటూ గాంభీర్యం సడలకుండా బయట తిరిగేస్తూ ఉంటారు. ఏదో ఒకరోజు అగ్నిపర్వతం బద్దలవుతుంది. దాంతో గుండె ఆగి గుటుక్కుమంటారు. చాలామంది పురుషుల అకాల మరణాలకు ఇలాంటి పరిస్థితులే కారణం. మగాళ్లూ మనుషులే! వాళ్లకూ ఈతిబాధలు ఉంటాయి. ఆడవాళ్ల బాధలను లోకమంతా పట్టించుకుంటుంది గానీ, మగాళ్ల బాధలను సాటి మగాళ్లు సైతం పట్టించుకోరు. మగాళ్ల జీవితాల్లో ఇదో పెద్ద విషాదం. గృహహింస బాధితులంటే మహిళలే అయి ఉంటారని చాలామంది ముందుగానే ఊహిస్తారు. కానీ, అది అర్ధసత్యం మాత్రమే! గృహహింస బాధితుల్లో మగాళ్ల సంఖ్య కూడా తక్కువ కాదు. ముఖ్యంగా జీవిత భాగస్వాముల చేతిలో నానా హింసలు అనుభవిస్తున్న మగాళ్లు తమ గోడు ఎవరికీ చెప్పుకోలేక లోలోనే కుమిలిపోతున్నారని ఇటీవల కంబ్రియా వర్సిటీ, సెంట్రల్ లాన్సషైర్ వర్సిటీలకు చెందిన మానసిక శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. జీవిత భాగస్వాముల చేతిలో దాడులకు గురవుతున్న వారిలో మగాళ్ల సంఖ్య, మహిళల సంఖ్య దాదాపు సమానంగానే ఉందని వెల్లడైంది. - దాసు -
హాలీవుడ్ సెలబ్రిటీలకూ గృహహింస?
లాస్ ఏంజిల్స్: మహిళలపై జరుగుతున్న గృహహింసకు వ్యతిరేకంగా సెలబ్రెటీలు మిలీ సిరస్, మడోన్నాల ఫొటోలతో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. మిలీ సిరస్, మడోన్నాలు గృహహింసకు గురైనట్లు ప్రముఖ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త అలెగ్జాండ్రో పొలాంబో రూపొందించిన ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్గా మారాయి. ఈ ఫొటోలలో.. మడోన్నా, సిరస్లు దారుణంగా హింసకు గురైనట్లు రూపొందించారు. ముఖంపై గాయాలతో కన్పిస్తున్న సెలెబ్రిటీల ఫొటోలు గృహహింసపై ఆలోచింపజేసేవిలా ఉన్నాయి. గృహహింసపై మౌనం వీడాలని ఈ ఫొటోలపై ఉన్నటు కొటేషన్లు సైతం నెటిజన్లను ఆకట్టకుంటున్నాయి. ఓ సామాజిక సమస్యకు సెలబ్రెటీల టచ్ ఇచ్చి పొలాంబో చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం చూపరులను ఆలోచింపజేస్తోంది. -
మృగాళ్ల ఆరళ్లు.. ఆరని కుంపట్లు
సమకాలీనం పలు రాజకీయ కుటుంబాల్లో గృహహింస గుట్టు చప్పుడు కాకుండానే కాదు బహిరంగంగా జరిగినా... పర్యవసానాలు బాధితులకు ప్రతికూలమే! సంపద, హోదా, రాజకీయ పలుకుబడి.. ఇలాంటివి నిందితులకు రక్షణ కవచాలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఓ పెద్ద హోదా అనుభవిస్తున్న బడా నేత కోడల్ని ఇంట్లోంచి గెంటించి, విశాఖపట్నంలో కొట్టి, బాబును లాక్కొని, ప్రత్యక్షనరకం చూపించినా కిమ్మన్న వాళ్లు లేరు. తెలంగాణలో ఓ మాజీ జడ్పీ ఛైర్మన్, ఓ మాజీ మంత్రి, ఓ ఎమ్మెల్యే... ఇలా ఎందరెందరో నాయకుల, శాసనకర్తల ఇళ్లల్లో రగిలేవి నిత్య రావణ కాష్టాలే! మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు జరిగిన చావు అంతకన్నా కాదు. ఆత్మ హత్యపై అనుమానాలున్నాయి. ఇది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జరిగిన హత్య. హంతకులెవరు? ఒకరా, ఇద్దరా, పలువురా? అన్నది తేలాల్సి ఉంది. తేలుతుందా తేలదా కూడా తెలియదు, ఎందుకంటే అది అనేకానేక అంశా లతో ముడివడి ఉంటుంది. పిల్లలు ముగ్గుర్ని చంపి సారిక తాను ఆత్మహత్య చేసుకుందా? అందరూ చనిపోయి, అది ఆత్మహత్యలా కనిపించేట్టు పథక రచనతో ఎవరైనా కుట్రపన్ని హతమార్చారా? అన్నది సాక్ష్యాధారాలు, సాంకే తికాంశాల ఆధారంగా దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి, న్యాయస్థానాలు ధృవీక రిస్తాయి. దానికి సమయం పట్టొచ్చు. ఈ లోపున... సందేహాలకతీతంగా నిర్ధారణ అవుతున్న నిజం మాత్రం, ఇది ముమ్మాటికీ హత్య అని! సారిక భర్త అనిల్, ఆయన కుటుంబీకులు సుదీర్ఘ కాలంగా వేధించి నిర్దాక్షిణ్యంగా జరి పించిన సామూహిక హత్యగానే భావించాలి. ఇక హంతకుల జాబితా... అనిల్తోనో, ఆయన కుటుంబీకులతోనో ఆగిపోవటం లేదు. ఇది చాలా పెద్దదిగానే ఉంది. ఈ హత్యే కాదు, ఇటీవల జరిగిన, జరుగుతున్న, జరుగ బోయే ఇటువంటి అనేకానేక హత్యల వెనుక ఒకరిద్దరు ప్రత్యక్ష నిందితులుగా మనకు కనబడుతున్నా పెద్ద వ్యవస్థే నిందితురాలిగా నిలుస్తోంది. అన్నెం పున్నెమెరుగని పసికందుల జీవితాల్ని మొగ్గలోనే నలిపేస్తూ తనువు చాలి స్తున్న వేనవేల సారికల మౌన రోదనలు ఎవరికీ వినిపించడం లేదు. రోజూ ఎక్కడో ఓ చోట ఇటువంటి ఘటనలు పునరావృతమౌతూనే ఉన్నాయి. ఇక వెలుగుచూడని దురాగతాలు ఎన్నో! మన సామాజిక, రాజకీయ, పాలన, పోలీసు, న్యాయ వ్యవస్థలన్నీ తిలాపాపం తలా పిడికెడన్న చందంగా ఈ విపరీత పరిస్థితులకు దోహదపడుతున్నాయి. గృహహింస యథేచ్ఛగా కొనసాగుతోంది. డబ్బు, హోదా ఉన్న సంపన్నుల ఇళ్లల్లో నోరిప్పక నలుగు తున్న సారికలెందరో! తెగించి బయటికొస్తేనో, వేగలేక తనువు చాలిస్తేనో తప్ప ఏ ఇంటిగుట్టూ బయటికి రావట్లేదు. ఎదిరించలేక వేదన మౌనమై రోదించే చోట సరేసరి, ఇక తెగించి బయటికొచ్చిన చోట కూడా న్యాయం జరగట్లేదు. చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా, న్యాయస్థానాలు కొంత చొరవ చూపుతున్నా... లంచగొండితనం, డబ్బు, పలుకుబడి, హోదాల ఆధిపత్యం ముందు చట్టం అమలు నిలువునా నీరుగారిపోతోంది. నాలుగు ప్రాణాలైనా నిలిచేవి! సారిక బాధలకు ఏ వ్యవస్థ సక్రమంగా స్పందించినా అమానుషంగా అగ్నికి ఆహుతి కాకుండా నాలుగు ప్రాణాలు నిలిచేవి. ఆరేళ్లుగా పోలీసు- న్యాయ వ్యవస్థ కూడా జాప్యాలే తప్ప ఏ మాత్రం న్యాయం చేయలేదు. అప్పటికీ ఆమె ఎంతో ధైర్యం చేసింది, ఓ పోరాటమే సాగించింది. కనీసం రాజకీయ వ్యవస్థయినా తన మొర వింటుందేమో అనుకున్న ఆమె ఆశలు రాజయ్యకు టిక్కెట్టు ఖరారుతో గల్లంతయ్యాయి. టిక్కెట్టివ్వొద్దని, తనను వేధిస్తున్నారని అఖిలభారత కాంగ్రెస్ నాయకత్వానికి ఆమె మొరపెట్టుకున్నారు. నూట పాతికేళ్ల పైబడ్డ చరిత్ర కలిగిన పార్టీ కూడా గెలుపు అవకాశాల కోణంలో తప్ప మరో తరహా ఆలోచించలేకపోయింది. గత ఎన్నికలప్పుడే సారిక ఆత్మ హత్యా యత్నం, రాజయ్య ఎం.