-
ఏపీ మంత్రుల శాఖలపై ఇదేం సస్పెన్స్?
అమరావతి, సాక్షి: మంత్రులుగా ప్రమాణం చేసి 48 గంటలు ముగిసింది. అయినా కూడా ఇంకా శాఖలు కేటాయించలేదు. అసలు ఎవరికి ఏ శాఖ దక్కుతుందో అని మూడు పార్టీల శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఇంతకీ ఏపీ కేబినెట్ కూర్పుపై సీఎం చంద్రబాబు కసరత్తులు పూర్తి చేశారా? లేదంటే తర్జన భర్జనలు పడుతున్నారా?.. ఇంకా ఏమైనా చర్చలు జరగాల్సి ఉందా?. ఆంధ్రప్రదేశ్లో మంత్రిత్వ శాఖల కేటాయింపుపై ఇవాళ సాయంత్రంలోపు ఒక స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక మంత్రుల శాఖల జాబితా వెలువడుతుందని అంతా ఎదురు చూశారు. కానీ, అది జరగలేదు. మరోవైపు కీలక శాఖలు మా నేతలకంటే మా నేతలకే దక్కుతాయంటూ ధీమాగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రధానంగా పవన్తో పాటు నారా లోకేష్కు, అలాగే టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి ఏ శాఖ దక్కుతుంది అనేదానిపై ఉత్కంఠ నడుస్తోంది.ఏపీలో మొత్తం 25 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అయితే.. టీడీపీ నుంచి 20, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కరు.. మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో.. హోం, ఆర్థిక లాంటి కీలక శాఖలను చంద్రబాబు టీడీపీ దగ్గరే ఉంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధాన మిత్రపక్షంగా జనసేనకు డిప్యూటీ సీఎంతో పాటు ఏవైనా మూడు ముఖ్య శాఖల్ని కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ తరఫున ఏకైక మంత్రి సత్యకుమార్కు దేవాలయ, ధర్మాదాయ ఇవ్వొచ్చనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.మంత్రలు శాఖల కేటాయింపు సస్పెన్స్కు నేడు తెర పడే అవకాశాలున్నాయి. ఇవాళ మధ్యాహ్నాం తర్వాత సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్లనున్నారు. మంత్రుల జాబితాపై మరోసారి పునఃసమీక్ష జరిపి ఈ సాయంత్రం లేదంటే అర్ధరాత్రి పూర్తి జాబితాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కొనసాగుతున్న లీక్స్.. ఏపీలో ఎవరికి ఏ శాఖ అంటే..?
విజయవాడ, సాక్షి: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు కోసం కసరత్తులు ముగిశాయా? లేదంటే ఇంకా చర్చించాల్సి ఉందా? అసలు కూటమి పార్టీలు ఏ శాఖల కోసం పట్టుబట్టాయి? కీలక శాఖలను టీడీపీనే దక్కించుకోబోతోందా? త్యాగాల జనసేన శాఖల విషయంలో పంతం నెగ్గించుకుంటుందా? ఫలానా వాళ్లకు ఫలానా మంత్రిత్వ శాఖ అని లీకులు ఇస్తోంది ఎవరు?.. ఏపీలో కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారనేదానిపై ఈ సాయంత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించాక.. ఈ ప్రకటన ఉండనున్నట్లు అధికారిక సమాచారం. మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారని చెబుతున్నప్పటికీ.. మరోసారి పునఃసమీక్షిస్తారా? అనే చర్చా మొదలైంది.గురువారం ఆయన తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల పర్యటనలు ముగించుకున్నాక అమరావతికి తిరిగి రానున్నారు. సాయంత్రం సచివాలయం వెళ్లి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల ఫైల్స్పైనా సంతకాలు చేస్తారని ఇప్పటికే సమాచారం అందింది. అయితే.. ఆ తర్వాతే ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారట. ఈ క్రమంలో గత రెండు రోజులుగా శాఖల కేటాయింపులపై లీకులు అందుతున్నాయి. ఇటు టీడీపీ శ్రేణులు.. అటు జనసేన.. ఇంకోవైపు ఎల్లో మీడియా సంస్థలు.. మంత్రిత్వ శాఖలపై గత రెండురోజులుగా వరుసబెట్టి కథనాలు ఇస్తున్నాయి. అందులో మొదటిది పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అవుతారని. అయితే నిన్న మంత్రిగానే పవన్ కల్యాణ్ ప్రమాణం చేసినప్పటికీ.. అధికారికంగా డిప్యూటీ సీఎం అని ఎక్కడా ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఆయన సోదరుడు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఉప ముఖ్యమంత్రి అనే లీక్ ఇచ్చేశారు. ఇక.. జనసేనకు మూడూ కీలక శాఖలే ఉంటాయని టీడీపీ అనుకూల ప్రధాన మీడియా కథనం ఇచ్చింది. అందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు పేర్కొంది. అయితే.. పవన్ హోం శాఖ కోసం కూడా పట్టుబడుతున్నారంటూ జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. మరోవైపు నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు లీకులు అందుతున్నాయి. ఇక టీడీపీ శ్రేణులేమో.. ఐటీ శాఖ మరోసారి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ బాబుకే వెళ్లొచ్చని చెబుతున్నాయి. గతంలో.. 2014 టైంలో ఎమ్మెల్సీగా నారా లోకేష్ ఈ శాఖను చేపట్టారు. అయితే టీడీపీలోనే మరో వర్గం లోకేష్కు ఈసారి ఇంకా ప్రాధాన్యం ఎక్కువ ఉన్న మంత్రిత్వ శాఖ దక్కుతుందని చెప్పుకుంటోంది. సీఎం చంద్రబాబు బాధ్యతను స్వీకరించిన తర్వాత రాత్రికి అధికారిక ప్రకటన. ఇలా ఏ వర్గానికి ఆ వర్గం ఫలానా మంత్రిత్వ శాఖ దక్కుతుందనే ప్రచారంలో ఉంటే.. మరో మిత్రపక్షం బీజేపీ మాత్రం ఒక్క మంత్రి పదవి పోస్ట్ మీద ఎలాంటి వ్యాఖ్యా చేయకపోవడం గమనార్హం. -
AP Cabinet: ఆ ఒక్క మంత్రి పదవి ఎవరికో?
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే మిత్ర కూటమి నేడు అధికారం చేపట్టబోతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వేళ.. 24 మంత్రులతో కూడిన జాబితా విడుదల విడుదలయ్యింది. వీళ్లందరితో కలిసే ముఖ్యమంత్రిగా ఇవాళ విజయవాడలో ప్రమాణం చేయబోతున్నారు ఆయన. అయితే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో 25 స్థానాలు ఉన్నాయి. తనతో సహా 25(24 మంది మంత్రులు)తో కూడిన జాబితానే చంద్రబాబు రిలీజ్ చేశారు. అంటే.. ఒక్క స్థానాన్ని ఆయన భర్తీ చేయకుండా వదిలేశారన్నమాట. ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానం మిత్రపక్షాలకా? లేదంటే టీడీపీకా? అనే అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు ఎవరికి ఏ పోర్ట్పోలియో కేటాయిస్తారు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల్లో ఈ అంశంపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.సంబంధిత వార్త: చంద్రబాబు కేబినెట్.. సామాజిక వర్గాల వారీగా చూస్తే..మంగళవారంనాడు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాక.. అర్ధరాత్రి దాటాక కొత్త మంత్రుల జాబితా విడుదల చేశారు. తొలుత జనసేనకు 4, బీజేపీ 2 పదవులు దక్కుతాయనే ప్రచారం నడిచింది. కానీ, కొత్త మంత్రుల జాబితాలో టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కింది. వీళ్లలో 17 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రులు కాబోతున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు కూడా ఇందులో చోటు దక్కింది. ముందు నుంచి వినవస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నారు. ఆ పార్టీ నుంచి సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు మంత్రులు కాబోతున్నారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్కు బెర్త్ దక్కింది. బీజేపీ నుంచి ఎవరికి చోటు దక్కాలి అనే అంశంపై చర్చల వల్లే మంత్రుల జాబితా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. -
చంద్రబాబు కేబినెట్.. తెరపైకి కొత్త ఈక్వేషన్లు!
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గంపై కసరత్తులు కొనసాగుతున్నవేళ.. ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవే కావాలని పట్టుబడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్కు, హోం శాఖ కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్కు హోం శాఖ ఖరారైందన్న ప్రచారం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది. చంద్రబాబు గతంలో కాపు డిప్యూటీ సీఎంకు హోంమంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఇప్పుడూ అదే ఫార్ములా అమలు చేయాలంటు జనసేన పట్టుబడుతోంది. మరోవైపు కేంద్ర కేబినెట్ లో కూడా కాపులకి అవకాశం దక్కని అంశాన్ని ప్రస్తావిస్తూ.. పవన్కు హోం శాఖ ఇచ్చి ఆ గ్యాప్ను బ్యాలెన్స్ చేయాలని డిమాండ్ జనసేన చేస్తోంది. ఇంకోవైపు హోం మంత్రి పదవి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకే అనే ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. అదే సమయంలో రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కడం, ఇప్పుడు జనసేన డిమాండ్తో అచ్చెన్నాయుడు మంత్రి పదవిపై సందిగ్థత నెలకొంది. దీంతో ఆయన టీడీపీ అధ్యక్ష పదవిలోనే కొనసాగుతారా? అనే చర్చ నడుస్తోంది. కూటమిలో ఉన్న బీజేపీ డిమాండ్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ పార్టీ కూడా కేబినెట్లో కీలక పోస్టులను కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మంత్రి పదవులెవరికో?.. ఏపీలో కొనసాగుతున్న ఉత్కంఠమరోవైపు.. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురు చేరారు. ఇది ఎమ్మెల్యేల్లో కొందరి అవకాశాల్ని దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది. యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందారు. ఆ మేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరిగే వీలుంది. మంచి ఇమేజ్ ఉన్నవారికి, రాబోయే 10-15 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యమున్న వారికి ఈసారి అధిక అవకాశాలు లభిస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం కొందరు సీనియర్ల అవకాశాలకు గండి కొట్టొచ్చు. ఇక స్పీకర్ పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కళా వెంకట్రావ్, అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ ముగ్గురూ ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అయితే గతంలో తన సామాజిక వర్గానికే స్పీకర్పదవి ఇచ్చుకున్న చంద్రబాబు.. ఈసారైనా బీసీ, ఎస్సీలకు ఇస్తారా? లేదంటే మళ్లీ తన సామాజిక వర్గానికే ఇప్పించుకుంటారా?అనే సస్పెన్స్ కొనసాగుతోంది. -
జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కల్యాణ్
గుంటూరు, సాక్షి: జనసేన పార్టీ శాసన సభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోకి పార్టీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జనసేన సీనియర్.. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, పవన్ పేరును ప్రతిపాదించగా.. అందుకు జనసేన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మరోవైపు చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవుల కోసమూ ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాసేపట్లో విజయవాడలో జరగబోయే ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి పవన్తో పాటు జనసేన ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. -
ఏపీ గవర్నర్ను కలిసిన కూటమి నేతలు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిశారు. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశం ముగిశాక నేరుగా రాజ్భవన్కు వెళ్లారు. చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నకున్నట్లు గవర్నర్ నజీర్కు లేఖ ఇచ్చారు. గవర్నర్ను కలిసిన వాళ్లలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, జనసేన నుంచి నాదెండ్ల, బీజేపీ నుంచి పురందేశ్వరి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన సంఖ్యా బలం తమకు ఉందని, చంద్రబాబును తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఈ సందర్భంగా వాళ్లు ఆయన్ని కోరారు. ఆ ఎమ్మెల్యేల సంతకాల లేఖను పరిశీలించిన గవర్నర్ నజీర్.. ప్రభుత్వ ఏర్పాటునకు సాయంత్రంలోగా ఆహ్వానిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. విజయవాడ ఏ-కన్వెన్షన్లో ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే కూటమి నేతగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఎన్డీయే కూటమి నేతగా.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆమోదం తెలిపారు. ఆవెంటనే మూడు పార్టీల ఎమ్మెల్యేలు సమ్మతి తెలపడంతో సభా నాయకుడిగా చంద్రబాబు ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కూటమి అద్భుత విజయం ఏపీ రాష్ట్రం సాధించిన విజయం. సమిష్టిగా పోరాడి అద్భుత విజయం సాధించాం. ఎన్డీయే కూటమి విజయం దేశవ్యాప్తంగా అందరికీ స్ఫూర్తి ఇచ్చింది. అద్భుతమైన మెజారిటీ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. కక్ష సాధింపులు.. వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు. ఏపీ ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. చంద్రబాబుకి నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చంద్రబాబు అనుభవజ్ఞుడే కాదు.. ధైర్యశాలి కూడా. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం. ప్రజలకు ఎన్నో హామీలిచ్చాం. వాటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.:: పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించాం. ఇంతటి ఘన విజయం సాధిస్తామని ఎవరూ ఊహించలేదు. ::బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిఎన్డీయే శాసనసభా పక్ష నేతగా నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అత్యున్నత ఆశయాల కోసం మూడు పార్టీలు ఏకం అయ్యాయి. అధిక స్ట్రైక్ రేట్తో విజయం సాధించాం. ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు. ఇది అన్స్టాపబుల్ విజయం. ఏపీలో ఘన విజయంతో ఢిల్లీలో గౌరవం పెరిగింది. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ::చంద్రబాబు నాయుడు శాసనసభ పక్ష నేతల ఎంపికకూటమి మీటింగ్ కంటే ముందే.. మంగళగిరి జనసేన ఆఫీస్లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, గెలిచిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పవన్ను జనసేన శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఈ పేరును ప్రతిపాదించగా.. అందుకు ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. ఇంకోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశం అయ్యారు. కానీ, శాసన సభా పక్ష నేత ఎంపిక నిర్ణయం అధిష్టానానికే వదిలేసినట్లు సమాచారం. దీంతో బీజేఎల్పీపై సస్పెన్స్ కొనసాగుతోంది.రేపే ప్రమాణం.. స్టేట్ గెస్ట్గా చిరుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణం చేయనున్నారు. విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. మరోవైపు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్గా నటుడు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు చంద్రబాబు. దీంతో ఈ సాయంత్రమే చిరు విజయవాడకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు రాం చరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. మంత్రి వర్గంపై ఉత్కంఠమరోవైపు.. రేపు(బుధవారం) ఉదయం ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులుగా కూడా ప్రమాణం చేయబోతున్నట్లు సమాచారం. టీడీపీ కోటాతోపాటు జనసేన, బీజేపీ నుంచి పేర్లతో కేబినెట్ కూర్పు ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ కూర్పు కోసం మూడు పార్టీల నేతలు సుదీర్ఘ కసరత్తులే చేసినట్లు తెలుస్తోంది. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయోననే ఉత్కంఠ ఆయా పార్టీ శ్రేణుల్లో నెలకొంది. -
పిఠాపురం వర్మపై జనసేన దాడి
కాకినాడ, సాక్షి: పిఠాపురం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు.రాళ్లు, కొబ్బరి కాయలతో వర్మ కారుపై దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. వారి నుంచి తప్పించుకుని ఆయన కారులో వేగంగా వెళ్లిపోయారు. వర్మపై దాడి విషయం తెలియడంతో గొల్లప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జనసేన నేతలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా వారు శాంతించలేదు. జనసేన నేతల దాడి నుంచి తప్పించుకుని వచ్చిన వర్మ గొల్లప్రోలు– చేబ్రోలుకు మధ్యలో ఉన్న తన గెస్ట్హౌస్కు చేరుకోగా పోలీసులు ఆయనకు రక్షణ ఏర్పాట్లు చేశారు. నన్ను చంపడానికి ప్రయత్నించారు: వర్మ ఎన్నికల్లో పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలపడానికి వెళితే జనసేన శ్రేణులు తనపై దాడి చేశాయని టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. ఆయన శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు చిలకపూరి ప్రభాకరరావు పిలుపు మేరకు సర్పంచ్లు ఎన్నికల్లో తమకు అనుకూలంగా పని చేశారన్నారు. దీంతో తాను సర్పంచ్ను కలిసి కృతజ్ఞతలు తెలపడానికి వన్నెపూడి వెళ్లానన్నారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన మాజీ టీడీపీ నేతలు, ప్రస్తుతం అధికారం కోసం జనసేనలోకి వెళ్లిన కొందరు నేతలు తనపై దాడికి దిగారని ఆరోపించారు. తనపై ఇటుకలు, గాజు గ్లాసులు, డ్రింక్ సీసాలు, కంకర రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దాడిలో తనతో పాటు మరికొందరికి గాయాలయ్యాయన్నారు. అల్లరి మూకలను జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. జనసేన నేతలు తనను చంపడానికి ప్రయతి్నంచారని ధ్వజమెత్తారు. 9 నెలలుగా ఉదయ్ తనను వేధిస్తున్నాడని.. జనసేనకు పనిచేయడం తన ఖర్మ అని వ్యాఖ్యానించారు.తనపై హత్యాయత్నం వెనుక ఉదయ్ హస్తం ఉందని ఆరోపించారు. తనపై దాడి చేస్తున్నప్పుడు వన్నెపూడికి చెందిన టీడీపీ కార్యకర్తలు సుమారు 150 మంది తనకు రక్షణ వలయంగా ఉండడంతో తాను బయటపడ్డానన్నారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ గొల్లప్రోలు పోలీసు స్టేషన్ వద్ద వర్మ టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. -
ఏపీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్
AP Election 2024 Counting And Results Updates03:43 PM, June 4th, 2024పులివెందులలో వైఎస్ జగన్ గెలుపు61,169 ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపుఅధికారికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెలియాల్సి ఉంది02:43 PM, June 4th, 2024పులివెందుల 19వ రౌండ్ ముగిసేసరికి 56వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్02:41 PM, June 4th, 2024అన్నమయ్య జిల్లా:రాయచోటి 14 వ రౌండ్ ముగిసేసరికి 3929 ఓట్ల ఆదిక్యం లో శ్రీకాంత్రెడ్డిశ్రీకాంత్ రెడ్డి(వైఎస్ఆర్సీపీ) : 63824మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి(టీడీపీ): 5989502:40 PM, June 4th, 2024కడప పార్లమెంట్వైఎస్ అవినాష్రెడ్డి ముందంజ.63218 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ అవినాష్వైఎస్ అవినాష్ రెడ్డి: 500912టిడిపి భూపేష్ సుబ్బరామి రెడ్డి: 437694వైఎస్ షర్మిలా రెడ్డి: 11871202:40 PM, June 4th, 2024ముందంజలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిరాజంపేట: 20వ రౌండ్ ముగిసేసరికి 8378 ఓట్ల ఆధిక్యంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డివైఎస్ఆర్సీపీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: 89664టిడిపి సుగవాస బాలసుబ్రమణ్యం: 8128602:26 PM, June 4th, 2024పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజచిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం 19 రౌండ్లకు గాను 17 రౌండ్ లు ఓట్ల లెక్కింపు పూర్తి6623 ఓట్ల లీడింగ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజ 01:50 PM, June 4th, 2024ముందంజలో అవినాష్రెడ్డి కడప: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్రెడ్డి16 రౌండ్లు ముగిసే సమయానికి 39,637 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్రెడ్డి ముందంజ01:05 PM, June 4th, 2024రాజంపేటలో వైఎస్సార్సీపీ ముందంజరాజంపేటలో వైఎస్సార్సీపీ 14 రౌండ్లు పూర్తయ్యేసరికి 7,108 ఓట్ల మెజారిటీతో ముందంజకదిరిలో ఐదువేల ఓట్లతో వైఎస్సార్సీపీ లీడ్12:21 PM, June 4th, 2024పులివెందులలో 21,292 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్పుంగనూరు: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసత్యవేడులో వైఎస్సార్సీపీ ఆధిక్యంవైఎస్సార్సీపీ-23497బీజేపీ-16,60311:15 AM, June 4th, 2024పాలకొండలో వైఎస్సార్సీ ముందంజగుంతకల్లులో వైఎస్సార్సీపీ ఆధిక్యతగుంతకల్లులో వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి ఆధిక్యత మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంపై 2608 ఓట్ల ఆధిక్యంలో వెంకట్రామిరెడ్డినరసరావుపేట అసెంబ్లీ 4వ రౌండ్ పూర్తయ్యేసరికి ఎమ్మెల్యే గోపిరెడ్డి 4700 ఓట్ల ఆధిక్యం10:54 AM, June 4th, 2024దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఆధిక్యంలో దిశగా దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగు రౌండ్లు ఫలితాలు ముగిసేరికివైఎస్సార్సీపీ-22965టీడీపీ-20921పలాస అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5110టీడీపీ-12309టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5478టీడీపీ-6263ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం (నాలుగో రౌండ్)వైఎస్సార్సీపీ-13805టీడీపీ -1786410:31 AM, June 4th, 2024తిరుపతి పార్లమెంట్.. ఆధిక్యంలో గురుమూర్తిగూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మూడో రౌండ్లో గురుమూర్తి 1596 ఓట్లు ఆధిక్యంవైఎస్సార్సీపీ-12,687బీజేపీ-11091నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి సర్వేపల్లి అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి 107 ఓట్లు ఆధిక్యం9:52 AM, June 4th, 2024వైఎస్ అవినాష్రెడ్డి ముందంజకడప పార్లమెంట్ పరిధిలో నాలుగో రౌండ్ ముగిసేసరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్రెడ్డి 13,182 ఓట్ల మెజార్టీతో ముందంజ9:24 AM, June 4th, 2024అనపర్తి, తిరువూరులో వైఎస్సార్సీపీ లీడ్హిందూపురం పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యంపుట్టపర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీధర్రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్రెడ్డి ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంసర్వేపల్లిలో కాకాణి గోవర్థన్రెడ్డి ఆధిక్యందర్శిలో వైఎస్సార్సీపీ ముందంజఅరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి లీడ్9:20 AM, June 4th, 2024పాలకొల్లులో టీడీపీ ముందంజఆచంటలో టీడీపీ 3747 ఓట్లు ఆధిక్యం ఉండిలో టీడీపీ 5,729 ఓట్లు ఆధిక్యంభీమవరంలో జనసేన 7012 ఓట్లు ఆధిక్యంతణుకులో టీడీపీ 7580 ఓట్లు ఆధిక్యంతాడేపల్లిగూడెంలో జనసేన 1524 ఓట్లు ఆధిక్యం నర్సాపురం పార్లమెంట్లో బిజెపి 18384 ఓట్లు ఆధిక్యం9:15 AM, June 4th, 2024విశాఖ లోక్ సభ స్థానానికి పోలైన సర్వీస్ ఓట్లు మొత్తం 1350ఆరు స్కానర్లు ద్వారా స్కాన్ చేస్తున్న సిబ్బంది.. పర్యవేక్షిస్తున్న ఆర్వోలుసర్వీస్ ఓట్లలో 13ఏలు పెట్టకుండా పోస్ట్ చేసిన కొంతమంది ఓటర్లుమరో గంటలో పూర్తి వివరాలు వచ్చేందుకు అవకాశం9:13 AM, June 4th, 2024పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందంజతిరువూరులో వైఎస్సార్సీపీ ముందంజఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్రెడ్డి ఆధిక్యం9:01 AM, June 4th, 2024ఆత్మకూరులో మేకపాటి విక్రమ్రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్రెడ్డి ఆధిక్యంనంద్యాల, కర్నూలు జిల్లాలో నెమ్మదిగా సాగుతున్న కౌంటింగ్8:53 AM, June 4th, 2024కడప ఎంపీ అభ్యర్థి అవినాష్రెడ్డి ఆధిక్యంఅవినాష్రెడ్డి 4362(ఆధిక్యం)భూపేష్ వెనుకంజ 2,088షర్మిల-11018:51 AM, June 4th, 2024చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఆధిక్యంగజపతినగరంలో అప్పలనర్సయ్య ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంచంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యం8:36 AM, June 4th, 2024కాకినాడ: పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ చెల్లని ఓట్లుపిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్మొదట చెల్లని ఓట్లు వేరు చేస్తున్న సిబ్బంది8:27 AM, June 4th, 2024తూర్పు గోదావరిరాజమండ్రి రూరల్ పోస్టల్ బ్యాలెట్.. కూటమి అభ్యర్థి ముందంజ రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి లీడ్ 5,795 ఓట్లకు పైగా ఆధిక్యం8:25 AM, June 4th, 2024నంద్యాలనంద్యాల జిల్లా కు సంబంధించి ఆరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంపటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్8:22 AM, June 4th, 2024పశ్చిమగోదావరిజిల్లాలోప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్.నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ 13,340 ఓట్లు8:15 AM, June 4th, 2024పల్నాడు నరసరావుపేట లోని కాకాని కౌంటింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన పడిపోయిన తెలుగుదేశం ఏజెంట్ గట్టినేని రమేష్108 సాయంతో హాస్పిటల్ హాస్పిటల్ కి తరలింపు8:09 AM, June 4th, 2024అమలాపురం నియోజకవర్గ పరిధిలో చెయ్యేరు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ హ్యూమన్సు శుక్లా8:09 AM, June 4th, 2024ఏలూరు జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియస్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ సెంటర్లకు ఈవీఎంలు తరలింపుతొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఏలూరు జిల్లాలో 17,500 పోస్టల్ ఓట్లు 8:05 AM, June 4th, 2024పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఅభ్యర్థుల సమక్షంలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్లుపోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు7:59 AM, June 4th, 2024అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు తెరుస్తున్న అధికారులుకాసేపట్లో ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లుఎప్పడూ లేనంత హై అలర్ట్లో పార్టీల అభ్యర్థులుఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలుపోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 4.61 లక్షల మంది ఓటర్లు7:43 AM, June 4th, 2024అమలాపురం కౌంటింగ్ సెంటర్లో పినిపే విశ్వరూప్అమలాపురంలో కౌంటింగ్ సెంటర్కి వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్బాపట్ల కేంద్రానికి చేరుకున్న బాపట్ల ఎమ్మెల్యే కోనరఘుపతి7:43 AM, June 4th, 2024చిత్తూరు జిల్లా: కర్ఫ్యూను తలపిస్తోన్న కుప్పంకుప్పంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులుఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న పోలీసులుకుప్పంలో దుకాణాలు తెరవకూడదని పోలీసులు హెచ్చరించడంతో, దుకాణాలను మూసేసిన వైనం7:34 AM, June 4th, 2024కీలకంగా మారిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ దాదాపు రెండున్నర గంటలు పట్టే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు7:22 AM, June 4th, 2024ఉమ్మడి చిత్తూరు జిల్లా.. ఒక పార్లమెంట్.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ చిత్తూరు 226 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 17 రౌండ్లుపలమనేరు 287 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 21 రౌండ్లుకుప్పం 243 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 18 రౌండ్లుపూతలపట్టు 260 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 19 రౌండ్లుజీడినెల్లూరు 229 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 17 రౌండ్లునగరి 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుపుంగనూరు 262 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 19 రౌండ్లుసత్యవేడు 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుశ్రీకాళహస్తి 293 పోలింగ్ కేంద్రాలు 14 టేబుల్స్ 21 రౌండ్లుతిరుపతి 267 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 20 రౌండ్లుచంద్రగిరి 395 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 29 రౌండ్లుపీలేరు 281 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 21 రౌండ్లుతంబళ్లపల్లి 236 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు-17 రౌండ్లుమదనపల్లి 259 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 19 రౌండ్లు7:22 AM, June 4th, 2024కోనసీమ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలురామచంద్రపురం మొత్తం ఓటర్లు 1,73, 91710 టేబుళ్లు 24 రౌండ్లుముమ్మిడివరం మొత్తం ఓటర్లు 2,05, 163, 14 టేబుళ్లు, 19 రౌండ్లుఅమలాపురం మొత్తం ఓటర్లు 1,75, 845,12 టేబుళ్లు, 20 రౌండ్లురాజోలు మొత్తం ఓటర్లు 1,56,40014 టేబుళ్లు, 15 రౌండ్లుపి. గన్నవరం మొత్తం ఓటర్లు 1,65, 749 12 టేబుళ్లు, 18 రౌండ్లుకొత్తపేట మొత్తం ఓటర్లు 2,14, 945 10 టేబుళ్లు-26 రౌండ్లుమండపేట మొత్తం ఓటర్లు 1,91,959 10 టేబుళ్లు-22 రౌండ్లు6:55 AM, June 4th, 2024గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియకౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బందితేలనున్న ఒక పార్లమెంట్ తో పాటు 7 నియోజకవర్గాల భవితవ్యంఉదయం 8 గంటలకు మొదలు కానున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..లెక్కింపు కి 267 టేబుళ్లు ఏర్పాటు..23,633 పోస్టల్ ఓట్ల తో పాటు ఈవీఎంల ద్వారా నమోదైన 14,11,989 ఓట్ల లెక్కింపు..18 నుంచి 21 రౌండ్లో వెలువడనున్న ఫలితాలుమొదటిగా తేలనున్న గుంటూరు ఈస్ట్, తాడికొండ ఫలితం1075 పోలింగ్ సిబ్బందితో పాటు, 2500 మంది పోలీస్ సిబ్బంది వినియోగంకౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రతకౌంటింగ్ కేంద్రాలకు చేరుకొంటున్న అభ్యర్థులు..6:47 AM, June 4th, 2024కృష్ణాజిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధంమచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపుమచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన ఓట్లు - 12,93,9357 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,93,948మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,5797 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,7288 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభంపార్లమెంట్ తో పాటు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటుఒక్కో టేబుల్కు ఏఆర్ఓ,ఒక సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు,ఒక కౌంటింగ్ అబ్జర్వర్ నియామకంమచిలీపట్నం అసెంబ్లీ - 15 రౌండ్లుపెడన అసెంబ్లీ - 16 రౌండ్లుగుడివాడ, పామర్రు అసెంబ్లీ స్థానాలు - 17 రౌండ్లుఅవనిగడ్డ అసెంబ్లీ - 20 రౌండ్లుగన్నవరం ,పెనమలూరు అసెంబ్లీ - 22 రౌండ్లుమొదట ఫలితం మచిలీపట్నం అసెంబ్లీ నుంచి వెలువడయ్యే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటుపామర్రు అసెంబ్లీ - 2 టేబుల్స్పెడన అసెంబ్లీ - 3 టేబుల్స్గన్నవరం అసెంబ్లీ - 5 టేబుల్స్గుడివాడ,పెనమలూరు అసెంబ్లీలు -6 టేబుల్స్మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీలు - 8 టేబుల్స్మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న అభ్యర్ధులు -15 మందిఏడు అసెంబ్లీల నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్యేఅభ్యర్ధులు - 79 మంది అసెంబ్లీల వారీగాగన్నవరం అసెంబ్లీ - 12 మందిగుడివాడ అసెంబ్లీ - 12 మందిపెడన అసెంబ్లీ - 10 మందిమచిలీపట్నం అసెంబ్లీ - 14 మందిఅవనిగడ్డ అసెంబ్లీ - 12 మందిపామర్రు అసెంబ్లీ - 8 మందిపెనమలూరు అసెంబ్లీ - 11 మంది6:26 AM, June 4th, 2024తొలి ఫలితం ఏదంటే..ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభంపోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్కు గరిష్ఠంగా 2.30 గంటల టైంఈవీఎంలలో ఒక్కో రౌండ్కు 20-25 నిమిషాల సమయంఒక్కోరౌండ్లో ఒక్కో టేబుల్పై 500 చొప్పున పోస్టల్ బ్యాలట్లుకొవ్వూరు, నరసాపురంలలో తొలి ఫలితంభీమిలి, పాణ్యం ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యం13 రౌండ్లతో ఎంపీ స్థానాల్లో మొదట రాజమహేంద్రవరం, నరసాపురం27 రౌండ్లతో అమలాపురం స్థానం ఫలితం అన్నింటి కంటే చివర్లోమధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టతలోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్ హాళ్లలో6:25 AM, June 4th, 2024ప్రతి పోస్టల్ బ్యాలట్ టేబుల్ వద్ద ఒక ఏఆర్వోఈవీఎం ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలట్ లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు.18 ఏళ్లు పైబడిన ఎవరినైనా సరే అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టుకోవచ్చు. ప్రతి టేబుల్కు ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. మంత్రులు, మేయర్లు, ఛైర్పర్సన్లు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు.రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అభ్యర్థి లేదా వారి తరఫు ప్రతినిధి ఉండొచ్చు.6:20 AM, June 4th, 20241,985 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపురెండు మూడ్రోజులపాటు మద్యం దుకాణాలు బంద్. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల విచక్షణాధికారం మేరకు నిర్ణయంరాష్ట్ర వ్యాప్తంగా 1,985 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు. సమస్యలు సృష్టించే అవకాశమున్న 12 వేల మందిని గుర్తించి బైండోవర్కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు. మొదటి అంచెలో కేంద్ర బలగాలు, రెండో అంచెలో ఏపీఎస్పీ, మూడో అంచెలో సివిల్ పోలీసులుకౌంటింగ్ కోసం 25 వేల మంది సిబ్బంది. రాష్ట్రవ్యాప్తంగా 45 వేలమంది పోలీసులు వీరంతా మంగళవారం నాడు ఎన్నికల విధుల్లోనే ఉంటారు.కౌంటింగ్ సందర్భంగా భద్రత, బందోబస్తు కోసం రాష్ట్రానికి 25 కంపెనీల కేంద్ర బలగాలు . ప్రస్తుతం రాష్ట్రంలో 67 కంపెనీల కేంద్ర బలగాలుసామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు6:15 AM, June 4th, 2024ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి.ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024 6:05 AM, June 4th, 2024మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టతనెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. సర్వే ఏదైనా ఫ్యాన్ దే ప్రభంజనం🔥ఎగ్జిట్ పోల్ అంచనాలు మించి గెలవబోతున్న వైయస్ఆర్సీపీ✊🏻సంబరాలకి సిద్ధమవ్వండి! 💫#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/jV2UdE7GzO— YSR Congress Party (@YSRCParty) June 3, 2024నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది. -
ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: అంచనాలకు మించి ఆనాడు..
జూన్ 4వ తేదీనాటి ప్రజాతీర్పు కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల ఫలితాల హ్యాష్ ట్యాగులు ఎక్స్(పూర్వపు ట్విటర్)లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం వెలువడబోయే ఎగ్జిట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చా నడుస్తోంది. ఇక.. 2019 ఏపీ సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల నాటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. 2019 మే 23వ తేదీ వెలువడ్డ ఫలితాలతో పోలిస్తే.. ఆ అంచనాలు ఎంత వరకు ఫలించాయో పరిశీల్తిస్తే.. 2019 మే 19 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో ఎక్కువ సర్వే సంస్థలు లోక్సభ, అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపించాయి. ఒకటి రెండు సర్వే సంస్థలు తప్పించి.. లోక్సభ స్థానాల్లో 20కి దగ్గర్లో వస్తాయని ఎగ్జిట్పోల్స్ చెప్పింది. వాటిల్లో.. 👉లోక్సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలిపింది.👉 ఆరా మస్తాన్ సర్వే ప్రకారం వైఎస్సార్సీపీకి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని తెలిపింది. టీడీపీకి 1 నుంచి 5 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.👉 టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం వైఎస్సార్సీపీకి 18 సీట్లు టీడీపీకి 7 సీట్లు రావొచ్చని అంచనా.👉 న్యూస్ 18- ఐపీఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైఎస్సార్సీపీకి 13 నుంచి 14 సీట్లు వస్తాయి. టీడీపీ 10 నుంచి 12 సీట్లు దక్కించుకుంటుంది.లోక్సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనా.. అంతకు మించే ఫలించింది. 25 స్థానాలకుగానూ 22 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని విజయ దుందుభి మోగించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని, అలాగే ఏపీ ఎన్నికల్లో తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి. ఇక పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. 👉 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 133 నుంచి 135 వరకు సీట్లు వస్తాయని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సీపీఎస్) అంచనా వేసింది. టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు దక్కే అవకాశముందని పేర్కొంది. జనసేన పార్టీకి ఒక స్థానం రావొచ్చని తెలిపింది.👉 వైఎస్సార్సీపీకి 112, టీడీపీ 59, జనసేనకు 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. వైఎస్సార్సీపీకి 18 నుంచి 21 లోక్సభ స్థానాలు గెల్చుకునే అవకాశముందని తెలిపింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు దక్కనున్నాయని అంచనా కట్టింది. జనసేనకు ఒక స్థానం రావొచ్చని తేల్చింది.👉 ఆరా మస్తాన్ సర్వేలో వైఎస్సార్సీపీకి 126 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 47, జనసేన పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది.👉 వీడీపీ అసోసియేట్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైఎస్సార్సీపీకి 111 నుంచి 121 సీట్లు వస్తాయి. టీడీపీకి 54 నుంచి 64 స్థానాలు దక్కుతాయి. జనసేనకు 4 సీట్లు వచ్చే అవకాశముంది.👉 ఐపల్స్ సర్వే ప్రకారం వైఎస్సార్సీపీకి 110 - 120, టీడీపీకి 56 - 62, జనసేన పార్టీ 0 - 3 స్థానాలలో విజయం సాధిస్తాయి.👉 కేకే సర్వే ప్రకారం వైఎస్సార్సీపీ 130 - 135, టీడీపీ 30 - 35, జనసేన పార్టీ 10 - 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి👉 మిషన్ చాణక్య సర్వే ప్రకారం వైఎస్సార్సీపీ 98 స్థానాల్లో, టీడీపీ 58 స్థానాల్లో, జనసేన పార్టీ 7 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధిస్తారని అంచనా వేశారు. ఇక్కడా ఆ అంచనాలు మించాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ 151 సీట్లు సాధించి.. చరిత్ర సృష్టిస్తూ సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అధికారాన్ని కైవసరం చేసుకుంది. మరి ఈసారి ప్రతిపక్షం కూటమిగా పోటీ చేసింది. వైఎస్సార్సీపీ సంక్షేమ పాలన నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. చూద్దాం.. సాయంత్రం రాబోయే ఎగ్జిట్ ఫలితాలు ఎలా ఉంటాయో!. -
అలాంటి ‘పుష్ప’పైనే విషమా?.. స్నేక్బాబుపై సెటైర్లు
ఎన్టీఆర్, సాక్షి: నటుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగబాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పతో ఉన్న స్నేహం కారణంగా అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం, దానిపై నాగబాబు నెగటివ్గా ట్వీట్ చేయడంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ట్విటర్ నుంచి మాయం అయ్యి.. మళ్లీ ప్రత్యక్షం అయ్యారు నాగబాబు. ఇదిలా ఉంటే.. నాగబాబు వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘‘స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?’’.. ‘‘మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, ‘‘నా పేరు సూర్య’’ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల రూపాయిలు ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న"పుష్పా"2019 లో జనసేనపార్టీకి 2కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు. స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి సినిమా పూర్తికాకముందే— Pothina venkata mahesh (@pvmaheshbza) May 18, 20242009,2019,2024 అండగా నిలిచిన వారిపై & గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీ ని దగాఫ్యామిలీ అనాలా? అంటూ మండిపడ్డారు. మళ్లీ Xలోకి నాగబాబుజనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. మళ్లీ ఎక్స్ లో ప్రత్యక్షం అయ్యారు. నా ట్వీట్ ను తొలగించాను అని నాగబాబు పోస్ట్ చేశారు. ‘‘మా పక్కన ఉంటూ మమ్మల్ని బలహీన పరచేవాడు మాకు శత్రువే.. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే’’ అంటూ అల్లు అర్జున్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబుపై దండెత్తారు. ఈ పరిణామంతో.. ట్విట్టర్ నుంచి తాత్కాలికంగా వైదొలిగారాయన. -
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
గుంటూరు, సాక్షి: ఆనందోత్సాహాలు.. పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో వైఎస్సార్సీపీ శ్రేణులు.. రెట్టించిన జోష్తో కదిలాయి. పోలింగ్ సరళి, మహిళలు..వృద్ధులు.. దివ్యాంగులు సైతం ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువత, రైతులు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడం వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో వైఎస్సార్సీపీలో ఉత్సాహం ఉరకలేసింది. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమంటూ.. వైఎస్సార్సీపీ శ్రేణులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.సజ్జల రామకృష్ణారెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలంతా పోలింగ్ సరళిపై ఒక అంచనాకు వచ్చారు. పోటెత్తిన ఓటర్లు.. మహిళలు, వృద్దులు, గ్రామీణులే విజయాన్ని డిసైడ్ చేశారంటున్నారు. ఏపీ ప్రజలు సీఎం జగన్ 59 నెలల సంక్షేమ పాలనను మెచ్చి.. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని దీని ద్వారా తేటతెల్లమైందని వ్యాఖ్యానిస్తున్నారు. జూన్ 4 వరకు ఉత్కంఠ అక్కర్లేదంటూ.. ముందే వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తమ నేతలకు అభినందనలు చెబుతున్నారు. కార్యాలయాలు, నివాసాలు కార్యకర్తల కేరింతలతో నిండిపోయాయి.ఇదీ చదవండి: ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలతఇక.. ‘‘ఓ వైపు కవ్వింపులు.. దాడులు.. మరోవైపు అసహనంతో టీడీపీ-జనసేన శ్రేణుల తీరు. పోలింగ్ సరళి మేరకు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శ్రేణుల్లో నైరాశ్యం వ్యక్తమవుతోంది. అసహనం పెరిగిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డాయి ఆ పార్టీ కేడర్లు. ఇక ఓటర్లు సైతం ప్రలోభాలకు లొంగలేదు. ఓటమి భయంతో పచ్చ మూకల విధ్వంసకాండ దిగినా ఓటర్లు బెదర్లేదు. పోలింగ్ జరిగిన తీరు, ఉదయాన్నుంచే బారులు తీరిన ఓటర్లే వైఎస్సార్సీపీ గెలుపునకు సాక్ష్యం అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు. పచ్చ ముఠాల విధ్వంసకాండజనసేన కార్యకర్తల దౌర్జన్యంజమ్మలమడుగు ఎమ్మెల్యేపై రాళ్ల దాడిపల్నాట పచ్చ మూక భీభత్సకాండఆగని టీడీపీ అరాచకాలు -
