Finance Ministery
-
డియర్.. నిప్పులేకుండానే కాలుద్ది జాగర్త!
ఖగపతి యమృతము తేగాభుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్పొగ చెట్టై జన్మించెనుపొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్అని గిరీశం దొరవారు ఎన్నడో సెలవిచ్చారు. ఇప్పుడు పొగపురాణాన్ని తిరగరాసుకోవాల్సి వచ్చేలా ఉన్నది. కమలపతి వడ్డన సేయగపొగచుట్టకు పన్ను పోటు బాగా ముదిరెన్రెక్కలతో ధరలు ఎగరగఅగ్గిపుల్ల లేకున్నా జేబులు కాలున్..అని కొత్తగా తోచిన పజ్జేలు రాసుకుని వాటిని పారాయణం చేసుకుంటూ గడపవలెను. దమ్ము కొట్టాలనిపించినప్పుడెల్లా.. నరాలు పట్టు తప్పి, జిహ్వ లాగి, భయం పుట్టి, వణుకుతో శరీరం కంపించి.. ఇక ఆ ఆలోచననే ధూమపాన ప్రియులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చేలా ఉన్నది మరి! ఢిల్లీ పాలకులు సిగరెట్టుల మీద పన్ను పోటును ఏకంగా 35 శాతానికి పెంచేయాలని తలపోస్తున్న తరుణంలో.. సిగరెట్టును తలచుకుంటే చాలు.. పర్సు కాలి చురుక్కు మంటుందని అనుకోవాల్సిందే.సిగరెట్టు అనగా ఏమిటి? మన లోలోపల గూడుకట్టుకుని ఉండే క్రియేటివిటీ అనే పదార్థాన్ని కరిగించి గంగాప్రవాహంలా వెలుపలికి లాక్కుని వచ్చే ధూమపరికరము కదా.. అని భాష్యం చెప్పగల మహానుభావులు మనకు చాలా మంది కనిపిస్తుంటారు. ‘భలే భలే ఓ సిగరెట్టు.. చేస్తావే బహు కనికట్టు.. చైతన్యానికి తొలిమెట్టు.. బద్ధకముంటే పని పట్టు..’ అంటూ సిగరెట్టు దమ్ము లాగి వదిలితే తప్ప తమలో జీవనోత్సాహం ఇనుమడించదని, దేహశకటం పరుగులెత్తదని నమ్మే ప్రబుద్ధ జీవులు కూడా కొందరుంటారు. పుర్రె బొమ్మ ఉన్నంత మాత్రాన చాపల్యం చావదని, చావు డప్పు మోగుతుందని తెలిసినా ధూమప్రేమ విలోమం కాదని నిరూపించే నిత్య సత్యమే సిగరెట్టు!ఉదయముననే మేల్కాంచి తమ స్నానాలగదిలోకి దూరి తమ చుట్టూ ధూపం వేస్తే తప్ప కాలకృత్యపర్వం కూడా ముగించలేని నిత్య అంకితులు కొందరుంటారు. తమ మునివేళ్ల చివరల్లోమండే అందాల్ని తమకు దూరం చేయాలనే కుట్ర ఏదో అధికారాత్మకంగా జరుగుతున్నదని అనుమానించే సత్యశంకితులు కొందరు ఉంటారు! ఎవరి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. సిగరెట్టు అనే పదార్థము తాజా పరిణామముల నేపథ్యములో.. నిప్పు లేకున్ననూ మండును.. మీ బతుకును పొగించడం మాత్రమే కాదు.. తెగించి ముట్టిస్తే నోటిచివర మండుట మాత్రమే కాదు సుమీ.. జేబులోని సొమ్ములను కూడా దహించి మసిచేయును.. అనే భావన ఇప్పుడు దేశ ప్రజలలో వేళ్లూనుకొనుచున్నది!సిగరెట్టు మీది అపరిమితమైన ప్రేమతో, అది అమూల్యమైన వస్తువని గుర్తించి.. దాని విలువను ఆకసమునందలి నక్షత్రాల సరసన ఉంచినప్పుడే దానికి సద్గతి కలుగునని ఏలికలు గ్రహించడమే ఒక చిత్రమైన సంగతి. అందుకే జీఎస్టీ అను జోడింపులో కాస్త పెంపు జత చేసి 35 శాతం వడ్డించడం తగు విధాయకం అని నిర్ణయించడం తాజా తాజా సంగతి! ఇటువంటి పరిస్థితుల్లో సిగరెట్టు అను పరికరముతో దమ్ము కొట్టాలన్నా.. దాని వెంబడి శీతల పానీయములు అనబడు ద్రావకములు గుటక వేయాలన్నా.. బహు కష్టము అని ప్రజలు తెలుసుకోవడం ఒక్కటే ఇంకా పెండింగులో ఉన్నది.ఇటువంటి వికట పరిస్థితులలో.. ధూమ ప్రేమికులకు గత్యంతరమేది? అను సందేహము జనులలో జనియించుట సహజము! పరిష్కారము బహు సులభము. ఓ తెల్లటి కాగితము మీద.. సిగరెట్టును చిత్రించి.. ఓ చివరన పెదవుల బంధమును, మరో చివరన పొగ కెరటములను చిత్రించి.. జిహ్వ లాగినప్పుడెల్లా దానిని చూచుకొనుచూ యుండవలెను. అటుల జేసిన యెడల.. జూచుచూ గడిపిన యెడల.. ధూమపానాసక్తులకు అనుభవైకవేద్యమైన పురాఅనుభవము.. పునః అనుభవములోకి వచ్చి ఆత్మానందము కలుగును. మరియొక మార్గము దుర్లభము. స్వస్తి. ..ఎం. రాజేశ్వరి -
రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్ష
వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశుపోషణ, పాడి పరిశ్రమ..వంటి విభిన్న విభాగాలకు అందించే రుణాల పంపిణీ పురోగతిని కేంద్రం సమీక్షించింది. కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి నాగరాజు ఈమేరకు అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డ్, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన బ్యాంకర్ల కమిటీతో సమావేశం నిర్వహించారు.రుణాలతో ఉపాధి అవకాశాలు పెంపుప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నాగరాజు బ్యాంకర్లకు సూచించారు. ఈ రంగాలకు అందించే రుణ పంపిణీని మెరుగుపరచడంలో బ్యాంకులకు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వ్యవసాయ వృద్ధి కోసం దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించాలన్నారు. దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కాబట్టి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో రుణ పంపిణీ పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ పంపిణీని నిర్ధారించడానికి ప్రాంతీయ స్థాయి సమావేశాలు నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించారు.ఇదీ చదవండి: ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?రుణ పంపిణీపై ప్రభుత్వం దృష్టిచేపల పెంపకందారులను గుర్తించి వారికి కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు సహకరించాలని చెప్పారు. అందుకోసం రాష్ట్ర విభాగాలు, ఇతర సంఘాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సులువుగా రుణాలు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని నొక్కి చెప్పారు. -
20 ఖాతాలను సమీక్షించండి.. బ్యాంకులకు ఆర్థిక శాఖ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్పీఏ) నిర్వహణలో భాగంగా ఇన్సాల్వెన్సీ– దివాలా కోడ్ కింద దాఖలైన టాప్ 20 ఖాతాలను నెలవారీగా పర్యవేక్షించాలని, సమీక్షించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) అధిపతులను కోరింది. పీఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓలతో జరిగిన సమావేశంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషి మాట్లాడుతూ, నెలవారీగా టాప్ 20 దివాలా కేసులను సమీక్షించాలని కోరారు. ఈ సమావేశంలో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) పని తీరును కూడా సమీక్షించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మెజారిటీ వాటాతో ఎన్ఏఆర్సీఎల్ 2021లో ఏర్పాటయి న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే.. కెనరా బ్యాంక్ స్పాన్సర్ బ్యాంక్గా ఉంది. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్, 2002 కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీగా రిజిస్టర్ అయ్యింది. -
సవాళ్లపై భారత్ అప్రమత్తత అవసరం
న్యూఢిల్లీ: సవాళ్లకు సంబంధించి దేశం అప్రమత్తత పాటించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రిత్వశాఖ నెలవారీ సమీక్ష స్పష్టం చేసింది. వ్యవసాయ ఉత్పత్తి తగ్గుదల, ధరల పెరుగుదలకు అవకాశం, భౌగోళిక ఉద్రిక్తతల వంటి పలు అంశాలను ఈ సందర్భంగా ఆర్థికశాఖ ప్రస్తావించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందన్న కేంద్ర అంచనాలను ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) నివేదికలు బలపరుస్తున్నప్పటికీ వృద్ధి ధోరణిపై సవాళ్లూ ఉన్నాయని సూచించింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం విషయంలో ఎదురయ్యే సవాళ్లను ఆర్థికశాఖ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎల్ నినో పరిస్థితులు కరువు పరిణామాలకు దారితీయడం, వ్యవసాయోత్పత్తి తగ్గే అవకాశాలు, ధరలు పెరగడం, భౌగోళికంగా రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి సవాళ్ల వంటి అంశాల్లో భారత్ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని విశ్లేషించింది. సమీక్షలో మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 2022–23లో సవాళ్లను తట్టుకున్నాం.. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, మహమ్మారి సవాళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు కనబరిచింది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా 7 శాతం వృద్ధి అంచనా ఉంది. తద్వారా ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోంది. ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) వంటి స్థూల ఆర్థిక అంశాల విషయంలో భారత్ స్థిరత్వంతో కూడిన పురోగతిని నమోదుచేసుకుంది. బ్యాం‘కింగ్’ వడ్డీరేట్లను పెంచినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా నిలద్రొక్కుకుంది. వృద్ధి స్థిరత్వానికి ఇది సంకేతం. బ్యాంకులపై వేర్వేరుగా ‘స్ట్రస్ టెస్ట్’ల నిర్వహణ కూడా జరుగుతోంది. ముఖ్యంగా డిపాజిట్ల విభాగమూ పటిష్టంగా ఉంది. బ్యాంకుల్లో డిపాజిట్లు సురక్షితం అని డిపాజిటర్లు భావిస్తున్నందున, డిపాజిట్లలో 63 శాతం వేగంగా విత్డ్రా (ఉపసంహరణ) అవడానికి అవకాశాలు లేవు. ఇది బ్యాంకింగ్ పట్ల డిపాజిట్లకు ఉన్న విశ్వాసంతో పాటు, ఎకానమీ స్థిరత్వానికి దోహదపడే అంశం. ఈ కారకాలన్నీ భారతీయ బ్యాంకులను అమెరికా, యూరోపియన్ యూనియర్ బ్యాంకుల కన్నా భిన్నంగా ఉంచుతున్నాయి. ఆయా దేశాల్లోని బ్యాంకులు కఠినమైన ద్రవ్య విధానం ఉపసంహరణ నేపథ్యంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం ప్రస్తుతం అదుపులో.. ధరల పరిస్థితిని పరిశీలిస్తే.. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉంది. టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మార్చిలో 29 నెలల కనిష్టానికి దిగి వచ్చింది. 1.34 శాతానికి పరిమితమైంది. గత 10 నెలల నుంచి తగ్గుతూ వస్తోంది. ద్రవ్యోల్బణం రేటు తగ్గడానికి ప్రధానంగా ప్రాథమిక లోహాలు, టెక్స్టైల్స్, ఆహారయేతర ఆర్టికల్స్, ఖనిజాలు, రబ్బర్.. ప్లాస్టిక్ ఉత్పత్తులు, క్రూడ్ పెట్రోలియం .. సహజ వాయువు, పేపర్ .. పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడమే కారణం. అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు 2022 గరిష్టాల నుంచి దిగివస్తుండటం, దేశీయంగా సానుకూల బేస్ ఎఫెక్ట్ల ప్రభావంతో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం రాబోయే రోజుల్లో మరింత తగ్గొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతం స్థాయిలో ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2023 మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల కనిష్ట స్థాయి 5.66 శాతానికి దిగివచ్చింది. నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం ఎగువనే కొనసాగింది. 2021–22లో సగటున వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉంది. 2022–23లో 6.7 శాతానికి పెరిగింది. అయితే గడచిన ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలలూ చూస్తే, సగటు ద్రవ్యోల్బణం 6.1 శాతంగా ఉండడం గమనార్హం. మొదటి ఆరు నెలల్లో ఈ రేటు ఏకంగా 7.2 శాతంగా ఉంది. అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు తగ్గడం, సరఫరాల చైన్ మెరుగుదలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఆర్బీఐ అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానం (2022 మే తర్వాత బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో 2.5 శాతం పెరిగి 6.5 శాతానికి ఎగసిన సంగతి తెలిసిందే) వంటి అంశాలు ద్రవ్యోల్బణం అదుపులోనికి రావడానికి దోహదపడింది. ఇదే ధోరణి కొనసాగుతుందన్న అంచనాలు ఉన్నాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2023–24లో 5.3 శాతం ఉంటుందని ఫిబ్రవరి ఆర్బీఐ పాలసీ అంచనా వేస్తే, ఏప్రిల్ మొదట్లో జరిగిన పాలసీ సమీక్ష ఈ అంచనాలను 5.2 శాతానికి తగ్గించడం వృద్ధికి దారితీసే మరో హర్షణీయ పరిణామం. భారత్ ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు దాదాపు భారత్ ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు దాదాపు 12 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. ప్రస్తుత నిల్వలు భారత్ ఎకానమీకి భరోసాను ఇస్తున్నాయి. 2021 అక్టోబర్లో భారత్ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గరిష్ట స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లుకుపైగా పడిపోయాయి. అయితే అటు తర్వాత తిరిగి కొంత స్థిరంగా కోలుకుంటున్నాయి. ఈ పరిమాణం ఏప్రిల్ 14వ తేదీతో ముగిసిన వారంలో 586.412 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫారిన్ ఫోర్టిఫోలియో ఇన్వెస్ట్మెంట్ల (ఎఫ్పీఐ) ఫారెక్స్ పెరుగుదలకు దోహదపడుతున్నాయి. దీనితో గడచిన ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కరెంట్ అకౌంట్లోటు (క్యాడ్) కట్టడిలో ఉంది. -