పి. అయ్యాక ఆయన ఇంటిముందు నిరసన ధర్నా, తాజా హెచ్చరికలు... ఇవన్నీ జరిగాక కూడా టిక్కెట్టు ఇవ్వడం రాజకీయ అవకాశవాదాన్నే స్పష్టం చేస్తోంది. పలుకుబడితో కేసులోంచి పేరు తీయించుకున్నంత మాత్రాన అభియోగం ఎక్కడికీ పోదన్నది నాయకత్వం గ్రహించి ఉండాల్సింది. ఈ కారణం చూపి, టిక్కెట్టు నిరాకరించి ఉంటే సారిక నైతిక స్థయిర్యం పెరగడమే కాకుండా, రాజకీయ పార్టీగా ఓ మంచి సంకేతం పంపినట్టయ్యేది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో నైతిక ప్రమాణాలు పాటించడం లేదు. పలు రాజకీయ కుటుంబాల్లో గృహహింస గుట్టు చప్పుడు కాకుండానే కాదు బహిరంగంగా జరిగినా... పర్యవసానాలు బాధితులకు ప్రతికూలమే! సంపద, హోదా, రాజకీయ పలుకుబడి ఇలాంటి నిందితులకు రక్షణ కవచాలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఓ పెద్ద హోదా అనుభవిస్తున్న బడా నేత కోడల్ని ఇంట్లోంచి గెంటించి, విశాఖపట్నంలో కొట్టి, బాబును లాక్కొని, ప్రత్యక్ష నరకం చూపించినా కిమ్మన్న వాళ్లు లేరు. తెలంగాణలో ఓ మాజీ మంత్రి, ఓ మాజీ జడ్పీ ఛైర్మన్... ఇలా ఎందరెందరో నాయకుల, శాసనకర్తల ఇళ్లల్లో రగిలేవి నిత్య రావణ కాష్టాలే! యథేచ్ఛగా జరిగే వివాహేతర సంబంధాలు తరచూ కుటుంబ కలహాలకు కారణమౌతు న్నాయి. బలవన్మరణాలు మామూలవుతున్నాయి. సారిక అగ్నికి ఆహుతైన ఇల్లు స్వచ్ఛందంగా ఇచ్చింది కాదు, న్యాయస్థానం ఇప్పించిందే! వలదని తాను వినతి చేసినా కాంగ్రెస్ టిక్కెట్టివ్వడం ఒక ఎత్తయితే, వాస్తు అనో, సౌకర్యమనో మళ్లీ కుటుంబం అంతా తానున్న ఇంటికే రావడం సారికలో అభద్రతని, భవిష్యత్తు పట్ల భయాన్నీ పెంచి ఉంటాయి. కాపురాలకు రక్షణ-బతుక్కు భరోసా ఏది? చిన్న వివాదాల నుంచి జఠిల సమస్యల వరకు భార్యా-భర్తల మధ్య గొడవలు కాపురాల్లో చిచ్చు రగిలిస్తున్నాయి. భర్తో, బావో, మామో.... ఇలా ఎవరో పురుషులే నిర్ణేతలుగా ఉండే కుటుంబాలవడం వల్ల అత్యధిక సందర్భాల్లో మహిళలకు న్యాయం జరగట్లేదు. ఆరళ్లకు, అణచివేతకు వారు గురవుతున్నారు. కష్టమైనా, నిష్ఠురమైనా కిమ్మనకుండా భరిస్తే సరేసరి! కాదని ధిక్కరిస్తే.... వేధింపులు, భౌతికదాడులు, బలవంతంగా విడిపోయే ఒత్తిళ్లు, మార్గాంతరం లేక మరణించే పరిస్థితులు కల్పిస్తున్నారు. కొన్నిసార్లు చంపేస్తున్నారు. రక్షించే వ్యవస్థ లేదు. జనాభాలో సగమై ఉన్న మహిళల రక్షణకు అవసరమైన సంఖ్యలో మహిళా పోలీసులు లేరు. పోలీసు విభాగంలో మహిళలు ఎనిమిది శాతానికి దాటట్లేదు. వరకట్న వేధింపులపై ఫిర్యాదు చేయాలన్నా ప్రయాసే. పలుకుబడి లేని వారు చేసేవైనా, పలుకుబడి ఉన్న వారిపై చేసే ఫిర్యాదులైనా కేసులుగా మారట్లేదు. ఈ కేసుల్ని కచ్చితంగా డీఎస్పీ స్థాయి అధికారే దర్యాప్తు చేయాలి. దాంతో, సాధారణ పరిస్థితుల్లో పోలీసులు వీటిని తీసుకోవడానికి విముఖత చూపడమో, కౌన్సెలింగ్ పేరిట తాత్సారం చేసి మధ్యలో తాము సొమ్ము చేసుకోవడమో జరుగుతోంది. ఫిర్యాదు తీసుకున్నా పోలీసుస్టేషన్లలో కౌన్సెలింగ్ కేంద్రాలు ఉండవు. ఇక ఇలాంటి కేసుల కోసమే ఏర్పాటైన మహిళా పోలీసుస్టేషన్ల విషయానికొస్తే, మహానగరమైన హైదరాబాద్లో ఉన్నవి మూడే. సైబరాబాద్లో ఒకటి. తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన చోట్ల జిల్లాకు ఒక్కటి మాత్రమే! ఈ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు లేకపోవడం, ఉన్న వాటిలోనూ పని భారంతో తీర్పుల్లో జాప్యం ఓ పెద్ద అవరోధంగా మారింది. భర్తకు దూరమై, తల్లిదండ్రుల ఆదరణ లేని అతివలు అంత సుదీర్ఘకాలం పోరాడలేక చతికిల పడుతున్నారు. వరకట్న వేధింపు కేసుల్లో పురుషాధిక్య వ్యవస్థ దురాగతాల్ని అడ్డుకునే ఆయుధం లాంటి భారతీయ శిక్షాస్మృతి, సెక్షన్ 498(ఎ) వేర్వేరు కారణాల వల్ల నిరుపయోగమౌతోంది. ఇది అప్పుడప్పుడు దుర్వినియోగం అవుతోంది. దాంతో, వరకట్న వేధింపులంటూ వచ్చే ఫిర్యాదులు అన్నిసార్లు వాస్తవం కాదనే భావన బలపడింది. కొన్ని సందర్భాల్లో సాక్షాత్తు న్యాయ మూర్తులే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇదే అభిప్రాయంతో ఉండే పోలీసులు, కోర్టులు నిజమైన బాధితులకూ పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దరిమిళా, సీఆర్పీసీ 41(ఎ) సవరణ తదనంతరం... భార్యను మానసికంగా, శారీకరంగా వేధించిన మృగాళ్లూ పోలీసుస్టేషన్ నుంచే బెయిల్ పొంది వెళ్లిపోవడాన్ని బాధితులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపణై, శిక్షలు పడుతున్న సందర్భాలు 25 శాతం కూడా ఉండట్లేదు. దీంతో సుదీర్ఘ విచారణ పూర్తయ్యే వరుకు ఎదురు చూసినా... చివరకు అనుకూలంగా తీర్పు వస్తుందనే భరోసా బాధితులకు కలగట్లేదు. ఈ దుస్థితే అనేక సందర్భాల్లో విపరీత నిర్ణయాలకు కారణమవుతోంది. జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో 2014 గణాంకాల ప్రకారం... 