మంగళగిరి పోలింగ్ బూత్లో పవన్ ఓవరాక్షన్
గుంటూరు, సాక్షి: జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కల్యాణ్ ఓవరాక్షన్కు దిగారు. సోమవారం ఉదయం తన భార్య అన్నా లెజినోవాను, కొందరు అనుచరులను వెంట పెట్టుకుని పోలింగ్ సెంటర్లోకి తీసుకెళ్లి హల్ చల్ చేశారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మి నరసింహ కాలనీలో 197వ బూత్లో పవన్ ఓటేసేందుకు వచ్చారు. ఆ సమయంలో తన భార్యను వెంటపెట్టుకుని బూత్లోకి తీసుకెళ్లారు. అలాగే.. అక్కడ సెంటర్లో ఓటే లేని అనుచరుల్ని వెంట తీసుకెళ్లారు. బూత్లో కలియ దిరుగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. పవన్ భార్య అన్నా లెజినోవాకు సైతం అక్కడ ఓటు లేదని సమాచారం. అయినా అధికారులు వాళ్లను లోపలికి ఎలా అనుమతించారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కొందరు.మరోవైపు పవన్ అలా వాళ్లందరినీ లోపలికి తీసుకెళ్తుంటే.. క్యూ నిల్చున్న కొందరు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అక్కడే ఉన్న పోలింగ్ సిబ్బంది ఆ అభ్యంతరాల్ని పట్టించుకోకపోవడం గమనార్హం. -
PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
గజ ఈతగాడు అన్నారు.. ఆకాశాన్నంటే హైప్ క్రియేట్ చేశారు... మనోడు లేస్తే పరశురాముడు గండ్ర గొడ్డలి తీస్తే హరిహరాదులు కూడా అడ్డుకోలేరు అన్నారు. అయన మౌనంగా కూర్చుంటే వశిష్ఠుడు అన్నారు.. ఒంటి చేత్తో కూటమి ముంగిటకు అధికారాన్ని తెచ్చి పడేసాడు అన్నారు. అన్న కన్నెర్ర చేస్తే భూమ్యాకాశములు ఏకమవుతాయన్నారు. పిడికిలి బిగించి గుద్దితే పిడుగులు కురుస్తాయి.. కన్నెర్ర చేస్తే నిప్పుల వాన.. ఆయన ప్రేమ ఆకాశం... ఆయన ఆగ్రహం అనంతం.. ఈ మాదిరి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ను మోశారు. పాపం సినిమావాడు కదా.. నమ్మేసాడు.. సినిమాల్లో ఐతే స్క్రిప్ట్ ప్రకారం నచ్చినట్లు రాసుకోవచ్చు.. పిడికిలి బిగిస్తే భూమి బద్దలయ్యేలా గ్రాఫిక్స్ పెట్టొచ్చు.. ఒంటి చేత్తో లక్షలాదిమందికి శాసించొచ్చు ఎందుకంటే వాళ్లంతా జూనియర్ ఆర్టిస్టులు కాబట్టి.. వింటారు.స్టూడియోలో స్క్రిప్ట్ ప్రకారం అట్ట కత్తులు తిప్పి పదులసంఖ్యలో శతృవులను కూల్చడం వేరు.. నిజంగా సమాజంలో నిలబడి.. ప్రజల మద్దతు పొందడం వేరు.. తన సినీగ్లామర్ చూసి జనం వస్తారు అంతవరకూ నిజమే కానీ వాళ్ళను ఆకట్టుకోవడం.. తన వ్యక్తిత్వం.. వ్యవహారశైలితోబాటు క్యారెక్టర్.. ఇవన్నీ చూసిగానీ ప్రజలు తనవెంట నడవరు. ప్రజలు.. సమాజం.. ఏమీ గమనించనట్లే ఉంటారు. కానీ అవకాశం వచ్చినపుడు నాయకులూ వేసే ప్రతి అడుగునూ ఆచితూచి చూసి అప్పుడు కానీ అనుసరించరు.. తన వెంట నడవరు.. పార్ట్ టైం నాయకుడైన పవన్కు ఇప్పుడు ఆ విషయం అర్థమైంది. జగన్ను, వైసీపీ నేతలను గుడ్డలూడదీసి కొడతాను.. సంకెళ్లు వేస్తాను.. ఇలాంటి డైలాగ్స్ పవన్ మానసిక సంతులితను తెలియజేస్తున్నాయి. దానికితోడు పిఠాపురంలో పవన్ మీద పోటీలో ఉన్న వంగా గీత తక్కువైనవ్యక్తి కాదు.. ముప్పయ్యేళ్లుగా ప్రజల్లో ఉంటూ ఎక్కడా మచ్చపడకుండా ప్రజల మద్దతుపొందుతూ వస్తున్నారు. గతంలో రెండు చోట్లా ఓడిపోయిన పవన్కు ఈసారి ఎలాగైనా చట్టసభలో అడుగిడాలని కోరిక బలపడింది. అయితే ఇప్పుడు పిఠాపురంలో కూడా మొదట ఉన్నంత సానుకూలత కనిపించడం లేదు. ఆదుకుంటాడు అనుకున్న వర్మ చివరలో పోటు పొందితే అంతకుమించిన అవమానం మరోటి ఉండదు. జబర్దస్త్ నటులతో చేయించిన ప్రచారం ప్రజలను నవ్వించింది.. పవన్ను నవ్వులపాల్జేసింది.. తప్ప ఓట్లు తెచ్చేది లేదని తేలిపోయింది.ఆఖరి అస్త్రంగా మెగాస్టార్పవన్ వద్ద ఉన్న డైలాగ్స్ .. యాక్షన్ సీన్లు అన్నీ ముగిసాక కూడా గెలుపు మీద నమ్మకం రాలేదు.. అటు గీత.. ఒక మహిళగా ప్రతి ఇంటినీ టచ్ చేస్తూ.. మీ ఇంటి ఆడబిడ్డను.. గెలిచినా గెలవకున్నా నా నివాసం ఇక్కడే.. కానీ వాళ్ళు గెలిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ సంతకం కోసం హైదరాబాద్.. మద్రాస్.. షూటింగ్స్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళాలి అని చెబుతూ ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. దీంతో పవన్ పరిస్థితి చిల్లుకుండలోని నీళ్లు మాదిరి మారింది.పూటపూటకూ గ్రాఫ్ తగ్గిపోతోంది.. దీంతో చివరి అస్త్రంగా మెగాస్టార్ చిరంజీవిని దించారు.. అయన కూడా తమ్ముడి గుణగణాలు.. వీరగాధలను ఉదహరిస్తూ పాపం పిల్లడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు.. గెలిపించండి... ఈసారైనా గెలిపించండి.. లేకుంటే అవమానభారంతో చచ్చేలా ఉన్నాడు అని విజ్ఞప్తి చేశారు. ఆఖరుకు పవన్ పరిస్థితి అక్కడికి వచ్చింది.. చంద్రబాబును సీఎంను చేయగలిగిన చరిష్మా ఉందని భావిస్తున్న పవన్.. ఇప్పుడు అన్నతో వీడియో పోస్ట్ చేయించుకునే స్థితికి చేరారు.. ఇది దాదాపుగా ఓటమితో సమానం... గెలిచినా ఓడినట్లే..:::: సిమ్మాదిరప్పన్న -
May 7th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu09:00 PM, May 7th, 2024పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన వర్మ వర్గీయులుమీరు నిలబడితే మీకు వేస్తాం కానీ పవన్కు మాత్రం ఓటేయమన్న వర్మ వర్గీయులుపిఠాపురం కూటమిలో కుంపట్లుటీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు, పవన్ వర్గానికి మధ్య విభేదాలు06:20 PM, May 7th, 2024గాజువాక రోడ్షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి04:51 PM, May 7th, 2024తాడేపల్లి :మీ బిడ్డ జగన్ బటన్ నొక్కిన సొమ్ములు అక్కచెల్లెమ్మలకి అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ అడ్డుకుంటున్నారుఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా పథకాల డబ్బులు ఇచ్చిన జగన్ని చివర్లో వీళ్లు కట్టడి చేస్తుంటే నా అక్కచెల్లెమ్మలు ఊరుకుంటారా.?ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకి బుద్ధి చెప్తారు.మీ బిడ్డ జూన్ 4న అధికారంలోకి వచ్చిన వారంలోనే అన్ని పథకాలకి డబ్బులు క్లియర్ చేస్తాడు. - సీఎం వైఎస్ జగన్04:10 PM, May 7th, 2024కాకినాడ:సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య: కురసాల కన్నబాబుఐదేళ్ళుగా క్రమం తప్పకుండా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను చివరి విడతలో ఆపేస్తే మిగిలిన నాలుగేళ్ళ ప్రభావం జగన్పై ఉందని చంద్రబాబు అనుకుంటున్నాడా?పేదలపై కక్ష సాధించడం చంద్రబాబుకు అలవాటైపోయిందిప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అంటే కోర్టులకు వెళ్తాడుపేదలకు ఇళ్ళ స్ధలాలు ఇస్తే కోర్టుకు వెళ్తాడుచంద్రబాబు మార్కు పథకం ఏమీ లేదుపెత్తందార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తరపున నిలబడతాడుఏదోలా గెలవలన్న ఒత్తిడితో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నాడుఅధికారులను బదిలీ చేయిస్తున్నాడు.. సంక్షేమ పధకాల నిధుల పంపిణీని అడ్డుకుంటున్నాడుదీంతో చంద్రబాబును చూసి జనం ఒక బలహీనత అని అనుకుంటున్నారుప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ జరిగితే నాడు-నేడు ద్వారా ఓటర్లకు జగన్ గుర్తోస్తాడన్న స్ధాయికి చంద్రబాబు వచ్చేశాడు 03:56 PM, May 7th, 2024తిరుపతి: మమ్మల్ని తిట్టేందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతికి వస్తున్నారు: టీటీడీ చైర్మన్ భూమనఈ రోజు సాయంత్రం నాలుగ్గాళ్ల మండపం వద్ద బూతుల పంచాంగం వినిపించ బోతున్నారుఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి మాకు అధికారాన్ని కట్టబెట్టనున్నాయిటీటీడీ ఉద్యోగస్తులకు జగనన్న నా చేత చేయించిన మేళ్లు పట్ల అంతా సంతోషంగా ఉన్నారుదార్శనికుడు భూమన అభినయ్ తిరుపతిని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడు అనే నమ్మకం తిరుపతి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందిఅందరూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి, భూమన అభినయ్, గురుమూర్తిని గెలిపించాలని స్పష్టమైన అభిప్రాయం తో ఉన్నారుకానీ, కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మమ్మల్ని తిట్టడానికే సమయం సరిపోతోందిపవన్ కల్యాణ్కి ముప్పై కోట్ల రూపాయల డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నాడుఇలాంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతికి ఎలా మంచి చేస్తాడోఆరణి శ్రీనివాసులు గత కొంత కాలంగా మమ్మల్ని బూతులు తిట్టే పనిలో ఉన్నాడుఇప్పుడు తన కంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాగా తిడుతారని తిరుపతికి పిలిపిస్తున్నాడు శ్రీనివాసులు02:49 PM, May 7th, 2024విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గంలో ఆగని బోండా ఉమా కుమారుల అరాచకాలువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార ఆటో వాహనాన్ని అడ్డుకున్న బోండా ఉమా పెద్ద కుమారుడుసింగ్నగర్, నందమూరి నగర్లలో ప్రచార ఆటోలకు అడ్డంగా కారు పెట్టిన బోండా సిద్ధార్థ, బోండా ఉమా సోదరుడు బోండా శ్రీనుఆటోలో పెన్డ్రైవ్ను లాక్కున్న బోండా సిద్ధార్థ, శ్రీనువిషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులువైఎస్సార్సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగిన బోండా అనుచరులుఘటనా స్థలికి చేరుకున్న పోలీసులుఅజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు02:02 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం01:54 PM, May 7th, 2024ప్రధాని మోదీకి మంత్రి బొత్స కౌంటర్బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుంది: మంత్రి బొత్స కేంద్రంలో మా పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలి: మంత్రి బొత్సమోదీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు: మంత్రి బొత్సరైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు: మంత్రి బొత్సటీడీపీ, జనసేన, బీజేపీ తోడు దొంగలు: మంత్రి బొత్సఒకడు తానా అంటే ఇంకొకడు తందనా అంటున్నారు: మంత్రి బొత్సమోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదు.. అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోయారు: మంత్రి బొత్సఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి.. దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదు: మంత్రి బొత్సనా రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సమోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారు: మంత్రి బొత్సమోదీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సరాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపాం: మంత్రి బొత్స01:32 PM, May 7th, 2024కూటమిది దుర్మార్గపు ఆలోచన: ఏపీ మంత్రి బొత్స2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చింది మేము అడ్డుకోలేదుకూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలిటీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయిఎన్నికలు అయిన వెంటనే.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయికూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్తారుచంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయిఒక వేలు నువ్వు చూపిస్తే.. మిగిలిన వేళ్ళు నిన్ను చూపిస్తాయని మర్చిపోవద్దు బాబుబాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారుచంద్రబాబుది మనిషి పుట్టుకేనా..?చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉందిఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదుఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగనించాలిరైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంధక రైతులు నష్టపోతే బాద్యులు ఎవరు..?రీయంబర్స్ మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాద్యులు ఎవరు?వీటన్నింటికి కూటమే బాధ్యత వహించాలిపింఛను లబ్ధిదారులు కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఓపిక పట్టండి15 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవుభవిష్యత్తులో హక్కుగా పథకాలు అందిస్తాంచంద్రబాబు ఏం చేసాడని ఉద్యోగస్తులు టీడీపీకి ఓటేస్తారు..బాబు ఉద్యోగస్తులను మోసం చేశారుఉద్యోగస్తులు ఎవరి పక్షాన ఉన్నారో జూన్ 4న తెలుస్తుంది 01:11 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాం.హోం ఓటింగ్ కు 28,000 మంది దరఖాస్తు చేశారు.అత్యవసర సర్వీసులు కింద 31,000 మందికి అవకాశం ఇచ్చాంపోలీసులు 40,000,ఇతరులు కలిపి మొత్తం 4,30,000 మంది ఉన్నారు.3,03,000 మంది ఇప్పటివరకూ ఓటు వేశారుపలు కారణాల తో ఓటు వేయలేని వారి కోసం ఈ రోజు,రేపు మరో అవకాశం ఇచ్చాంఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారి సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవచ్చుపోస్టల్ బ్యాలెట్ వేసే వారికి నగదు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందిఉద్యోగులు నగదు తీసుకోవడం చాలా దారుణంపశ్చిమ గోదావరి లో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేశాం01:08 PM, May 7th, 2024ఎన్నికలప్పుడే బాబుకు కాపులు గుర్తొస్తారు: కాపు నేత అడపా శేషుడీబీటీ ద్వారా ఇచ్చే నిధులను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పథకాలు నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు.ఎన్నికల కమిషన్ చంద్ర బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోందికల్లబొల్లి కబుర్లు చెప్పే చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని తిరుగుతున్నాడు.పేదలకు పథకాలు అందడం టీడీపీకి ఇష్టం లేదుపథకాలు ఇళ్లకు చేరకుండా ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెస్తున్నారు.ఉన్నత వర్గాలకు పవన్ కళ్యాణ్, చంద్ర బాబు దోచిపెట్టడానికి మళ్ళీ సిద్ధం అయ్యారు.పవన్ కల్యాణ్ చివరికి చంద్రబాబు రాజకీయ క్రీనిడలో బలిపశువు అయ్యారు.కాపులు ఎదగడం పవన్ కల్యాణ్ , చంద్రబాబులకు ఇష్టం లేదు.కాపుల్లో ముద్రగడ, వంగవీటి మోహనరంగా కుటుంబాన్ని నాశనం వ్యక్తి చంద్రబాబు.ఒకవైపు వంగవీటి రాధని, మరోవైపు పవన్ను అడ్డుపెట్టుకుని కాపులను మోసం చేస్తున్నారు.ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులు గుర్తుకు వస్తారుపేదలకు సెంట్ భూమి ఇవ్వని చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి మాట్లాడే అర్హత లేదు.01:04 PM, May 7th, 2024ఈసీ ఎవరి కోసం పని చేస్తున్నట్లు?: MLC లేళ్ల అప్పిరెడ్డిఏపీలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందిఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారుఇంకొకపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారుఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు?అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుందిఅదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పిందికానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోందిఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెళ్ళకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారుచంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారువాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారుచంద్రబాబు ట్రాప్ లో పడవద్దని ఈసీకి హితవు పలుకుతున్నాంల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్ నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?12:48 PM, May 7th, 2024ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ షాక్టీడీపీ వీడి వైస్సార్సీపీలో చేరిన 50 మంది టీడీపీ కార్యకర్తలుపార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్12:43 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• క్రమం తప్పకుండా ఇన్ని రోజులు పథకాలిచ్చిన జగన్కు ఇప్పుడే ఇబ్బందులు..• మీ బిడ్డ జగన్ను ఇబ్బందులు పెడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా?• ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు చేస్తున్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పండి..• వీళ్లు ఎవ్వరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు..• జూన్ 4న అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో ఈ బటన్లన్నీ క్లియర్ చేస్తాం..12:36 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• చంద్రబాబు ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారు..• జగన్ను బటన్లు నొక్కిన పథకాల సొమ్మును ప్రజలకు అందకుండా చేస్తున్నారు..• జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసేలా ప్రజాస్వామ్యం దిగజారిపోయింది..• ఆన్గోయింగ్ స్కీమ్స్ కు మాత్రమే జగన్ బటన్లు నొక్కాడు.. అవేమీ కొత్తవి కాదు..• అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఈ పథకాలకు ఆమోదం కూడా తెలిపారు..• జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితిరాజానగరంలో సీఎం జగన్ పూర్తి ప్రసంగం కోసం క్లిక్ చేయండి 12:28 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• 2019లో బాబుపై ప్రతీకారంగా ప్రజలంతా సైకిల్ను ముక్కలుగా విరిచి పక్కకు పడేశారు• ఆ తుప్పు పట్టిన సైకిల్కు రిపేర్లు చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు• రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్లారు.. ఫలితం లేదు• దత్తపుత్రుడి సైకిల్ క్యారేజ్పై మాత్రమే కూర్చుంటా.. టీ గ్లాస్ పట్టుకుంటా అన్నాడు• ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీ పంపించాడు.. అక్కడి మెకానిక్స్ను ఇక్కడికి దింపారు• ఢిల్లీ మెకానిక్స్ అంతా ఏపీకి వచ్చి తుప్పుపట్టిన సైకిల్ చూశారు• సైకిల్కు హ్యాండిల్, సీటు, పెడల్స్, చక్రాలు లేదని ఢిల్లీ మెకానిక్స్ గుర్తించారు• ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగుచేస్తామని ఢిల్తీ మెకానిక్స్ అడిగారు• చంద్రబాబు పిచ్చి చూపులు చూసి బెల్ ఒక్కటే మిగిలిందని కొట్టడం మొదలు పెట్టాడు• చంద్రబాబు కొడుతున్న ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో 11:49 AM, May 7th, 2024బోండా ఉమా కొడుకి దౌర్జన్యంYSRCP ఎస్సీ మహిళా కార్యకర్తల పై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా కుమారుడు దాడి ప్రచారం చేస్తున్న వైస్సార్సీపీ మహిళా కార్యకర్తలను దుర్భాషలాడిన బోండా కుమారుడు రవితేజ.నున్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుబాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ,ఎమ్మెల్సీ రుహుల్లాతన ఓటమి ఖాయమని బొండా ఉమా తెలుసుకున్నాడు: వెలంపల్లి శ్రీనివాసరావుగెలుపు కోసం అరాచకాలకు పాల్పడుతున్న బోండా వర్గీయులుప్రజాభిమానం కోల్పోవడంతో గుండాగిరిని నమ్ముకుంటున్న టీడీపీసెంట్రల్ నియోజకవర్గంలో వైసిపి పై టీడీపీ చేసిన రెండో దాడిటీడీపీని చీదరించుకుంటున్న ఓటర్లువైస్సార్సీపీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ.దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు 11:37 AM, May 7th, 2024జననేత కోసం జనంఎన్నికల ప్రచారంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండకు చేరుకున్న సీఎం జగన్సీఎం జగన్ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కార్యకర్తలుమరి కొద్దిసేపట్లో సభ స్థలానికి చేరుకున్న సీఎం జగన్హెలిపాడ్ నుండి సభాస్తలికి మధ్య కిలోమీటర్ రోడ్డు షోసీఎం జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి బారులు తీరిన అభిమానులు11:11 AM, May 7th, 2024పచ్చ కుట్రలు! ఏపీ కోర్టులో పిటిషన్అమల్లో డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులువిద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై కోర్టుకు ఎక్కిన విద్యార్థులు, రైతులుచేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యుల పిటిషన్లంచ్ మోషన్ కింద విచారించనున్న ఏపీ హైకోర్టుచంద్రబాబే ఇలా చేయించాడని మండిపడుతున్న లబ్ధిదారులు11:02 AM, May 7th, 2024షర్మిలపై కేసు నమోదుఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పై కేసు నమోదైంది. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసు ప్రస్తావన కేసు నమోదు చేసిన వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల షర్మిలను ఆదేశించిన కడప కోర్టు10:32 AM, May 7th, 2024నంద్యాలలో టీడీపీ శ్రేణుల బరితెగింపుబనగానపల్లె పట్టణంలో బరితెగించిన టీడీపీ నాయకులువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార రథం తిరగొద్దు అంటూ టీడీపీ నాయకులు బెదిరింపులు బనగానపల్లె పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల మీద టీడీపీ శ్రేణుల జులుంవైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సతీమణి కాటసాని జయమ్మ, కోడలు మేధా శ్రీ రెడ్డిఅదే సమయంలో కూరగాయల మార్కెట్ లో ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డివైఎస్సార్సీపీ ప్రచార రథాలు ఇక్కడ తిరగొద్దంటూ గొడవగాయపడ్డ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలింపు10:29 AM, May 7th, 2024మరోసారి పేదల గొంతు నొక్కిన చంద్రబాబు!