పాలసీల విక్రయాల్లో అనైతిక పోకడ వద్దు
న్యూఢిల్లీ: కస్టమర్లతో ఏదో రకంగా బీమా పాలసీలను విక్రయించే విధానాలను బ్యాంక్లు అనుసరిస్తున్నాయనే విమర్శలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. బీమా ఉత్పత్తుల విక్రయాల కోసం అనైతిక విధానాలను అనుసరించొద్దని బ్యాంక్లను కోరింది. కస్టమర్లకు బీమా పాలసీల విక్రయాల్లో అనైతిక విధానాలు పాటించకుండా తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల అధినేతలను ఆదేశించింది. కస్టమర్లకు బీమా పాలసీలను విక్రయించే విషయంలో బ్యాంక్లు, బీమా సంస్థలు మోసపూరిత, అనైతిక విధానాలకు పాల్పడుతున్నాయంటూ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగానికి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 75 ఏళ్లు దాటిన కస్టమర్లకు సైతం జీవిత బీమా పాలసీలను విక్రయించిన సందర్భాలను ప్రస్తావించింది. సాధారణంగా కస్టమర్లు రుణాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, టర్మ్ డిపాజిట్ చేస్తున్నప్పుడు బ్యాంక్లు బీమా ఉత్పత్తులను వారితో కొనిపించే ప్రయత్నం చేస్తుంటాయి. ఏదో ఒక బీమా కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులను కస్టమర్లతో బలవంతంగా కొనిపించే చర్యలకు దూరంగా ఉండాలని తాజా ఆదేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. బీమా ఉత్పత్తుల విక్రయాలపై ప్రోత్సాహకాలు ఇవ్వడం క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఒత్తిడికి దారితీయడమే కాకుండా, బ్యాంక్ల ప్రధాన వాణిజ్య కార్యకలపాలపై ప్రభావం పడుతుందని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సైతం ఆందోళన వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అనైతిక, అనుచిత విధానాలను అనుసరించకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని, తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని కోరింది. బీమా పాలసీల విక్రయాలకు సంబంధించి నూరు శాతం కేవైసీ నిబంధనలు అమల్లో పెట్టాలని కూడా ఆదేశించింది. -
Pre-Budget 2023: బడ్జెట్లో పన్నులు తగ్గించాలి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలన్నది బడ్జెట్కు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ముందుకు వచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి. అలాగే, మరింత మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని, ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా మరిన్ని నిధులను ఖర్చు చేయాలని, పలు రంగాలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న డిమాండ్లు వచ్చా యి. కేంద్ర ఆర్థిక శాఖ 2023–24 బడ్జెట్కు ముందు వివిధ భాగస్వాములు, పరిశ్రమలతో సంప్రదింపులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 21న పలు రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు మొదలు పెట్టారు. సోమవారం ఆర్థికవేత్తల అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా చర్చలను ముగించారు. వచ్చే ఫిబ్రవరి 1న బడ్జెట్ను మంత్రి సీతారామన్ పార్లమెంట్కు సమర్పించనుండడం గమనార్హం. ఎంఎస్ఎంఈలకు గ్రీన్ సర్టిఫికేషన్, పట్టణ నిరుద్యోగుల కోసం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలని, ఆదాయపన్నును క్రమబద్ధీకరించాలనే డిమాండ్లు వచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దేశీయంగా సరఫరా వ్యవస్థ బలోపేతం, ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నుల తగ్గింపు, ఈవీ విధానాన్ని ప్రకటించడం, గ్రీన్ హైడ్రోజన్కు భారత్ను కేంద్రం చేయడం, చిన్నారులకు సామాజిక భద్రత ప్రయోజనం, ఈఎస్ఐసీ కింద అసంఘటిత రంగ కార్మికులకు కవరేజీ కల్పించాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. -
రుణ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి
శ్రీనగర్: బ్యాంకులు వివిధ రుణ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్రావ్ కరాద్ కోరారు. ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి ప్రయోజనాలు అందేలా అవగాహన కల్పించాలని మంగళవారం విజ్ఞప్తి చేశారు. కేంద్రపాలిత ప్రాంత స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రత్యేక సమీక్షా సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ, ఆర్థిక అభివృద్ధిలో సాధారణంగా విద్య ఎంత కీలకమో ఆర్థిక అక్షరాస్యత కూడా అంతే ముఖ్యమన్నారు. ‘‘బ్యాంకులు వివిధ రుణ పథకాల గురించి ప్రజలలో అవగాహన పెంచాలి. దీనివల్ల ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం ఉద్దేశించిన ప్రయోజనాలు వారికి అందుతాయి‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► పీఎం సేవానిధి స్కీమ్లో రుణగ్రహీతల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఈ పథకం లబ్ధిదారులను మార్గనిర్దేశం చేసి, పీఎం ముద్రా యోజన కింద అధిక రుణాలు పొందే అర్హతను వారు పొందేందుకు కృషి జరగాలి. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన వివిధ చొరవలతో జమ్మూ, కశ్మీర్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇక్కడ బ్యాంకింగ్ పోషిస్తున్న పాత్ర పట్ల సంతృప్తి ఉంది. జమ్మూ, కశ్మీర్లో బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల సేవల విస్తరణకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందిస్తుంది. ► గత రెండేళ్లలో దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ప్రశంసనీయమైన పనితీరును కనబరిచాయి. ఇది అభినందనీయం. -
సుస్థిరమైన ఆవిష్కరణలు, ఉత్పత్తులు రావాలి
సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని అతి పెద్ద మార్కెట్ లక్ష్యంగా వివిధ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు, సుస్థిరమైన ఉత్పత్తులు తీసుకురావాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. వివిధ రంగాల పరస్పర సహకారం, వినూత్న విధానాలతో వచ్చే 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశాల శక్తికేంద్రంగా నిలుస్తుందనే ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిఫ్ట్, ఎఫ్డీఐఐ, ఎన్ఐడి, ఐఐఎఫ్టి, ఐఐపి విద్యార్థుల సమావేశం శిల్పకళావేదికలో శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన నిర్మలా సీతారామన్ ‘డిజిటలైజేషన్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్: భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు’ అనే అంశంపై మాట్లాడారు. ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ సూచించిన పంచ సూత్రాల(పంచ పరిష్కారాలు) అమలుతో దేశం మరింత బలోపేతం అవుతోందన్నారు. ఇప్పటికే భారత్ అభివృద్ధి చేసిన స్థిరమైన డిజైన్ల గురించి తెలుసుకొని, వాటిని ఈ తరానికి సౌకర్యంగా ఉండేలా మెరుగుపరచాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు. మార్పును స్వీకరించి, కొనసాగించే వారధులుగా విద్యార్థులు ఉండాలని సీతారామన్ వ్యాఖ్యానించారు. ఆశాకిరణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ : పీయూష్ గోయల్ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచానికి భారత్ ఆర్థికవ్యవస్థ ఒక ఆశాకిరణంగా ఉందని కేంద్ర పరిశ్రమలు, ప్రజా పంపిణీ, జౌళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఉత్తమ డిజైన్లను రూపొందించి, ఖర్చు తగ్గించే అంశాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. సభికులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. పేటెంట్ల కోసం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డిజిటలైజేషన్ ద్వారా అవినీతిని రూపుమాపామని, మధ్యవర్తులను దూరం చేయగలిగామని, పోటీతత్వం పెంచగలిగామని తెలిపారు. నూతన ఆవిష్కరణలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఐదు విద్యాసంస్థల విద్యార్థుల (పూర్వవిద్యార్థులుసహా) సమ్మేళనం తొలిసారిగా హైదరాబాద్లో జరుగుతోందని, రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటివి నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రవాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ సింగ్ ఠాకూర్, ఎఫ్డీడీఐ ఎండీ అరుణ్ కుమార్ సిన్హా, నిఫ్ట్ డైరెక్టర్ విజయ్ కుమార్ మంత్రి, ఎన్ఐడి ప్రొఫెసర్ శేఖర్ ముఖర్జీ, ఎఫ్డిఐఐ హైదరాబాద్ సెంటర్ ఇంచార్జ్ దీపక్ చౌదరి, ఐఐఎఫ్టి డీన్ డాక్టర్ సతీందర్ భాటియా, ఐఐపీ చైర్మన్ వాగీ దీక్షిత్ పాల్గొన్నారు. -
ఏవియేషన్కు రూ. 1,500 కోట్ల రుణ పరిమితి
న్యూఢిల్లీ: కోవిడ్ ధాటికి కుదేలైన రంగాలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి ఉద్దేశించిన ఈసీఎల్జీఎస్కి (అత్యవస రుణ సదుపాయ హామీ పథకం) కేంద్ర ఆర్థిక శాఖ సవరణలు చేసింది. వైమానిక రంగ సంస్థలకు గరిష్ట రుణ పరిమితిని రూ. 400 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెంచింది. సముచిత వడ్డీ రేటుతో తనఖా లేని రుణాలు పొందడం ద్వారా విమానయాన సంస్థలు నిధుల కొరత సమస్యను అధిగమించడంలో తోడ్పాటు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2020 మే నెలలో కేంద్రం ఈ స్కీమును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత నుంచి పరిస్థితులను బట్టి సవరిస్తూ, పొడిగిస్తూ వస్తోంది. ఇది ఈ ఏడాది మార్చితో ముగియాల్సి ఉండగా 2023 మార్చి వరకూ పొడిగించింది. ఈ స్కీము కింద 2022 ఆగస్టు 5 నాటికి ఈ స్కీము కింద రూ. 3.67 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. -
అలెర్ట్: ఈపీఎఫ్ అకౌంట్లో మీ వడ్డీ డబ్బులు కనిపించడం లేదా?
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు అలెర్ట్. మీ ఈపీఎఫ్ఓ ఖాతాలో వడ్డీ మొత్తం కనిపించడంలేదని కంగారు పడుతున్నారా? సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కారణంగా ఈ వడ్డీ మొత్తం స్టేట్మెంట్లో కనిపించడం లేదని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. ఈపీఎఫ్ఓ సంస్థ ప్రతి ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ ఎంత చెల్లించేది నిర్ణయిస్తుంది. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత సంబంధిత ఖాతాలో ఆ వడ్డీని జమ చేస్తుంది. ఎప్పటిలాగే 2020-2021 ఆర్ధిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని చెల్లించినట్లు మార్చి 2021లో ప్రకటించింది. అదే ఏడాది డిసెంబర్ నెలలో లబ్ధి దారుల అకౌంట్లలో డిపాజిట్ అయ్యింది. 2021-22 సంబంధించి ఈపీఎఫ్ బోర్డు వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకు అకౌంట్లో జమ కాలేదు. There is no loss of interest for any subscriber. The interest is being credited in the accounts of all EPF subscribers. However, that is not visible in the statements in view of a software upgrade being implemented by EPFO to account for change in the tax incidence. (1/2) https://t.co/HoY0JtPjII — Ministry of Finance (@FinMinIndia) October 5, 2022 దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు సభ్యులు నిర్ణయించిన వడ్డీ మొత్తం ఇప్పటి వరకు తమ అకౌంట్లలో జమ కాలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్దాస్ పాయ్ పీఎఫ్ వడ్డీ ఎక్కడ? అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్పై ఆర్థిక మంత్రిత్వ శాఖ..పీఎఫ్ ఖాతాలో రూ.2.5 లక్షల మించి జమ చేస్తే..ఆ మొత్తంపై లభించే వడ్డీకి పన్ను విధిస్తామని గతంలో పేర్కొన్నాం. దానికి సంబంధించి సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ జరుగుతుండటంతో ఆలస్యం అవుతోందని, వడ్డీ మొత్తాన్ని ఏ ఒక్క చందాదారుడూ కోల్పోరని తన ట్వీట్లో స్పష్టం చేసింది. -
ఆయిల్ కంపెనీలకు కేంద్రం శుభవార్త, పెట్రోల్..డీజిల్ రేట్లు తగ్గేనా?