498 (ఎ) కేసులు: ఏపీ- 6362, టీఎస్- 6369/ వరకట్న మరణాలు: ఏపీ- 215, టీఎస్- 289/ వరకట్న నిషేధ చట్టం కింద కేసులు: ఏపీ-468, టీఎస్-563/ వరకట్న వేధింపులతో ఆత్మహత్యలు: ఏపీ-36, టీఎస్-62. ఈ నేరాల తీరు ఆందోళన కలిగించేదే. మానసిక దృఢత్వం సున్న..! సమష్టి కుటుంబ వ్యవస్థ సన్నగిల్లిన తర్వాత ఒకరిద్దరు పిల్లలతో ఉండే పరిమిత కుటుంబాలెక్కువయ్యాయి. మానవ సంబంధాల పరంగా పిల్లల్లో ఆలోచన పరిధి అంతగా విస్తరించడం లేదు. మంచి-చెడుల విచక్షణ, ప్రేమ-ఆకర్షణల మధ్య వ్యత్యాసం తెలియటం లేదు. ఇటీవలి కాలంలో నవతరాన్ని తలిదండ్రులు తీర్చిదిద్దే తీరే వింతగా ఉంటోంది. సున్నితత్వం పాళ్లెక్కువై మానసిక దృఢత్వం పెంచే యత్నం ఆడపిల్లల పెంపకంలో లోపిస్తోంది. ఇందుకు పూర్తి విరుద్ధంగా, మగపిల్లల నిర్లక్ష్యపు పెంపకం వల్ల వారిలో స్పందనా రాహిత్యం-తెంపరితనం పాళ్లెక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా దూకుడు, బాధ్యతా రాహిత్యం వార్ని వ్యసనపరులు, దురహం కారులుగా తయారు చేస్తోంది. దాంతో పర్యవసానాలు ఆలోచించలేనంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఆడపిల్లలు గాలివానలో తమలపాకులా చిన్న చిన్న విషయాలకే తల్లడిల్లిపోయేంత సున్నిత మనస్కులుగా తయారవు తున్నారు. ఏదీ లోతుగా ఉండదు. పైపై ఆకర్షణలకే అత్యధికులు వశమై పోయే పరిస్థితులున్నాయి. దీనికితోడు... ప్రపంచీకరణ ప్రభావం వల్ల పెరి గిన వస్తు వ్యామోహానికి యువతీయువకులు బాగా ప్రభావితులవుతున్నారు. ప్రేమ-వ్యామోహం మధ్య సన్నటి పొరను ఎప్పుడో చెరిపేశారు. కుటుంబ విలువల పట్ల, కట్టుబాట్ల పట్ల చులకన భావం పెరుగుతోంది. సమకాలీన సినిమాల్లో, టీవీ సీరియళ్లలో వస్తున్న ఇతివృత్తాలు, కథనాల్ని నడిపే తీరు, వస్తు వ్యామోహం, పాత్రల వ్యక్తిత్వాలకు సంబంధించిన చవకబారుతనం, నేర దృక్పథం, ప్రేమ అనే ఉదాత్త భావనను పలుచబార్చిన తీరు... ఇవన్నీ యువతను పెడదారి పట్టిస్తున్నాయి. జిమ్ దగ్గర చూడగానే పుట్టిన ప్రేమ నిలువక ఓ అమ్మాయి చిక్కుల్లో చిక్కుకోవడమైనా, పీఎఫ్ ఆఫీసులో పనిచేసే ఒక జులాయి దురాగతాలకు 300 పైచిలుకు అమ్మాయిలు మోసపోవడమైనా ఈ పరిస్థితులకే అద్దం పడుతున్నాయి. రాజయ్య కోడలు సారిక-ఆమె ముగ్గురు పిల్లల అమానుష మరణం, దాని వెనుక కారణాల్ని విశ్లేషించి నపుడు... ఇవన్నీ స్ఫురణకు వస్తున్నాయి. ప్రతి ఆత్మహత్యా హత్యే అన్న సామాజికవేత్తల వ్యాఖ్య నిజమని మరోమారు రుజువౌతోంది. దిలీప్ రెడ్డి, ఈమెయిల్: dileepreddy@sakshi.com -
ఢిల్లీ ఎమ్మెల్యే అరెస్టు ఖాయం?
ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే, ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్నాథ్ భారతి అరెస్టు దాదాపు ఖాయమైనట్టే. గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. జస్టిస్ సురేష్ కైత్ ఈ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏక్షణంలోనైనా సోమ్నాథ్ ని అదుపులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సోమనాథ్ భారతిపై ఆయన భార్య లిపికా ఈ ఏడాది జూలై 10న మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా వేధిస్తూ, హింసిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు తన పెంపుడు కుక్క లాబ్రడార్ ను ఉసికొల్పి హత్య చేయడానికి ప్రయత్నించారని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆప్ మాజీ మంత్రిపై గృహ హింస, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. మరోవైపు సోమనాథ్ భారతి విచారణకు సహకరించడం లేదని ఆరోపిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని పేర్కొంటూ, అరెస్టు వారెంట్ ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. -
ఆడవాళ్ల గ్రామమండీ..!
ఆడవాళ్ల కోసం స్పెషల్ బస్సులు చూశాం.. షీ క్యాబులు, లేడీస్ స్పెషల్ రైళ్లు, రెస్టారెంట్లు, కిట్టీ పార్టీల సంగతులూ విన్నాం. అయితే, ప్రత్యేకించి ఆడవాళ్ల కోసమే నిర్మించిన గ్రామం గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇటువంటి గ్రామం కెన్యాలో ఉంది. విధివంచిత మహిళలకు స్వర్గధామంగా.. మగవాసనకు దూరంగా ఉండే ఈ గ్రామం పేరు ఉమోజా. కెన్యా ఉత్తర ప్రాంతంలో రెబెక్కా అనే మహిళ 25 ఏళ్ల క్రితం ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. కేవలం మహిళల కోసమే నిర్మించిన ఈ గ్రామంలోకి పురుషుల్ని అనుమతించరు. వివరాల్లోకి వెళ్తే.. సంబూరు తెగకు చెందిన రెబెక్కాను కొందరు వ్యక్తులు కొడుతూ ఉంటే, భర్త చూస్తూ ఉండిపోయాడు. ఏ మాత్రం ప్రతిఘటించలేదు. ఇదేకాక, గతంలో ఈ ప్రాంతంలో బ్రిటిష్ సైనికులు శిక్షణ పొందేవారు. వారి అకృత్యాలకు అడ్డూ అదుపూ ఉండేది కాదు. మహిళలను శారీరకంగా, లైంగికంగా హింసించేవారు. ఇవన్నీ కళ్లారా చూసిన రెబెక్కాకు పురుషులంటే అసహ్యం వేసింది. తనలాంటి వారికి రక్షణగా ఓ సరికొత్త గ్రామాన్ని సృష్టించాలనుకుంది. ఆ ప్రయత్నమే ఉమోజా అంటారు గ్రామస్థులు. 1990లో ఏర్పాటైన ఈ గ్రామంలోకి నెమ్మదినెమ్మదిగా బాధితులు రాసాగారు. భర్త వేధింపులు తాళలేనివారు, భర్త చనిపోయినవారు, అత్యాచారాలకు గురైనవారు, అనాథలు.. ఇలా స్త్రీలంతా ఒకచోట చేరారు. వీరంతా బతుకుతెరువు కోసం ఆభరణాల తయారీ చేపడుతుంటారు. వీరందరికీ నాయకత్వం వహిస్తున్నారు రెబెక్కా. ప్రస్తుతం ఈ గ్రామం కెన్యాలోని పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. అయితే, మగ పర్యాటకులకు మాత్రం అనుమతి లేదండోయ్! -
ప్రత్యూష కేసు విచారణ వాయిదా
-
ప్రత్యూష కేసు విచారణ వాయిదా
హైదరాబాద్: కన్నతండ్రి, పిన్ని చేతిలో చిత్రహింసలు భరించి కోలుకున్న ప్రత్యూష ఆరోగ్యంపై డాక్టర్లు ఇచ్చిన నివేదికను హైకోర్టుకు ఎల్బీ నగర్ పోలీసులు సమర్పించారు. ప్రత్యూష ఆరోగ్య కారణాలను దృష్టిలో విచారణను వచ్చే సోమవారంకు కోర్టు వాయిదా వేసింది. చదువు మధ్యలో ఆపేసి గృహహింసకు గురౌవుతున్నవారి సంఖ్య తెలపాలని రెండు రాష్ట్రాల అడ్వేకేట్ జనరల్స్ ను హైకోర్టు ఆదేశించింది. ఏపీ సర్కారును సైతం ఈ కేసులో ప్రతివాదిగా చేర్చింది. ప్రభుత్వ నిధులు బాధితులకు అందకుండా దుర్వినియోగం అవుతున్నాయని, ఆర్టికల్ 14 ఉల్లంఘన జరుగుతోందని హైకోర్టు పేర్కొంది. కాగా ప్రత్యూష రక్షణ బాధ్యత తీసుకుంటామని హైకోర్టును అవేర్ ఫౌండేషన్ ఆశ్రయించింది. ప్రత్యూష లాంటి 14 మంది బాలికలు తమ సంరక్షణలో ఉన్నారని న్యాయస్థానానికి తెలిపింది. -
ఎఫ్ఐఆరే నమోదు కాలేదు.. బెయిలేంటి?