ఈసీకి ఫిర్యాదులు చేసిన చంద్రబాబు.ఇప్పటివరకూ కొనసాగుతున్న సంక్షేమ పధకాలైన వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్లకు ఈసీ బ్రేక్మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్ర.పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా చంద్రబాబుకి ఎంత కడుపుమంటో చూడండి!పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదలకి ఇప్పుడు అందుతున్న ఏ సంక్షేమ పథకం కూడా అందదు!పేదవాళ్లంటే నీకు ఎందుకు అంత కడుపుమంట చంద్రబాబూ?10:19 AM, May 7th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. TDPకి ఏపీ బీజేపీ షాక్ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఏపీ బీజేపీ!ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై బీజేపీ హాట్ కామెంట్స్దేశంలో భూహక్కుల పరిరక్షణకోసం నీతి అయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కు తప్పుడు భాష్యం చెప్పడం ద్వారా సాధించేమీ లేదుఎన్నికల వేళ ఇలాంటివి సృష్టించడం వల్ల కూటమికి ప్రయోజనం కంటే నష్టమే జరుగుతుందని విజ్ణులు గుర్తించాలికూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టం అమలు చేయాల్సి ఉంటుందిఎక్స్ లో ట్వీట్ చేసిన బీజేపీ సీనియర్ నేత లక్ష్మిపతిరాజు10:00 AM, May 7th, 2024మొన్న వృద్ధుల కడుపు.. ఇవాళ రైతుల కడుపు కొట్టిన చంద్రబాబుచంద్రబాబు మొన్న వృద్ధుల కడుపు కొట్టాడు.. ఇప్పుడు రైతుల కడుపు కొట్టాడు..రైతుల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ఫీజు రియంబర్స్ రాకుండా అడ్డుకుని విద్యార్థులను రోడ్డున పడేశాడు..ఇంటికొచ్చే పింఛను చంద్రబాబు అడ్డుకున్నారు.. చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు..కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి 420.. అయన చేయని అక్రమాలు లేవు..ప్రభుత్వ భూముల కబ్జా దగ్గర నుంచి.. బ్లాక్ మెయిలింగ్ దాకా ఆయన సిద్ధహస్తుడుతెలుగుదేశం పార్టీ కుట్రలపై కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫైర్9:49 AM, May 7th, 2024ఏపీలో ఈసీ పని తీరుపై వైస్సార్సీపీ ఆగ్రహంకొనసాగుతున్న పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణలెఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా నిధుల విడుదలకు నోఈసీ అనుమతి ఇవ్వకపోవడం ఏంటి?: YSRCPతెలంగాణలో సబ్సిడీ ఇన్ఫుట్కు అనుమతి ఈసీ ఎలా ఇచ్చింది అంటూ ప్రశ్నఏపీలో మాత్రమే ఈసీ ఎందుకు వివక్ష చూపుతోంది9:39 AM, May 7th, 2024అన్నమయ్య రాజంపేటలో టీడీపీకి ఎదురుదెబ్బఅన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ...టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన వంద కుటుంబాలుతెలుగు తమ్ముళ్లకు YSRCP కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి అకేపాటి అమరనాథ్ రెడ్డిజగనన్న అందిస్తున్న జనరంజక పాలన మెచ్చి వైఎస్సార్సీపీలో చేరామన్న స్థానికులు9:23 AM, May 7th, 2024డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ నేతపెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ వద్ద నగదుతో దొరికిన టీడీపీ నేతటీడీపీ నేత దంతులూరి వెంకట దుర్గ ప్రశాంత్ వర్మ నేతృత్వంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రధాని మోదీ సభకు జనాలను తరలించిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు!జనాలకు నగదు పంపిణీ చేయడానికే తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులుతనిఖీల్లో వర్మ వద్ద లభించిన రూ.10 లక్షలకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో సీజ్ చేసి పెందుర్తి పోలీసులకు అప్పగింత8:50 AM, May 7th, 2024జనంలోకి జగన్ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినేడు మూడు జిల్లాల్లో ప్రచార భేరీరాజమండ్రి రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ జంక్షన్లో ప్రచారంమధ్యాహ్నం శ్రీకాకుళం ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ప్రచారంవిశాఖపట్నం లోక్సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గం గాజువాక సెంటర్లో ప్రచారం8:23 AM, May 7th, 2024నేడు పవన్ ప్రచారం ఇలా..ప్రకాశం దర్శిలో పవన్ కల్యాణ్ ప్రచారంసాయంత్రం తిరుపతిలో చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్న పవన్8:01 AM, May 7th, 2024హవ్వా.. ఇదేంది బాబూ!తీవ్రరూపం దాల్చిన చంద్రబాబు బూతు పురాణంపూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న చంద్రబాబుతనను ప్రజలు నమ్మట్లేదని ప్రచారంలో బూతుల పర్వం అందుకున్న టీడీపీ అధినేతసీఎం జగన్ ను కొట్టండి అనే దగ్గర నుంచి.. ఇప్పుడు చంపండి, నరకండి అనే స్థాయికి చేరిన చంద్రబాబుఓటమి భయంతో చంద్రబాబుకు మతి చెడిందన్న అనుమానంలో ప్రజలుబాబు బూతు పురాణంపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైస్సార్సీపీచంద్రబాబుపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఎన్నికల కమిషన్7:25 AM, May 7th, 2024తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్.. కీలక ఆదేశాలుసోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీమహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలినిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక. 6:59 AM, May 7th, 2024చిలకటూరిపేట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. ఈసీ సీరియస్ చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు6:45 AM, May 7th, 2024చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహంఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు6:37 AM, May 7th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!6:30 AM, May 7th, 2024అబద్దం.. వాస్తవంఎన్నికల వేళ కూటమి కుట్రలుఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలువాస్తవాలతో వివరించే యత్నం వీడియో పోస్ట్ చేసిన వైస్సార్సీపీమన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥#FactCheck#ProgressiveAP#YSJaganDevelopsAP #DevelopmentInAP pic.twitter.com/G2KbNXK9Pl— YSR Congress Party (@YSRCParty) May 6, 2024 -
AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
హైదరాబాద్, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేని రీతిలో ఈ దఫా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. సంక్షేమాభివృద్ధిలు, సామాజిక న్యాయం అజెండాగా అధికార వైఎస్సార్సీపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడకముందే ప్రచార క్షేత్రంలోకి దిగింది. మరోవైపు.. పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు గందరగోళం నడుమ అయోమయంగానే సాగుతోంది కూమిటి పార్టీల ప్రచారం.ఏపీలో ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5గం. ప్రచార పర్వం ముగియనుంది. మే 13వ తేదీన(సోమవారం) ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ చివరి నాలుగు రోజుల్లో ప్రచారం హోరెత్తె అవకాశాలున్నాయి.ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లతో సంబంధం లేకుండా.. ఏడాది కిందటి నుంచే వైఎస్సార్సీపీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అభ్యర్థుల ఎంపిక.. అందునా సిట్టింగ్లలో ఎవరెవరిని తప్పిస్తారనేది ముందు నుంచే చెబుతూ పార్టీని, పార్టీ శ్రేణుల్ని మానసికంగా సిద్ధం చేస్తూ వచ్చారు. అందుకే సిట్టింగ్లలో కొందరికి సీట్లు దక్కకపోయినా.. పార్టీ కేడర్ మాత్రం ఎక్కడా చెక్కుచెదరలేదు. ఆ వెంటనే సిద్ధం సభలతో పార్టీకి ఉన్న అశేష ప్రజాదరణను దేశం మొత్తానికి చూపించిన సీఎం జగన్.. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేపట్టారు.ఇక బస్సు యాత్ర ముగిసిన వెంటనే కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో.. మరోవైపు జగన్ కోసం సిద్ధం పేరిట మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి తమ విశ్వసనీయత ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో.. సీఎం జగన్ కేవలం తన పరిపాలన గురించి, చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకే సీఎం జగన్ ప్రచారం ఏ రూపంలో ఉన్నా సరే.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఇక కూటమి పార్టీల ప్రచారానికి ప్రజా స్పందనే కరువైంది. ఒకవైపు ఎన్నికల ప్రచార సభలకు జనం లేక వెలవెలబోతుంటే.. పిల్ల కాలువను సముద్రంలా చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా ఆపసోపాలు పడుతోంది. యువగళం, ప్రజాగళం, వారాహి.. నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఎవరికి వారే సభలు పెట్టినా.. ఆఖరికి అంతా కలిసి ఉమ్మడిగా సభలు నిర్వహించినా.. జనం ఆసక్తి చూపించడం లేదు. ఆఖరికి.. సూపర్సిక్స్ ల్యాంటి గిఫ్ట్ ప్యాక్లతో ఎరవేసే యత్నం చేసినా.. ఛీ కొట్టేస్తున్నారు. కూటమి పార్టీల ప్రధాన నేతలు ప్రచారంలో జనాకర్షణ కోసం చెమటోస్తున్నారు.ప్రస్ట్రేషన్తో చంద్రబాబు ప్రజాగళం సాగుతోంది. తన హయాంలో జరిగిన ఇది అని చెప్పలేకపోతున్నారు, ప్రజల్లో సెంటిమెంటును ఎమోషన్ను రెచ్చగొట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తనకు అధికారం వస్తే ఇలా చేస్తానని ఇవి అమలు చేస్తానని చెప్పుకోలేకపోతున్నారు. ఇక ఊగిపోతూ పవన్ చేస్తున్న ప్రసంగాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అసలు ప్రచారం చేస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పూర్తిగా దూరం ఉండిపోయారు. ఇంకోవైపు వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చే కుట్రలో భాగంగా సీఎం జగన్ను.. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు ఏపీ పీసీసీ చీఫ్, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల. ఇక్కడ కాంగ్రెస్ ప్రచారం చెప్పుకోవడం వేస్ట్.కూటమిలో బీజేపీ కూడా ఉండడంతో.. చివరి నాలుగు రోజుల్లో ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారంలోకి దిగనున్నారు. మోదీ, అమిత్ షాలు ప్రచారం చేయనున్నారు. మొత్తంగా చూసుకుంటే.. ఏపీ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంతంగా ప్రతిపక్ష కూటమి ప్రచారం అయోమయంగా, గందరగోళంగా సాగుతుండగా, ఒక షెడ్యూల్ ప్రకారం క్లారిటీతో వైఎస్సార్సీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. -
ప్చ్.. పవన్ మెడలు వంచిన చంద్రబాబు
మన్యం, సాక్షి: పాపం.. పవన్ కల్యాణ్ జనసేనకు దక్కిన 21 సీట్లకు కూడా అభ్యర్థులకు దిక్కులేక ఎంత సతమతం అవుతున్నారో!.. ఇది ఏపీ ప్రజల్లో కొందరి అభిప్రాయం. కానీ, చంద్రబాబు నాయుడి రాజకీయాలు అర్థం చేసుకునేవాళ్లెవరైనా పవన్ను పాపం అని కాదు కదా.. ఛీ కొట్టి తిరస్కరిస్తారు. పాలకొండ అభ్యర్థి విషయంలో రాత్రి పూట పవన్ చేసిన ప్రకటనే ఇందుకు కారణం. చంద్రబాబు నాయుడు రాజకీయం ఎంత ఘోరంగా ఉంటుందో ఈ దఫా ఎన్నికల టైంలో స్పష్టంగా కనిపిస్తోంది. పేరుకు పొత్తు, కూటమి అంటూ ఇటు జనసేనకు, అటు బీజేపీకి సీట్లు ఇచ్చారే గానీ, ఆ సీట్లలో కూడా తన వాళ్లనే పోటీ చేయిస్తున్నారు. కాకపోతే.. వారికి సైకిలు గుర్తు ఉండదు. బీజేపీ, జనసేన బీఫాంల మీద పోటీకి దిగబోతున్నారు.. అంతే! బీజేపీలో, జనసేనల అభ్యర్థుల జాబితాను చంద్రబాబు దాదాపుగా తన మనుషులతో నింపేశారు. ఈ క్రమంలో ఆ రెండు పార్టీల్లో మొదటి నుంచి ఉన్న సీనియర్లకు అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. బీజేపీ అభ్యర్థుల్లో.. ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, రోషన్న, సీఎం రమేష్ లాంటివాళ్లే కాకుండా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చంద్రబాబు మనిషేనని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇది చాలదన్నట్లు పురంధేశ్వరి పేరు చెప్పుకుని.. రూ. 3 కోట్లు ఇస్తే సీటు వదిలేస్తానని టీడీపీ నేతకు ఓ బీజేపీ నేత ఆఫర్ ఇచ్చినట్టు ఓ ఆడియో లీక్ కావడం, బీజేపీ-టీడీపీ చీకటి ఒప్పందాలకు ఊదాహరణ అనే చెప్పొచ్చు. ఇది చాలదన్నట్లు మరికొన్ని చోట్లా అభ్యర్థుల్ని మార్చుకునేందుకు ఆ రెండు పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. మరోవైపు జనసేన పరిస్థితి ఇంతే!. దక్కిన 21 సీట్లలోనూ అభ్యర్థుల్ని నింపేందుకు పవన్ తెగ ఇబ్బంది పడిపోయారు. పవన్లోని ఆ గందరగోళాన్ని చంద్రబాబు ఎంచక్కా క్యాష్ చేసుకున్నారు. ఒకవైపు వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన వంశీకృష్ణ యాదవ్, అరణి శ్రీనివాసులకు టికెట్లు ఇవ్వడం కూటమిలో మంట రాజేసింది. ఇది చాలదన్నట్లు భీమవరం, అవనిగడ్డ, ఇప్పుడు పాలకొండకు టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థుల్ని ఖరారు చేయడం, ఈ మధ్యలో రైల్వే కోడూరు అభ్యర్థిని తప్పించి మరీ టీడీపీ మనిషి అయిన అరవ శ్రీధర్కు టికెట్ ఇవ్వడం చూస్తే చంద్రబాబు పవన్ మెడల్ని ఏమేర వంచి తాను అనుకున్నది చేశారో స్పష్టం అవుతోంది. వాస్తవానికి పాలకొండ విషయంలో మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు తనయుడు జయకృష్ణ ఎంపిక జనసేన శ్రేణుల్ని ఏమాత్రం సహించని విషయమే. ఎందుకంటే.. గతంలో పోటీ చేసిన ప్రతీసారి ఆయన విజేతలకు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఈసారి టీడీపీ తరపున టికెట్ ఆశించారు. అదే సమయంలో పడాల భూదేవీ కూడా పోటీ చేయాలనుకున్నారు. కానీ, పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లడంతో.. ఈ ఇద్దరూ అందులో చేరి టికెట్ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఈలోపు జనసేన నాగేశ్వరరావుకు మంగళగిరి నుంచి పిలుపు రావడంతో జనసేన శ్రేణులు తమ అభ్యర్థే పోటీ చేయబోతున్నట్లు సంబురాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. చివరకు.. బాబు కుట్ర రాజకీయమే ఫలించి టీడీపీ నుంచి చేరిన జయకృష్ణకే టికెట్ దక్కింది. పోటీ చేయడానికి జనసేనలో సరైన అభ్యర్థులే లేరా?.. తెలుగుదేశం వారిని జనసేనలో చేర్చుకుని మరీ వారికి పవన్ టికెట్లు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని జనసేన నేతలు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థిత్వానికి విపరీతమైన కాంపిటీషన్ ఉన్నదని చెబుతూ.. ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించడం టైం పాస్ వ్యవహారమేనని పవన్ చేష్టలతో ఇప్పుడు అర్థమవుతోంది కదా!. -
పవన్తో పని చేసినందుకు అసహ్యం వేస్తోంది: పోతిన మహేష్
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడలో కూటమికి భారీ షాక్ తగిలింది. జనసేనకు షాక్ ఇస్తూ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జి పదవికి పోతిన వెంకట మహేష్ ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ఆవేశంలోనో.. సీటు రాలేదోనో తాను జనసేన పార్టీకి రాజీనామా చేయలేదన్న.. భవిష్యత్తు ఇచ్చేవాడు నాయకుడని, పవన్ను నమ్మి అడుగులేసి తామంతా మోసపోయామని పోతిన మహేష్ ఆ లేఖలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై జనసేనలోని నా బాధ్యతలకు, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశాను నేను అవేశంతోనో, సీటు రాలేదనే అసంతృప్తితోనో మాట్లాడట్లేదు భవిష్యత్తుకు ఇచ్చేవాడే నాయకుడు.. నటించేవారు నాయకుడు కాలేదు రాజకీయాల్లో నటించేవారు నాయకుడు కాలేదు పవన్ కల్యాణ్ను నమ్మి అడుగులు వేశాను కొత్తతరం నాయకత్వం కోసం గుడ్డిగా అడుగులు వేశాం పవన్ కల్యాణ్ మార్పు తీసుకొస్తాడని నమ్మాం 2014లో పోటీ చేయకపోయినా, 2019లో ఒక్క సీటు గెలిచిన 2024పై ఆశలు పెట్టుకున్నాం జరుగుతున్నది, జరిగింది అర్థం కాక పిచ్చెక్కింది అయినా పవన్ కల్యాణ్లో స్పందన లేదు రాష్ట్ర ప్రజలకు, కాపు యువతకు , నాలాంటి కొత్తతరం నాయకులకు పవన్ సమాధానం చెప్పాలి పవన్ కల్యాణ్ నిజ స్వరూపం అందరూ తెలుసుకోవాలి మేడిపండు చూడ మేలిమి ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు.. లాంటి వ్యక్తి పవన్ కల్యాణ్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ఇన్నేళ్ళు ప్రయాణం చేసినందుకు మామీద మాకు అసహ్యం వేస్తుంది పార్టీ నిర్మాణం, క్యాడర్ పై పవన్ దృష్టి సారించలేదు అన్నీ తాత్కాలికం.. అంతా నటన.. నమ్మి నట్టేట మునిగిపోయాం ప్రజలు జనసైనికులకంటే తెలివైనవారు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు ప్రజలకు అర్థం కావట్లేదు అనుకున్నాం ఎంత చెప్పినా ప్రజలకు జనసేన పట్ల నమ్మకం రాలేదు 25 కేజీల బియ్యం కాదు.. 25 ఏళ్ల భవిష్యత్తు కావాలనే పవన్ కళ్యాణ్ కనీసం 25 సీట్లలో పోటీ చేయలేకపోయారు 25రోజుల తర్వాత పార్టీ భవిషత్తు చెప్పగలరా? 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకు, జనసేనకి ఏం భవిషత్తు ఇవ్వగలరు పవన్ స్వార్ధానికి మా కుటుంబాలు బలైపోతున్నాయి పార్టీలో మీకు తెలియకుండా అన్నీ జరుగుతున్నాయని భ్రమ పడ్డాం కానీ అన్నీ మీకు తెలిసే అన్నీ జరుగుతున్నాయి పవన్ కల్యాణ్ చూపులో ద్వంద అర్థాలు ఉన్నాయి సీట్లన్నీ తెలుగుదేశం నాయకులకే కేటాయించారు గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు మీకోసం నిలబడతారా? జనసేన ఎందుకు పెట్టారు.. ఏం ఆశించి పెట్టారు.. అసలు జనసేన ఎవరికోసం పెట్టారు? పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టారని తెలుస్తోంది అన్నీ ఆధారాలను బయటపెడతాను కాపు యువతను బలి చేయొద్దని కన్నీటితో అభ్యర్ధిస్తున్నా మీరు మా గొంతు కోస్తున్న నొప్పి తెలుస్తుంది మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకుంటే, మీరు ఆస్తులు కొనుక్కున్నారు మా రక్తమాంసాలపై మీరు భవంతులు కట్టుకున్నారు కాకినాడ మేయర్ సరోజ, శేష కుమార్, విశాఖలో మహిళా నాయకురాలికి మాత్రమే పదవులు పొడిగించారు మీ గురించి, పార్టీలో బ్రోకర్ పనులు బయట పెడుతున్నారనే భయంతోనే వాళ్ల పదవులు పొడిగించారు సుజనా చౌదరి(విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి) గతంలో బినామీ ఛానల్ లో మీ తల్లిని దూషించారు అలాంటి సుజనాకు మీరు టికెట్ ఎలా ఇప్పిస్తారు? సుజనా గెలుపులో మీరు ఎలా భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నారు కన్నతల్లిని విమర్శించి, పచ్చనోట్లు పడేస్తే అన్నీ మర్చిపోయారా? విజయవాడలో జనసేన జెండా లేదు.. గాజు గ్లాసు గుర్తు లేదు మేము బతికించిన పార్టీని మీరు చంపేశారు టీడీపీ వేసే కుక్క బిస్కెట్లు మనకి వద్దు అన్నారు.. ఇప్పుడు ఆ బిస్కెట్లు ఎందుకు తీసుకున్నారు జనసేనను సీట్లు అడగకుండా బీజేపీ ఎందుకు త్యాగం చేశారో చెప్పాలి బీజేపీ, టీడీపీని సీట్లు అడిగితే మీరు ఎందుకు ఇచ్చారు? పొత్తు ధర్మం బిజెపి, టీడీపీలకు లేదా, కేవలం జనసేనకు మాత్రమే ఉందా పొత్తు కుదిర్చితే ఎక్కువ స్థానాలు కోరుకోవాలి కదా.. ఎక్కువ సీట్లు సాధించాలి కదా! మీరెందుకు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించారు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన నుండి పోటీకి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా.. అన్ని పార్టీలు విధేయతకు పట్టం కట్టాయి కసాయివాడికి కనికరం ఉంటుంది.. మీపట్ల విధేయతతో ఉన్నందుకు కనీసం కనికరం లేదా? మీమనసు ఇంత పాషాణ హృదయం అని ఊహించలేదు 21 అసెంబ్లీ, 2ఎంపీల్లో ఏడు అసెంబ్లీ, ఒక ఎంపీ మాత్రమే జనసేన కోసం పనిచేసినవాళ్లకు ఇచ్చారు టీడీపీ నుండి వచ్చిన నేతలు జనసేనను టీడీపీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా? రాబోయే 12 నెలలో జనసేన అడ్రస్ గల్లంతు అవుతుంది జనసేన పార్టీ ప్రజారాజ్యం-2 అయి తీరుతుంది త్యాగాలకు బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకు పనికి రారా? మంగళగిరి, విజయవాడ పశ్చిమ బీసీల నుండి తీసుకుని కమ్మలకు ఇవ్వలేదా? పశ్చిమ సీటు బలహీన వర్గాలలో ముస్లింలకో, సోము వీర్రాజు లాంటి వారికి ఇవ్వచ్చుగా? పెట్టుబడిదారుడైన సుజనా చౌదరికి ఎందుకు ఇచ్చారు? పద్మశాలిలకు ఒక్కసీటు ఎందుకు కేటాయించలేదు? సుజనా స్థానంలో ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ దొరకలేదా? ఇదెక్కడి సామాజిక న్యాయం ? పవన్ కల్యాణ్ కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు రాజకీయ కుట్రలో భాగంగా కులాలకు కొమ్ము కాస్తున్నారు 21 సీట్లలో ఒక్క చోట కూడా కాపులు హర్షించలేదు పార్టీ భవిషత్తు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది కాపులు జనసెనకు దూరమయ్యారు.. పవన్ కి కాపులు మద్దతు ఇవ్వట్లేదు కులాల మధ్య కుట్రలకు తెరలేపారు గెలిచే భీమవరం స్థానాన్ని వదిలి పిఠాపురం ఎందుకు వెళ్ళారు భీమవరంలో టీడీపీ నాయకుడిని ఎందుకు తీసుకొచ్చి టికెట్ ఇచ్చావు సొంతఇల్లు కట్టుకోవడానికి భీమవరం ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని చెప్పిన మాట అవాస్తవం ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడివి అయ్యుండి వేరే పార్టీ నేత కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్? అనకాపల్లి సీటు ఎందుకు వదులుకున్నారు? అనకాపల్లిలో నాగబాబు వచ్చాక పారిశ్రామికవేత్తల దగ్గర ఫండ్స్ వసూలు చేశారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు.. అందుకే అక్కడినుండి వచ్చేశారు నాదెండ్ల మనోహర్ కు జనసేన అనే బస్సు ఇస్తే ఆయన పెద్ద కొండకు గుద్ది ముక్కలుముక్కలు చేసారు నష్టపోయింది మాత్రం మేము మేము చెప్పేది వినే ఓపిక లేనపుడు పార్టీ ఎందుకు పెట్టారు పొత్తు మరో పదేళ్లు కావాలా? ఇప్పుడు చంద్రబాబు ఆ తర్వాత, ఆ తర్వాత కూడా ఎవరు ముఖ్యమంత్రిని చేయాలో చెప్తే బానిసల్లా జెండాలు మొస్తాం నాదెండ్లా(నాదెండ్ల మనోహర్ను ఉద్దేశించి)... తెనాలి వస్తా, అక్కడే ప్రేస్మీట్ పెడతా నేను చెప్పేవన్నీ నిజాలే.. నాకు దేనికీ భయం లేదు చివరిగా నాకు ఓకే ఒక కోరిక.. పిఠాపురంలో మీ ఇల్లు గృహ ప్రవేశానికి అన్నా లేజినోవాతోనే రావాలి మీ నెల రోజులు పర్యటన షెడ్యూల్ కి ఏర్పాట్లు చేయండి జనసేన పార్టీ మొత్తం వాట్సాప్ లోనే నడుస్తుంది ‘‘కొత్తతరం నేతల్ని పవన్ తయారు చేస్తారని గుడ్డిగా అడుగులు వేశాం. 2019లో జనసేనకు ఒక్క సీటు వచ్చినా.. పవన్తో నడిచి భంగపడ్డాం. నటించేవాళ్లు ఎన్నటికీ నాయకులు కాలేరు. స్వార్థరాజకీయ ప్రయోజనాలు కలిగిన వ్యక్తి పవన్. అందుకే పార్టీ నిర్మాణంపైగానీ, కేడర్పైగానీ ఆయన ఏనాడూ దృష్టి పెట్టలేదు. ’’ అని పవన్కు పోతిన మహేష్ చురకలు అంటించారు. ఇదిలా ఉంటే.. జనసేనలో పోతిన తొలి నుంచి ఉన్నారు. పవన్ను నమ్ముకునే పార్టీలో కొనసాగుతున్నారు. గత ఐదేళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో జనసేన బలోపేతం కోసం ఎంతో కృష్టి చేశారాయన. ఈ క్రమంలోనే వెస్ట్ సీటుపై మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరకు టికెట్ కోసం పెత్తందారులతో పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. విజయవాడ వెస్ట్ సీటు కోసం మొదటి నుంచి ఆసక్తికర రాజకీయం నడిచింది. టీడీపీ నుంచి ఇద్దరు నేతలు సీటు కోసం యత్నించగా.. పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లొచ్చనే ప్రచారం తొలి నుంచి నడిచింది. దీంతో మహేష్ పవన్ నుంచి ఆ సీటు తనకేనని మాట తీసుకున్నారు. ఈ లోపు సీన్లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఏపీ బీజేపీ.. పొత్తులో భాగంగా ఆ సీటును తన్నుకుపోయింది. పవన్ ద్వారా చంద్రబాబు తన అనుచరుడు సుజనా చౌదరి(బీజేపీ)కి ఇప్పించుకున్నారు. అయినా కూడా మహేష్ సీటు కోసం ప్రయత్నించారు. పవన్పై చివరి నిమిషం వరకు నమ్మకం ప్రదర్శించారు. అయినప్పటికీ చివరకు.. వేల కోట్లున్న అగ్రవర్ణ నేత కోసం బీసీ నేత అయిన మహేష్ను పవన్ దగా చేశారు. పవన్ను నమ్మి తాను మోసపోయినట్లు మహేష్ ఇప్పుడు తన అనుచరుల వద్ద వాపోయారు. అధికారంలోకి వస్తే.. ఏదైనా పదవి ఇస్తామని పవన్ ఆఫర్ చేసినప్పటికీ మహేష్ అందుకు లొంగలేదని తెలుస్తోంది. పోతిన మహేష్ తదుపరి రాజకీయ అడుగులు ఎటు అనేది తెలియాల్సి ఉంది. -