నష్టపోతున్న ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థకు కేంద్రం పాక్షికంగా సహాయం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం ఇంధన రీటైలర్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో పాటు ఇతర కంపెనీలకు రూ.20వేల కోట్లు పరిహారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు దేశ వ్యాప్తంగా 90శాతం కంటే ఎక్కుగానే ఇంధనాన్ని సరఫరా చేస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం ప్రభుత్వ ఆయిల్ సంస్థలపై పడింది. దీంతో ఏప్రిల్ - జూన్ వార్షిక ఫలితాల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రతి లీటర్ పెట్రోల్ పై రూ.10, లీటర్ డీజిల్పై రూ.14 నష్టంతో మొత్తం రూ.1992.52 కోట్ల నష్టాల్ని మూటగట్టుకుంది. ఆ నష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఇంధనాలపై పన్ను తగ్గింపులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేసింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం చమురు సబ్సిడీని 58 బిలియన్ రూపాయిలు కేటాయించగా, ఎరువుల సబ్సిడీపై 1.05 ట్రిలియన్ రూపాయలు అందించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. అదే సమయంలో అమెరికాలో ఇంధన తయారీ సామర్ధ్యం తగ్గడం, ఉక్రెయిన్పై యుద్ధంతో రష్యా నుంచి ఎగుమతులు తగ్గాయి. 85శాతం కంటే ఎక్కువగా దిగుమతి చేసుకున్న చమురు రిఫైనింగ్-కమ్-ఫ్యూయల్ రిటైలింగ్ కంపెనీలు అంతర్జాతీయ ధరలకే ఉత్పత్తి చేయడంలో బెంచ్ మార్క్ను క్రాస్ చేశాయి. ఈ తరుణంలో ఈ ఆగస్ట్ నెలలో చమురు కంపెనీలకు ధరల పెంపు లేదా ప్రభుత్వ పరిహారం ద్వారా నిరంతర నష్టాలను పూడ్చేందుకు కొంత జోక్యం అవసరం అని భారత పెట్రోలియం చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు ఊతం ఇచ్చేలా పెట్రోలియం శాఖ ఆర్ధిక సాయం కింద కేంద్రాన్ని 280 బిలియన్ డాలర్లు (రూ.28వేల కోట్లు) అడిగినట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో పేర్కొంది. పెట్రోలియం శాఖ అభ్యర్ధనపై ఆర్ధిక శాఖ 200బిలియన్ల (రూ.20వేల కోట్లు) ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆ రెండు కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఇంధన రీటైల్ సంస్థలకు ఆర్ధిక సాయం అందనున్నట్లు వెలుగులోకి వచ్చిన పలు కథనాలు హైలెట్ చేస్తున్నాయి. -
యూపీఐ సేవలపై చార్జీలు!.. కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపుల విధానంలో (యూపీఐ) లావాదేవీలపై చార్జీలు విధించే యోచనేదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. యూపీఐ అనేది ప్రజలకు మేలు చేకూర్చేందుకు ఉద్దేశించిన డిజిటల్ ప్రయత్నం మాత్రమేనని పేర్కొంది. సర్వీస్ ప్రొవైడర్లు ఇతరత్రా మార్గాల ద్వారా తమ ఖర్చులను రాబట్టుకోవాల్సి ఉంటుందని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో తెలిపింది. డిజిటల్ చెల్లింపులు, పేమెంట్ ప్లాట్ఫాంలను ప్రోత్సహించడం కోసం డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు ప్రభుత్వం గతేడాది ఆర్థిక సహకారం అందించిందని, ఈ ఏడాది కూడా దాన్ని కొనసాగిస్తామని ప్రకటించిందని ఆర్థిక శాఖ వివరించింది. ఐఎంపీఎస్ తరహాలోనే యూపీఐ కూడా నిధుల బదలాయింపు వ్యవస్థ కాబట్టి ఈ విధానంలోనూ చార్జీలను వర్తింపచేసే అంశంపై రిజర్వ్ బ్యాంక్ చర్చాపత్రం విడుదల చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. UPI is a digital public good with immense convenience for the public & productivity gains for the economy. There is no consideration in Govt to levy any charges for UPI services. The concerns of the service providers for cost recovery have to be met through other means. (1/2) — Ministry of Finance (@FinMinIndia) August 21, 2022 -
పన్నులన్నీ చెల్లిస్తా
లండన్: భర్త దేశ ఆర్థిక మంత్రిగా ఉండి భార్యే పన్నులు చెల్లించట్లేదనే ఆరోపణలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు బ్రిటన్లోనూ ఇకపై పన్నులు చెల్లిస్తానని ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి స్పష్టంచేశారు. వాస్తవానికి ఆమెకు బ్రిటన్ పౌరసత్వంలేదు. బ్రిటన్ పౌరసత్వం లేనందున విదేశాల్లో వచ్చే ఆదాయంపై పన్నులను బ్రిటన్లో చెల్లించాల్సిన పనిలేదు. ప్రసిద్ధ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్లో అక్షతకు 0.9 శాతం వాటా ఉంది. వేర్వేరు సంస్థల్లో పెట్టుబడులతో రూ.కోట్ల మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే, స్వయంగా ఆర్థిక మంత్రి భార్యే పన్నులు చెల్లించట్లేదని అక్కడి రాజకీయ పార్టీలు విమర్శలు చేయడంపై అక్షత స్పందించారు. ‘బ్రిటన్లో వ్యాపారంపై వచ్చే ఆదాయానికి పన్నులను బ్రిటన్లో కడుతున్నాను. ఇక అంతర్జాతీయ ఆదాయంపై అంతర్జాతీయ పన్నునూ చెల్లిస్తున్నాను. భారత్సహా ప్రపంచవ్యాప్త ఆదాయంపై పన్నులను ఇకపై బ్రిటన్లో చెల్లించడం ప్రారంభిస్తా’ అని ట్వీట్ చేశారు. -
నిరుద్యోగులకు శుభవార్త.. 30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనమతులు ఇవ్వాలని సీఎం శాసనసభలోనే చెప్పడం జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర మంత్రులతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు ధపాలుగా చర్చించారు. 80,039 ఉద్యోగాలకుగాను, తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఇవాళ(బుధవారం) ఆర్థిక శాఖ పచ్చా జెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయా శాఖల మంత్రులు, ఆయా శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికాలుతో చర్చించి మిగతా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీఎం కేసీఆర్ పిలుపు రేపు(గురువారం) రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలునిచ్చారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రదర్శనలు చేపట్టాలని పేర్కొన్నారు. -
వేతన జీవులకు నిర్మలా సీతారామన్ భారీ షాక్!
అడగనిదే అమ్మయినా పెట్టదంటారు. అందుకని వేతన జీవులు తమ వేదనలను వెలిబుచ్చుతూ ఎన్నో విన్నపాలు వినవలె అంటూ విన్నవించుకున్నారు. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిగి రాలేదు. చలించలేదు. పెడచెవిన పెట్టారో .. శీతకన్ను వేశారో .. మొత్తానికి చిన్న చూపే చూశారనే చెప్పాలి. కరోనా నేపథ్యంలో ఆర్థిక స్థితి బాగులేదని సరిపెట్టుకుందామనుకున్నా ముందు రోజు విడుదల చేసిన ‘ఆర్థిక సర్వే‘ ఎంతో ఆశాజనకంగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ పెరుగుతుందని ఆశించారు. కానీ పెంచలేదు. సెక్షన్ 80సిలో సేవింగ్స్ లిమిట్ పెరుగుతుందనుకున్నారు. పిల్లల స్కూలు ఫీజుకు ఎక్కువ మినహాయింపు లభిస్తుందనుకున్నారు. ఇంటి లోన్ మీద వడ్డీకి మినహాయింపు పెరుగుతుందని అనుకున్నారు. కానీ.. భారతదేశాన్ని ’డిజిటల్’ భారతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో నీతిగా, నిజాయితీగా క్రమం తప్పకుండా పన్నులు చెల్లించే వేతనజీవులకు ఎటువంటి వెసులుబాటు లభించలేదు. నిన్న, మొన్నటి వరకూ ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడి అందరూ రిటర్నులు వేశారు. వెబ్సైట్లో దురదృష్టవశాత్తూ ఏర్పడ్డ స్వాభావిక ఇబ్బందుల వల్ల తుది గడువును పలు మార్లు పొడిగించి చివరికి మమ అనిపించింది. ఇప్పుడు కొత్త ఫెసిలిటీ ఇస్తారట. అది అమల్లోకి వచ్చినప్పటి మాట. ఫెసిలిటీ ఇవ్వడమనేది ఎటువంటి ఉపశమనం కాదు. అది బాగా పనిచేస్తే త్వరితగతిన ఫైలింగ్ చేసుకోవచ్చు. శ్లాబ్రేట్లు యథాతథం.. బేసిక్ లిమిట్ పెంచలేదు. శ్లాబ్ రేట్లు యథాతథంగా ఉంచారు. రేట్లలో మార్పు లేదు. పైపెచ్చు పెంచకపోవడమే ఊరట అన్నారు మంత్రి. మిగతా రంగాల్లో గ్రామీణం, వ్యవసాయం, ఇళ్లు, ఇన్ఫ్రా, కరోనా నివారణ, క్యాపిటల్ ఖర్చులు .. వీటి ద్వారా పరోక్షంగా ప్రయోజనం ఉంటుందని ముందు ముందు ఎటువంటి ఆశలకు తావు ఇవ్వకుండా అడ్డుకట్ట వేశారు. ‘విభిన్న సామర్థ్యం‘ ఉన్నవారికి ఇచ్చిన .. లేదా పొందుపర్చిన ఉపశమనం నామమాత్రమే. చాలా కొద్ది మందికే ఇది లభిస్తుంది. ఇదొక మంచి అవకాశం అని చెబుతున్నారు. రిటర్నుల్లో సవరణలు చేసుకోవచ్చని అంటున్నారు. అయితే, రివైజ్ చేసినప్పుడు ఆదాయం పెరిగితే .. సహజంగానే పన్నుభారం పెరుగుతుంది. వడ్డీలు కూడా కట్టాలి. కొత్త మార్పుల ప్రకారం అయితే.. మొదటి సంవత్సరం లోపల మార్పులు చేసుకుంటే 25 శాతం అదనం .. రెండో సంవత్సరం మొదలై పూర్తయ్యేలోపల 50 శాతం అదనం కట్టాల్సి ఉంటుంది. దీనితో ఎటువంటి ప్రయోజనమూ లేదు. -
పన్ను ఉపశమనం కల్పించాలి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులలో మార్పులు చేయాలని, భారత కంపెనీలు విదేశాల్లో లిస్టింగ్ ప్రక్రియను సులభతరం చేయాలని, టీడీఎస్/టీసీఎస్ నిబంధనలను క్రమబద్ధీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి కేపీఎంజీ సూచించింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కంపెనీలు అందించిన కోవిడ్ టీకాలు, వైద్య సరఫరాలపై పన్నుల్లేకపోవడంపై స్పష్టత ఇవ్వాలని కోరింది. 2022–23 బడ్జెట్కు ముందు కీలక సూచనలు చేసింది. ఆర్థిక శాఖకు కేపీఎంజీ సూచనలు ► కరోనా చికిత్సలకు భారీ మొత్తం ఖర్చయినందున ప్రత్యేక పన్ను మినహాయింపు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ► భారత కంపెనీలు నేరుగా విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు లేదా స్పెషల్ పర్పస్ యాక్విజిషన్ కంపెనీ మార్గంలో లిస్ట్ అయ్యేందుకు, పన్ను మినహాయింపులకు సంబంధించి నియంత్రణపరమైన కార్యాచరణను ప్రకటించాలి. ► విదేశీ కంపెనీలకు, విదేశీ బ్యాంకు శాఖలకు కార్పొరేట్ పన్నును తగ్గించాలి. దేశీ కంపెనీలకు మాదిరే రేట్లను అమలు చేయాలి. ► టీడీఎస్, టీసీఎస్కు సంబంధించి నిబంధనలను సరళీకరించాలి. అన్ని రకాల సెక్యూరిటీలను (డెరివేటివ్స్ సైతం) టీడీఎస్/టీసీఎస్ నుంచి మినహాయించాలి. ► బ్యాంకుల మాదిరే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ) కంపెనీలకు నిబంధనల పరంగా వెసులుబాటు కల్పించాలి. ముఖ్యంగా ఎన్పీఏలకు సంబంధించి మినహాయింపును పెంచాలి. వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు ఇవ్వాలి. ► దేశంలో నూతన ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాల ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు.. ముఖ్యంగా ఫార్మా, హెల్త్కేర్ రంగంలో పరిశోధన, అభివృద్ధిపై (ఆర్అండ్డీ) కంపెనీలు చేసే వ్యయాలకు వెయిటెడ్ డిడక్షన్ ఇవ్వాలి. ► జీఎస్టీ కిందకు పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావడాన్ని పరిశీలించాలి. ► కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కరోనా మహమ్మారి సమయంలో కంపెనీలు వినియోగించిన ఉత్పత్తులు, సేవలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం కల్పించాలి. -
ఒక్కరోజులో 24.39 లక్షలు.. ఒక్క గంటలో 2.79 లక్షలు.. ఐటీ ఫైలింగ్లో రికార్డ్ !
ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు విషయంలో డిసెంబరు 30న రికార్డు చోటు చేసుకుంది. ఐటీ రిటర్న్స్కి చివరి తేదీ సమీపించడంతో భారీ స్పందన వచ్చింది. డిసెంబరు 30వ తేదిన ఒక్క రోజులేనే దేశవ్యాప్తంగా 24.39 లక్షల మంది ఐటీ రిటర్న్ దాఖలు చేశారు. ఇందులో చివరి గంటలో ఏకంగా అయితే 2.79 లక్షల ఫైళ్లు దాఖలయినట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2021 డిసెంబరు 30 ఇప్పటి వరకు మొత్తం 5.34 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ సమర్పించారు. కాగా డిసెంబరు 31తో ఐటీ దాఖలకు గడువు ముగిసిపోతుంది. More than 5.34 crore Income Tax Returns for AY 2021-22 filed till 8pm today. This includes 24.39 lakh #ITRs filed today itself with 2.79 lakh #ITRs filed in the last one hour. Hope you have filed yours too! If not, please file by the due date ie 31st December, 2021. — Income Tax India (@IncomeTaxIndia) December 30, 2021 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్ని హామీలు ఇచ్చినా.. హెచ్చరికలు జారీ చేసినా ఐటీ రిటర్న్స్ ఈ ఫైలింగ్లో సమస్యలు తొలగిపోవడం లేదు. పదే పదే సాంకేతిక సమస్యలు (ఎర్రర్స్) ఎదురవుతున్నాయి. చివరి తేది సమీపించడంతో భారీ సంఖ్యలో ఐటీ రిటర్న్స్ కోసం ఈ ఫైలింగ్ పోర్టల్కి లాగిన్ అయ్యారు. వీరిలో చాలా మంది టెక్నికల్ గ్లిచెస్తో తాము విసిగిపోయామంటూ ట్వీట్లు చేశారు. Tax filing deadline and #CAs erupting in anger about @Infosys and #TaxPortal. Most are great devotees of @narendramodi Is @FinMinIndia @nsitharaman listening?? A tax portal that doesn't work despite public admonishment @NandanNilekani https://t.co/5MvAo2qetG — Sucheta Dalal (@suchetadalal) December 30, 2021 చదవండి:జీఎస్టీ పరిహారం మరో ఐదేళ్లు పొడిగించండి -
గోల్డ్ ఎక్సేంజ్ ఏర్పాటు.. విధి విధానాలు ఇలా ఇవే
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్ (ఈజీఆర్)లను ‘సెక్యూరిటీల కాంట్రాక్టుల చట్టం 1956’ కింద గుర్తిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే గోల్డ్ ఎక్సేంజ్ల్లో ఈజీఆర్ల ట్రేడింగ్కు దారిచూపినట్టయింది. ఇప్పటికే ఉన్న ఎక్సేంజ్ల్లో ప్రత్యేక కేటగిరీ కింద వీటిల్లో ట్రేడింగ్కు అవకాశం ఉంటుంది. షేర్ల మాదిరే ఈజీఆర్లను డీమ్యాట్ ఖాతాల్లో ఉంచుకోవచ్చు. అవసరమైనప్పుడు వీటిని భౌతిక బంగారంగాను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. సెక్యూరిటీల మాదిరే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్కు అర్హత లభిస్తుంది. సెబీ నిబంధనల ప్రకారం భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి ఈజీఆర్లను పొందొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021–22 బడ్జెట్ సందర్భంగా ఈజీఆర్లపై సెబీ నియంత్రణ సంస్థగా వ్యవహరిస్తుందని.. వేర్హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ కమోడిటీ మార్కెట్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తుందని ప్రకటించడం గమనార్హం. ఎక్సేంజ్ ఏర్పాటుకు మార్గం సుగమం బంగారం ఎక్సేంజ్ను ఏర్పాటు చేసేందుకు సెబీ ఈ ఏడాది సెప్టెంబర్లోనే ఆమోదం తెలియజేసింది. ఈ ఎక్సేంజ్లో బంగారం ఈజీఆర్ల రూపంలోనే ట్రేడవుతుంది. ప్రస్తుత లేదా కొత్తగా ఏర్పాటు చేసే ఎక్సేంజ్లు ఏవైనా ఈజీఆర్లో ట్రేడింగ్ను ప్రత్యేక విభాగం కింద చేపట్టొచ్చని సెబీ ప్రకటించింది. ఎంత పరిమాణం చొప్పున ఈజీఆర్లలో ట్రేడింగ్, ఈజీఆర్లను బంగారంగా మార్పిడి చేసుకునేందుకు అనుమతించడం అనేది ఎక్సేంజ్ల ఇష్టానికే విడిచిపెట్టింది. బంగారం ఎక్సేంజ్ ఏర్పాటుతో దేశంలో సహేతుక బంగారం ధరలు, పెట్టుబడులకు లిక్విడిటీ, బంగారం నాణ్యతకు హామీ లభిస్తుందని సెబీ భావిస్తోంది. ఈజీఆర్లను ఇన్వెస్టర్ తనకు నచ్చినంత కాలం షేర్ల మాదిరే ఉంచుకోవచ్చు. వద్దనుకుంటే ఈజీఆర్లను స్వాధీనం చేసి, ఖజానాల్లో అండర్లైయింగ్ (హామీగా)గా ఉండే బంగారాన్ని తిరిగి పొందొచ్చు. వీటికి అయ్యే వ్యయాలు కూడా తక్కువగానే ఉంటాయని సెబీ తెలిపింది. సెబీ పర్యవేక్షణ ఈజీఆర్లకు అండర్లైయింగ్గా ఉంచే భౌతిక బంగారం వాల్ట్లపై సెబీ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటాయి. ఆయా సంస్థలు సెబీ వద్ద రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. వాల్ట్ మేనేజింగ్ సేవలు అందించడానికి.. అంటే బంగారాన్ని ఈజీఆర్లుగా మార్చి సెక్యూరిటీల జారీకి సెబీ అనుమతి పొందాల్సి ఉంటుంది. బంగారం డిపాజిట్, నిల్వ, భద్రత, ఈజీఆర్లను వెనక్కి తీసుకుని భౌతిక బంగారాన్ని అప్పగించడం ఇవన్నీ వాల్ట్ సర్వీసుల్లో భాగంగా ఉంటాయి. నిర్ణీత కాలానికోసారి ఈజీఆర్లు, వాటికి సంబంధించి బంగారం నిల్వలను ఆడిట్ చేయించుకోవాలి. చదవండి:హాల్మార్కింగ్ విధాన విస్తరణకు కసరత్తు -
క్రిప్టో బిల్లుకి అంతా రెడీ.. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ..
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఒక బిల్లును తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. కేబినెట్ ఆమోదం అనంతరం బిల్లును ప్రవేశపెడతామన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 23 వరకు కొనసాగుతాయని తెలిసిందే. క్రిప్టో కరెన్సీలకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు సభ్యుల నుంచి వ్యక్తం అవుతుండడంతో మంత్రి దీనిపై స్పందించారు. వర్చువల్ కరెన్సీల్లో వేగంగా వస్తున్న మార్పులను నూతన బిల్లు పరిగణనలోకి తీసుకుంటుందని, క్రితం బిల్లులో లేని అంశాలను పొందుపరచనున్నట్టు చెప్పారు. ‘క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021’ను ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం లోగడే ప్రకటించడం గమనార్హం. ‘‘చివరిగా వర్షకాల సమావేశాల్లోనూ బిల్లును తీసుకొస్తామనడం నిజమే. కానీ, ఇతర పరిణామాల వల్ల బిల్లుపై తిరిగి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. గత సమావేశాల్లోనూ బిల్లును తీసుకొచ్చేందుకు నిజాయితీ ప్రయత్నాలే చేశాం. ఇప్పుడు నూతన బిల్లుతో సభ ముందుకు వస్తున్నాం’’ అని మంత్రి సీతారామన్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలను దేశంలో నియంత్రించడం లేదని, క్రిప్టోకరెన్సీల లావాదేవీల సమాచారాన్ని ప్రభుత్వం సమీకరించడం లేదని స్పష్టం చేశారు. పోలీసు రుణాలపై పోలీసు సిబ్బంది తదితర సున్నితమైన ఉద్యోగాల్లో ఉన్న వారికి రుణాలు ఇవ్వొద్దంటూ బ్యాంకులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని మంత్రి సీతారామన్ మరో ప్రశ్నకు సమాధానంగా ప్రశ్నోత్తరాల సమయంలో సభకు తెలియజేశారు. నిషేధించడం అవివేకమే: ఓఆర్ఎఫ్ భారత్లో 1.5 కోట్ల మంది డిజిటల్ కరెన్సీలను కలిగి ఉన్నందున.. వీటిని ఇతర ఆర్థిక సాధనాల మాదిరి నియంత్రించాలే కానీ, నిషేధించడం అవివేకమే అవుతుందని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) పేర్కొంది. గడిచిన ఐదేళ్లలో క్రిప్టో ఆస్తుల పరిశ్రమ భారత్లో బాగా వృద్ధిని చూసిందని, సుమారు 1.5 కోట్ల మంది క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టి ఉంటారని తెలిపింది. ‘‘భారత్లో ఇప్పుడు 350 వరకు క్రిప్టో స్టార్టప్లు కూడా ఉన్నాయి. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, వినియోగదారుల సంక్షేమం దృష్ట్యా క్రిప్టోలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. అంతేకానీ, అన్నింటిపైనా నిషేధం విధించడం సరైనది కాదు. దీనివల్ల ప్రభుత్వం గణనీయమైన ఆదాయం కోల్పోతుంది. అంతేకాదు చట్టవిరుద్ధమైన సంస్థలను ప్రోత్సహించినట్టు అవుతుంది’’ అంటూ ఓఆర్ఎఫ్ తన నివేదికలో ప్రస్తావించింది. చదవండి: క్రిప్టోకరెన్సీపై కీలక నిర్ణయం! ఈలోపే భారత్లో మరో.. -
‘రెండు లక్షల మందికి రుణాలు ఇచ్చాం’
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ ‘క్రెడిట్ అవుట్రీచ్’ కార్యక్రమం కింద దాదాపు 2 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.11,168 కోట్ల రుణాలను అందజేసిందని ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద, బ్యాంకులు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రుణగ్రహీతలకు రుణాలను మంజూరు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనితోపాటు పలు బ్యాంకులు రాయితీ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి పండుగ ఆఫర్లను ప్రకటించాయి. ‘ఆగస్టులో ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు మద్దతును అందించే క్రమంలో అక్టోబర్లో క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ను నిర్వహించాలని బ్యాంకులకు సూచించారు. దీనికి అనుగుణంగా, బ్యాంకులు జిల్లాల వారీగా, రంగాల వారీగా రుణ ఔట్రీచ్ ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నాయి‘ అని ఆర్థిక మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. బ్యాంకులు–నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), ఫిన్టెక్ సెక్టార్ల మధ్య సహ–రుణ ఏర్పాట్ల ద్వారా కేంద్రం క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంచి స్పందన వివిధ కేంద్ర ప్రభుత్వ రుణ గ్యారెంటీ పథకాల కింద మంజూరు చేసిన, పంపిణీ చేసిన నిధుల పరిమాణంకంటే క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కింద జారీ అయిన రుణాలు అధికంగా ఉండడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దాదాపు లక్ష మంది లబ్ధిదారులకు రూ.6,268 కోట్ల వ్యాపార రుణాలు మంజూరు చేయగా, 5,058 మంది రుణగ్రహీతలకు రూ.448 కోట్ల విలువైన వాహన రుణాలు మంజూరయ్యాయి. 2021 అక్టోబర్ 20 నాటికి 3,401 మంది రుణగ్రహీతలకు రూ.762 కోట్ల విలువైన గృహ రుణాలు మంజూరయ్యాయి. 2019 అక్టోబర్ – 2021 మార్చి మధ్య ఇలాంటి అవుట్రీచ్ కార్యక్రమాలను బ్యాంకులు నిర్వహించాయి. తద్వారా ఆర్ఏఎం సెక్టార్ (రిటైల్, వ్యవసాయం, లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) అన్ని రకాల రుణ అవసరాలను నెరవేర్చాయి. అప్పట్లో ఈ కార్యక్రమం కింద రూ.4.94 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ పండుగ సీజన్లో కూడా చిన్న రుణగ్రహీతలకు సరసమైన వడ్డీ రేట్లలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం కింద రుణాలను అందజేయాలని కేంద్రం నిర్దేశిస్తోంది. -
మరోసారి జీఎస్టీ సమీక్షకు కేంద్రం రెడీ
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ సమీక్షకు రాష్ట్రాల మంత్రులతో కూడిన రెండు కీలక కమిటీలను కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసింది. ఒక కమిటీకి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నేతృత్వం వహిస్తారు, మరొక కమిటీకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యం వహిస్తారు. వీటిపైనే దృష్టి రేట్ స్లాబ్లు– విలీనం, జీఎస్టీ మినహాయింపు వస్తువుల సమీక్ష, పన్ను ఎగవేతల గుర్తింపు, ఎగవేతలు నివారించడానికి మార్గాల అన్వేషణ, ట్యాక్స్ బేస్ పెంపు తత్సంబంధ అంశాలపై ఈ కమిటీలు సమీక్ష జరపనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. క్లిష్టమైన పరోక్ష పన్ను రేట్ల వ్యవస్థలు అన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకువస్తూ, నాలుగేళ్ల క్రితం (2017 జూలై నుంచి) జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థను మరింత సరళతరం చేయడంపై కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కమిటీలు ఇలా... బసవరాజు బొమ్మై నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పించనుంది. ఈ కమిటీలో పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అమిత్ మిశ్రా, కేరళ ఆర్థికమంత్రి కేఎన్ బాలగోపాల్, బిహార్ ఉపముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ తదితరులు సభ్యులుగా ఉంటారు. మరో ఎనిమిది సభ్యులతో కూడిన కమిటీకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వం వహిస్తారు. వీరిలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగ రాజన్, ఛత్తీస్గఢ్ ఆర్థికమంత్రి టీఎస్ సింగ్ డియో ఉన్నారు. ఈ నెల 17న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ ఈ కమిటీల ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత రేట్ల వ్యవస్థ ఇదీ... ప్రస్తుతం ప్రధానంగా నాలుగు జీఎస్టీ రేట్ల వ్యవస్థ అమలవుతోంది. నిత్యావసరాలపై కనిష్టంగా 5 శాతం పన్ను అమలవుతుండగా, కార్లపై అత్యధికంగా 28 శాతం పన్ను విధింపు ఉంది. 12 శాతం, 18 శాతం పన్ను స్లాబ్స్ కూడా ఉన్నాయి. లగ్జరీ, పొగాకు వంటి డీమెరిట్, సిన్ గూడ్స్పై ఉన్న అత్యధిక 28 శాతంపై సెస్ విధింపు కూడా అమలు జరుగుతోంది. 12 శాతం 18 శాతం శ్లాబ్లను ఒకటిగా చేయాలన్న డిమాండ్ గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తోంది. మినహాయింపుల కేటగిరీ నుంచి కొన్ని ఉత్పత్తులను తొలగించి, స్లాబ్ల హేతుబద్ధీకరణ వల్ల జరిగే రెవెన్యూ నష్టాలను పూడ్చుకోవాలని కూడా కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక తుది వస్తువులపై దాని ఇన్పుట్లపై విధించే పన్ను కంటే తక్కువ రేటును విధింపు (ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్) విషయంలో పన్ను వ్యత్యాసాలను ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్ తొలగించింది. మొబైల్ హ్యాండ్సెట్, పాదరక్షలు, వస్త్రాల విషయంలో ఈ రేటు వ్యత్యాసాలను సరిచేస్తూ సవరణలు జరిగాయి. పెట్రోలు విషయంలో.. జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువు, క్రూడ్ ఆయిల్ను ఈ విధానం నుంచి మినహాయించారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ను కొనసాగించడానికి ఈ విధానం దోహదపడుతోంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోనికి తీసుకుని రావాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన అత్యున్నత స్థాయి విధాయక మండలి అసలు ఆ అంశంపైనే చర్చించకూడదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనివల్ల ఇటు రాష్ట్రాలు, అటు కేంద్రం ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండడమే కౌన్సిల్ నిర్ణయానికి కారణం. చదవండి : సెప్టెంబర్ వరకూ కేంద్ర రుణం రూ.7.02 లక్షల కోట్లు -
GST Tax Payers: సెప్టెంబరు 10లోగా టీడీఎస్ దాఖలు చేయండి
న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారులను ఉద్దేశించి కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఆగస్టుకి సంబంధించి జీఎస్టీ నుంచి డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ (టీడీఎస్) మినహాయింపు పొందాలని ఆశించే వారు సెప్టెంబరు 10లోగా జీఎస్టీఆర్- 7 ఫామ్ని దాఖలు చేయాలని కోరింది. టీడీఎస్ మినహాయింపుకు మరో మూడు రోజుల సమయమే ఉందని చెప్పింది. నిర్దేశిత గడువులోగా జీఎస్టీ ఫామ్ 7ను దాఖలు చేయాలని లేదంటే ఆలస్య రుసుముతో పాటు వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుందని సూచించింది. Attention GST Taxpayers who are required to deduct Tax at Source (TDS) under GST! File your GSTR-7 Return for the month of August, 2021 by September 10th, 2021. pic.twitter.com/6XmfZuRkDq— CBIC (@cbic_india) September 8, 2021 చదవండి: ప్రత్యేక ఆర్థిక జోన్లకూ పన్ను రిఫండ్ పథకం? -
ప్రత్యేక ఆర్థిక జోన్లకూ పన్ను రిఫండ్ పథకం?