న్యూఢిల్లీ: గృహహింస చట్టం కింద నమోదైన కేసు విషయంలో ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్నాథ్ భారతికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు విషయంలో నిందితుడు అలా కోరడం అనుభవరాహిత్యం అని పేర్కొంది. బెయిల్ పిటిషన్ను విచారించిన అడిషనల్ సెషన్స్ జడ్జి పరమ్ జీత్ సింగ్ అసలు ఇంతవరకు ఈ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, ఎలాంటి అరెస్టులు జరగలేదని, దరఖాస్తు కూడా పూర్తిస్థాయిలో లేదని పేర్కొన్నారు. గత జూన్లో సోమ్నాథ్ భారతి భార్య లిపికా భారతి 2010 నుంచి ఆయన గృహహింసకు పాల్పడుతున్నారని, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ కేసు పెట్టిన విషం తెలిసిందే. -
భర్తపై తప్పుడు ఫిర్యాదు.. రూ. లక్ష జరిమానా
గృహహింస చట్టం కింద తన భర్త, అత్తమామలపై తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఢిల్లీ కోర్టు ఓ మహిళకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆమె చట్టాలను దుర్వినియోగం చేసి, వ్యక్తిగత స్వార్థం కోసం అతడి నుంచి అన్యాయంగా డబ్బు దోచుకోవాలనుకుందని కోర్టు వ్యాఖ్యానించింది. దక్షిణ ఢిల్లీకి చెందిన సదరు మహిళ ఈ మేరకు చేసిన ఫిర్యాదును మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శివాని చౌహాన్ డిస్మిస్ చేశారు. తన అత్తమామలను వేధించేందుకు వాస్తవాలను తొక్కిపెట్టి, తప్పుడు ఫిర్యాదులు చేసిందని చెప్పారు. సాధారణంగా మహిళలు గృహహింసకు బాధితులు అవుతుంటారని, గృహహింస నిరోధక చట్టం కూడా మహిళలకు దీన్నుంచి రక్షణ కల్పించడానికే ఉద్దేశించారని మేజిస్ట్రేట్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ కేసులో మాత్రం ఫిర్యాదుచేసిన మహిళ దీన్ని దుర్వినియోగం చేసి, అనేక అబద్ధాలతో తన ఫిర్యాదును దాఖలు చేశారన్నారు. లక్ష రూపాయల భారీ జరిమానా విధించేందుకు ఈ కేసు తగినదేనని మేజిస్ట్రేట్ చెప్పారు. ఆమె నుంచి వసూలుచేసే లక్ష రూపాయలను 'బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్' ఖాతాలో జమచేయాలని ఆదేశించారు. ఈ జరిమానా భవిష్యత్తులో మరెవ్వరూ ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేయకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. -
ఎమ్మెల్యేపై గృహహింస కేసు, సమన్లు
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కష్టాలు వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఆప్ మంత్రి నకిలీ డిగ్రీ పట్టా కేసులో జైలుకు వెళితే.. తాజాగా మరో ఆప్ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు. ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై ఆయన భార్య గృహహింస కేసు పెట్టారు. సోమనాథ్ భారతి తనను వేధిస్తున్నారంటూ ఆమె ఢిల్లీ మహిళా కమిషన్ను ఆశ్రయించింది. దాంతో మహిళా కమిషన్ బుధవారం సోమనాథ్ భారతికి సమన్లు జారీ చేసింది. కాగా గతంలోనూ సోమనాథ్పై ఆఫ్రికన్ మహిళలపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సోమనాథ్ భారతి తన మద్దతుదారులతో కలిసి దాడి చేశారంటూ ఉగాండా మహిళ ఫిర్యాదు చేయటంతో ఆయనపై జనవరి 19న ఎఫ్ఐఆర్ నమోదైంది. -
పిల్లాడికి వాతలు పెట్టిన తల్లి
హైదరాబాద్: ప్రియుడి మత్తులో పడి ముక్కు పచ్చలారని బాలుడికి వాతలు పెట్టిందో కన్నతల్లి. హైదరాబాద్ మౌలాలి ప్రాంతంలో నివాసం ఉంటున్న అన్వర్ పాషా, రేష్మకు ఇద్దరు పిల్లలు. గత కొంత కాలంగా మహేష్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్న రేష్మ కుటుంబాన్ని వదిలేసి అతనితో వెళ్ళిపోయింది. కొద్ది రోజుల క్రితం తిరిగి వచ్చిన ఆమె, తన పిల్లలు కావాలంటూ నాలుగేళ్ళ కొడుకును తీసుకు వెళ్ళింది. విషయం తెలుసుకున్న తండ్రి ఆరా తీయగా 50 వేల రూపాయలు ఇస్తేనే బాబును ఇస్తానంటూ రేష్మ తేల్చి చెప్పింది. దీంతో మౌలాలీ రైల్వే స్టేషన్ వద్ద రేష్మ ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్ళి బాలుడిని తీసుకవచ్చారు. అయితే ఆ బాలుడి ఒంటిమీద ఎక్కడ పడితే అక్కడ వాతలు కన్పించడంతో షాకయ్యారు. పెదవులు కూడా చిట్లిపోయాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలుడి గాయాల తీవ్రత దృష్ట్యా ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరోవైపు ఫిర్యాదు అందుకున్న నేరేడ్ మేట్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. -
కోడిగుడ్డు కూర అడిగితే వీపుపై వాతలు
ఇల్లెందు (ఖమ్మం) : కోడిగుడ్డు కూర మరికొంచెం పెట్టమన్నందుకు.. ఆ బాలిక వీపుపై వాతలు పెట్టింది పెద్దమ్మ. పైగా అరుపులు వినిపించకుండా బాత్రూమ్లో బంధించింది. ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణంలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బాలాజీ నగర్కు చెందిన పసుపులేటి ప్రభాకర్, మౌనిక దంపతుల ఏడేళ్ల కూతురు హారిక. తండ్రి మరణించగా, తల్లి ఎటో వెళ్లిపోవడంతో గత కొంతకాలంగా హారిక పెద్దమ్మ వరలక్ష్మి వద్ద ఉంటోంది. రోజూ మాదిరిగా గురువారం మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు వరలక్ష్మి తన సొంత కుమారుడికి కోడి గుడ్డు కూరతో భోజనం వడ్డించింది. హారికకు మాత్రం కొద్దిగానే వేసింది. తనకు మరికొంచెం కూర పెట్టమని హారిక అడగడంతోనే ఆమెకు కోపం వచ్చింది. ఆగ్రహంతో తన చేతిలోని గరిటెను కాల్చి వీపు మీద అంటించింది. హారిక ఏడవడంతో మరింత కోపంతో మరో చోట కాల్చింది. బాలిక ఏడుపులు వినిపించకుండా బాత్రూమ్లో బంధించి తలుపులు వేసింది. గమనించిన చుట్టుపక్కలవారు స్థానిక ఒడ్డెరగుంపు అంగన్వాడీ కార్యకర్త ఉప్పు పద్మావతికి సమాచారం అందించారు. వెంటనే అంగన్వాడీ కార్యకర్త అక్కడికి వెళ్లి బాలికను కలిసి జరిగిన ఘటనపై ఆరా తీసింది. సూపర్వైజర్ సరోజనకు సమాచారం అందించగా ఆమె వచ్చి స్థానికుల సహాయంతో బాలికను ఇల్లెందు సివిల్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం బాలికను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. వారు బాలికను హన్మంతులపాడు అనాథాశ్రమానికి తరలించారు. -
ఆపదలో ‘అతివ’.!