ఏప్రిల్ 06: ఏపీ ఎన్నికల సమాచారం
April 6th AP Elections 2024 News Political Updates 09:06 PM, April 06 2024 షర్మిల వ్యాఖ్యలు.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కౌంటర్ తాను చేస్తోన్న ఆరోపణలపై షర్మిల ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రజలు కూడా షర్మిల విమర్శలను గమనించాలి జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఎలా బ్రహ్మరథం పట్టారో పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే ఎలాంటి స్పందన వచ్చిందో అందరు చూస్తున్నారు జిల్లా ప్రజలు ఎలా స్వాగతం పలుకుతున్నారో షర్మిల గమనించాలి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని మాట్లాడే విషయంలోను షర్మిల అత్మ పరిశీలన చేసుకోవాలి తెలంగాణాలో వైఎస్సార్ తెలంగాణా పార్టీ ఎలా ప్రారంభించారో.. తెలంగాణా నా సొంత ప్రాంతం అంటూ ఎలా మాట్లాడారో గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ను గతంలో ఎలా దుయ్యబట్టారో అందరికి తెలిసిందే వైఎస్సార్ కుమార్తెగా అమెను గౌరవిస్తున్నాం తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తామని అంటే చాలా సంతోషించాం కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడి నాయకులందరిని ముంచివేసింది 06:25 PM, April 06 2024 అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు: సీఎం జగన్ కావలి లో జన ప్రభంజనం కనిపిస్తోంది మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా.? మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఇది జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు పేదల పక్షాన ఉన్న మీ బిడ్డ జగన్ ఉన్నాడు పెత్తందార్ల పక్షాన ఉన్న చంద్రబాబు ఉన్నాడు మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా? అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు.! చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటీ లేదు ఎన్నికల ముందు మాత్రమే బాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది బాబు తన మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చలేదు మేనిఫెస్టో చూపించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా ? చంద్రబాబు మంచి చేసి ఉంటే మూడు పార్టీలతో పొత్తు ఎందుకు ? మోసాలు, వెన్నుపోట్లతో బాబు 14 ఏళ్లు సీఎం గా ఉన్నారు.! ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించా రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం మేనిఫెస్టో లోని 99 శాతం హామీలు నెరవేర్చాం ఇంటింటికి పౌర సేవలను డోర్ డెలివరీ చేయిస్తున్నాం లంచాలు, వివక్ష లేని వ్యవస్థను తీసుకొచ్చాం నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం నేను చేసిన మంచిలో కనీసం 10 శాతమైన బాబు చేశాడా ? చంద్రబాబును 4 నెలలుగా ప్రశ్నలు అడుగుతూ వచ్చా ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు బెంజ్ కారు, బంగారం ఇస్తానంటూ మభ్యపెడతాడు పేదవాడికి మంచి చేశానని ఏరోజైనా చంద్రబాబు చెప్పగలిగాడా? నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం ప్రతి గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్స్ పెట్టాం మహిళల రక్షణ కోసం దిశా యాప్ తీసుకొచ్చాం అవ్వాతాతల సంక్షేమం, మహిళా సాధికారత చేసి చూపించాం ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంధంగా భావించాం 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి పేదలకు ఈ మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి మరో ఐదేళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలి ఫ్యాన్ కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి 2014 లో ముగ్గురి ఫొటోలతో ముఖ్యమైన హామీలు ఇచ్చారు చంద్రబాబును పొరపాటున కూడా నమ్మొద్దు చంద్రబాబును నమ్మితే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లే రైతు రుణమాఫీ చేస్తానన్నాడు .. చేశాడా ? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు .. చేశాడా ? ఆడబిడ్డ పుడితే రూ . 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు .. చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు .. ఇచ్చాడా ? ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు .. ఇచ్చాడా ? రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు .. వేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు .. చేశాడా ? ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు ... నిర్మించాడా ? 04:42 PM, April 06 2024 చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అందుకే ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సీఎం జగన్ 1.60 లక్షల ఉద్యోగాలు కల్పించారని చంద్రబాబు అంగీకరించారు చంద్రబాబు వాలంటీర్ల వ్యతిరేకి చంద్రబాబు నిర్వాకం వల్లే పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు కష్టాలు పడ్డారు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం 04:28 PM, April 06 2024 ‘మార్గదర్శి’ పై కేసు నమోదు ద్వారక పోలీస్ స్టేషన్లో 188 సెక్షన్ల కింద కేసు ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.52 లక్షలు తరలింపు ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీం ఫిర్యాదు మేరకు కేసు మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న పోలీసులు మార్గదర్శి సితం పెట అకౌంట్ అసిస్టెంట్ వి. లక్ష్మణ్ రావు, ఆఫీస్ బాయ్ శ్రీను పై కేసు నమోదు 03:14 PM, April 06 2024 ఢిల్లీకి విశాఖ బీజేపీ నేతలు బీఎల్ సంతోష్ ను కలిసిన విశాఖ బీజేపీ నేతలు విశాఖ టికెట్ జీవీఎల్కు ఇవ్వాలని కోరిన నేతలు విశాఖలో బీజేపీ ని కాపాడాలని నేతల ఆందోళన జేపీ నడ్డాను కూడా కలవనున్న విశాఖ బీజేపీ నేతలు 01:45 PM, April 06 2024 అనకాపల్లి: ఎన్నికల కోసం జనసేన నేతల మద్యం దిగుమతి సోమలింగంపాలెం వద్ద గడ్డిమెట్లో దాచిన మద్యం పట్టివేత మద్యం విలువ రూ.90 లక్షలపైన ఉంటుందని అంచనా గోవా నుంచి తెచ్చిన మద్యంగా పోలీసుల నిర్ధారణ 01:30 PM, April 06 2024 పాలకొల్లులో రెండో రోజు చంద్రబాబు పర్యటన పశ్చిమ గోదావరి జిల్లాలోని కూటమి అభ్యర్థులు, ముఖ్యనేతలతో అంతర్గత సమావేశం ఎన్నికల సన్నద్ధత పై కూటమి అభ్యర్థులు, నేతలతో చర్చ మూడు పార్టీల నేతల మధ్య అంతర్గత సర్దుబాట్లపై దిశానిర్దేశం 01:25 PM, April 06 2024 రఘురామకృష్ణంరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఖరారు పాలకొల్లు సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరుల ఆందోళన చంద్రబాబు బయటకు రాకుండా హాలు ముందు బైఠాయించిన రామరాజు అనుచరులు ఉండి గడ్డ రామరాజు అడ్డ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ నినాదాలు 01:20 PM, April 06 2024 చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా కడపలో కిరాణా షాపులు బంద్ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ కిరాణా షాపుల్లో సరసమైన ధరలకు గంజాయి లభిస్తుందని వ్యాఖ్య 01:15 PM, April 06 2024 వైఎస్సార్సీపీలో చేరిన శెట్టిబత్తుల రాజాబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ అమలాపురం టికెట్ దక్కకపోవడంతో 3 రోజుల క్రితం జనసేనకు రాజీనామా చేసిన రాజాబాబు 12:58 PM, April 06 2024 చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్ని అబద్దాలైన ఆడగల వ్యక్తి చంద్రబాబు ఇప్పుడు వృద్ధులకు రూ. 4000 చొప్పున పెన్షన్ ఇస్తానని మరో అబద్ధం చెప్తున్నాడు 2014 ఎన్నికల అప్పుడు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి అమలు చేయలేదు వలంటీర్ వ్యవస్థ పై నిమ్మగడ్డ రమేష్ ద్వారా తప్పుడు ఫిర్యాదు చేయించాడు పెన్షన్ల కోసందూర ప్రాంతాలకు వెళ్లి మండుటెండలో అవస్థలు పడి కొంతమంది వృద్ధులు చనిపోయారు ఆ అవ్వ తాతల ఉసురు చంద్రబాబుకు తప్పదు చంద్రబాబు ఎన్ని అబద్ధాల హామీలు ఇచ్చిన తిరిగి సీఎంగా జగనే అవుతారు 12:42 PM, April 06 2024 వాళ్లు కాపులకు ఏం చేశారసలు?.. : ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు రబ్బరు చెప్పులు వేసుకున్న వారిని అసెంబ్లీకి తీసుకెళతానని పవన్ కల్యాణ్ మోసం చేశాడు చంద్రబాబు కు దాసోహం అంటూ 21 సీట్లు తీసుకున్నాడు బీజేపీలో ఉన్న ఒక్క కాపుకి కూడా చంద్రబాబు సీటు లేకుండా చేశాడు పవన్ కల్యాణ్ కోసం కాపు జాతి లేదు కాపుల కోసం పని చేసే ఎవరికైనా మద్దతు ఉంటుంది 31 సీట్లు కాపు లకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు బిజెపి ఒక్క సీటు ఇవ్వలేదు.. టీడీపీ కూడా కాపులకు న్యాయం చేయలేదు అందుకే.. కాపులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారు ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు వ్యాఖ్యలు 12:02 PM, April 06 2024 ప్రతీ పేదోడి గుండెల్లో జగన్: గుడివాడ అమర్నాథ్ ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారో అని పేద వాడు ఆలోచించడు అక్కడ పేద వాడికి కనిపించేది జగన్ మాత్రమే! మంచి చేసిన జగన్ కు మాత్రమే ఓటు వెయ్యాలని పేదవాడు అనుకుంటాడు సీఎం రమేష్ ఎక్కడి నుంచి అనకాపల్లికి వచ్చాడు సీఎం రమేష్ ఆధార్ కార్డు అడ్రెస్ చూడండి.. హైదరాబాద్ అడ్రెస్ ఉంటుంది సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు లోకల్ సీఎం రమేష్ ఎంపీ నిధులు అనకాపల్లిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా..? సీఎం రమేష్ బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకోడానికి వచ్చాడు.. పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదు సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమే కొణతాల, దాడి వీరభద్రరావుపైనా మంత్రి అమర్నాథ్ సెటైర్లు అనకాపల్లిలో రాజకీయ శత్రువులను నేను కలిపాను వారు ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలి అలాంటి వారు నామీద పడి ఏడుస్తున్నారు సీఎం జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యడం కోసం ఏదైనా చేస్తా 11:55 AM, April 06 2024 షర్మిల వ్యాఖ్యల్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా: ఎంపీ అవినాష్రెడ్డి కడప ఎన్నికల ప్రచారం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు స్పందించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అద్యక్షురాలు షర్మిల అన్నారు ఆ వ్యాఖ్యల్ని అమె విజ్ఞతకే వదిలేస్తున్నా ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉంది మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలి 11:49 AM, April 06 2024 టీడీపీ త్వరలో నామరూపాల్లేకుండా పోతుంది: వైవీ సుబ్బారెడ్డి సీఎం రమేష్ ఎక్కడి నుంచో వచ్చి ఉత్తరాంధ్రలో రౌడీయిజం చేస్తున్నారు సీఎం రమేష్ మార్క్ రౌడీయిజం మనకు కావాలా? సీఎం రమేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రాజ్యసభలో ఖాళీ అయినట్లే.. మిగతా మూడు చోట కూడా టీడీపీ ఖాళీ అవుతుంది ఎన్నికల తర్వాత నామారూపాల్లేకుండా పోతుంది 10:55AM, April 06 2024 కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకానా? టీడీపీ అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం బీజేపీతో అంతర్గత మార్పులపై చంద్రబాబు ఫోకస్ నరసాపురం, కడప ఎంపీ స్థానాలు ఇచ్చిపుచ్చుకునే యోచనలో టీడీపీ బీజేపీ మాడుగుల, చింతపూడి, మడకశిర, సూళ్లురుపేట, సత్యవేడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు? 10:37AM, April 06 2024 విశాఖలో జీవీఎల్ పోస్టర్ల కలకలం విశాఖలో బీజేపీ నేత జీవీఎల్ పేరిట పోస్టర్లు జన జాగరణ సమితి పేరిట ఆంధ్రాయూనివర్సిటీలో వెలిసిన పోస్టర్లు విశాఖ ఎంపీ సీటు జీవీఎల్కే కేటాయించాలంటూ సందేశాలు విశాఖ అభివృద్ధి కోసం పార్లమెంట్లో జీవీఎల్ గళం వినిపించారని.. ఆయనకే టికెట్ ఇవ్వడం న్యాయమంటూ పోస్టర్లపై రాతలు పొత్తులో భాగంగా ఇప్పటికే టీడీపీకి విశాఖ ఎంపీ సీటు విశాఖ బీజేపీకి వెళ్తే గనుక.. నరసాపురం కోరే ఛాన్స్ నరసాపురం ఓకే అయితే గనుక.. టీడీపీలో తాజాగా చేరిన రఘురామ కృష్ణంరాజుకు ఇచ్చే అవకాశం 09:48AM, April 06 2024 ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే: కేశినేని, దేవినేని అవినాష్ విజయవాడ పటమట లంక 14వ డివిజన్లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం కార్యక్రమం ప్రచారంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ నియోజకవర్గంలో దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కారం చూపిన దేవినేని అవినాష్: కేశినేని నాని స్క్రూ బ్రిడ్జి అండర్ పాస్ నిర్మాణానికి స్థానిక నాయకులు చేసిన కృషి అభినందనీయం: కేశినేని నాని జగన్ అందించే పథకాలు మాకు అందాయి అని ప్రతీ గడపలో చెబుతున్నారు: కేశినేని నాని నేదురుమల్లి నీ, ఎన్టీఆర్ నీ వెన్ను పోటు పొడిచింది చంద్రబాబును కాదా?: కేశినేని నాని చంద్రబాబు శిష్యులు కాబట్టే మంచి చేసే జగన్ ప్రభుత్వం పై కుక్కల్లాగా వాగుతున్నారు: కేశినేని నాని మేము మాటలు వ్యక్తుల కాదు చేతల ప్రభుత్వం లో వున్నాము: కేశినేని నాని టీడీపీ చిల్లర నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పని లేదు: కేశినేని నాని రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తోంది: దేవినేని అవినాష్ స్క్రూ బ్రిడ్జ్ అండర్ పాస్ పనులు ఎలా పూర్తి చేస్తారో అని ఎల్లో మీడియా లో విమర్శించారు: దేవినేని అవినాష్ అండర్ పాస్ పనులను త్వరితగిన పూర్తి చేస్తున్నాం: దేవినేని అవినాష్ నిస్సిగ్గుగా టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు: దేవినేని అవినాష్ రిటైనింగ్ వాల్ టిడిపి నిర్మిస్తే వరదలు ఏందుకు వచ్చాయో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పాలి: దేవినేని అవినాష్ ఓటమి భయంతోనే వ్యక్తి గత రోషణకు చేస్తున్న టీడీపీ నేతలు: దేవినేని అవినాష్ ప్రజలు అందరూ వైఎస్ఆర్సీపీ కి అండగా ఉన్నారు: దేవినేని అవినాష్ 09:15AM, April 06 2024 చంద్రబాబుకి బుద్ధి చెప్తాం: నెల్లూరు ప్రజలు నెల్లూరులో చింతా రెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్దకు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్కు స్వాగతం పలికేందుకు సిద్ధం జై జగన్ అంటూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పేందుకు అందరూ సిద్ధం అంటూ ప్రజల నినాదాలు 08:27AM, April 06 2024 నెల్లూరు సిద్ధమా?: సీఎం జగన్ ట్వీట్ నేడు ఉమ్మడి నెల్లూరులో సీఎం జగన్ బస్సు యాత్ర సాయంత్రం కావలిలో వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం బహిరంగ సభ ఇప్పటికే రాయలసీమలో బస్సు యాత్ర సూపర్ సక్సెస్ Day-9 నెల్లూరు జిల్లా సిద్ధమా…?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2024 07:54AM, April 06 2024 రాజమండ్రిలో బీజేపీ ఆఫీస్ ప్రారంభం నేడు రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటన బీజేపీ ఆఫీస్ను ప్రారంభించనున్న పురందేశ్వరి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నేడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొననున్న పురందేశ్వరి 07:32AM, April 06 2024 ఇవాళ పల్నాడులో చంద్రబాబు ప్రచారం పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం క్రొసూర్, సత్తెనపల్లి ప్రజా గళం బహిరంగ సభలు 07:17AM, April 06 2024 చుక్కాని లేని జనసేనాని విభజిత ఆంధ్రప్రదేశ్కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు. ఇప్పటికీ పార్టీ నిర్మాణం, ఒక సిద్ధాంతమంటూ లేకుండా పోయిన పవన్ కల్యాణ్ కొమరం భీం, వీరమల్లు, చేగువేరా, జన సైన్యం, వీర మహిళలు అంటూ భారీ భారీ డైలాగులు.. పేర్ల వాడకాలు బీజేపీ వంటి పార్టీ పక్షం వహించటం మరీ ఎబ్బెట్టు మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ అభిమానులతో నినాదాలు చేయించిన పవన్ తర్వాత 50–60 స్థానాలలో పోటీ అంటూ ప్రచారం ప్రభుత్వ ఏర్పాటులో పెద్ద చెయ్యి అని ప్రకటనలు చివరకు 21 సీట్లకు పరిమితం కావటంతో జనసేన శ్రేణులే.. అసలు పవన్ ఎందుకు పార్టీ పెట్టాడా? అని నిలదీతలు పైగా చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడనే విమర్శ పవన్పై 07:04AM, April 06 2024 నేడు 9వ రోజు మేమంతా సిద్ధం యాత్ర తొమ్మిదో రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగనున్న సీఎం జగన్ బస్సు యాత్ర సాయంత్రం కావలిలో సిద్ధం బహిరంగ సభ నిన్న యాత్రకు విరామం.. నెల్లూరు నేతలతో సీఎం జగన్ భేటీ ఇప్పటికే రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో పూర్తైన ఎన్నికల ప్రచార యాత్ర అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతూ సీఎం జగన్కు బ్రహ్మరథం పట్టిన వైనం పేదలే స్టార్క్యాంపెయినర్లుగా ప్రచారం దూసుకెళ్తున్న సీఎం జగన్ పాలనపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్తో పాటు సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న సీఎం జగన్ మేనిఫెస్టోలో మరింత మంచి జరిగేలా కొత్త పథకాలు ప్రవేశపెట్టే యోచన ప్రతీ సభలోనూ జరిగిన మంచిని వివరిస్తూ.. కూటమిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సీఎం జగన్ Memantha Siddham Yatra, Day -9. ఉదయం 9 గంటలకు చింతరెడ్డిపాలెం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 3 గంటలకు కావలి బైపాస్ దగ్గరబహిరంగ సభ జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/3oqaBoGJAU — YSR Congress Party (@YSRCParty) April 6, 2024 06:45AM, April 06 2024 షర్మిలపై మండిపడ్డ ఎమ్మెల్యే సుధా కడపలో పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారం షర్మిల ప్రచారంలో చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించిన బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా షర్మిల వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా విచారణ కోర్టులో జరుగుతుండగానే అవినాష్ రెడ్డి హంతకుడని షర్మిల మాట్లాడటం సమంజసం కాదు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా వైఎస్ వివేకానందరెడ్డి హత్య పట్ల అందరిలో బాధ ఉంది: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా గతంలో దివంగత వైఎస్అర్, వివేకానందరెడ్డిలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఇప్పుడు సిఎం వైఎస్ జగన్, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిలు ప్రజల సమస్యలు పరిష్కరిస్తు అండగా నిలుస్తున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేము ఎవరి ఇంటికి వెళ్లినా మా తమ్ముడు, మా అన్న అంటూ చెబుతున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా అలాంటి మంచి వ్యక్తులపై నిరాధార అరోపణలు చెయ్యడం దారుణం: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా చంపిన వ్యక్తి అప్రూవర్ గా మారి బయట తిరుగుతున్నాడు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా కోర్టులు ఇంకా తీర్పులు ఇవ్వాల్సి ఉంది: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఈలోపు తొందరపడి అవినాష్రెడ్డి మీద షర్మిల ఆరోపణలు చేయడం సరికాదు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా నా భర్త ఎమ్మెల్యేగా ఉండి చనిపోతే జగనన్న నన్ను తోబొట్టులా అదరించాడు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా రెండవ మారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా షర్మిల ప్రచారం చేసుకోకుండా ఏదొ పొలిటికల్ ఏజెండాను పెట్టుకుని మాట్లాడుతున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఇకనైనా ఇలాంటివి వదిలిపెట్టి ప్రచారం చేసుకొవాలి: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ప్రెస్ వ్యాఖ్యలు 06:30AM, April 06 2024 ఎల్లో మీడియాపై ఐపీఎస్ ఆఫీసర్ అసోషియేషన్ సీరియస్ చంద్రబాబు కోసం బరితెగించొద్దు! పచ్చమందకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వార్నింగ్ ‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయి ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం... ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం అందరిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ‘వీళ్లా ఐపీఎస్లు’ కథనంపై మండిపడ్డ చీఫ్ సెక్రటరీ.. పరువునష్టం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ తమ కౌంటర్ను ‘ఈనాడు’ బ్యానర్గా వెయ్యాలని డిమాండ్.. ఎల్లో మీడియా అడ్డగోలు కథనాలపై ఐఏఎస్, ఐపీఎస్ల అసంతృప్తి ఒక వర్గానికి కొమ్ముకాస్తారా: పౌర సంఘాల ధ్వజం రామోజీ, పచ్చ మీడియా రాతలపై ఈసీ, ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు ఈసీ నియామకాలపైనా ఎందుకు అక్కసు? ఎస్పీలను ఈసీ బదిలీ చేస్తే ఆహా ఓహో అని పొగడ్తలు.. అదే ఈసీ కొత్త ఎస్పీలను నియమిస్తే మాత్రం దు్రష్పచారం ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ.. రామోజీ జేబు సంస్థ కాదు.. ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లతో జాబితా పంపిన సీఎస్.. ఆ జాబితాను పరిశీలించి ఎస్పీలను నియమించిన ఈసీ చంద్రబాబు కోసం హద్దులు దాటుతున్న ఎల్లో మీడియా! ఐపీఎస్ అధికారులను కించపరిచేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి గత మూడు రోజులుగా వరుస కథనాలు సరైన ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాస్తుండటంపై ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సీరియస్ చంద్రబాబుకి తొత్తుగా మారిన ఎల్లో మీడియాపై ఇప్పటికే ఉమ్మేస్తున్న… pic.twitter.com/LaB6dcPczr — YSR Congress Party (@YSRCParty) April 5, 2024 సామాన్యులే మన పార్టీ కార్యకర్తలు!#YSJaganAgain#VoteForFan pic.twitter.com/UyO2f6gCUh — YSR Congress Party (@YSRCParty) April 5, 2024 -