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక జోన్లకూ (ఎస్ఈజడ్) పన్నులు, సుంకాల రిఫండ్ పథకం– ఆర్ఓడీటీఈపీ (రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడె ప్రొడక్ట్స్) ప్రయోజనాలను వర్తింపజేయాలని ఈఓయూ, ఎస్ఈజడ్ల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈపీసీఈఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ పథకం కింద వివిధ ప్రొడక్టులపై విధించిన వివిధ కేంద్ర, రాష్ట్ర సుంకాలు, పన్నులు, లెవీలను ఎగుమతిదారులకు రిఫండ్ జరుగుతుంది. అలాగే ఈ రంగానికి మౌలికరంగం హోదా ఇవ్వాలని కోరింది. తద్వారా ప్రాధాన్యత రంగం కింద తక్కువ రేటుకు ఎస్ఈజడ్లకు బ్యాంకుల నుంచి రుణాల మంజూరు సాధ్యమవుతుందని పేర్కొంది. పెరుగుతున్న ఎగుమతులు జోన్ల నుంచి ఎగుమతుల భారీ పెరుగుదలకు వాణిజ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక మండలి– ఈపీసీఈఎస్ ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. ఈపీసీఈఎస్ చైర్మన్ భువనేష్ సేథ్ ఆయా అంశాలపై మాట్లాడుతూ, ప్రత్యేక ఆర్థిక జోన్ల నుంచి ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 2020–21లో ఎస్ఈజడ్ ఎగుమతుల విలువ రూ.7.55 లక్షల కోట్లుకాగా, 2021–22లో ఈ విలువ రూ.8 లక్షల కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. తద్వారా కోవిడ్ ముం దస్తు ఎగుమతుల విలువ (2019–20లో రూ.7.84 లక్షల కోట్లు)ను ఈ విభాగం అధిగమిస్తుందన్న అంచనాలు ఉన్నాయన్నారు. ప్రత్యేక ఆర్థిక జోన్ల నుంచి నౌకాశ్రయాలకు రవాణా సౌలభ్యతపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్ఓడీటీఈపీ వివరాలు ఇవీ.. ఆర్ఓడీటీఈపీ స్కీమ్ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఎగుమతుల రంగానికి ఊతం ఇస్తూ, కేంద్రం ఇటీవలే ఆర్ఓడీటీఈపీ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రూ.12,454 కోట్లు కేటాయించింది. 8,555 ఉత్పత్తులకు వర్తించే విధంగా ఆర్ఓడీటీఈపీకి ఈ నిధులను కేటాయించింది. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై విధించిన సుంకాలు, పన్నుల రిఫండ్కు ఉద్ధేశించిన ఈ పథకం కింద పన్ను రిఫండ్ రేట్లను కూడా కేంద్రం నోటిఫై చేసింది. వివిధ రంగాలకు సంబంధించి పన్ను రిఫండ్ రేట్లు 0.5 శాతం నుంచి 4.3 శాతం శ్రేణిలో ఉన్నాయి. విద్యుత్ చార్జీలపై సుంకాలు, రవాణా ఇంధనంపై వ్యాట్, వ్యవసాయం, సొంత అవసరాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి, మండీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఇంధనంపై సెంట్రల్ ఎక్సైజ్పన్ను వంటి విభాగాల్లో రిఫండ్స్ జరుగుతాయి. రిఫండ్ జరిగే 8,555 ఉత్పత్తుల్లో సముద్ర ప్రాంత ఉత్పత్తులు, దారం, డెయిరీ ప్రొడక్టులు, వ్యవసాయం, తోలు, రత్నాలు–ఆభరణాలు, ఆటోమొబైల్, ప్లాస్టిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ ఉన్నాయి. స్టీల్, రసాయనాలు, ఔషధ రంగాలకు మాత్రం ఆర్ఓడీటీఈపీ పథకం వర్తించదు. ఎటువంటి ప్రోత్సాహకాలూ లేకుండా ఈ రంగాలు కార్యకలాపాలు నిర్వహించడమే దీనికి కారణం. జౌళి ఎగుమతిదారులకు భరోసా కల్పిస్తూ కేంద్రం ఇటీవలే ఆర్ఓఎస్సీటీఎల్ స్కీమ్ను పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, దుస్తుల ఎగుమతిదారులు 2024 మార్చి వరకూ తమ ఎగుమతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పన్నులపై రాయితీలను పొందగలుగుతారు. ఈ స్కీమ్ కింద వస్త్రాలపై గరిష్టంగా 6.05 శాతం వరకూ రాయితీ అందుతుంది. రెడీమేడ్స్పై ఈ రేటు 8.2 శాతం వరకూ ఉంది. ఎస్ఈజడ్లవైపు దేశంలో మొత్తం 427 జోన్లకు ప్రభుత్వం ఆమోదముద్ర ఉంది. అయితే జూన్ 30వ తేదీ నాటికి వీటిలో 267 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2021 జూన్ 30వ తేదీ నాటికి ప్రత్యేక జోన్లపై రూ.6.25 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వీటిలో దాదాపు 24.47 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఎస్ఈజడ్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎగుమతులు భారీగా 41.5 శాతం పెరిగాయి. విలువలో ఇది 2.15 లక్షల కోట్లు. ఔషధాలు, ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతులు భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణం. దేశం ఎగుమతుల్లో నాల్గవ వంతు ప్రత్యేక జోన్ల నుంచి జరుగుతుండడం గమనార్హం. నేడు కొత్త కార్యాలయం ప్రారంభం దేశ రాజధాని న్యూఢిల్లీలోని హిమాలయ భవన్లో ఈపీసీఈఎస్ కొత్త కార్యాలయం సెప్టెంబర్ 8వ తేదీన ప్రారంభమవుతుందని చైర్మన్ భువనేష్ సేథ్ తెలిపారు. వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్, వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యంలు ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ‘ఎగుమతులు పెంపు, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతిక వినియోగం, నూతన ఆవిష్కరణలు– ఎస్ఈజడ్లపై ప్రభావం’ అన్న అంశంపై పీడబ్ల్యూసీ నిర్వహించిన ఒక అధ్యయన నివేదికను ఈ సందర్భంగా ఆవిష్కరించడం జరుగుతుందని కూడా ఆయన వెల్లడించారు. చదవండి : గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ -
120 ఎంటీకి స్టీల్ ఉత్పత్తి!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లో దేశీ స్టీల్ ఉత్పత్తి 120 మిలియన్ టన్నులకు చేరే వీలున్నట్లు ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తీ తాజాగా అంచనా వేశారు. ఇది 18 శాతం వృద్ధికాగా.. డిమాండ్ సైతం 100 ఎంటీని తాకవచ్చని పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది(2020–21)లో 6 శాతం తక్కువగా 102 ఎంటీ స్టీల్ తయారయ్యింది. కోవిడ్–19 కట్టడికి లాక్డౌన్ల అమలు ప్రభావం చూపింది. కాగా.. 2021 ఏప్రిల్–జూన్లో దేశీయంగా స్టీల్ ఉత్పత్తి 45 శాతం జంప్చేసింది. 37.52 ఎంటీని తాకింది. దీంతో ఈ ఏడాది 115–120 ఎంటీని స్టీల్ను తయారు చేయగలమన్న ధీమాతో ఉన్నట్లు సింగ్ తెలియజేశారు. జాతీయ స్టీల్ పాలసీ 2017లో భాగంగా ప్రభుత్వం 2030–31కల్లా 300 ఎంటీ స్టీల్ ఉత్పత్తిని అందుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కరోనా నేపథ్యంలో గతేడాది దేశీ స్టీల్ వినియోగం దాదాపు 7 శాతం క్షీణించి 93.43 ఎంటీకి పరిమితమైనట్లు వెల్లడించారు. ప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల పైప్లైన్ను ప్రకటించిందని, ఈ పథకం ప్రకారం వివిధ ప్రాజెక్టులకు భారీ స్థాయిలో స్టీల్ వినియోగం ఉంటుందని వివరించారు. -
కోలుకుంటున్న ఎకానమి.. లక్ష కోట్లు దాటిన జీఎస్టీ
కరోనా సంక్షోభం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. మెరుగవుతున్న జీఎస్టీ వసూళ్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వరుసగా రెండో నెల కూడా దేశీయంగా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లను దాటాయి. ఆగస్టు వసూళ్లు 1.12 లక్షల కోట్లు ఆగస్టు నెలకు సంబంధించి 1.12 లక్షల కోట్లు జీఎస్టీగా వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటిచింది. గతేడాదితో పోల్చితే 30 శాతం అధికంగా జీఎస్టీ వచ్చినట్టు తెలిపింది. ఆగస్ట్కి సంబంధించిన జీఎస్టీలో సెంట్రల్ జీఎస్టీ రూ. 20,522 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ. 26,605 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 56,247 కోట్లు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. వీటితో పాటు రూ.8,646 కోట్లు సెస్సుగా వసులైంది. వరుసగా రెండో నెల కరోనా సెకండ్ వేవ్ తర్వాత క్రమంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. ఆగస్టులో రూ. 1.12 కోట్ల జీఎస్టీ రాగా అంతకు ముందు జులైలో రూ. 1.16 లక్షల కోట్లు వచ్చింది. కరోనా సంక్షోభం మొదలైన తర్వాత 2020 అక్టోబరు తొలిసారిగా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయి. ఆ తర్వాత 2021 మే వరకు ప్రతీ నెల లక్ష కోట్లకు పైగానే వస్తు సేవల పన్నుల మొత్తం దాటింది. సెకండ వేవ్ ఎఫెక్ట్తో 2021 జూన్లో మాత్రం జీఎస్టీ లక్షకు దిగువన రూ 92.84 వేల కోట్లకు పరిమితమైంది. చదవండి: GST On Papad: అప్పడాలపై జీఎస్టీ !.. ట్విట్టర్లో రచ్చ రచ్చ -
తెలంగాణలో మొత్తం ఖాళీ పోస్టులు 56,979
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి అవకాశముందో ఆర్థిక శాఖ తేల్చింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 44,022, ఆయా శాఖల పరిధిలోని గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇతర సంస్థల్లో 12,957 కలిపి మొత్తం 56,979 డైరెక్ట్ రిక్రూట్మెంట్ (డీఆర్) పోస్టుల భర్తీకి అవకాశముందని స్పష్టం చేసింది. ఈ మేరకు నివేదికను బుధవారం కేబినెట్కు సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం పోలీసు శాఖలో ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉండగా, అతి తక్కువగా సమాచార శాఖలో కేవలం నాలుగంటే నాలుగు పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఇలా మొత్తం 28 శాఖల వివరాలను కేబినెట్కు సమర్పించగా, 8 ప్రభుత్వ శాఖల్లో 100కన్నా తక్కువ ఉద్యోగ ఖాళీలు చూపెట్టారు. సంక్షేమ గురుకులాల్లో పోస్టుల సంఖ్యను చూపెట్టినా, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు 18 వేల పోస్టులను మాత్రం నివేదికలో ప్రస్తావించలేదు. కానిస్టేబుళ్ల పోస్టులు 19,251 పోలీసు శాఖలో 21,507 డీఆర్ పోస్టులు నింపేందుకు అవకాశముందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఇందులో 88 డీఎస్పీ (సివిల్), 368 ఎస్ఐ (సివిల్), 19,251 కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి అవకాశం ఉందని తెలిపింది. అలాగే 515 ఫైర్మెన్, 380 ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, 174 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది. సంక్షేమ గురుకులాల్లో.. సంక్షేమ గురుకులాల్లో 7,701 పోస్టుల భర్తీకి అవకాశముందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఇందులో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ పరిధిలో 3,400, ఎస్సీ గరుకుల సొసైటీలో 1,784, ఎస్టీ గురుకులాల్లో 1,124, మైనార్టీ గురుకులాల్లో 1,393 పోస్టులు చూపెట్టారు. పలు శాఖల్లో ఇలా... వైద్య శాఖ విషయానికి వస్తే 3,353 స్టాఫ్ నర్సులు, 1,216 ఏఎన్ఎంలు, 1,085 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అవకాశముంది. ఉన్నత విద్యలో 1,062 డిగ్రీ లెక్చరర్లు, 900 వరకు జూనియర్ లెక్చరర్ పోస్టులున్నాయని ఆర్థిక శాఖ తేల్చింది. రెవెన్యూ శాఖ విషయానికి వస్తే 305 ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, 59 ఏసీటీవోలు, 48 సీటీవోలు, 169 జూనియర్ అసిస్టెంట్లు (పన్నుల శాఖ), 210 మంది డిప్యూటీ సర్వేయర్లు, 50 డ్రాఫ్ట్మెన్, 42 డిప్యూటీ కలెక్టర్లు, 95 నాయబ్ తహశీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 894 జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, 121 ఎంపీడీవోలు, 195 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల భర్తీకి అవకాశముంది. నీటì పారుదల శాఖలో 721 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 221 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, 184 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, అటవీశాఖలో 856 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండగా, మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ సూపర్వైజర్లు గ్రేడ్–1 కింద 181, గ్రేడ్–2 కింద 433 ఖాళీలున్నాయి. వ్యవసాయశాఖలో వ్యవసాయ విస్తరణాధికారులు 200, పశువైద్య విభాగంలో 244 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, 103 వెటర్నరీ అసిస్టెంట్లు, రవాణా శాఖలో 108 మంది అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు పోస్టుల భర్తీకి అవకాశముందని ఆర్థిక శాఖ వెల్లడించింది. -
రాష్ట్రాలకు పీడీఆర్డీ నిధులను విడుదల చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పదిహేడు రాష్ట్రాలకు చెందిన నాలుగో విడత పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు రూ .9,871 కోట్లను గురువారం రోజున విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను అర్హత గల రాష్ట్రాలకు మొత్తం 39,484 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు మంజూరు చేయబడుతుంది. 15 వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల రెవెన్యూ ఖాతాలలో అంతరాన్ని భర్తీ చేయడానికి ఈ గ్రాంట్లను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. 2021-22 మధ్య కాలంలో 17 రాష్ట్రాలకు పీడీఆర్డీ గ్రాంట్లను ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 17 రాష్ట్రాలకు రూ .1,18,452 కోట్ల పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ను 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఇప్పటివరకు రూ .39,484 కోట్లు (33.33 శాతం) నాలుగు విడతలుగా విడుదలయ్యాయి. ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. -