మహిళలకు కరువైన రక్షణ చట్టాలున్నా భయపడని మృగాళ్లు ఫలితమివ్వని పోలీసుల చర్యలు స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా.. నింగి నుంచి అంతరిక్షం వరకూ మహిళ ప్రస్థానం సాగుతున్నా..ఇంకా మహిళ భయం భయంగానే బతుకుతోంది. నిజమైన స్వేచ్ఛ కోసం సింహాల బోనులో జింకపిల్లలా వెతుకుతూనే ఉంది. విశాఖ వంటి ఆధునిక నగరంలో ఆటవిక సంస్కృతికి బలైపోతూనే ఉంది. నిర్భయ, గృహ హింస వంటి చట్టాలు ఎన్ని వచ్చినా మృగాళ్ల పైశాచికాన్ని అడ్డుకోలేకపోతున్నాయి. జిల్లాలో గడిచిన మూడేళ్లలోనూ, తాజాగా జరుగుతున్న నేరాలను చూస్తే మహిళలు ఎంతటి అభద్రతా సమాజంలో బతుకుతున్నారో అర్ధమవుతోంది. సాక్షి, విశాఖపట్నం అడుగుడుగునా మృగాళ్లే ఈ ఏడాది ఆరంభం నుంచే మహిళలపై అఘాయిత్యాలు పెచ్చుమీరాయి. మొదటి వారంలోనే పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్ధిని తనను ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి రెండ తేదీన రిమాండ్కు పంపించారు. చేపలుప్పాడలో దళిత బాలికపై, ఎన్ఏడీ కొత్తరోడ్డులో, కైలాసపురంలో మైనర్ బాలికపై అత్యాచారం, మల్కాపురం, ఎంవీపీల్లో పెళ్లిపేరుతో మోసం, గాజువాకలో ఉద్యోగినిపై లైంగిక వేధింపులు ఇలా ఒకటి కాదు రెండు కాదు నిన్నటి సాఫ్ట్వేర్ యువతిపై అత్యాచారం వరకూ మహిళలపై అనేక రకాలుగా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల దృష్టికి వచ్చినవే వందల్లో ఉంటే, పరువు కోసం, సమాజానికి భయపడి తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేక లోలోనే కుమిలిపోతున్న అభాగినులు ఎందరో లెక్కే లేదు. చట్టాలు, సాఫ్ట్వేర్లు ఎన్నున్నా ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా మహిళల భద్రతపై వెల్లువెత్తిన నిదరసల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకువచ్చింది. మహిళపై ఎవరైనా లైంగిక దాడులకు తెగబడితే కఠినంగా శిక్షించేలా చట్టం చేసింది. అంతకు ముందే గృహ హింస చట్టం అమలులో ఉంది. ఈ రెండు చట్టాలతో పాటు ఎస్సీ,ఎస్టీ అల్రాసిటీ చట్టం కూడా మహిళలకు రక్షణగా ఉపయోగపడుతోంది. ఇవి కాకుండా మహిళలు, యువతులు తమను తాము రక్షించుకునేలా మొబైల్ ఫోన్ల ‘యాప్స్’ అందుబాటులోకి వచ్చాయి. విశాఖ పోలీస్ కమిషనర్గా అమిత్గార్గ్ బాధ్యతలు చేపట్టగానే రాష్ట్ర హోమ్ మంత్రి చినరాజప్ప చేత ‘ఐ క్లిక్’ పరికరాన్ని, ‘అభయం’ సాఫ్ట్వేర్ను ప్రారంభింపజేశారు. వీటి నిర్వహణ కోసం మహిళా ఎస్సై నేతృత్వంలో ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి 24గంటలూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. కేసులు నమోదవుతున్నా ఇప్పటి వరకూ ఐ క్లిక్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు 28 కేసులు నమోదు చేశారు. అభయం సాఫ్ట్ వేర్ను యువతులు తమ మొబైల్స్లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ 1500 మంది ఆ విధంగా అభయంను తమ వద్ద ఉంచుకున్నారు. 100 మంది ఇప్పటికే ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగా 18 కేసులు నమోదయ్యాయి. అయినా నగరంలో మహిళలపై నేరాలు తగ్గడం లేదు. మృగాళ్లు కనీసం భయపడటం లేదు. మరోవైపు ఈ చట్టాలను, సదుపాయాలను మహిళలు దుర్వినియోగం చేస్తున్నారనే వారూ ఉన్నారు. ‘అభయం’ ద్వారా వచ్చిన వంద ఫిర్యాదుల్లో కొన్ని కేసు వరకూ రాకపోవడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అవకాశాలను దుర్వినియోగం చేస్తున్న వారి వల్ల నిజమైన బాధితులకు కూడా కొన్ని సమయాల్లో న్యాయం జరగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. వాటిని సక్రమంగా వినియోగించాలి. అప్పుడే మగువకు రక్షణ, మృగాడికి భయం ఉంటుంది. -
చెయ్యెత్తితే ఖబడ్దార్!