చుక్కాని లేని జనసేనాని
విభజిత ఆంధ్రప్రదేశ్కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు. ఇప్పటికీ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు ఒక సిద్ధాంతం లేదు. పార్టీ నిర్మాణం లేదు. ఇవి చాలదన్నట్లు ఆయన కొమరం భీం, వీరమల్లు, చేగువేరా, జన సైన్యం, వీర మహిళలు అంటూ బీజేపీ వంటి పార్టీ పక్షం వహించటం ఎబ్బెట్టుగా కనిపిస్తున్నది. అది ఒకటైతే, మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ మాట్లాడి, తర్వాత 50–60 స్థానాలలో పోటీ, తద్వారా ప్రభుత్వంలో పెద్ద చెయ్యి అని ప్రకటించి, చివరకు 21 సీట్లకు పరిమితం కావటం తన పార్టీ వారికి, తన సామాజిక వర్గం వారికి కూడా ఇబ్బందికరంగా తయారైంది. చుక్కాని అంటూ లేని పార్టీ పరిస్థితి ఇంతకు భిన్నంగా ఉంటుందా?స్థాపించి నిండా పది సంవత్సరాలు గడిచినా తన సిద్ధాంతాలు ఏమిటో తెలియని రాజకీయ పార్టీ ఒకటి ఉందంటే నమ్మబుద్ధి కావటం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీకి అయినా సిద్ధాంతాలు, లక్ష్యాలు, విధానాలన్నవి చుక్కాని వంటివి. కానీ పవన్ కల్యాణ్ 2014లో స్థాపించిన జనసేన పార్టీకి నేటి వరకు కూడా ఒక సిద్ధాంత పత్రం ఏమీ లేదు. కనీసం ఎన్నికల సమయంలోనైనా వారు మేనిఫెస్టో ఏదీ ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్ చారిత్రకంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ దేశంలోని ప్రముఖ రాష్ట్రాలలో ఒకటి. అక్కడి అయిదు కోట్లమంది ప్రజలు అనేక రంగాలలో ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో కూడా క్రియాశీలంగా ఉన్న వివేకవంతులు. అటువంటి రాష్ట్రానికి సారథ్యం వహించగోరే ఒక పార్టీ ఇంత దారీ తెన్నూ లేని విధంగా సాగుతుండటం ఆశ్చర్యకరమైన విషయం. ఇటువంటివి ఆలోచించదగిన విషయాలనే స్పృహ అయినా ఆ పార్టీ అధ్యక్షునికి ఉందా అనే అనుమానం కలుగుతున్నది. పవన్ కల్యాణ్ అసలు పార్టీ ఎందుకు పెట్టినట్లు? పెట్టిన ఈ పదేళ్లుగా ఏమి చేసినట్లు? మునుముందు ఏమి చేయాలన్నది తన ఆలోచన? తన మాటలను, చేతలనుబట్టి చూస్తే రాజకీయ పరిశీలకు లకు ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు అయినా స్పష్టమైన సమాధానాలు కన్పించటం లేదు. ఆయన పార్టీ ప్రకటించిన 2014లో ఆంధ్రప్రదేశ్ ఒక పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడి పోయింది. విభజిత రాష్ట్రం అనేక వనరులను కోల్పోయింది. రాజ కీయ పార్టీలకు, సాధారణ ప్రజలకు కూడా కొత్త రాష్ట్రాన్ని తిరిగి ఏ విధంగా నిలబెట్టాలనేది ఒక పెద్ద సమస్య. అప్పటి పరిణామాలన్నీ వారికి మానసికంగా కూడా కొంత అయోమయాన్ని సృష్టించాయి. అటువంటి స్థితిలో ఏర్పడే ఒక కొత్త రాజకీయ పార్టీ తనదైన విధంగా సమాధానాలను వెతకాలి. వాటిని ఒక సిద్ధాంత పత్ర రూపంలో రూపొందించి ప్రజల ముందుంచాలి. ఆ మేరకు స్వయంగానూ, ఏకీ భావం గల ఇతర పార్టీలు, వర్గాలతోనూ కలిసి కార్యాచరణను చేప ట్టాలి. కానీ ఇటువంటిదేమీ చేయలేదు. నేటికీ చేయటం లేదు. ఇది ఒక కోణం కాగా, మరొక కోణాన్ని చూద్దాము. పవన్ కల్యాణ్ సామాజికంగా కాపు వర్గానికి చెందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో రెడ్లు, కమ్మల తర్వాత మూడవ బలమైన వర్గం. అయినప్పటికీ రాజకీయాధికారం తమకు లేకుండా పోయిందని, దానిని అందు కోవాలనే కోరిక వారిలో బలంగా ఎప్పటి నుంచో ఉంది. అందుకోసం గట్టి ప్రయత్నాలు మొదటిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో పి. శివశంకర్ ఆధ్వర్యాన జరిగాయి. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణల నుంచి కూడా ఈ సామాజిక తరగతులను కదిలించారు. ఆ ప్రయత్నాలు విఫల మయ్యాయి. తర్వాత చిరంజీవి రాకతో వారిలో తలెత్తిన ఆశలు కూడా ముందుకు సాగలేదు. ఇపుడు ఆ వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ను వారిలోని కొందరు తమ వాడు అనుకోవటం తప్ప ఆశాభావాలు గత రెండు విడతలలోనూ ఎంత మాత్రం కనిపించటం లేదు. అందుకు ఒక కారణం ఆయన... శివశంకర్, చిరంజీవి వంటి గౌరవ ప్రతిష్ఠలను, నమ్మకాన్ని సంపాదించు కోలేక పోవటం. రెండు – తనలో అటువంటి పరిణతిగానీ, దార్శనికత గానీ ఉన్నా యనే అభిప్రాయం ఆ వర్గం వారికి 2014లో గానీ, తర్వాత ఈ పదే ళ్లలోగానీ ఏర్పడక పోవడం. మూడు – ఒక పార్టీని సీరియస్గా నడిపే ఆలోచన, దక్షత, స్థిరత్వం, వ్యవహార ధోరణి అసలెప్పుడూ కన్పించక పోవటం. నాలుగు – పైన అనుకున్నట్లు తన సిద్ధాంతాలు, విధా నాలు, ప్రణాళికలు, ఆ ప్రకారం ఆచరణలు ఏమిటో అర్థం కాక పోవటం. అయిదు – సినిమాలలో కావలసిన కొన్ని లక్షణాలకు, సీరి యస్ రాజకీయాలకు అవసరమైన పద్ధతులకు మధ్య తేడా పాటించక తన విలువను తానే తగ్గించుకోవటం. దానితో, కాపులలోని యువతరానికి పవన్ కల్యాణ్ పట్ల ఇతర త్రానూ గల సినిమాటిక్ ఆకర్షణ రాజకీయ ఆకర్షణగా మారటం తప్ప, వారిలోని ఇతరులకు ఆయనపై తమనేదో ఉద్ధరించగలడనే ఆశా భావం ఏమీ కలగటం లేదు. గత ఎన్నికల ఫలితాలు ఇందుకొక స్పష్టమైన సూచన. గమనించదగినదేమంటే, ఒకవేళ ఆయన శివశంకర్, చిరంజీవిల వలె తమ సామాజిక వర్గాన్ని, ఇతర బడుగు, బల హీన వర్గాలను కూడదీసే ప్రయత్నం చేసినట్లయితే ఆంధ్ర రాజకీ యాలలో మూడవ ధ్రువం ఏర్పడే అవకాశం ఉండేది. వ్యక్తిగతంగా తనకు ఆ దార్శనికత, సమర్థత ఉన్నట్లు కనిపించదనేది వేరే విషయం. కానీ కనీసం సూత్రరీత్యా అటువంటి అవకాశం ఉండేది. ఈ పరిస్థితుల దృష్ట్యా పవన్ కల్యాణ్ గత పది సంవత్సరాలలో ఎటువంటి విలువనూ పెంచుకోలేక పోయారు. తనకు సంబంధించి అంతా సినిమాటిక్ గానే కనిపిస్తుంది. జనసేన అనే పేరు, కార్యకర్తలను సైనికులు అనటం, మహిళా సభ్యులను వీర మహిళలనటం, ఎక్కడైనా సమస్య కనిపిస్తే తోకచుక్క తెగిపడినట్లు వచ్చి హడావిడి చేసి మాయమవటం తప్ప అందుకు కొనసాగింపు లేకపోవడం, ప్రసంగాలలో దురుసుతనం, వీరాలా పాలు, అందుకు తగినట్లు సినిమా లలో వలెనే హావభావాలు. ఈ విధంగా, ఆంధ్రప్రదేశ్ వంటి ముఖ్య రాష్ట్రం ఒక పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటుండిన దశలో, ఒక సిద్ధాంతం, విధానాలంటూ లేకుండా ఒక పార్టీని నెలకొల్పటం, పదేళ్లయినా అదే పరిస్థితి ఉండటం, రాజకీయాధికారాన్ని కోరుకుంటున్న తన సామాజిక వర్గా నికి ఎటువంటి ఆశాభావాన్ని కల్పించలేక పోవటం, చివరకు పార్టీ నిర్వహణ సైతం గందరగోళంగా సాగుతుండటాన్ని బట్టి, పవన్ కల్యాణ్ జనసేన ఆంధ్రప్రదేశ్లో, నిజమైన అర్థంలో ఒక నికరమైన, స్థిరమైన, సీరియస్ రాజకీయ పార్టీ అనే గుర్తింపును, గౌరవాన్ని సంపా దించుకోలేక పోయింది. సిద్ధాంతాలు, లక్ష్యాల మాట ఇలా ఉంటే, జనసేన అధ్యక్షుని ఎన్నికల వ్యవహరణ ఏ విధంగా ఉన్నదో చూద్దాం. ఆయన రాష్ట్ర విభజనకు వ్యతిరేకి. కానీ ఆ విషయంలో డబుల్ గేమ్ ఆడిన టీడీపీ అ«ధ్యక్షుడు చంద్రబాబును 2014 ఎన్నికలలో బలపరిచారు. చంద్ర బాబు రైతాంగానికి, పేదలకు నష్టం చేసినందున 2004లో, 2009లో వరుసగా రెండుసార్లు ఓడిపోయిన వ్యక్తి. అదే విధంగా, రాష్ట్ర విభజ నను పూర్తిగా బలపరచిన బీజేపీతోపాటు అపుడు చంద్రబాబు వెంట నిలబడ్డారు. తర్వాత 2019 ఎన్నికలలో వామపక్షాలతో స్నేహం చేశారు. అప్పటికి అయిదేళ్లు రాజకీయం చేసినా, తన సామాజిక వర్గం పెద్ద సంఖ్యలోగల గాజువాక, భీమవరం స్థానాల నుంచి స్వయంగా పోటీ చేసి కూడా ఓడారు. అయిదేళ్లలో తన సిద్ధాంతాలేమిటో చెప్ప లేదు. సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం పేరిట తమ వారినీ ఒప్పించ లేక పోయారు. ఆ వర్గానికి కంచుకోటలైన జిల్లాలు అంతటా అదే పరిస్థితి ఎదురైంది.విభజిత ఆంధ్రప్రదేశ్కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు. ఇప్పటికీ తనకు సిద్ధాంతం లేదు. పార్టీ నిర్మాణం లేదు. సోదరుడు చిరంజీవి రాజకీయాలలో ఉండినప్పటిలా తన సామాజిక వర్గంగానీ, ఇతర బడుగు బలహీన వర్గాలుగానీ ఆయనను ఒక ఉద్ధారకునిగా ఏమీ చూడటం లేదు. అది ఒకటైతే, మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ మాట్లాడి, తర్వాత 50–60 స్థానాలలో పోటీ, తద్వారా ప్రభుత్వంలో పెద్ద చెయ్యి అని ప్రకటించి, చివరకు 21 సీట్లకు పరిమితం కావటం తన పార్టీ వారికి, తన సామాజిక వర్గం వారికి కూడా ఇబ్బందికరంగా తయారైంది. తీరా అందులో గెలిచేదెన్ని, తమ కూటమి అధికారానికి రాగలదనే హామీ ఎంత అనేవి ఎవరికీ అంతు పట్టని ప్రశ్నలయ్యాయి. మౌలికంగా చుక్కాని అంటూ లేని పార్టీ పరిస్థితి ఇంతకు భిన్నంగా ఉండగలదా? - వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు - టంకశాల అశోక్ -
PK: పిఠాపురం గోళీలు పని చేయట్లేదా?
కాకినాడ, సాక్షి: జనసేన విషయంలో పవన్ కల్యాణ్ చేస్తున్నదంతా పదేళ్లుగా ఆ పార్టీని వెంటపెట్టుకుని తిరిగిన వాళ్లెవరికీ సహించడం లేదు. సీఎం అవుతాడని కలలుగన్న అభిమానుల ఆశలు పటాపంచల్ చేస్తూ మళ్లీ చంద్రబాబుతోనే పొత్తుకు వెంపర్లాడడం.. ఇటు రాజకీయ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది. గత ఎన్నికల్లో 130 ఫ్లస్ సీట్లకు పోటీ చేసిన జనసేన.. ఇప్పుడు 21 స్థానాలకే పరిమితం కావడాన్ని జనసేన కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. పోనీ ఆ 21 సీట్ల కేటాయింపులో అయినా జెన్యూన్గా ఉన్నాడా? అంటే అదీ లేదు. కనీసం రెండు పదుల స్థానాలకు అభ్యర్థుల్ని సైతం ఎంపిక చేయలేని పరిస్థితికి దిగజారిపోయాడు పవన్. అదే సమయంలో.. చంద్రబాబు సూచనల మేరకు టీడీపీ నుంచి పార్టీ మారిన వాళ్లకు.. అధికార వైఎస్సార్సీపీ ఫిరాయించిన వాళ్లకు సీట్లిచ్చి ఆయా స్థానాల్లో పాతుకుపోయిన జనసేన కేడర్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో రాజీనామాల పర్వంతోనూ పవన్కు నిరసన తగిలింది. పోనీ తన సీటు విషయంలో అయినా కచ్చితత్వం ప్రదర్శిస్తున్నాడా? అంటే అదీ లేదు. అసలు పిఠాపురంలో పోటీ చేయడం పవన్ నామినేషన్ వేసే దాకా అనుమానమే అనే పరిస్థితిని తీసుకొచ్చారు ఇప్పుడు. భీమవరం, గాజువాక ఓటర్లకు భరోసా ఇవ్వలేకపోయిన పవన్.. ఇప్పుడు పిఠాపురం ఓటర్లకు ఏం భరోసా ఇస్తాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారాహి పేరిట ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి రెండ్రోజులు మామూలు హడావిడి చేయలేదు. బహిరంగ సభతో పాటు ఆటోలెక్కి రోడ్ల మీద ఓ హడావిడి చేశాడు. అదేంటో.. ఆ రెండ్రోజులు తిరగక మునుపే జ్వరం పేరుతో నియోజకవర్గాన్ని వీడారు. పార్టీ నిర్వహణను నాదెండ్ల మనోహర్కు.. నియోజకవర్గ ప్రచార బాధ్యతలను తనపై గుర్రుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు అప్పగించారు. అంటే పిఠాపురంలో గెలుపుపై పవన్ ఆశలు వదిలేసుకున్నట్లేనా?.. ఆ మాత్రం జ్వరానికి పవన్కు పిఠాపురంలో గోళీలు దొరకవా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. చంద్రబాబుకి బానిసత్వం ప్రదర్శించడంలో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆల్ టైం రికార్డు సృష్టిస్తున్నారు. ఎన్నికల వేళ పార్టీని పూర్తిగా చంద్రబాబు చేతిలో పెట్టారు. బాబు నుంచి వెన్నుపోటు రాజకీయం నేర్చుకుని దానిని జనసేన కేడర్పైనే ప్రయోగిస్తున్నారు. తన చుట్టూరా ఎప్పుడూ బౌన్సర్లను ఉంచుకునే పవన్.. పార్టీ నేతలు, కార్యకర్తలు సహా ఎవరినీ దగ్గరకు రానీయకుండా జాగ్రత్తపడుతుంటారు. అలాంటిది పార్టీ మీటింగ్లలో తనపై బ్లేడ్లతో దాడి జరిగిందంటూ ఆరోపణలకు దిగడం మరో కొసమెరుపు. ఈ ఆరోపణల్ని జనసేన శ్రేణులు సైతం స్వాగతించడం లేదు. పోనీ దాడికి సంబంధించిన ఆధారాలు ఏమైనా చూపించారా? అంటే అదీ లేదు. ఇక.. ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే ట్యాగ్లకు అదనంగా ఇప్పుడు అదనంగా బ్లేడ్ బాబ్జీ అంటూ పవన్కు మరో ట్యాగ్ తగిలించారు. అట్లుంటది ప్యాకేజీ స్టార్తో అంటూ సెటైర్లు వేస్తున్నారు. అలా పవన్ ఇటు జనాల్లో.. అటు జనసేన శ్రేణుల్లో రాజకీయంగా మరి చులకనైపోతున్నాడు. -
ఏప్రిల్ 05.. ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 5th Telugu Updates 09:23 PM, ఏప్రిల్ 05 2024 ఈనాడు తప్పుడు రాతలపై సీఎస్ జవహర్రెడ్డి ఆగ్రహం తనపై రాసిన తప్పుడు వార్తపై మండిపడ్డ సీఎస్ ఈనాడు చీఫ్ ఎడిటర్కి లేఖ రాసిన సీఎస్ ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ కొత్త ఎస్పీల బదిలీలపై ఈనాడు తప్పుడు కథనం సీఎస్ జవహర్రెడ్డి ఎలక్షన్ కమిషన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఈనాడు తప్పుడు కథనం అబద్ధపు రాతలపై ఖండన లేఖ విడుదల చేసిన సీఎస్ తన ఖండన ఈనాడు మొదటి పేజీలో రాయాలని కోరిన జవహర్ రెడ్డి లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని.స్పష్టం చేసిన సీఎస్ ఎన్నికల సంఘం చేసిన బదిలీలను ఎలా తప్పు పడతారు? ఐపీఎస్ అధికారులు ఏసిఆర్లు, సీనియారిటీ, అనుభవం పరిశీలించాకే నియమించాం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితాను ఈసీఐ పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చింది ఈసీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారుల ప్యానెల్పై అభ్యంతరాలుంటే ఈసీఐ కొత్త ప్యానెల్ కోరుతోంది అధికారుల బదిలీలు, నియమకాలపై సర్వాధికారాలు ఈసీఐకి ఉంటాయి అధికారుల ప్రతిష్ట దెబ్బతీసేలా వార్తలు రాయడం అనైతికం ప్రతి అధికారి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారు అలాంటి వారిపై ఇలా తప్పుడు, నిరాధార వార్తలు రాయడం సమంజసం కాదు తక్షణమే ఈనాడు మొదటి పేజీలో నా ఖండన ప్రచురించాలి లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటా.. లేఖలో పేర్కొన్న సీఎస్ 09:09 PM, ఏప్రిల్ 05 2024 పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్ ముగ్గురిపైన క్రిమినల్ చర్యలకు దిగాలని ఐపీఎస్ అధికారుల సంఘం నిర్ణయం ఐపీఎస్లపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం.. ప్రకటన విడుదల చేసిన ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పురందేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేయడాన్ని ఖండించిన సంఘం క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ప్రకటించిన ఐపీఎస్ల సంఘం 08:14 PM, ఏప్రిల్ 05 2024 పేదలపై చంద్రబాబు కక్ష సాధింపు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదని అడ్డుపడింది చంద్రబాబు కాదా? చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ఎవరు నమ్మరు షర్మిలను చంద్రబాబు తప్పు దోవ పట్టిస్తున్నారు దివంగత మహానేత వైయస్సార్ పాలనను సీఎం జగన్ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు వైఎస్సార్ మరణం తర్వాత ఎఫ్ఐఆర్లో ఆ మహానేత పేరును కాంగ్రెస్ చేర్చింది అలాంటి పార్టీలో షర్మిల చేరడం ఆంధ్ర రాష్ట్రానికి ఆమెకి ఎటువంటి సంబంధాలు లేవు కొంతసేపు తెలంగాణ కోడలు అంటుంది కొంతసేపు ఆంధ్ర ఆడపిల్లను అంటుంది షర్మిల మాటలకు పొంతన లేదు సీఎం జగన్ పై రాళ్లు వేస్తే దివంగత వైఎస్సార్ కూడా నిన్ను క్షమించడు నారా లోకేష్కు దమ్ముంటే మంగళగిరిలో గెలిచి చెప్పమనండి మీడియా వాళ్లందరూ వెళ్లి నారా లోకేష్ మంగళగిరిలో గెలుస్తారా..? లేదా అడగండి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారు ఈ రాష్ట్రంలో 175కు 175 గెలిచే పార్టీ వైఎస్సార్సీపీ నారా లోకేష్కి దమ్ము ధైర్యం ఉంటే ప్రధాని మోదీ, అమిషా, పవన్ కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్. టీడీపీ నేతలు మెడ నిండా ఎన్ని కండువాలు వేసుకుంటున్నారో వాళ్లకే తెలియదు 05:59 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల: వాసిరెడ్డి పద్మ కోర్టు పరిధిలో ఉన్న అంశాలను షర్మిల మాట్లాడుతున్నారు తీర్పు శిక్ష ఈవిడే వేసేస్తున్నారు.. ఇది తీవ్రమైన అంశం విచారణలో ఉన్న అంశాల పై ఇంత రాజకీయం చేయడం సరికాదు కడప ప్రజలు అమాయకులు.. అజ్ఞానులు కాదు వైఎస్ కుటుంబాన్ని విడదీయాలని జరుగుతున్న కుట్ర కడప ప్రజలకు కొత్త కాదు షర్మిల సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ వివేకానందను ఓడించడానికి చేసిన కుట్రలు మరిచిపోయారా? ఆ రోజు కుట్రలు చేసిన వారు ఈరోజు మీ పక్కన ఉండి మాట్లాడుతున్నారు చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల చిక్కుకుంది అవినాష్ రెడ్డి పై హంతకుడని నింద వేస్తున్నారు కోర్టులో విచారణ జరుగుతున్న అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చడం వెనుక ఉన్న రాజకీయమేంటి? చంద్రబాబు రాజకీయంలో షర్మిల, సునీత పావులుగా మారారు ఏం సాధించడానికి మీరు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది కాంగ్రెస్ రాష్ట్రం అన్యాయం అయిపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా? విభజన హామీలు గాలికి వదిలేసింది కాంగ్రెస్ కాదా? ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడలేదా? ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు ప్రజలకు షర్మిల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు? ఎందుకు మూసేశారు ఏపీకి నష్టం జరిగినా తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తామన్నారు తెలంగాణలో నాయకులను వాడుకుని మోసం చేశారు ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆరోజు ఎందుకు అనుకున్నారు ఏపీ ప్రజల కోసం ఈ రోజు ఎందుకు వస్తున్నారు చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా షర్మిల మారుతున్నారు చంద్రబాబు కంటే ఎక్కువ యూటర్న్ లు తీసుకుంటున్నారు మీ యూటర్న్ల వెనుక మీ ఉద్ధేశ్యమేంటి.. ప్రజలకు సంజాయిషీ చెప్పాలి వివేకాను రాజకీయంగా లేకుండా చేసిన వారితో చేతులు కలిపారు షర్మిలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది ఆధారాలు లేకుండా అవినాష్ పై ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికల్లో ఏం చేస్తారో కడప ప్రజలకు చెప్పండి ఏపీ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషి ఎవరు ఏం చేశారో కడప ప్రజలకు తెలుసు షర్మిల ప్రచారం పూర్తిగా ఎన్నికలకు విరుద్ధం కచ్చితంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం 05:01 PM, ఏప్రిల్ 05 2024 ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ బస్సుయాత్ర 9వ రోజు శనివారం(ఏప్రిల్ 6) షెడ్యూల్ ఉదయం 9 గంటలకు చింతరెడ్డి పాలెం రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి చేరుకుని సాయంత్రం 3 గంటలకి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్ , సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు,వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారు. 