ప్రభుత్వంపై చెల్లింపుల భారం..రూ.116.21 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వంపై చెల్లింపుల భారం 2021 మార్చి ముగిసే నాటికి రూ.116.21 లక్షల కోట్లని శుక్రవారం ఆర్థిక మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. అంతక్రితం డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే (రూ.109.26 లక్షల కోట్ల నుంచి) ఈ పరిమాణం 6.36 శాతం ఎగసింది. మొత్తం చెల్లింపుల భారంలో ప్రభుత్వ రుణం వాటా 88.10 శాతమని గణాంకాలు పేర్కొన్నాయి. -
తెలంగాణకు రూ.1,336 కోట్లు.. ఏపీకి రూ.1,810 కోట్లు
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ విధానంతో రాష్ట్రాలకు భారీగా నష్టాలు ఎదుర్కొంటుండగా కేంద్రం పరిహారం కింద విడతల వారీగా అందిస్తోంది. తాజాగా మరో దఫా జీఎస్టీ పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీఎస్టీ విధానంతో పలు రాష్ర్టాలు ఎదుర్కొంటున్న నష్టాల భర్తీకి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. గతేడాది డిసెంబర్లో విడుదల చేయగా ఇప్పుడు మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ పరిహారం అందించింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు మొత్తం 3,174.15 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం మరో విడత పరిహారం విడుదల చేసింది. స్పెషల్ బారోయింగ్ ప్లాన్లో భాగంగా తెలంగాణ రాష్ర్టానికి రూ.1,336.44 కోట్లు విడుదల చేయగా.. ఆంధ్రప్రదేశ్కు రూ.1,810.71 కోట్లు విడుదల చేసింది. జీఎస్టీ పరిహారం విషయమై రాష్ట్రాలు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి, ఆర్థికమంత్రులను కలిసి విన్నవిస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం విడుదల వారీగా జీఎస్టీ పరిహారం విడుదల చేస్తోంది. -
పోలవరం అంచనా వ్యయం సవరణ రూ.47,725.74 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లకు సవరించేందుకు కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సోమవారం ఆయన సంతకం చేసి కేంద్ర ఆర్థికశాఖకు పంపారు. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ), కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ(ఆర్ఈసీ) ఇప్పటికే అంచనా వ్యయాన్ని సవరించేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ఫైలుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సంతకం చేయడం ఇక లాంఛనమే! వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం పనులపై నిపుణుల కమిటీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో దర్యాప్తు జరిపించి టీడీపీ సర్కార్ అవినీతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రక్షాళన చేశారు. ‘రివర్స్ టెండరింగ్’ ద్వారా ఇప్పటికే రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ధృఢ సంకల్పం, చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న నేపథ్యంలో అంచనా వ్యయం సవరించటాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సవరించిన అంచనా ఇలా... ► కేంద్ర జల్శక్తి శాఖ ఆమోదించిన సవరించిన అంచనాల ప్రకారం పోలవరం హెడ్వర్క్స్ వ్యయం రూ.9,734.34 కోట్లు. కుడి కాలువ వ్యయం రూ.2,865.75 కోట్లు, ఎడమ కాలువ వ్యయం రూ.2,720.8 కోట్లు, భూసేకరణ, సహాయ పునరావాస(ఆర్ఆర్) ప్యాకేజీ వ్యయం రూ.28,172.21 కోట్లు, 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) వ్యయం రూ.108 కోట్లుగా ఉంది. ► 2010–11 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ వ్యయం పెరగడం.. నిర్వాసితులకు పునరావాసంకోసం ఆర్ అండ్ ఆర్ వ్యయం పెరగడంతో 2017–18 ధరల ప్రకారం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకు చేరుకుంది. కేంద్రం నుంచి ఇంకా రావాల్సింది రూ.29,521.70 కోట్లు. గత సర్కారు నిర్వాకాలతో... ► విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నాటి కేంద్ర మంత్రి మండలి బడ్జెట్ ద్వారా నిధులను కేటాయించి విడుదల చేయాలని 2014 మే 28న నిర్ణయం తీసుకుంది. పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ను ఏర్పాటు చేసినా కమీషన్లకు కక్కుర్తిపడి, ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2016లో నాటి సీఎం చంద్రబాబు కోరారు. ఈ క్రమంలో 2017 సెప్టెంబరు 7న పోలవరం బాధ్యతను గత సర్కారుకు కేంద్రం అప్పగించింది. అయితే 2014 ఏప్రిల్ 1 తర్వాత పోలవరంలో నీటిపారుదల పనికి వ్యయం చేయాల్సిన నిధులను మాత్రమే ఇస్తామని మెలిక పెట్టింది. ఫలితంగా ఏప్రిల్ 1, 2014కు ముందు ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,135.87 కోట్లను కోల్పోవాల్సి వచ్చింది. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టుకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం స్పష్టం చేసింది. పారదర్శకత, చిత్తశుద్ధికి తార్కాణం.. ► రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును సాకారం చేసేందుకు 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. 2009 నాటికే కుడి, ఎడమ కాలువల పనుల్లో సింహభాగం పూర్తి చేశారు. హెడ్ వర్క్స్కు అవసరమైన భూసేకరణను కొలిక్కి తెచ్చారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడం ద్వారా శరవేగంగా పూర్తి చేసే క్రమంలో మహానేత హఠాన్మరణం చెందారు. ► విభజన నేపథ్యంలో జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించిన కేంద్రం వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేసి అప్పగిస్తామని చట్టంలో హామీ ఇచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును అక్రమార్జనకు ఏటీఎంలా మార్చుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇదే అంశాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించి చంద్రబాబు నైజాన్ని చాటారు. ► మార్చి 12, 2015న మొదటిసారిగా పీపీఏ సర్వసభ్య సమావేశంలో తాజా ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు తక్షణమే అందజేయాలని గత సర్కారును నాటి పీపీఏ సీఈవో దినేష్కుమార్ ఆదేశించారు. ► 2017–18 ధరల ప్రకారం రూ.57,940.86 కోట్లతో టీడీపీ సర్కారు పంపిన వ్యయ ప్రతిపాదనల్లో అక్రమాలను గుర్తించిన పీపీఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ► వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే పోలవరం పనులను ప్రక్షాళన చేసి శరవేగంగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. రివర్స్ టెండరింగ్తో అక్రమాలకు చెక్ పెట్టారు. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టడంతో జగ్మోహన్ గుప్తా నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఆర్ఈసీ పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా ఖరారు చేసి కేంద్ర జల్ శక్తి శాఖకు పంపింది. -
ఎంఎస్ఎంఈలకు రూ.లక్ష కోట్ల రుణాలు
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వీలుగా.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల(ఎంఎస్ఎంఈ)కు రూ.3 లక్షల కోట్ల రుణాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అత్యవసర రుణ హామీ పథకం’ (ఈసీఎల్జీఎస్) కింద.. బ్యాంకులు ఇప్పటికే రూ.లక్షకోట్లకు పైగా రుణాలను అందించాయి. ఆగస్ట్ 18 నాటికి మొత్తం రూ.1,50,759.45 కోట్ల రుణాలను మంజూరు చేయగా, ఇందులో రూ.1,02,245.77 కోట్ల మేర వారికి పంపిణీ చేయడం కూడా పూర్తయింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసింది. ఈ పథకం కింద బ్యాంకులు ఎంఎస్ఎంఈలకు అందించే రుణాలకు కేంద్రం హామీదారుగా ఉంటుంది. కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల విలువైన వివిధ ప్యాకేజీల్లో ఈ పథకం కూడా ఒకటి కావడం గమనార్హం. 12 ప్రభుత్వరంగ బ్యాంకులు, 24 ప్రైవేటు బ్యాంకులు, 31 ఎన్బీఎఫ్ సీలు కలసి ఎంఎస్ఎంఈలకు ఈ మేరకు రుణాలను అందించాయి. కేంద్రం ప్రకటించిన నాటి నుంచి ఈ ఏడాది అక్టోబర్ చివరి వరకు లేదా గరిష్టంగా రూ.3 లక్షల కోట్ల రుణాలకు (ఏది ముందు అయితే అది) ఈ పథకం అమల్లో ఉంటుంది. రుణంపై 9.25 శాతం వార్షిక వడ్డీ రేటు అమలవుతుంది. అత్యధికంగా మహారాష్ట్రలోని ఎంఎస్ఎంఈలకు రూ.7,756 కోట్ల రుణాలు మంజూరు కాగా, ఆ తర్వాత తమిళనాడులోని ఎంఎస్ఎంఈలకు రూ.7,740 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. -
కరోనా : పాలసీదారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ, దేశ వ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో పాలసీ దారులకు ఊరటనిస్తూ ఆర్థికమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు , ఆరోగ్య బీమా చెల్లుబాటును ఏప్రిల్ 21 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో ఈ బీమా చెల్లింపుల పునరుద్ధరణ తేదీలు వచ్చే వ్యక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. 2020 మార్చి 25 - ఏప్రిల్ 14 (లాక్ డౌన్ సమయం) మధ్యకాలంలో చెల్లింపులు చేయాల్సిన వాహన, ఆరోగ్య పాలసీ దారులకు భారీ ఉపశమనం కల్పించింది.ఈ ఉత్తర్వు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది. పాలసీ దారులు ప్రీమియం బకాయిలు మొత్తాన్ని ఏప్రిల్ 21 న లేదా అంతకన్నా ముందుగానీ చెల్లించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారి పునరుద్ధరణ ప్రీమియాన్ని సకాలంలో చెల్లించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో చట్టబద్ధమైన మోటారు వాహనం థర్డ్ పార్టీ భీమా కవరేజీని కొనసాగించాలని పేర్కొంది. 2020 ఏప్రిల్ 21 ని పాలసీ పునరుద్ధరణ తేదీగా పరిగణించాలని చెప్పింది. ఆరోగ్య బీమా పాలసీల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని ప్రకటించింది. చదవండి : (హెచ్డీఎఫ్సీ గ్రూప్ : రూ.150 కోట్ల సాయం) చైనా నగరంలో కుక్క మాంసంపై శాశ్వత నిషేధం (కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం) The government has provided relief for third-party auto insurance policy holders and health insurance policy holders in light of the #Covid19 situation. The relevant notifications are attached below. #IndiaFightsCorona pic.twitter.com/5YK86vdXBw — NSitharamanOffice (@nsitharamanoffc) April 2, 2020 -
అవసరమైతే మరిన్ని బ్యాంకుల విలీనం
న్యూఢిల్లీ: అవసరమైన పక్షంలో మరిన్ని బ్యాంకులను విలీనం చేసే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యం సాకారమయ్యేందుకు.. కన్సాలిడేషన్ ద్వారా ఏర్పడే అంతర్జాతీయ స్థాయి బ్యాంకులు తోడ్పడగలవని ఆయన చెప్పారు. భారీ బ్యాంకులతో పెద్ద సంఖ్యలతో ప్రజలకు ఆర్థిక సేవలు, మెరుగైన పథకాలు అందించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం గతేడాది ఏకంగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేసే ప్రతిపాదన ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనాల కారణంగా 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గనుంది. 2017 ఏప్రిల్లో అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2019లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ)లో విలీనం చేశారు. ఎల్ఐసీ లిస్టింగ్తో పారదర్శకత .. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ లిస్టింగ్ చేయడం ద్వారా సంస్థలో మరింత పారదర్శకత పెరగగలదని ఠాకూర్ చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రతిపాదన చేశారు. ఎల్ఐసీలో కొన్ని వాటాలతో పాటు ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 90,000 కోట్ల దాకా సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ప్రభుత్వానికి ప్రస్తుతం ఎల్ఐసీలో 100 శాతం, ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటాలు ఉన్నాయి. అటు రుణ పునర్వ్యవస్థీకరణ వెసులుబాటుతో గతేడాది దాదాపు అయిదు లక్షల లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ప్రయోజనం చేకూరిందని ఠాకూర్ చెప్పారు. తాజాగా రుణ పునర్వ్యవస్థీకరణ వ్యవధిని వచ్చే ఏడాది మార్చి 31 దాకా పొడిగిస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు. -
బడ్జెట్ 2020 : కేబినెట్ సమావేశం ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను మరికొన్ని గంటల్లో ఆవిష్కరించబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు మంత్రులు నిర్మాలా సీతారామన్, అనురాగ్ ఠాగూర్ శనివారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్కు బయలుదేరుతారు. ఉదయం 10.15గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రివర్గం బడ్జెట్ను లాంఛనంగా ఆమోదించనుంది. అనంతరం కేంద్ర బడ్జెట్ ప్రసంగం ఉదయం 11 గంటలకు ప్రారంభమౌతుంది. ఈసారి బడ్జెట్పై ప్రజలతోపాటు కంపెనీలు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి. వేతన జీవులు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందో చూడాలి. -
బ్యాంకు డిపాజిటర్లకు శుభవార్త!