గృహహింస చట్టం మహిళలకు వరం ‘498 ఎ’ కన్నా ఎక్కువ రక్షణ అమలుకు ప్రత్యేక యంత్రాంగం మరింత అవగాహన అవసరం అతివలకు అడుగడుగునా అవరోధాలే. ఇంటా బయటా వేధింపులే. ఇది అనాదిగా వస్తున్న దురవస్థ. ఒకవిధంగా ఆలోచిస్తే బయటి సమస్యల కన్నా ఇంట్లోని పరిస్థితులే వారిని మరింత కుంగదీస్తున్నాయి. మహిళలకు రక్షణ కల్పించడానికి రూపొందించిన గృహహింస చట్టం ఇప్పుడిప్పుడే తన ప్రతాపం చూపిస్తోంది. వేధించేవారి వెన్నులో వణుకు పుట్టి ఇది అతివలకు మరింతగా ఉపయోగపడాలంటే ఈ చట్టం గురించి విస్తృత ప్రచారం జరగాలి. అవగాహన పెరగాలి. విశాఖపట్నం : గృహహింస నుంచి మహిళలను రక్షించేందుకు ప్రవేశపెట్టిన చట్టం మహిళలకు వరం. గృహహింస నివారణ చట్టం 2005-06 అక్టోబర్ 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నెంబర్-43తో ఈ చట్టాన్ని తయారు చేసింది. వివక్షతో కూడిన ఆచారాలు, పద్ధతులు, అభిప్రాయాల వల్ల సమాజంలోనే కాకుండా ఇంట్లో కూడా స్త్రీ, పురుష సంబంధాలలో అసమానతలు ఏర్పడి గృహహింసకు దారితీస్తున్నాయి. దుర్భర పరిస్ధితులు ఎదుర్కొనే మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. చాలామంది మద్యానికి బానిసై కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఆ కుటుంబాలలోని మహిళలు కూడా ఏదో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి సంపాదనను కూడా మద్యం కోసం దుబారా చేసే మగపుంగవులు కోకొల్లలు. మద్యం మత్తులో భార్య, కుమార్తెలను ఇష్టానుసారంగా హింసించే మగ రాక్షసులకు కటకటాల వెనక్కినెట్టడమే కాకుండా మస్తుగా జరిమానాలు కూడా వడ్డించేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. గృహహింస.. శారీరకంగాను, మానసికంగాను, ఆర్ధికంగాను, లైంగికంగాను హింస పెట్టడం గృహహింస కిందకే వస్తుంది. ఇంకా బెదిరించడం, భయపెట్టడం దౌర్జన్యానికి పాల్పడడం, ఆరోగ్యాన్ని కుంటుపరిచే చర్యలు కూడా గృహహింసకు సంబంధించినవిగానే పరిగణిస్తారు. చట్టం పరిధి.. ఈ చట్టం ప్రకారం బాధితురాలు, ప్రతివాది మధ్య... భార్యభర్తల సంబంధంతోపాటు ఇతర సంబంధాలు కూడా వర్తిస్తాయి. పుట్టుక ద్వారా, పెళ్లి ద్వారా, దత్తత ద్వారా కలిసివుంటున్నవారు, ఒకే ఇంటిలో కలిసి నివసించే స్త్రీ, పురుషులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. గృహహింసకు గురయినపుడు సంబంధిత మహిళ లేదా ఆమె తరపు బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. అమలు పరిచే వ్యవస్థ రక్షణ అధికారి, న్యాయ సేవల అధికారి, సేవలు అందించే స్వచ్ఛంద సంస్ధలు, ఆశ్రయం అందించే సంస్ధలు, పోలీస్ అధికారి ఈ చట్టాన్ని అమలుపరుస్తారు. జిల్లాలలోని మహిళా, శిశు అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డెరైక్టర్లను ఈ చట్టం కింద రక్షణ అధికారులుగా నియమించారు. ప్రాజెక్టు డెరైక్టర్కు అందిన ఫిర్యాదు మేరకు జిల్లాలోని ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేస్తారు. సంబంధింత న్యాయమూర్తి దరఖాస్తు అందిన మూడు రోజులలోగా మొదటి వాదన వినాలి. వాదోపవాదాలు విన్న తరువాత 60 రోజులలోగా తుది తీర్పు ప్రకటించవలసి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే ప్రతివాదులకు ఏడాది జైలుశిక్షతోపాటు 20 వేల రూపాయల జరిమాన విధించే అవకాశాలు ఉన్నాయి. ప్రవాస వంచకులతో ఇబ్బందులు.. ప్రవాస భారతీయులను పెళ్లి చేసుకుని మోసపోయిన మహిళలను గృహహింస చట్టం కూడా ఆదుకోలేకపోతుంది. కేసు వేసినా ఇక్కట్లు పడాల్సి వస్తోంది. ఆయా దేశాలలో నివసిస్తున్న వీరి భర్తలకు సమన్లు అందడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. సమన్లు అందినా కోర్టుకి రాకుండా కాలయాపన చేస్తుండటంతో బాధిత మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగం కావడంతో అమ్మాయిల తల్లిదండ్రులు ముందు, వెనుక చూడకుండా లక్షలాది రూపాయల కట్నం, ఇతర లాంఛనాలతో పెద్ద ఎత్తున వివాహలు జరిపిస్తున్నారు. తీరా కొద్ది కాలానికే తమ కుమార్తె పుట్టింటికి చేరుకోవడంతో తల్లిదండ్రులను అంతులేని ఆవేదన మిగులుతుంది. పోనీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహహింస నివారణ చట్టం 2005 కింద న్యాయం జరుగుతుందేమోనని ఫిర్యాదు చేసినా పరిష్కారం మాట దేవుడెరుగు, సమన్లు పంపడానికే పడరానిపాట్లు పడాల్సివస్తోంది. నగరంలోని ఎంవీపీ కాలనీ సెక్టార్-9లోని జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్ధ కార్యాలయంలో ఉమెన్సెల్ పనిచేస్తోంది. సంస్ధ ప్రాజెక్ట్ డెరైక్టర్ పర్యవేక్షణలో పనిచేసే ఈ సెల్లో ఒక లీగల్ ఆఫీసర్, ఒక కౌన్సిలర్, మరో ఇద్దరు అసిస్టెంట్ కౌన్సిలర్లు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పనిచేస్తున్నారు. వీరు బాధితుల నుంచి ముందుగా ఫిర్యాదు తీసుకుంటారు. త రువాత సంబంధీకులను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తారు. రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తారు. రాజీ కుదరకుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సంబంధిత కోర్టులో కేసు దాఖలు చేస్తారు. కోర్టులో న్యాయమూర్తి బాధిత మహిళలకు మధ్యంతర భృతి, తరువాత భరణం మంజూరు చేస్తుంటారు. చట్టంలోని నిబంధల ప్రకారం కేసుని 60 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈసెల్లో ఎన్ఆర్ఐ కేసులు 20 కావడం గమనార్హం. మొత్తం కేసులు... 2006 నుంచి 2015 జనవరి వరకు ఉమెన్ సెల్లో మొత్తం 1447 కేసులు నమోదు కాగా అందులో 273 కౌన్సెలింగ్లు జరుగుతున్నాయి. కోర్టులో సెటిల్ అయినవి 381 కేసులు కాగా, కోర్టులో 793 ప్రోసెస్లో ఉన్నాయి. నిర్భయంగా ఫిర్యాదు చేయండి.... గృహహింసకు గురయ్యే మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి. బాధితులు నేరుగా మా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. నమోదు చేసిన అనంతరం ఒక నివేదిక రూపంలో కోర్టుకి సమర్పిస్తాం. చట్టపరంగా సహయం, ఉచిత న్యాయసేవలు, ఆర్ధికసాయం, పిల్లల సంరక్షణ, ఆశ్రయం, వైద్యసహాయం వంటివి బాధిత మహిళలకు అందజేస్తాం. కోర్టు కేసు విచారణ తెలిపే నోటీసును ప్రతివాదికి అందజేస్తాం. స్వచ్ఛంద సంస్ధల ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరించి, చట్టప్రకారం వ్యవహరిస్తాం. జిల్లాలోని బాధిత మహిళలు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్ఆర్ఐ కేసులు ఉన్నాయి. అడ్రస్ లేకపోవడంతో ఇబ్బందులు పడవలసి వస్తోంది. -బి.డి.జ్యోతిలత , కౌన్సిలర్ ప్రొటెక్షన్ సెల్, డీఆర్డీఏ కాంప్లెక్స్, సెక్టార్-9, ఎంవీపీ కాలనీ, ఫోన్: 0891-270615 -
అతివలకు అండ