04:53 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు బుజ్జగించినా తేలని గోపాలపురం టికెట్ పంచాయితీ చంద్రబాబు ముందే బయటపడ్డ వర్గ విభేదాలు చంద్రబాబు బస చేసిన నల్లజర్ల ప్రియాంక కన్వెన్షన్ హాల్ వద్ద ముళ్లపూడి వర్గీయుల ఆందోళన మద్దిపాటి వద్దు ఎవరైనా ముద్దు అంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు ఫ్లకార్డులతో నిరసన,నినాదాలు ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అదుపు చేసిన పోలీసులు, స్పెషల్ ఫోర్స్ మద్దిపాటి వెంకట రాజుని వెంటనే మార్చాలంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు బైఠాయించి తెలుగు తమ్ముళ్ల నిరసన 03:45 PM, ఏప్రిల్ 05 2024 గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా?: పోసాని కృష్ణమురళి ఎన్ని అన్యాయాలు చేసినా చంద్రబాబు అంటే పవన్కు దేవుడు చంద్రబాబు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడతారు చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైలుకెళ్లారు. వాలంటీర్ల సేవలను సైతం చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారు. నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్డీఆర్ను చంపేశారు చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టుకోడు.. ఇంటింటికి తిరగడు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగావీటి రంగాను చంపేశారు పవన్ కల్యాణ్ను చంద్రబాబు లొంగదీసుకున్నారు 02:02 PM, ఏప్రిల్ 05 2024 అచ్చెన్న, అయ్యన్నలకు ఈసీ నోటీసులు టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడుకి ఎన్నికల సంఘం నోటీసులు సీఎం వైఎస్ జగన్ పై తప్పుడు ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు టీడీపీ నేతలపై ఈసీఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు కి నోటీసులు ఇచ్చిన సీఈఓ మీనా 01:45 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుపై ఫైర్.. టీడీపీ మీటింగ్లో తిట్ల పురాణం చిప్పగిరి మండలం నెమకల్లు టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కు సొంత పార్టీ లో నిరసన సెగ పార్టీ కార్యకర్తల ఆత్మీయసమావేశం లో వీరభద్ర గౌడ్ సమక్షంలో రెండు వర్గాలు రసాభాస మా అవసరం మీకు పట్టదా అంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు ఒక్క వర్గానికే ప్రాధాన్యత చంద్రబాబు ఇస్తున్నాడని తెలుగు తమ్ముళ్లు మండిపాటు సమాచారం ఇవ్వకుండా మీటింగులు ఎలా పెడతారంటూ ఒకరి పై నొకరు తిట్ల పురాణం 1:15 PM, ఏప్రిల్ 05 2024 విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా: కేఏ పాల్ మన పార్టీ(ప్రజాశాంతి) అధికారంలోకి వస్తుంది అందుకే విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా కారణం నేను విశాఖలోనే పుట్టి, పెరిగి చాలా సేవ చేశా రాయలసీమ ముఖ్యమంత్రిలు విశాఖను పట్టించుకోలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కోర్టులో ఆర్గ్యుమెంట్ చేశాను స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల భూముల కోసం కోర్టులో పోరాడా స్టీల్ ప్లాంట్ కోసం రూ.8 వేల కోట్లు ఇస్తానని చెప్పాను ఇవ్వకపోతే నేను జైలు శిక్షకు కూడా సిద్ధంగా ఉన్నాను కోర్టుల్లో జడ్జిలు తప్పుడు తీర్పులు ఇస్తే వారి సంగతి తేల్చుతా 12:30 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకు నిరసన సెగ టికెట్ల కేటాయింపుపై భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనల్లో నిరసన సెగలు పార్టీలో కష్టపడ్డ వారికి టికెట్లు కేటాయించాలంటూ నినాదాలు నల్లజర్ల లో చంద్రబాబు బసచేసిన ప్రాంతంలో పోలవరం టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ పార్టీ శ్రేణుల నిరసన బొరగం శ్రీనివాస్ కి టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయుల ఆందోళన పోలవరం అభ్యర్థి ని మార్చాలని నినాదాలు చేస్తున్న టీడీపి శ్రేణులు 11:43 AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు: హోం మంత్రి తానేటి వనిత వలంటీర్లను గోనె సంచులకు మోసుకునేవాళ్లు.. ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు తలుపులు తట్టి ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు డేటా తీసుకెళ్లి అమ్మేస్తున్నారు మహిళల అక్రమ రవాణా చేస్తున్నారన్న అన్న వ్యక్తి పవన్ కల్యాణ్ వలంటీర్లను చిన్న చూపు చూస్తూ కించపరుస్తూ.. వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వ్యక్తులు చంద్రబాబు పవన్ కళ్యాణ్.. కోర్టులకు వెళ్లి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయించింది ఎవరు?.. చంద్రబాబే అవ్వ తాతల మరణాలకి చంద్రబాబే కారణం చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు పుష్కరాల్లో షూటింగ్ ల పేరుతో సామాన్యుల ప్రాణాలు పట్టణ పెట్టుకుంది ఎవరు చంద్రబాబు కాదా....? జగనన్న బస్సు యాత్రకు వస్తున్న జన సందోహన్ని చూసి వీరికి వణుకు పుడుతుంది దళిత మహిళలని లేకుండా నాపై చెత్తాచెదారం అంటూ హీనంగా మాట్లాడారు.. చంద్రబాబు కొవ్వూరులో టిడిపి వ్యక్తిని తీసుకెళ్లి గోపాలపురంలో ఎందుకు పెట్టారు జవహర్ ను తీసుకెళ్లి గతంలో తిరువూరులో పెట్టింది ఎవరు.... కొవ్వూరు నియోజకవర్గం లో ఒక రూపాయి దోచుకున్నానని నిరూపిస్తే రాజకీయాలను శాశ్వతంగా వైదొలుగుతాను...? దోచుకున్నానని ఆధారాలతో నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం... కొవ్వూరు లో టిడిపి హాయంలో ఏడేచ్చగా దోచుకుంది వారి నాయకులు దొమ్మేరులో దళిత యువకుడు ఆత్మహత్య చనిపోతే చంద్రబాబు నాపై ఆపాదిస్తున్నారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులపై బురద చల్లితే సానుభూతి వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారు భ్రమరావతి కట్టినంత ఈజీ కాదు ప్రజల్లో అబద్దాల మేడలు కట్టడం ప్రజల గుండెల్లో జగనన్న సంక్షేమ పథకాలు గూడు కట్టుకుని ఉన్నాయి జగనన్నను పేదలు ఆరాధ్య దైవంగా భావిస్తూ పేదల గుండెల్లో స్థానం కల్పించారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పై నాయకులపై బురద చల్లితే.. మైలేజీ వస్తుందని అనుకోవడం వారి భ్రమ కొవ్వూరులో గోపాలపురంలో కూడా టిడిపిలో వర్గ విభేదాలు రెండు గ్రూపులు ఉన్నాయి వైఎఎస్సార్సీపీలో కొవ్వూరు గోపాలపురంలో ఐక్యతగా పనిచేస్తున్నామని కడుపుమంటతో ఉక్రోశంతో చంద్రబాబు ఉన్నారు ప్రజలు ఎవరూ చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి గెలవడం కాదు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను.. చంద్రబాబు తన మ్యానిఫెస్టోలో లో కాపీ పేస్ట్ చేస్తున్నారు మా నియోజకవర్గంలో దళితులపై అట్రాసిటీ కేసులు పెట్టామని అంటున్నారు ఒకటైన నిరూపించమని సవాల్ చేస్తున్నాను టిడిపి హయంలో మహిళలను వివస్రను చేశారు ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని అనుకుంటారు అన్న వ్యక్తి చంద్రబాబు పురందేశ్వరి అధికారులపై బురద చల్లాలి అనుకోవడం బాధాకరం ఐఏఎస్ ఐపీఎస్ చిన్న స్థాయి ఉద్యోగుల సైతం వారి ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తారు వారి ప్రభుత్వానికి కొమ్ము కాయరు టీడీపీ హయాంలో అలా చేసినట్లు ఉన్నారు అందుకే ఇలాంటి లేఖలు రాస్తున్నారు తూర్పు గోదావరిలో హోం మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు 11:03 AM, ఏప్రిల్ 05 2024 సీఎం రమేష్ ఓ అహంకారి: ఎమ్మెల్యే ధర్మశ్రీ అనకాపల్లిలో సీఎం రమేష్ రౌడీయిజం తనిఖీలకు వచ్చిన అధికారులతో సీఎం రమేష్ అనుచిత ప్రవర్తన తీవ్రంగా ఖండించిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు శాంతికాముకులు, హింసను సహించరు సీఎం రమేష్ ఎక్కడ నుండి వచ్చారు మళ్లీ అక్కడికే పంపుతారు సీఎం రమేష్ అహంకారంతో విర్రవీగుతున్నారు సీఎం రమేష్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు తనపై అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ పై పరువు నష్టం దావా వేస్తా 10:52 AM, ఏప్రిల్ 05 2024 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓ నమ్మకద్రోహి: మంత్రి పెద్దిరెడ్డి మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి నే కారణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నది కూడా మాజీ సీఎం కిరణ్ ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి చిత్తుగా ఓడిపోతారు కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వేధించాడు కిరణ్ కుమార్ రెడ్డి నమ్మకద్రోహి గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించాం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తాం చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తాం ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు శ్రీ వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారు ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు పుంగనూరు ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 10:34 AM, ఏప్రిల్ 05 2024 ప్రజా సమస్యల పరిష్కారమే జగన్ ప్రభుత్వం ఎజెండా టీడీపీ చేయని అనేక అభివద్ధి పనులు జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది అబద్ధపు ప్రచారాలు చేసుకునీ కాలం గడుపుతున్న టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ప్రజా సమస్యలు పట్టవు పెన్షన్ కోసం వృద్ధుల మరణ మృదంగం కి టీడీపీ నేతలు కారణం కాదా ఎందుకు గద్దె రామ్మోహన్ నీ గెలిపించామా? అని స్థానిక ప్రజలు వాపోతున్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలను ఇంటికే పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 10:02 AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకు అవ్వా తాతల ఉసురు తప్పదు: చింతల ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆ వృద్ధులు పడుతున్న అవస్థలు చూస్తే చాలా బాధ వేస్తుంది పెన్షన్ కోసం వృద్ధులను మంచాలపై తీసుకు వెళ్లాల్సి వస్తోంది వలంటరీ వ్యవస్థ పై చంద్రబాబు కక్ష కట్టి తప్పుడు ఫిర్యాదులు చేయించాడు నాలుగు సంవత్సరాల 11 నెలల పాటు వలంటీర్లు సేవలు అందించారు ప్రతినెల 1వ తేదీ ఉదయాన్నే వలంటీర్లు పెన్షన్లు అందించే వాళ్ళు తప్పుడు ఫిర్యాదులు చేసి వలంటీర్లను పక్కన పెట్టించిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్తారు ఇప్పటికైనా ఎన్నికల సంఘం పునరాలోచన చేసి వాలంటీర్లతో పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 09:37 AM, ఏప్రిల్ 05 2024 వేర్ ఈజ్ లోకేషం? ఎన్నికల వేళ.. టీడీపీలో ఆసక్తికర పరిణామం తెర వెనుకే ఉంటున్న చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు శంఖరావాలకు సైతం బ్రేక్ ఇచ్చిన లోకేష్ పూర్తిగా ఉండవల్లి నివాసానికే పరిమితమైన వైనం మంగళగిరి ప్రచారానికి వెళ్తే.. అడుగడుగునా నిలదీస్తున్న జనం దీంతో.. లోకేష్ ప్రచారానికి దూరంగా ఉంటున్న పార్టీ శ్రేణులు అపార్ట్మెంట్లలో ప్రచారానికే మొగ్గుచూపిస్తున్న నారా లోకేష్ వైఎస్సార్సీపీ అభ్యర్థి లావణ్యకు ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న మంగళగిరి వాసులు సోషల్ మీడియాలో సినబాబుపై పేలుతున్న సెటైర్లు 09:09 AM, ఏప్రిల్ 05 2024 టీడీపీని కబళిస్తున్న చంద్రబాబు తప్పిదాలు: విజయసాయిరెడ్డి 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు అందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైఎస్సార్సీపీలో చేరుతున్నారు జగన్ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు ఆకర్షితులు అవుతున్నారు.. వలంటీర్ వ్యవస్థ పై పిర్యాదులు చేసి.. పింఛన్ దారులకు దూరం చెయ్యడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం.. చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు తెలుగుదేశం పార్టీనే కబలించి వేస్తుంది.. వలంటీర్ మీద ఆధారపడిన ప్రతి కుటుంబం చంద్రబాబు కుట్రలను వ్యతిరేకిస్తున్నారు.. అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలో చేరిన అందరికీ ప్రాధాన్యత ఇస్తాం.. రేపటి(ఏప్రిల్ 6) సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర చింతరెడ్డిపాలెం నుంచి ప్రారంభం అవుతుంది ప్రతీ స్వాగత పాయింట్ల వద్ద వైఎస్సార్సీపీ నేతలు సీఎం జగన్కు స్వాగతం పలుకుతారు.. సాయంత్రం నాలుగు గంటలకి సీఎం జగన్ కావలి చేరుతారు.. 6 గంటలకి సభ ముగుస్తుంది నెల్లూరు చేరిక కార్యక్రమంలో YSRCP MP అభ్యర్థి విజయసాయి రెడ్ది వ్యాఖ్యలు 09:02 AM, ఏప్రిల్ 05 2024 ఇవాళ బస్సు యాత్రకు విరామం నెల్లూరులోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం యాత్ర నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం బస చేసిన ప్రాంతంలోనే.. నెల్లూరు జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం జగన్ రాయలసీమ జిల్లాల యాత్రపై సమీక్ష నిర్వహించనున్న సీఎం జగన్ ఇప్పటికే వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విజయవంతంగా సాగిన యాత్ర ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, సలహాలు-సూచనల మేరకు కొత్త పథకాలను మేనిఫెస్టోలో ప్రవేశపెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉదయం నుంచే చింతరెడ్డిపాలెం సీఎం జగన్ బస కేంద్రానికి చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రేపు.. తొమ్మిదవ రోజు బస్సు యాత్రలో పాల్గొననున్న సీఎం జగన్ నెల్లూరు బైపాస్ చింతరెడ్డిపాలెం బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభం కానున్న యాత్ర రేపు కావలిలో సిద్ధం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ 08:47 AM, ఏప్రిల్ 05 2024 విజయసాయిరెడ్డి సమక్షంలో చేరికలు నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం పండగ వాతావరణం టీడీపీ నుంచి పలువురు వైఎస్సార్సీపీలోకి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ జడ్పీటీసీ రుక్మిణి, మాజీ Sc కమిషన్ మెంబర్ రవీంద్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి 08:27 AM, ఏప్రిల్ 05 2024 నేటి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఇలా.. నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు పర్యటన ప్రజా గళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు స్థానిక టీడీపీ నేతలతో కీలక మంతనాలు నిర్వహించే ఛాన్స్ 08:06 AM, ఏప్రిల్ 05 2024 రఘురామ కొత్త రాగం నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొత్త రాగం కూటమి తరఫునే పోటీ చేస్తానని గతంలో ప్రకటించుకున్న రఘురామ సీటు తన్నుకుపోయిన బీజేపీ.. తన అనుచరుడి కోసం పైరవీలు మొదలుపెట్టిన చంద్రబాబు తాజాగా రఘురామ కొత్త రాగం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే తన ఆశయమంటూ ప్రకటన నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. ఢిల్లీ ఎంపీగానో, అమరావతి ఎమ్మెల్యేగానో చూడాలి. పోటీ చేయడమైతే పక్కా. ఎంపీగా బరిలో నిలవాలన్నది నా ఆశ. అసెంబ్లీలో ఉండాలన్నది ప్రజల కోరిక. చాలా మంది నన్ను అసెంబ్లీలో స్పీకర్గా చూడాలనుకుంటూ రఘురామ వ్యాఖ్య నేను కోరుకుంటున్న కేంద్రమా, ప్రజలు కోరుతున్న రాష్ట్రమో త్వరలోనే తెలుస్తుందంటూ గప్పాలు 07:42AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు గంజాయి వ్యాఖ్యలు.. భగ్గుమన్న వ్యాపారులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం రావులపాలెం బంద్ కు పిలుపునిచ్చిన చాంబర్ ఆఫ్ కామర్స్ రావులపాలెంలో టీడీపీ నిర్వహించిన ప్రజా గళం సభలో వ్యాపారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు రావులపాలెంలో కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతారంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు చంద్రబాబు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన వ్యాపారులు బంద్ నిర్వహించడంతోపాటు చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న చాంబర్ ఆఫ్ కామర్స్ చంద్రబాబు మాటలపై మండిపడుతున్న ఆర్యవైశ్య సంఘాలు 07:15AM, ఏప్రిల్ 05 2024 మరో రెండు జనసేన సీట్లు బాబు ఖాతాలోకే చంద్రబాబుతో పొత్తంటే బాబు మెచ్చిన వాళ్లకి, బాబు చెప్పిన వాళ్లకి, బాబు పంపిన వాళ్లకి టికెట్లిచ్చేయడమే. జనసేనకు కేటాయించిన మరో రెండు సీట్లనూ చంద్రబాబు ఇలాగే కొట్టేశారు. టీడీపీ నేతలకే దక్కిన రైల్వేకోడూరు, అవనిగడ్డ జనసేన సీట్లు అవనిగడ్డ సీటు మండలి బుద్ధ ప్రసాద్కే గతంలో జనసేనను తీవ్రంగా విమర్శించిన బుద్ధ ప్రసాద్ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన బుద్ధ ప్రసాద్ బుద్ధ ప్రసాద్కు టికెట్ఇవ్వడంపై అవనిగడ్డ జనసేనలో అసంతృప్తి రాజీనామాలకు సిద్ధమైన పలు వర్గాలు మరోవైపు.. బాబు ఒప్పుకోలేదని రైల్వేకోడూరు అభ్యర్ధిని మార్చేసిన పవన్ యనమల భాస్కరరావు పేరును స్వయంగా ప్రకటించిన పవన్ కల్యాణ్ బాబు కోసం.. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ప్రధాన అనుచరుడు అరవ శ్రీధర్కు టికెట్ మూడు రోజుల కిందట జనసేనలో చేరిన ముక్కవారిపల్లి సర్పంచ్ అరవ శ్రీధర్ పవన్ నిర్ణయంపై మండి పడుతున్న పార్టీ నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయా స్థానాల్లో జనసేన శ్రేణుల నిర్ణయం? 07:06AM, ఏప్రిల్ 05 2024 అధికారులపై సీఎం రమేష్ దౌర్జన్యం అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దౌర్జన్యం టీడీపీ సానుభూతిపరుడు షాపుపై డీఆర్ఐ అధికారుల తనిఖీలు జీఎస్టీ రికార్డులు తనిఖీలు చేస్తున్న అధికారులపై గుండాయిజం తనిఖీలు వెంటనే ఆపాలంటూ బెదిరింపులు నా సంగతి మీకు తెలియదు అంటూ రౌడీయిజం అధికారులను ఏక వచనంతో సంబోధిస్తూ అధికారుల చేతిలో నుంచి ఫైళ్లు లాక్కున్న సీఎం రమేష్ సీఎం రమేష్ రౌడీయిజం చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు ప్రశాంతమైన అనకాపల్లిలో గతంలో ఎన్నడు ఇటువంటి సంఘటన జరగలేదంటున్న ప్రజలు అధికారులపై టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టిన సీఎం రమేష్ పోలీసులు సర్ది చెప్పిన పట్టించుకోని సీఎం రమేష్ టీడీపీ కార్యకర్తలు ఎక్కడ నుంచో వచ్చి అనకాపల్లిలో రౌడీయిజం చేయడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం 06:54AM, ఏప్రిల్ 05 2024 నేటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం నేటి నుంచి ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారం రాజమండ్రి ఎంపీ బరిలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి నుంచి ప్రచారం ప్రారంభించనున్న పురందేశ్వరి పొత్తులో భాగంగా.. పది అసెంబ్లీ, ఆరు ఎంపీ సీట్లు తీసుకున్న ఏపీ బీజేపీ సీట్ల పంపకంపై ఏపీ బీజేపీలో తీవ్ర అసంతృప్తి.. పురందేశ్వరి తీరుపై విమర్శలు టీడీపీ తీసుకున్న విశాఖ ఎంపీ సీటు బీజేపీకి వెళ్లే అవకాశం బీజేపీ నరసాపురం సీటును వదులుకునే చాన్స్ నరసాపురం ఎంపీ సీటు కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్న రఘురామ కృష్ణంరాజు కడప ఎంపీ సీటును బీజేపీ ఇచ్చే యోచనలో టీడీపీ జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం టీడీపీకి ఇచ్చే ఆలోచనలో బీజేపీ మరో మూడు నాలుగురోజుల్లో సీట్లు మార్చుకునే అంశంపై రానున్న స్పష్టత 06:49AM, ఏప్రిల్ 05 2024 తిరుపతి జిల్లా సిద్ధంపై సీఎం జగన్ ట్వీట్ తిరుపతి జిల్లాలో ముగిసిన మేమంతా సిద్ధం యాత్ర గురువారం సీఎం జగన్ బస్సు యాత్రకు తిరుపతి ప్రజల బ్రహ్మరథం సాయంత్రం నాయుడుపేట బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ పేదలను గెలిపించాలని మనం యుద్దం చేయబోతున్నాం: సీఎం జగన్ నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం పదవులు ఇచ్చాం: సీఎం జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారు: సీఎం జగన్ 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం: సీఎం జగన్ ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు: సీఎం జగన్ తలుపు తట్టి పథకాలు అందిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోయారు: సీఎం జగన్ పేదలకు తోడుగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా?: సీఎం జగన్ పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వతాతలు ప్రాణాలు విడిచారు: సీఎం జగన్ 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు ఏమనాలి?: సీఎం జగన్ 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును హంతకుడు అందామా?: సీఎం జగన్ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి: సీఎం జగన్ ఏపీ పేద వర్గాల ప్రజలంతా నా వాళ్లు: సీఎం జగన్ చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు: సీఎం జగన్ చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు: సీఎం జగన్ చిన్న పిల్లలు మేనమామ అని పిలుస్తుంటే గర్వంగా ఉంది: సీఎం జగన్ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్ మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే: సీఎం జగన్ Day-8 తిరుపతి జిల్లా సిద్ధం! #MemanthaSiddham #VoteForFan pic.twitter.com/1GxnW91kLr — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/ewqX04uLG4 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 06:40AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకి ఈసీ నోటీసులు సీఎం జగన్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు గురువారం నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం మార్చి 31వ తేదీన నిర్వహించిన ప్రజా గళం సభల్లో చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు ఈసీకి వైఎస్సార్సీపీ లేళ్ల అప్పిరెడ్డి, మరొకరు ఫిర్యాదు ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుకి నోటీసులు 48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ ఈసీ ఆదేశం 06:30AM, ఏప్రిల్ 05 2024 చివరకు ఇదీ టీడీపీ పరిస్థితి: YSRCP ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి టీడీపీకి అంత బెరుకేంటో? రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుని తిట్టిపోస్తున్న జనం. వలంటీర్ వ్యవస్థను నిలువరించి.. ఫించన్లను జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం నెగిటివ్ కామెంట్స్కి భయపడి చంద్రబాబు సభల లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్కి చాట్ ఆప్షన్ను మాయం చేసిన టీడీపీ అదే సమయంలో.. టీడీపీని మరింతగా ముంచేస్తున్న పొత్తులు సీట్ల పంపకాల్లో బాబు ఒంటెద్దు పోకడ ప్రజల్లో దిద్దుకోలేక.. పార్టీలో సర్దుకోలేక చేతులెత్తేస్తున్న చంద్రబాబు! ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి అంత బెరుకేంటి @JaiTDP..? రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుని తిట్టిపోస్తున్న జనం. దాంతో నెగిటివ్ కామెంట్స్కి భయపడి చంద్రబాబు సభల లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్కి చాట్ ఆప్షన్ను మాయం చేసిన టీడీపీ టీడీపీని నిండా ముంచేస్తున్న పొత్తులు, సీట్ల పంపకాల్లో బాబు… pic.twitter.com/nJNBTLnz5B — YSR Congress Party (@YSRCParty) April 4, 2024 -