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వినియోగదారులకు మరింత భరోసా కల్పించేలా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి శుభవార్త అందనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ బీమా పరిమితిని ఊహించిన దానికంటే ఎక్కువ పెంచనుందని తెలుస్తోంది. ముఖ్యంగా రూ .1 లక్ష నుండి రూ .5 లక్షలకు పెంచవచ్చనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. హోల్సేల్ డిపాజిటర్లకు డిపాజిట్ బీమాను రూ.25 లక్షలకు పెంచే కొత్త పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టే అవకాశం ఉందని ‘బిజినెస్ స్టాండర్డ్’ తెలిపింది. ఈ పెంపు అమల్లోకి వస్తే, డిపాజిట్ బీమాకు సంబంధించి ఇదే మొదటి పెంపు అవుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ రెండు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మొదటిది, చాలాకాలంగా పెండింగ్లో అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా వ్యక్తులు, లేదా సంస్థలకు ప్రతిపాదిత మెరుగైన పరిమితులకు మించి అదనపు డిపాజిట్ బీమాను పొందడానికి బ్యాంకులను అనుమతించడం. రెండవది, ఆర్బీఐ నియంత్రణలోని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి), పంజాబ్ అండ్ మహారాష్ట్రల మాదిరిగానే మోసాల కారణంగా నష్టపోతున్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక రిజర్వ్ను ఏర్పాటు చేయడం. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో డిసెంబర్ 13న జరిగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కేంద్ర బోర్డు సమావేశంలో వీటిపై చర్చించే అవకాశం ఉంది. బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతం అమలులో ఉన్న రూ.1 లక్ష బీమా కవరేజీని పెంచే అవకాశమున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో చెప్పారు. మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుల నియంత్రణకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ రెండింటికీ సంబంధించి ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చట్టాల్ని తీసుకొస్తామని చెప్పారు. సహాకార బ్యాంకుల సంక్షోభాల్ని కట్టడి చేసేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే బిల్లు రూపకల్పన జరిగిందని, క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టి అమలులోకి తీసుకు వస్తామన్నారు. పీఎంసీ బ్యాంక్లో జరిగిన మోసాలు మళ్లీ జరుగకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న బ్యాంకుల మార్గదర్శకాలను మార్చి నూతన ప్రణాళికను ప్రకటించనున్నట్లు తెలిపారు. తాజా పీఎంసీ కుంభకోణంలో పీఎంసీ డిపాజిటర్లు పెద్ద మొత్తంలో నష్టపోయిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ప్రస్తుతం బ్యాంకు డిపాజిటర్లు జమ చేసే మొత్తాలపై డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ రూ.1 లక్ష వరకు బీమా కవరేజీని అందిస్తోంది. 1992 సెక్యూరిటీల కుంభకోణంతో బ్యాంక్ ఆఫ్ కరాడ్ కుప్పకూలిన తరువాత, 1993 నుంచి డిపాజిట్ ఇన్సురెన్స్ రూ.1 లక్ష వరకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. -
పోలవరానికి రూ.3,000 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,000 కోట్లు విడుదల చేయడానికి కేంద్ర జల వనరుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘నాబార్డు’ ద్వారా ఈ నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. మరో రూ.1,810.04 కోట్ల మంజూరుపై కసరత్తు చేస్తోంది. నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను(యూసీలు) ఎప్పటికప్పుడు పంపిస్తే, ప్రాజెక్టుకు వ్యయం చేసిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. గత ఏడాది జూలై 26న పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల వనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. 2014 ఏప్రిల్ 1వ తేదీకి ముందు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులపై ఆడిట్ చేయించి, ఆడిటెడ్ స్టేట్మెంట్ పంపితే నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. కానీ, 2014 ఏప్రిల్ 1వ తేదీకి ముందు చేసిన వ్యయంపై ఆడిట్ చేయించడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. 2014 ఏప్రిల్ 1కి ముందు సేకరించిన భూములను, ఆ తర్వాత అంటే 2014 ఏప్రిల్ 1 తర్వాత సేకరించినట్లు చూపి భారీ ఎత్తున ప్రజాధనాన్ని కాజేయడం వల్లే ఆడిట్ చేయించడానికి అప్పటి ప్రభుత్వ పెద్దలు అంగీకరించలేదు. కేంద్ర జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) పదేపదే ఒత్తిడి తేవడంతో వ్యయానికి సంబంధించిన ఆడిట్ స్టేట్మెంట్ను మాత్రమే రాష్ట్ర జలవనరుల శాఖ కేంద్రానికి పంపింది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు 2014కు ముందు చేసిన వ్యయం రూ.1,397.19 కోట్లకు సంబంధించిన ఆడిట్ స్టేట్మెంట్ను పంపలేదు.. గత నెల 31న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఇదే అంశాన్ని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ లేవనెత్తారు. ఆడిట్ స్టేట్మెంట్ను పంపితేనే నిధులు విడుదల చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తేల్చిచెప్పారు. సీఎం వైఎస్ జగన్ సమీక్షతో కదలిక వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ నెల 3వ తేదీన సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై.. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. కేంద్రం గతేడాది జూలై 26 నుంచి నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని జలవనరుల శాఖ అధికారులను ప్రశ్నించారు. అధికారులు అసలు సంగతి బయటపెట్టడంతో కేంద్ర ప్రతిపాదన మేరకు తక్షణమే 2014 ఏప్రిల్ 1వ తేదీకి ముందు భూసేకరణ, సహాయ పునరావాస పనులకు చేసిన వ్యయంపై ఆడిట్ చేయించి, స్టేట్మెంట్ సిద్ధం చేసి పీపీఏ ద్వారా కేంద్ర జలవనరుల శాఖకు పంపాలని జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దాంతో భూసేకరణ లెక్కలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఇదే సమాచారాన్ని పీపీఏకు చేరవేశారు. దాంతో పోలవరానికి తక్షణం రూ.3,000 కోట్లు విడుదల చేయాలంటూ కేంద్ర జలవనరుల శాఖకు పీపీఏ ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ప్రతిపాదించారు. యూసీలు పంపితే నిధుల విడుదల - పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై రూ.5,135.87 కోట్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే సమయంలో.. 2014 ఏప్రిల్ 1 తర్వాత అంటే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని(జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం మినహాయించి) మాత్రమే రీయింబర్స్ చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. - పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటిదాకా రూ.16,673.17 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. 2014 ఏప్రిల్ 1కి ముందు రూ.5,135.87 కోట్లను వ్యయం చేసింది. 2014 ఏప్రిల్ 1 తర్వాత రూ.11,535.30 కోట్లు ఖర్చు చేసింది. - కేంద్రం పోలవరం ప్రాజెక్టు కోసం పీపీఏకు రూ.6,764.16 కోట్లు విడుదల చేసింది. (ఇందులో రూ.6,727.26 కోట్లను పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది) మిగతా రూ.4,810.04 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. - యూసీలు పంపితే నిధులు విడుదలకు ప్రతిపాదనలు పంపుతామని పీపీఏ పేర్కొంది. దాంతో ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్లకు సంబంధించిన యూసీలను పీపీఏ ద్వారా కేంద్రానికి పంపింది. - ఈ నెల 10న నిర్వహించిన డీడీఆర్పీ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు సంబంధించిన అంశంపై కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో చర్చించారు. యూసీలు పంపితే ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తామని కేంద్రం మరోసారి వెల్లడించింది. ఢిల్లీకి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ను బుధవారం ఢిల్లీకి పంపారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జారీ చేసిన పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపివేత ఉత్తర్వుల సడలింపు గడువు జూలై 2తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పనుల నిలిపివేత ఉత్తర్వులను సడలించడం కాకుండా.. పూర్తిగా ఎత్తివేసేలా కేంద్ర అటవీ, పర్యావరణ, జలవనరుల శాఖ అధికారులతో చర్చించాలని ఆదిత్యనాథ్ దాస్కు సీఎం జగన్ సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేయాల్సిన నిధులతోపాటు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన(పీఎంకేఎస్వై) కింద రాష్ట్రానికి నిధులు విడుదల చేసే అంశంపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్తో గురువారం ఆదిత్యనాథ్ దాస్ చర్చించనున్నారు. -
ప్రజలపై భారం మోపొద్దు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : కుదేలైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను మార్చేందుకు అందరు ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. అస్తవ్యస్థంగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చక్క దిద్దడానికి సృజనాత్మక ఆలోచన విధానాలతో రావాలని ఆయన కోరారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా 15వ ఆర్ధిక సంఘం ముందు సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ తన వాదన వినిపించాలని, రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులను, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను వివరిస్తూ సమగ్రమైన నివేదిక తయారు చేసి ప్రత్యేక హోదా ఎందుకు అవసరమో కేంద్రానికి వివరించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆర్ధిక పరిస్థితిని మరింత మెరుగు పరిచేలా చర్యలు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అయితే సామాన్యునిపై భారం పడకుండా రాష్ట్ర ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. ఈ దిశగా హరిత పన్ను (గ్రీన్ టాక్స్), వ్యర్థ పదార్థాలపై పన్ను, ఎర్ర చందనం అమ్మకం, తక్కువ వడ్డీకే రుణాలు పొందడం, సరయిన ఇసుక విధానం అమలు వంటి చర్యలు ద్వారా ఆదాయాన్ని పెంచే యోచన చేయాలన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి దశలవారీగా మద్యపాన నిషేధం ఎక్సైజ్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కేవలం ప్రత్యేక ఆదాయ వనరులుగా చూడకూడదని, ప్రతి పేదవారిలోనూ ఆనందం వెల్లివిరిసేందుకు బెల్ట్ షాపులను సమూలంగా తొలగించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. అవసరమైన పక్షంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపి బెల్ట్ షాప్ల వ్యవస్థను నిర్ములించాలని సూచించారు. ఎక్కడయినా బెల్ట్ షాప్ కనిపిస్తే.. దానిపై చర్యలు తీసుకుంటూనే, దానికి మద్యం సరఫరా చేసిన వైన్ షాప్ లైసెన్స్ రద్దు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ అక్రమాలు జరిగినా మరింత కఠినతరమైన నిబంధనలు అమలు చేయాలని, దశల వారి మద్యపాన నిషేధం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చైతన్యం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీ పెట్టి, అప్పులు తీసుకుని, వాటిని దారి మళ్లించిన వైనాన్ని చూసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివ్వెరపోయారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా వాడేసుకున్న విషయం తెలిసిందే. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సాంబశివరావు, పీవీ రమేష్, ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి కె.ధనంజయ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజలపై భారం మోపకుండా రాష్ట్ర ఆదాయం పెంచాలని సూచన
-
ఆర్థిక,రెవెన్యూశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
-
ఆర్థికశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాఖల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా శనివారం ఉదయం ఆర్థికశాఖ అధికారులతో సమీక్షా సమావేశం మొదలైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి.సాంబశివరావు, పీవీ రమేష్, ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా వాడేసుకున్న విషయం తెలిసిందే. పోలింగ్ పూర్తయిన తరువాత కూడా గత ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికి బిల్లులు చెల్లింపులు జరిగాయి. తెలుగుదేశం పార్టీ పాలకుల నిర్వాకం వల్ల రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎన్నికల ముందు గత ప్రభుత్వం హడావిడిగా చేపట్టిన పనులు, పెండింగ్ బిల్లులు, నిధుల ఆర్జన, శాఖల పనితీరు తదితర అంశాలపై ముఖమంత్రి సమీక్షిస్తున్నారు. ఇక సోమవారం విద్యాశాఖ, మంగళవారం జలవనరులు, గృహ నిర్మాణశాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్షిస్తారు. బుధవారం వ్యవసాయానుబంధ శాఖ, గురువారం సీఆర్డీఏపై ఆయన సమీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మంత్రివర్గంలోకి తీసుకోవద్దు జైట్లీ వినతి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించవద్దని మోదీని కోరారు. తీవ్రమైన ఆనారోగ్యం కారణంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేకపోతున్నానని జైట్లీ వివరించారు. అనధికారికంగా పార్టీకి, ప్రభుత్వానికి సేవలందిస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కూడా జైట్లీ దూరంగా ఉన్నారు. కాగా కాన్సర్తో బాధపడుతున్న జైట్లీ జనవరిలో న్యూయార్క్లో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో తాత్కాలిక ఆర్థికమంత్రిగా పియూష్ గోయల్ జైట్లీ స్థానంలో బాధ్యతలను నిర్వహించారు. ఫిబ్రవరి1న పార్లమెంటులో సమర్పించాల్సిన కేంద్ర మధ్యంతర బడ్జెట్ను కూడా గోయల్ ప్రవేశపెట్టారు. జైట్లీ చాలా బలహీనంగా ఉన్నారని, అనారోగ్యం కారణంగానే ప్రధాని మోదీ రెండోసారి ఏర్పాటు చేయబోయే కేబినెట్లో ఉండే అవకాశాలు లేవని ఇదివరకే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. మరింత మెరుగైన వైద్యం కోసం ఆయన బ్రిటన్ లేదా అమెరికా వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది. బయటకు వెల్లడించని అస్వస్థతతో గతవారం జైట్లీ ఎయిమ్స్లో చేరారు. ఎన్నికల అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికల విజయోత్సవాల్లో ఆయన పాల్గొనలేదు. జైట్లీ తప్పుకోవడంతో నూతన మంత్రివర్గంలో కీలకమైన ఆర్థికశాఖ మంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా బీజేపీలో సీనియర్ నేత అయిన జైట్లీ.. మంత్రివర్గంలో లేకపోవడం లోటేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక నిపుణిడిగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా జైట్లీ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. పార్టీలోనే కాదు ప్రధాని మోదీకి జైట్లీ అత్యంత సన్నిహితుడు. ఆర్థిక మంత్రిగానే కాకుండా న్యాయవాది కావడంతో పార్టీకి, ప్రభుత్వానికి ఎన్నో కేసుల్లో లీగల్ సలహాదారుడిగా జైట్లీ వ్యవహరించారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు రాజ్యాంగ సవరణ చేయకుండా.. కేవలం పార్లమెంట్ ఆమోదంతో చట్టాన్ని రూపొందించవచ్చని జైట్లీ చేసిన సూచన బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు లేకుండా చేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లు రూపకల్పనలో కూడా జైట్లీ పాత్ర ఎంతో ఉంది. -