విజయనగరం కలెక్టరేట్లోని జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ(ఐసీడీఎస్) కార్యాలయంలో గృహహింస కార్యాలయం ఉంది. వివాహం... అసలైన జీవితానికి పునాది. మహిళలకు కొత్త జీవితానికి నాంది. అయితే పెళ్లయిన వెంటనే ఆరళ్లు మొదలైతే, వేధింపులు ఎక్కువైతే... అత్త నుంచో భర్త నుంచో ఊహించని స్పందనలు కళ్లకు కనబడితే ఆ అతివ జీవితం నరకప్రాయమవుతుంది. ఇలాంటి వారిని ఆదుకుని, వారి జీవితాన్ని చక్కదిద్దేందుకు ప్రవేశపెట్టిందే గృహహింస చట్టం. మహిళలకు అండగా నిలుస్తూ, వారిపై వేధింపులను నిలువరిస్తోందీ చట్టం. వేధింపులకు గురవుతున్నవారంతా ఈ చట్టాన్ని వినియోగించుకోవాలని పలువురు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. విజయనగరం ఫోర్ట్: అత్తింటి వారి వేధింపులు భరించలేక ఇటీవల కాలంలో మహిళలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భర్త వేధించాడనో, అత్త వేధిస్తోందనో మనస్తాపంతో చాలా మంది వివాహితలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీని వల్ల పసివారు అనాథలుగా మారుతున్నారు. ఇలాంటి వారి కోసమే 2005లో ప్రభుత్వం గృహహింస చట్టాన్ని ప్రవేశ పెట్టిం ది. ఈ చట్టం మహిళలకు కొండంత అం డగా నిలుస్తుంది. భర్తతోగానీ, అత్తతోగా నీ, ఇతర కుటుంబ సభ్యులతో ఊహించని పరిణామాలు ఎదురైతే వారు నేరుగా గృహిహింస చట్టం సి బ్బందికి ఫిర్యాదు చేస్తే ఉచితంగా న్యాయ సహా యాన్ని అందిస్తారు. గృహహింస అంటే... శారీరకంగా గానీ, మానసికంగా గానీ, మాటలు ద్వారా ఉద్వేగపరిచినా గృహహింస కిందకు వస్తుంది. ఆర్థిక, లైంగిక హింసలు, బెదిరించడం, భయపెట్టడం, దౌర్జన్యానికి పాల్పడడం, ఆరోగ్యాన్ని కుంటుపరిచే విధంగా వ్యవహరించే చర్యలన్నీ గృహహింస కిందకే వస్తాయి. ఈ చట్టం ప్రకారం బాధితురాలు ప్రతివాది మధ్య సంబంధం భార్యభర్తల సంబంధమే కానవసరం లేదు. పుట్టుక ద్వారా లేదా పెళ్లి ద్వారా, దత్తర ద్వారా కలిసి ఉంటున్న వారైనా, ఒకే ఇంట్లో ప్రస్తుతం కానీ, గతంలో కానీ కలిసి నివసిస్తూ ఉన్న స్త్రీ పురుషులు ఈ చట్టపరిధిలోకి వస్తారు. గృహహింసకు గురైన మహిళ ఫిర్యాదును నేరుగా గానీ, ఎవరితోనైనా హింస జరుగుతుందని, జరగబోతుందని రక్షణ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. రక్షణ అధికారులు... గృహహింసకు గురవుతున్న మహిళలకు రక్షణను అందించేందుకు ముగ్గురు జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. వీరిలో ఒకరు విజయనగరం ఆర్డీఓ ఫోన్ నంబరు 08922-226888, పార్వతీపురం ఆర్డీఓ 08963-261006, ఐసీడీఎస్ పీడీ, విజయనగరం ఫోన్ నంబరు- 9440814584లు ఉన్నారు. మహిళలకు ఆశ్రయం అందించే సంస్థల వివరాలు గృహహింసకు గురైన మహిళలకు ఆశ్ర యం కల్పించే సంస్థలు రెండు ఉన్నాయి. వీటిలో ఒకటి స్వధార్ ఆశ్రమం కాగా రెండోది దుర్గాభాయ్ దేశ్ముఖ్ శిశు వికాశ కేంద్రాలు ఉన్నాయి. గృహహింస కార్యాలయంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఒక లీగల్ కౌన్సిలర్, ఒక సోషల్ కౌన్సిలర్, ఇద్దరు హోంగార్డులు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారు. కౌన్సిలర్ల విధి... గృహహింసకు గురవుతున్న మహిళల నుంచి ఫిర్యాదు స్వీకరించి వాటిని రక్షణ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చిన మీదట రాజీ కుదరకపోతే రక్షణ అధికారి సమక్షంలో మరో సారి కౌన్సిలింగ్ ఇప్పించడం. అప్పటికీ రాజీ కుదరకపోతే కోర్టులో కేసు నమోదు చేయడం వీరి విధులు. రక్షణ అధికారి బాధ్యతలు బాధితులకు చట్టపరమైన సాయం, ఉచితన్యా య సేవలు, ఆర్థిక సహాయం, పిల్లల సంరక్షణ అందించడం, ఆశ్రయం అందించే సంస్థలు, వైద్య సహాయం గురించి సమాచారం అందించడం వంటివి రక్షణ అధికారులు చేస్తారు. అలాగే... కేసు విచారణ తేదీ తెలిపే నోటీసులను ప్రతివాదికి అందజేస్తారు.కేసు నమోదు చేసిన 60 రోజుల్లో తుదితీర్పు వినిపించాలి. -
గృహహింస చట్టంపై గ్రామీణ మహిళల్లో అవగాహన
శ్రీకాకుళం అర్బన్: గృహహింస చట్టంపై గ్రామస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.అన్నపూర్ణ అన్నారు. మహిళా మార్గదర్శి సేవాసంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని వరం రెసిడెన్సీలో గురువారం గృహహింస నుంచి మహిళలకు రక్షణ చట్టం-2005పై జిల్లాస్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహహిం సను నేరంగా గుర్తించి గృహహింస నిరోధక చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఇది సివిల్ చట్టమని, నేరం చేసిన వాళ్లను దండించడం కాకుండా బాధితులకు ఉపశమనం కల్పించే దిశగా ఈ చట్టం ఏర్పాటు చేసినట్టు వివరిం చారు. తన కుటుంబానికి సంబంధించిన మగవారు జరిపే ఎటువంటి హింసనుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకు గృహహింస చట్టం ఏర్పాటైందన్నారు. బాధితులు ఈ చట్టాన్ని ఉపయోగించి సెక్షన్ 17, 18, 19, 20, 21, 22, 23 ద్వారా నివసించే హక్కు, రక్షణ ఉత్తర్వులు, నివాసపు ఉత్తర్వులు, పిల్లల సంరక్షణ ఉత్తర్వులు, నష్టపరిహారం ఉత్తర్వులు పొందవచ్చన్నారు. గృహహింస బాధితులు ఎవరైనా ఉంటే రక్షణాధికారి ద్వారా లేదా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా న్యాయ సహా యం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కొంతమంది దంపతులు గొడవలు పడి కోర్టుకు వెళతారే తప్ప వారి పిల్లలు గురించి ఆలోచించరన్నారు. న్యాయమూర్తి కూడా బం ధాలు, బాంధవ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని, లేదంటే వీటి ప్రభావం సమాజంపై పడుతోందన్నారు. విశ్రాంత జిల్లా జడ్జి పప్పల జగన్నాథరావు మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చాయని, వాటిపై అవగాహన లేకనే ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తోందన్నారు. న్యాయవాది సనపల పాపినాయుడు మాట్లాడుతూ గృహహింస చట్టం అమలైన నాటి నుంచి ఏడు సంవత్సరాల కాలంలో కేవలం 141 కేసులు మాత్రమే నమోదయ్యావంటే ఈ చట్టం క్షేత్రస్థాయిలోకి వెళ్లలేదని అర్ధమవుతోందన్నారు. క్షేత్రప్రచార అధికారి జి.కొండలరావు మాట్లాడుతూ అవగాహనా లోపం వల్ల గ్రామస్థాయి నుంచి ఈ చట్టం వరకూ వచ్చే కేసులు కేవలం 5.1 శాతం మాత్రమేనన్నారు. మహిళా మార్గదర్శి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏఎన్ లక్ష్మీకుమారి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో 2007లో ఈ చట్టం కింద కేసును కోర్టులో వేసి 70 రోజుల్లో న్యాయం పొందడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా గృహహింస, స్త్రీలపై హింస జరుగుతున్న వివిధ కారణాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్ను అన్నపూర్ణ ప్రారంభించారు. అలాగే మహిళా మార్గదర్శి ఆధ్వర్యంలో కుటుంబంలో స్త్రీ ఏవిధంగా హింసను అనుభవిస్తుందో కళ్లకు కట్టినట్లుగా గృహహింసపై నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు పేడాడ సన్యాసప్పారావు, మహిళా మార్గదర్శి ప్రతినిధులు సీహెచ్ భారతి, మీనా, అమల, సుశీల, జనచేతన, సీఎస్ఎస్, బ్రెడ్స్, గ్రామీణ చైతన్య వేదిక, మహిళా సమతా సొసైటీ తదితర స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
వరంగల్ ఎంపీ రాజయ్య కుమారునిపై గృహహింస కేసు
హైదరాబాద్: వరంగల్ ఎంపీ రాజయ్యపై, ఆయన కుమారుడు అనిల్పై కోడలు ఫిర్యాదు మేరకు బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు నమోదైంది. ఏసీపీ మనోహర్ చెప్పిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన సారిక, రాజయ్య కుమారుడు అనిల్కుమార్ ఇంజనీరింగ్ చదువుతున్నపుడు ప్రేమించుకున్నారు. 2002లో వెస్ట్మారేడ్పల్లి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకుని ఉద్యోగరీత్యా లండన్ వెళ్లిపోయారు. 2005లో తిరిగి వచ్చాక, పెద్దల కోరిక మేరకు 2006లో సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. అనంతరకాలంలో అనిల్ మరో మతానికి చెందిన యువతితో సహజీవనం చేయసాగాడు. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. సారిక తన అత్తమామలకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోలేదు. ఈ మధ్యకాలంలో సారిక ఉద్యోగం చేసి సంపాదించిన రూ.30 లక్షలు, 20 తులాల బంగారు నగలు తన భర్తకే ఇచ్చింది. అయినప్పటికీ వేధింపులు పెరగడంతో సారిక నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కోర్టు ఎంపీ రాజయ్యపై, ఆయన కుమారుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనిల్కుమార్పై ఐపీసీ సెక్షన్ 498ఏ,494,506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఏసీపీ తెలిపారు. రాజయ్యపై, ఆయన భార్య వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మాధవిపై కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఏసీపీ వివరించారు. -
ఆమెకు ఏదైనా జరిగితే నాదే బాధ్యత!