టీడీపీ కోసం మరో అభ్యర్థిని మార్చేసిన పవన్
సాక్షి, అన్నమయ్య: జనసేన శ్రేణుల అభిప్రాయాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పూచిక పుల్లలా తీసి పారేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఇంకా ఒకట్రెండు పెండింగ్ స్థానాలకు అధికారికంగా అభ్యర్థుల్ని ప్రటించాల్సి ఉంది. అయితే ఈలోపే ప్రకటించిన స్థానాల్లోనూ మార్పునకు దిగింది. అదీ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారనే!. తాజాగా రైల్వే కోడూరు అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మార్చేశారు. రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును గురువారం మధ్యాహ్నాం ప్రకటించింది జనసేన పార్టీ. యనమల భాస్కర్ స్థానంలో అరవ శ్రీధర్ను అభ్యర్థిగా పోటీలో నిలుపుతున్నట్లు ఒక నోట్ రిలీజ్ చేసింది. క్షేత్రస్థాయి నివేదికలు, జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ మార్పు చేసినట్లు సదరు నోట్ తెలిపింది. అయితే.. యనమల ఇంకా ప్రచారంలోకి దిగకముందే ఈ మార్పు చోటు చేసుకోవడం గమనార్హం. అదే సమయంలో.. ముక్కావారి పల్లె గ్రామసర్పంచ్గా ఉన్న అరవ శ్రీధర్.. మూడు రోజుల కిందటే జనసేనలో చేరడం గమనార్హం. అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా శ్రీ మండలి బుద్ధ ప్రసాద్#VoteForGlass pic.twitter.com/5zGc4kndba — JanaSena Party (@JanaSenaParty) April 4, 2024 అంతకు ముందు.. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా యనమల భాస్కర్పై సర్వేల్లో సానుకూలత రాలేదని.. మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేకుండా పోయిందంటూ అభ్యర్థి మార్పుపై జనసేన నేరుగా ప్రకటన చేసేయడం గమనార్హం. ఇప్పటికే ఆళ్లగడ్డ సీటును టీడీపీ నుంచి వచ్చిన మండలి బుద్ధ ప్రసాద్కు కేటాయించిన సంగతి తెలిసిందే. మన్యం పాలకొండ స్థానం సైతం టీడీపీ నుంచే వలస వచ్చిన నిమ్మక జయకృష్ణకే దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. నేడో, రేపో ఆ ప్రకటన కూడా వెలువడనుంది. -
పండుటాకులు విలవిల
సాక్షి నెట్వర్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిల కుట్రలతో అవ్వాతాతలు విలవిలలాడుతున్నారు. ఎన్నికల సంఘంపై తమ అనుకూలురుతో ఒత్తిడి తెచ్చి పింఛన్ల పంపిణీ చేయనీయకుండా వలంటీర్లను ఈ ముగ్గురు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో అవ్వాతాతలు, ఇతర పింఛన్ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1నే లబ్దిదారులు ఇళ్ల వద్దే ప్రభుత్వం పింఛన్ అందిస్తుండగా ఈసారి టీడీపీ, జనసేన కుతంత్రాలతో సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుతం ఎండా కాలం కావడంతో వేసవి తాపానికి వడదెబ్బ కొట్టి మృత్యువాత పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 20 మంది పింఛన్ లబ్దిదారులు మృత్యువాత పడటం విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబీకులు చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఆయన వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉసురు చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. చేయాల్సిందంతా చేసి టీడీపీ నేతలు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ఒక్కరోజే 20 మంది మృత్యువాత అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లెకు చెందిన ఎన్.రాజమ్మ (85) సచివాలయం వద్దకు నడిచి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో రాయి కాలుకు తగిలి ముందుకుపడి మృతి చెందింది. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్లపల్లిలో టీడీపీ కుట్రలతో ఆందోళనకు గురైన దుగ్గిలమ్మ(70) అనే వృద్ధురాలు మృతిచెందింది. అలాగే గుండెపోటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మద్దులచెర్వులో చోటు చేసుకుంది. అదేవిధంగా కొండకమర్ల పంచాయతీ పోలేవాండ్లకొత్తపల్లిలో సన్నాయప్ప (73) తన భార్య పింఛన్ కోసం ఎండలో నడుచుకుంటూ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వడదెబ్బకు గురై మృతి చెందాడు. సూళ్లూరుపేట సాయినగర్లో ఈశ్వరవాక లలితమ్మ (58) వితంతు పింఛను కోసం గాండ్లవీధి సచివాలయం వద్ద క్యూలో నిలబడి ముందుకు పడిపోయి ప్రాణాలు విడిచింది. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం ఎరికంబట్టు దళితవాడకు చెందిన అప్పాస్వామి(75) పెన్షన్ కోసం ఇంటి బయటే మంచంపై ఎదురు చూస్తూ ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై మరణించాడు. అలాగే చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన నన్నేసాహెబ్ (76) పింఛన్ కోసం వెళ్లి సచివాలయం వద్ద కుర్చిలో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన సచివాలయం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు నన్నేసాహెబ్ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఘడియపూడి పునరావాస కాలనీలో బొమ్మల శేషయ్య (70) పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లి ఇంటికి చేరుకుని భోజనం చేసి నీరసంగా పడుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులు లేపడానికి ప్రయత్నించగా విగత జీవుడై ఉన్నాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్ళపల్లికి చెందిన బుర్ర శామ్యూలు (71) గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. అలాగే గుంటూరు జిల్లా కొల్లిపరలో దొప్పలపూడి బాబూరావు (62) వ్యవసాయ కూలీ. ఈ క్రమంలో పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లిన బాబూరావు తిరిగొస్తూ ఇంటికి సమీపంలో కుప్పకూలిపోయి మరణించాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరుకు చెందిన సయ్యద్ ఖాదర్బాషా బోదకాలుతో బాధ పడుతున్నాడు. ఈసారి సచివాలయం వద్ద ఇస్తారని తెలిసి కుమారుడి బైక్పై అక్కడకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చాక అస్వస్థతకు గురై మృతిచెందాడు. కాకినాడ జిల్లా తూరంగి పగడాలపేటకు చెందిన అడపా వీర్రాజు (67) పింఛన్ కోసం సచివాలయం వద్దకు వెళ్లాడు. తిరిగి వస్తూ మార్గమధ్యంలో కళ్లు తిరగడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు వీర్రాజును ఇంటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. అలాగే ఏటిమొగ ప్రాంతానికి చెందిన పట్టా అప్పారావు(61) సమీపంలోని సచివాలయానికి వెళ్లాడు. ఎండ తీవ్రతతో సచివాలయం దగ్గరే స్పృహ తప్పాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఏటిమొగలోని రాజీవ్ గృహకల్ప సముదాయానికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన పిల్లి నాగేశ్వరమ్మ (75) కిలోమీటరుకు పైగా దూరంలో ఉన్న సచివాలయానికి కాలినడకన బయలుదేరింది. కొంత దూరం నడిచి ఆయాసంతో పడిపోయి మృత్యువాత పడింది. పల్నాడు జిల్లా దుర్గి మండల పరిధిలోని నెహ్రూనగర్ తండాకు చెందిన రమావత్ సాలిబాయి (70) పెన్షన్ కోసం ముటుకూరు 2 సచివాలయానికి ఆటోలో వెళ్తుండగా దారి మధ్యలో సొమ్మసిల్లి కుప్పకూలింది. ఆమెను ముటుకూరు పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ దిగువతొట్లివారిపల్లె గ్రామానికి చెందిన టి. మంగమ్మ(68) ఇంట్లోనే ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలిపోయి మృతి చెందింది. పింఛన్ కోసం ఎండలో వెళ్లి వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఆనందపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు రాజుబాబు (48) పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయానికి ఎండలో వెళ్లాడు. దీంతో వడదెబ్బకు గురికావడంతో ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు లోనై మృతి చెందినట్లు ఆయన భార్య సీత తెలిపింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ వేలమామడికి చెందిన పాడి సొములు(65) పింఛన్ కోసం పెదకోట సచివాలయానికి నడుచుకుని వెళుతుండగా జాలడ గ్రామ సమీపంలో ఆయాసం రావడంతో కూర్చొన్నాడు. అదే సమయంలో సొమ్మసిల్లిపోవడంతో మృత్యువాత పడ్డాడు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన పింఛన్ లబ్దిదారుడు పాతకోకిల పెద్దిరాజు (63) పింఛన్ ఇస్తున్నారని తెలిసి సచివాలయానికి బయలుదేరాడు. తీవ్ర ఉద్వేగానికి గురైన పెద్దిరాజు ఇల్లు దాటి వెళుతుండగా కొద్దిదూరంలో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. చేతులు విరిగి.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొర్లకుంట సచివాలయానికి పింఛన్ తీసుకునేందుకు వెళ్లిన పోలి తులసమ్మ అనే వృద్ధురాలు తిరిగి వస్తూ కింద పడటంతో చేయివిరిగింది. ప్రకాశంజిల్లా ముండ్లమూరు మండలం వేంపాడుకు చెందిన గ్రంధి మరియమ్మ (71) పింఛను నగదు కోసం ముండ్లమూరు సచివాలయానికి వెళ్లింది. మండుటెండలో ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్ సెంటరుకు వచ్చింది. ఆటో ఎక్కే క్రమంలో ఎండధాటికి సొమ్మసిల్లి కింద పడిపోయింది. ఈ క్రమంలో ఆమె మూతికి, పెదాలకు తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన పరుచూరి కృష్ణకుమారి (74) గుండెపోటుకు గురయ్యారు. చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పొన్న సుబ్బారావు అనే వృద్ధుడు పింఛను కోసం గ్రామ సచివాలయానికి వెళుతూ మార్గమధ్యంలో స్పృహ తప్పి పడిపోయారు. పింఛన్ తీసుకోవాలంటే 30 కి.మీ వెళ్లాల్సిందే టీడీపీ నేతల నిర్వాకంతో వలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో గిరిజనులు అల్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చెన్నపాలెం గ్రామం గారపెంట పంచాయతీలో ఉండగా దాని సచివాలయం పుల్లలచెరువులో ఉంటుంది. పుల్లలచెరువు నుంచి చెన్నపాలెం గిరిజనగూడెం వెళ్లాలంటే రానుపోను కలిపి 30 కి.మీ దూరం. ఇప్పటి వరకు వలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ ఇస్తున్నారు. ఈనెల వలంటీర్లు రాకపోవడంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు కూడా సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి వచ్చింది. మండుటెండలో అంతదూరం వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కల్పించారంటూ వృద్ధులు, వికలాంగులు టీడీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల డ్రామాలు ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డ్రామాలు మొదలుపెట్టారు. బుధవారం పట్టణంలోని సచివాలయాల వద్దకు వచ్చి పింఛన్ల పంపిణీకి సంబంధించి టీడీపీ వల్ల ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి వృద్ధులను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇలా ఎందుకు కూర్చోబెట్టారు అంటూ సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించారు. సచివాలయం బయటకు వచ్చి పింఛన్దారులతో మాట్లాడుతూ ఇంకా పింఛన్ డబ్బులు రాలేదు కానీ టీడీపీ వల్లే పింఛన్లు ఇంటికి రావడం లేదని అంటున్నారన్నారు. ఎమ్మెల్యే నిమ్మల వెళ్లిపోయిన తర్వాత అక్కడున్న పింఛన్దారులంతా ఇంటికి పింఛన్లు రాకుండా ఈ టీడీపీ నాయకులే అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరిపై పింఛన్దారుల ధర్నా పింఛను పంపిణీ విధానంపై చంద్రబాబు వైఖరి పట్ల లబ్దిదారులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడులో సచివాలయం వద్ద పింఛనుదారులు బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రతి నెల వలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ల కార్యక్రమాన్ని అడ్డుకున్న చంద్రబాబు వైఖరి నశించాలని నినాదాలు చేశారు. పాత పద్ధతిలో వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో ‘బోడె’ శవ రాజకీయం టీడీపీ, జనసేన కుట్రలతో ఈసారి పింఛన్ ఇవ్వటానికి వలంటీర్ లేకపోవటంతో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో వెంపటి వజ్రమ్మ (80)గుండెపోటుకు గురై మరణించింది. గంగూరు ఏఆర్ నగర్ కాలనీలో ఉంటున్న వజ్రమ్మ గంగూరు 2 సచివాలయానికి పింఛన్ సొమ్ము కోసం వెళ్లగా బ్యాంకు నుంచి సొమ్ము రావాలని, సాయంత్రం పింఛన్ ఇస్తామని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చింది. సచివాలయం నుంచి ఇంటికి వచ్చిన కొద్ది క్షణాలకే గుండెపోటుకు గురై మృత్యువాత పడింది. మరోవైపు చేయాల్సిందంతా చేసి డ్రామాలకు టీడీపీ నేతలు తెరలేపారు. వజ్రమ్మ మృతిని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు యత్నించగా స్థానిక మహిళలు తీవ్ర అభ్యంతరం తెలిపి తిప్పికొట్టారు. వజ్రమ్మ మృతి సమాచారం తెలుసుకున్న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి, పెనమలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగి రమేష్ బాధితురాలి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వజ్రమ్మకు నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. కాగా.. మంత్రి అక్కడ ఉన్న సమయంలోనే టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ కూడా తన అనుచరులతో రావటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మంత్రి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సమయంలో టీడీపీ అభ్యర్థి బోడెప్రసాద్, అతని అనుచరులు కల్పించుకుని జగన్ పింఛన్ ఇవ్వకపోవటంతోనే వజ్రమ్మ మరణించిందంటూ ఆరోపించారు. బోడె ప్రసాద్ వ్యాఖ్యల పట్ల మహిళలు అభ్యంతరం తెలిపారు. వజ్రమ్మ మరణాన్ని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు చేసిన యత్నాన్ని లబ్ధిదారులే తిప్పికొట్టారు. వలంటీర్లు పింఛను ఇస్తే చంద్రబాబుకు బాధ ఏంటని బోడె ప్రసాద్ను మహిళలు, పింఛన్ లబ్ధిదారులు ప్రశ్నించారు. జగనన్న పాలనలో ప్రతి నెల వేకువజామునే వలంటీర్లు ఇళ్లకు వచ్చి పింఛన్ ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు. వజ్రమ్మ అన్యాయంగా చనిపోయిందని, ఇప్పుడు పరామర్శించడానికి వచ్చారా అని నిలదీశారు. ఒక్కసారిగా మహిళలు తిరగబడటంతో టీడీపీ నేతలు వెనక్కి తగ్గారు. -
Pawan: ‘మా బిడ్డకు వేరొకరు తండ్రా?’
సాక్షి, కృష్ణా: అవనిగడ్డ సీటు జనసేనలో కుంపట్లు రాజేసింది. జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్కు టికెట్ ఖరారు చేస్తుండడాన్ని ఆ పార్టీ ‘అసలైన’ నేతలు భరించలేకపోతున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడకపోయినా.. దాదాపు ప్రసాద్కే టికెట్ ఖాయమైపోయిందనే చర్చ ఆ నియోజకవర్గంలో నడుస్తోంది. ఈ తరుణంలో ఆందోళనలకు జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి.విక్కుర్తి శ్రీనివాస్ నేతృత్వంలో ఇవాళ అవనిగడ్డలో ఆత్మీయ సమావేశం జరగనుంది. శ్రీనివాస్కే టికెట్ కేటాయించాలని జనసేన నేతలు, ఆయన అనుచర గణం గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ మేరకు ఇవాళ్టి సమావేశంలో తీర్మానం చేయాలని నిర్ణయించాయి. ఆలస్యం చేయకుండా ఈ తీర్మానాన్ని పవన్కు పంపడం ద్వారా.. సీటు శ్రీనివాస్కే కేటాయించేలా జనసేన అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అయితే.. ‘‘మండలి బుద్ధ ప్రసాద్ గతంలో జనసేనను పిల్లల పార్టీ అన్నారు. జనసేనలో డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని మరీ సీటు ఇవ్వాల్సిన అవసరం పవన్కు ఏముంది?. పార్టీలో అర్హులైనవాళ్లు ఎవరూ లేరా?. న్యాయంగా చూసుకుంటే అవనిగడ్డ టికెట్ నాకే దక్కాలి. కానీ, చివరి నిమిషంలో మార్చేశారు’’ అని విక్కుర్తి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు అవనిగడ్డలో జనసేన అభ్యర్థినే నిలబెట్టేందుకు పోరాడుతున్నామని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పేర్కొన్నారు. మాబిడ్డకు వేరొకరు తండ్రి అవుతారంటే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారాయన. పార్టీ కోసం కష్టపడిన ఒకరిని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పక్క పార్టీ నాయకులను తీసుకొస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. మమ్మల్ని కాదని వేరొకరికి టిక్కెట్ ఇస్తే అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. పదేళ్లు ఏ కష్టం వచ్చినా సరే.. పార్టీని వీడకుండా ఉన్నాం. ఒక్క సీటు నెగ్గిన కష్టకాలంలోనూ పవన్ వెంటే నడిచాం. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మరీ పరాయి పార్టీ జెండాలు మోశాం. ఇప్పుడేమో.. చంద్రబాబు, పవన్ ఒప్పందం ప్రకారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ను పార్టీలో చేర్చుకొని, టిక్కెట్టు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తారా? అని.. జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. ఒకవేళ పార్టీ వ్యక్తికి కాదని బయటకు వాళ్లకు ఇస్తే గనుక మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని పవన్ను అవనిగడ్డ జనసేన శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. -
Pawan Kalyan: ‘మా బిడ్డకు వేరొకరు తండ్రా?’
కృష్ణా, సాక్షి: అవనిగడ్డ సీటు జనసేనలో కుంపట్లు రాజేసింది. జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్కు టికెట్ ఖరారు చేస్తుండడాన్ని ఆ పార్టీ ‘అసలైన’ నేతలు భరించలేకపోతున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడకపోయినా.. దాదాపు ప్రసాద్కే టికెట్ ఖాయమైపోయిందనే చర్చ ఆ నియోజకవర్గంలో నడుస్తోంది. ఈ తరుణంలో ఆందోళనలకు జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి. విక్కుర్తి శ్రీనివాస్ నేతృత్వంలో ఇవాళ అవనిగడ్డలో ఆత్మీయ సమావేశం జరగనుంది. శ్రీనివాస్కే టికెట్ కేటాయించాలని జనసేన నేతలు, ఆయన అనుచర గణం గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ మేరకు ఇవాళ్టి సమావేశంలో తీర్మానం చేయాలని నిర్ణయించాయి. ఆలస్యం చేయకుండా ఈ తీర్మానాన్ని పవన్కు పంపడం ద్వారా.. సీటు శ్రీనివాస్కే కేటాయించేలా జనసేన అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అయితే.. ‘‘మండలి బుద్ధ ప్రసాద్ గతంలో జనసేనను పిల్లల పార్టీ అన్నారు. జనసేనలో డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని మరీ సీటు ఇవ్వాల్సిన అవసరం పవన్కు ఏముంది?. పార్టీలో అర్హులైనవాళ్లు ఎవరూ లేరా?. న్యాయంగా చూసుకుంటే అవనిగడ్డ టికెట్ నాకే దక్కాలి. కానీ, చివరి నిమిషంలో మార్చేశారు’’ అని విక్కుర్తి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు అవనిగడ్డలో జనసేన అభ్యర్థినే నిలబెట్టేందుకు పోరాడుతున్నామని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పేర్కొన్నారు. మాబిడ్డకు వేరొకరు తండ్రి అవుతారంటే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారాయన. పార్టీ కోసం కష్టపడిన ఒకరిని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పక్క పార్టీ నాయకులను తీసుకొస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. మమ్మల్ని కాదని వేరొకరికి టిక్కెట్ ఇస్తే అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. పదేళ్లు ఏ కష్టం వచ్చినా సరే.. పార్టీని వీడకుండా ఉన్నాం. ఒక్క సీటు నెగ్గిన కష్టకాలంలోనూ పవన్ వెంటే నడిచాం. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మరీ పరాయి పార్టీ జెండాలు మోశాం. ఇప్పుడేమో.. చంద్రబాబు, పవన్ ఒప్పందం ప్రకారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ను పార్టీలో చేర్చుకొని, టిక్కెట్టు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తారా? అని.. జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. ఒకవేళ పార్టీ వ్యక్తికి కాదని బయటకు వాళ్లకు ఇస్తే గనుక మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని పవన్ను అవనిగడ్డ జనసేన శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
కరివేపాకులు చాలా రోజులు వరకు నిల్వ ఉండాలంటే..!
ఎంట్రీలు పడుతున్నాయ్.. బీ రెడీ!
బాహుబలి పోస్టర్ను రీక్రియేట్ చేసిన స్టార్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
T20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖారారు.. షెడ్యూల్ ఇదే
‘డీప్ సీ మిషన్’ కలిగిన ఆరోదేశంగా భారత్
ఫండ్స్లో కొత్త ఇన్వెస్టర్ల జోరు
కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
పాతకాలం విమానం కుప్పకూలి ఇద్దరి మృతి
ఢిల్లీలో రోగి.. గురుగ్రామ్లో వైద్యుడు.. 40 కి.మీ. దూరం నుంచి ఆపరేషన్
Advertisement