అలా చేస్తే నా భార్య వదిలేస్తుంది: రాజన్
న్యూఢిల్లీ : రాజకీయాల్లోకి వస్తే తన భార్య వదిలేస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలపై ఆయన స్పందించారు. రాజకీయాల కన్నా తనకు కుటుంబ జీవతమే ముఖ్యమన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘నేను రాజకీయాల్లోకి వెళ్తే.. నా భార్య నాతో సంసారం చేయనని చెప్పింది. రాజకీయాలు ఎక్కడైనా ఒకే విధంగా ఉంటాయి. బలమైన కారణం ఏది లేకపోయినప్పటికి నాకు మాత్రం రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు. కొందరు తమ వ్యాక్చాతుర్యంతో ఓట్లను పొందుతారు. అలాంటి నైపుణ్యం నాకు లేదు. నేను ఏ పార్టీకి మద్దతుగా ఉండను. నా రచనలు అన్నీ పార్టీలకు అతీతంగానే ఉంటాయి. నాకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తిలేదు. నాకు ఉద్యోగం అంటేనే ఇష్టం. ప్రస్తుతం నిర్వర్తిస్తున్న విధులతో నేను సంతోషంగా ఉన్నాను. కాంగ్రెస్ కనీస ఆదాయ పథకంతో ఎన్నో లాభాలున్నాయి. పేదలకు నగదు అందజేయడం వల్ల వారికి కావాల్సినవి వారే తీసుకుంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాకు మంత్రి పదవి దక్కుతుందని చాలా ఊహాగాలను వస్తున్నాయి. వాటిని నేను ఆపలేను. నేనెక్కడుంటే అక్కడ వాతావరణం సంతోషంగా ఉండేలా చూసుకుంటాను’ అని చెప్పుకొచ్చారు. 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ దాకా రిజర్వ్ బ్యాంక్ 23వ గవర్నర్గా రాజన్ సేవలందించిన విషయం తెలిసిందే. రాజన్ పదవీకాలాన్ని పొడిగించడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలో భాగమైన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. విపక్షాల కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆర్థిక మంత్రిగా రాజన్నే ఎంపిక చేసే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కనీస ఆదాయ పథక రూపకల్పన విషయంలో సలహాలు, సూచనలు తీసుకున్న ప్రముఖ ఆర్థికవేత్తల్లో రాజన్ కూడా ఉన్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పడం కూడా ఈ వార్తలకు ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో రాజన్ తాజా వివరణనిచ్చారు. తాను ప్రస్తుతం నిర్వర్తిస్తున్న విధులతో సంతోషంగానే ఉన్నానని, రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. -
సీఎస్పై మంత్రి యనమల విమర్శలు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. సీఎస్ నియామకాన్ని, నిర్ణయాలను ఓ ప్రకటనలో ఆయన తప్పుబట్టారు. ఆర్థిక శాఖలో వ్యవహారాలపై సీఎస్ సూచనలను యనమల విభేదించారు. నిధుల సమీకరణ, విడుదలలో మంత్రివర్గ నిర్ణయమే ఫైనల్ అని అభిప్రాయపడ్డారు. ప్రధాన కార్యదర్శి సర్వీస్ రూల్స్ అతిక్రమిస్తున్నారని విమర్శించారు. సీఎస్ మంత్రివర్గానికి సబార్డినెట్ అని అలాంటిది ఆయన మంత్రివర్గ నిర్ణయాలను ఎలా ప్రశ్నిస్తారనే వాదనను లేవనెత్తారు. కాగా ఇటీవలే ఆర్థికశాఖలోని అడ్డగోలు వ్యవహారాలపై సీఎస్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ప్రాధాన్యత క్రమం లేకుండా చెల్లింపులు చేయడంపై ఆయన...అధికారులను వివరణ కోరారు. సీఎస్ సమీక్షతో నేపథ్యంలో ఉలిక్కిపడ్డ మంత్రి యనమల ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
అవకాశముంటే.. మళ్లీ వస్తా..
న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలు గానీ గెలిస్తే తాను ఆర్థిక మంత్రిగా ఎంపికయ్యే అవకాశాలున్నాయన్న వార్తలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. తన సేవలు ఉపయోగపడతాయని భావించిన పక్షంలో, అవకాశం ఉంటే భారత్ తిరిగి వచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ‘ది థర్డ్ పిల్లర్’ పేరిట రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజన్ ఈ విషయాలు తెలిపారు. 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ దాకా రిజర్వ్ బ్యాంక్ 23వ గవర్నర్గా రాజన్ సేవలందించారు. రాజన్ పదవీకాలాన్ని పొడిగించడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలో భాగమైన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. విపక్షాల కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆర్థిక మంత్రిగా రాజన్నే ఎంపిక చేసే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కనీస ఆదాయ పథక రూపకల్పన విషయంలో సలహాలు, సూచనలు తీసుకున్న ప్రముఖ ఆర్థికవేత్తల్లో రాజన్ కూడా ఉన్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పడం కూడా ఈ వార్తలకు ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో రాజన్ తాజా వివరణనిచ్చారు. తాను ప్రస్తుతం నిర్వర్తిస్తున్న విధులతో సంతోషంగానే ఉన్నానని, అయితే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సదా సిద్ధమని రాజన్ చెప్పారు. స్వల్పకాలిక సమస్యల పరిష్కారంపై దృష్టి.. ఒకవేళ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు గానీ చేపట్టిన పక్షంలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇస్తారన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ముఖ్యంగా స్వల్పకాలిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతానని రాజన్ చెప్పారు. ‘నాతో సహా చాలా మంది ఆర్థికవేత్తలు.. విధానాలపరంగా తీసుకోతగిన చర్యల గురించి రాశారు. అవి పుస్తకరూపంలో రాబోతున్నాయి. ఇక నా విషయానికొస్తే.. నిల్చిపోయిన చాలా ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమయ్యేందుకు ఉపయోగపడేలా స్వల్పకాలిక సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి పెడతాను’అని ఆయన పేర్కొన్నారు. అలాగే, బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయడం, సాధ్యమైనంత వేగంగా వాటిని మళ్లీ రుణ వృద్ధి బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. అటు వృద్ధికి దోహదపడేలా 2–3 కీలక సంస్కరణలను కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తానన్నారు. ‘ఈ సంస్కరణల జాబితాలో వ్యవసాయ రంగంలో ఒత్తిడిని తగ్గించేందుకు అనుసరించతగిన విధానాలు కచ్చితంగా ఉంటాయి. ఇక రెండోది.. స్థల సమీకరణ సమస్య. రాష్ట్రాల స్థాయిలో అమలవుతున్న ఉత్తమ విధానాల గురించి తెలుసుకోవడం, ఆయా రాష్ట్రాలు తమకు అనువైన విధానాలను ఎంపిక చేసుకునేందుకు స్వేచ్ఛనివ్వడం ఇందుకు ఉపయోగపడగలదు. ఇలా స్థల సమీకరణ సమస్యల పరిష్కారం, బ్యాంకుల ప్రక్షాళన, వ్యవసాయాన్ని పునరుద్ధరించేందుకు కీలక విధానాల రూపకల్పనకు అత్యధిక ప్రాధాన్యమిస్తాను’ అని రాజన్ చెప్పారు. -
ఆర్బీఐపై మెత్తబడిన కేంద్రం: మార్కెట్ల జోరు
సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్బ్యాంకు మధ్య ఏర్పడిన వివాదంనేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గడంతో స్టాక్మార్కెట్లు పుంజుకున్నాయి. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిన కాపాడతామని హామీ యిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడింది. దీంతో కీలక సూచీలు లాభాల్లోకి మళ్ళాయి. ఒకదశలో 200 పాయింట్లకు పైగా కోల్పోయి సెన్సెక్స్ అదే స్థాయిలో రీబౌండ్ అయింది. తీవ్ర ఒడిదుడుకులతో లాభ నష్టాలమధ్య ఊగిసలాడిన సెన్సెక్స్, ప్రస్తుతం 353పాయింట్లు పుంజుకుని 34, 244వద్ద, 114 పాయింట్ల లాభంతో నిఫ్టీ 10 312వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ సెక్టార్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. టెక్ మహీంద్రా 7 శాతం, మైండ్ట్రీ 6 శాతం చొప్పున జంప్చేయగా.. హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఇన్ఫీబీమ్, టాటా ఎలక్సీ, నిట్ టెక్ కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటితోపాటు హెచ్డీఎఫ్సీ, ఐబీ హౌసింగ్, యూపీఎల్, సన్ ఫార్మా, సిప్లా, ఇండస్ఇండ్, యాక్సిస్ లాభపడుతున్నాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్, జీ, ఎన్టీపీసీ, మారుతీ, ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో టాటా స్టీల్, కోల్ ఇండియా, జిందాల్ స్టెయిన్లెస్, నాల్కో, హిందాల్కో, ఎన్ఎండీసీ, హింద్ జింక్, సెయిల్, వేదాంతా నష్టపోతున్నాయి. అటు దేశీయ కరెన్సీ కూడా డాలరు మారకంలో పుంజుకుంది. ఉదయం ట్రేడింగ్లో 74 స్థాయికి దిగజారిన రూపాయి ఈ స్థాయినుంచి కోలుకుని 73.93 వద్ద కొసాగుతోంది. -
ఆర్బీఐ వివాదం : కేంద్రం ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం నెలకొన్న వివాదం నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని గౌరవిస్తుందని వెల్లడించింది. దాని విలువను మరింత పెంచుతుందని స్పష్టం చేసింది. ఆర్బీఐ చట్టం పరిధిలో బ్యాంకు స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపింది. అలాగే ఆర్బీఐ ఐనా, ప్రభుత్వమైనా ప్రజా ప్రయోజనాలు, దేశ ఆర్థికవ్యవస్థ అవసరాల నిమిత్తం వ్యవహరించాల్సి ఉందని ఫైనాన్స్ మినిస్ట్రీ తన ప్రకటనలో తెలిపింది. దీనికోసం ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య పలు అంశాలపై విస్తృతమైన సంప్రదింపులు, చర్చలు ఎప్పటికప్పుడు జరుగుతాయి. ఈ విషయాలను భారత ప్రభుత్వం ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. తీసుకున్న తుది నిర్ణయాలు మాత్రమే తెలియజేస్తుంది. ఈ సాంప్రదాయాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే అధికారిక సంస్థ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)కు తగిన స్వేచ్చలేదంటూ సాక్షాత్తూ డిప్యూటీ గవర్నర్ అసంతృప్తి, దీనికి ప్రతిగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర వ్యాఖ్యలు ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయవచ్చే వార్తలు వ్యాపించాయి. ముఖ్యంగా ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 ద్వారా ఆర్బీఐ కార్యకలాపాల్లో ప్రభుత్వం చోక్యం చేసుకోనుందని, ఈ నేపథ్యంలో గవర్నర్ తప్పుకునే అవకాశాలున్నాయని మార్కెట్వర్గాలు అంచనా వేశాయి. Autonomy for Central Bank, within the Framework of the RBI Act, is an Essential and Accepted Governance Requirement: Says Government ; For full details, please log on to: https://t.co/lqjjoH9pOb — Ministry of Finance (@FinMinIndia) October 31, 2018 -
డబ్బులు.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక జవాబుదారీ విధానం పాటించకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసిక నిధుల విడుదలను నిలిపేస్తామని ఆర్థికశాఖ హెచ్చరించింది. ఈమేరకు అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు మెమో జారీ చేసింది. ఆయా శాఖల ఆస్తుల వివరాల నివేదికను ప్రతి ఆర్నెల్లకు ఒకసారి పంపాలని మెమోలో పేర్కొన్నారు. బ్యాంకుల్లో ఖాతాల వివరాలను నెలవారీగా ఆర్థిక శాఖకు తెలియజేయాలని స్పష్టం చేశారు. నగదు పుస్తకంలోని వివరాలను, బ్యాంకుల్లో నగదు, చెక్ నిల్వల మధ్య సమన్వయాన్ని ప్రతి నెలా పరిశీలించాలని ఆదేశించారు. మెమోలో ముఖ్యాంశాలు.. - ట్రెజరీల్లో నగదు నిల్వపై ప్రతినెలా సమన్వయ నివేదిక పంపాలి. - నెలవారీగా గ్రాంట్లు రికవరీతో పాటు వినియోగ సర్టిఫికెట్లను సమర్పించాలి. - ప్రతి నెలా ఆడిట్ పేరాలపై స్పందించాలి. - ఎ.సి, డి.సి బిల్లుల వివరాలతో పాటు నెలవారీ వ్యయం స్టేట్మెంట్ను ఆర్థికశాఖకు ఇవ్వాలి. - నెలవారీ ఖర్చుకు సంబంధించి సంబంధిత శాఖాధిపతి రిజిష్టర్ను నిర్వహించాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు. కేంద్ర నిధుల్లో కోత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, వివిధ గ్రాంట్లలో రాష్ట్రానికి కోత పడనుంది. ఆర్థిక క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కేంద్రం నాలుగో త్రైమాసిక నిధుల్లో 33 శాతానికి మించి విడుదల చేయరాదని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద విడుదలై, వ్యయం కాని నిధుల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ కోరింది. నిధులు నిల్వ ఉంటే తదుపరి ఆ పథకాలకు విడుదలను నిలిపేయనుంది. వివిధ గ్రాంట్లలో కూడా రాష్ట్రానికి కోతపడనుంది.