తనకు పిల్లల భవిష్యత్ ముఖ్యమని కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ స్పష్టం చేశారు. తన భార్య సునీత తనపై చేసిన ఆరోపణలు అవాస్తమని చెప్పారు. మానవత్వంతో ఆమె పొరపాట్లను సహిస్తున్నానని అన్నారు. తన నుంచి ప్రాణహాని ఉందని సునీత చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఆమె ప్రాణాలకు ఆయన హామీయిచ్చారు. ఆమె ఏదీ జరిగినా తనదే పూచీ అన్నారు. ఆమెకు ఏదైనా జరిగితే కర్త, కర్మ, క్రియ తనదే అన్నారు. తనను కాపాడు కోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కోటి రూపాయిలు ఇవ్వాలని సునీత బెదిరిస్తోందని వెల్లడించారు. డబ్బు కోసమే ఆమె ఇదంతా చేస్తోందని ఆరోపించారు. పిల్లల భవిష్యత్ కోసమే బతుకుతున్నానని చెప్పారు. పిల్లలను బాగు చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఆమెకు తన ఆస్తే కావాలని వెంకటరమణ ఆరోపించారు. ఈ ఆస్తి కోసమే ఇంత చేశారన్నారు. ఆమె బ్లాక్ మెయిల్ చేయడం ప్రపంచమంతా చూస్తోందని అన్నారు. ఆమె సుఖంగా ఉంటుందంటే తన ఆస్తిని ఇచ్చేసేందుకు సిద్ధమన్నారు. తన భార్యతో కలిసివుందామని ఇప్పటికీ అనుకుంటున్నానని తెలిపారు. యముడునయితే పరిస్థితి వేరేగా ఉండేదన్నారు. హైకోర్టు ఆదేశించినా పిల్లలను పాఠశాలకు పంపకపోవడం కోర్టు ధిక్కారం అవుతుందన్నారు. పిల్లల భవిష్యత్ కాపాడుకోవాల్సిన సునీతపై ఉందన్నారు. పదే పదే కేసులు పెడితే వారి భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించుకోవాలన్నారు. తనను చంపేసి సునీత జైలుకు వెళ్లినా, ఆమెను చంపేసి తాను జైలుకు వెళ్లినా పిల్లల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. అయితే వెంకట రమణ తనను పనిమనిషిగా కన్నా హీనంగా చూశారని సునీత ఆరోపించారు. ఈ రోజుకి కూడా తనకు మనిషిగా గుర్తించడం లేదన్నారు. రాజకీయంగా ఎదగడానికి తమను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. తనను శారీరకంగా, మానసికంగా గాయపరిచారని వాపోయారు. అధికారం ఉందన్న గర్వంతో విర్రవీగుతున్నారని, ఆడవాళ్లంటే ఆయన చిన్నచూపు అని ధ్వజమెత్తారు. తన కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించారని చెప్పారు. 15 ఏళ్ల నుంచి నరకం అనుభవిస్తున్నానని చెప్పారు. ఈ నరకం ఇక చాలన్నారు. పిల్లలు పేరు చెప్పి తన భర్త తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. పిల్లలపై ప్రేమ ఉంటే తనను ఆరు నెలలు పుట్టింట్లో ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. పిల్లలకు జ్వరమొచ్చినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఆయనపై తనకు నమ్మకం లేదన్నారు. పిల్లల కోసమే బతుకుతున్నట్టు వెంకట రమణ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని సునీత ఆరోపించారు. తన పిల్లలు ఆయన దగ్గర వుంటే తనకు దక్కరని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తాను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎన్నో ఆస్తులు సంపాదించారని, వాటిని తన ముందు దాచి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్ ఆలోచించే ఇన్నాళ్లు తన భర్తతోకాపురం చేశానని సునీత చెప్పారు. ఆయన మాటలకు, చేతలకు పొంతన ఉందని చెప్పారు. ఆయనతో కలిసివుండడం కుదరదని సునీత స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్ తనకు ముఖ్యమని వెంకట రమణ పునరుద్ఘాటించారు. -
వేధింపులే ప్రాణం తీశాయా..!
భీమ్గల్, న్యూస్లైన్: శుక్రవారం రాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డ భీమ్గల్ మండలం బడాభీమ్గల్ గ్రామానికి చెంది న కూన మాధవి (20) మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లయి ఏడాది కూడా గడవకముందే ఆమె బల వన్మరణానికి పాల్పడడానికి బలపైన కారణాలు ఎంటన్నదానిపైనే గ జరుగుతోంది. మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన మోహన్, పద్మ దంపతుల ఏకైక కుమార్తె మాధవిని గతేడాది డిసెంబర్లో బడాభీమ్గల్కు చెందిన మేనళ్లుడైన కూన శ్రీనివాస్కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే ఈ వివాహం శ్రీని వాస్కు ఇష్టం లేదని తెలుస్తుంది. పెద్దల ఒత్తిడి మేరకు వివాహం చేసుకున్న ఆయన తన భార్యను తరచూ వేధించేవాడని మృతురాలి బంధువులు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు శ్రీనివాస్ ఏపని లేక జులాయిగా తిరిగేవాడని, తరుచూ భార్యతో గొడవ పడేవాడని స్థానికుల మాటలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో మాధవి ఇంట్లో గదిలో గడియ పెట్టుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుని ఆత్మహత్యకు ఒడిగట్టింది. మృతురాలు నాలుగు నెలల గర్భిణి అని తెలిసింది. పెళ్లయి ఏడాదైన గడవకముందే నిండు నూరేళ్ల జీవితం ముగియడంపై బంధువులు, కుటంబీకులు కంట తడి పెడుతున్నారు. మృతురాలు కాలి పోయి పడి ఉన్న కోణంలోనూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్తుమార్టం నివేదిక అందితే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. నిందితుడి కుటంబ సభ్యులులందరూ పోలీసుల అదుపులో ఉన్నారు. -
గృహ హింస కేసుపై స్పందించిన బాలీవుడ్ నటుడు ఓం పురి!
తనపై నమోదైన గృహ హింస కేసుపై బాలీవుడ్ నటుడు ఓం పురి స్పందించాడు. నందితా తనను టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఈ వివాదం రేపు కోర్టులో విచారణకు వస్తుంది. త్వరలోనే వాస్తవాలు తెలుస్తాయి అని ఓం పురి పీటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. గత 35 సంవత్సరాలు సినీ పరిశ్రమలో పనిచేస్తున్నానని, సుమారు 250 చిత్రాల్లో నటించానని, అయితే తనపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఓం పురి తెలిపారు. తన భార్య ఆరోపణలన్ని అవాస్తవాలని, తన కుమారుడి క్షేమం గురించి ఆలోచించడం కారణంగా తాను మౌనం వహిస్తున్నానని ఓం పురి తెలిపారు. ఓం పురిపై ఆయన భార్య నందిత వెర్సోవా పోలీసు స్టేషన్ లో గృహ హింస కేసు నమోదు చేసింది. ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని తమ ఫ్లాట్ లో తనను కర్రతో కొట్టారని పిర్యాదు చేసింది. అంతేకాక తన కుమారుడికి స్కూల్ ఫీజు, తనకు పురి భృతిని చెల్లించడం లేదని ఫిర్యాదులో తెలిపింది.