jithender reddy
-
‘జితేందర్ రెడ్డి’ మూవీ రివ్యూ
టైటిల్: జితేందర్ రెడ్డినటీనటులు:రాకేశ్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలునిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డిదర్శకుడు: విరించి వర్మసంగీతం: గోపి సుందర్ఎడిటర్: రామకృష్ణ అర్రంవిడుదల తేది: నవంబర్ 8, 2024కథేంటంటే.. తెలంగాణలోని జగిత్యాలకు చెందిన దివంగత ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్ ఇది. 1980లో జగిత్యాల పట్టణంలో నక్సలైట్లకు, ఆరెస్సెస్, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో జితేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్న సమయంలో వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అయితే జితెందర్(రాకేశ్ వర్రె) బాల్యం ఎలా గడిచింది? నక్సల్స్ని ఎందుకు ఎదురించాడు? కాలేజీ రోజుల్లో ఏబీవీపీ నాయకుడిగా రాకేశ్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? ఆయనపై ఆరెస్సెస్ నేత గోపన్న(సుబ్బరాజు) ప్రభావం ఎంతవరకు ఉంది? అతన్ని చంపడానికి నక్సల్స్ వేసిన ప్లాన్ ఏంటి? జితేందర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగిత్యాలలో ఎలాంటి మార్పులు జరిగాయి? కాలేజీ స్నేహితురాలు, లాయర్ శారద(రియా సుమన్) అతనికి ఎలా తోడుగా నిలిచింది? చివరకు నక్సల్స్ చేతుల్లో ఎలా మరణించాడు? అనేదే ఈ సినిమా కథ.ఎలా ఉందంటే.. జితేందర్ రెడ్డి గురించి జగిత్యాలతో పాటు కరీంనగర్ చుట్టుపక్క ప్రాంతాల వారికి బాగా తెలుసు. నక్సల్పై ఆయన చేసిన పోరాటం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే కరీంనగర్ జిల్లా మినహా ఆయన గురించి, ఆయన కుటుంబ నేపథ్యం గురించి పూర్తిగా తెలిసినవారు అంతగా లేరు. జితేందర్ రెడ్డి ఏబీవీపీ నాయకుడని, నక్సల్స్కు వ్యతిరేకంగా పోరాడి వారి చేతుల్లోనే మరణించారనే విషయం మాత్రమే తెలుసు. ఈ చిత్రంలో జితేందర్ రెడ్డి గురించి బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు చెప్పారు. అయితే వీటిల్లో నిజం ఎంత అనేది పక్కకు పెడితే..సినిమా పరంగా చూస్తే దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ని తెరపై చక్కగా, అందరికి అర్థమయ్యేలా చూపించాడు. జితేందర్ రెడ్డి బాల్యం మొదలు కొని చనిపోయే వరకు ఆయన జీవితంలో చోటు చేసుకున్న కీలక ఘటలన్నింటిని రెండున్నర గంటల సినిమాలో చూపించేశాడు. జితేందర్కి చిన్నప్పటి నుంచే దేశ భక్తి ఎక్కువని రిజిస్టర్ చేయడానికి ప్రారంభంలోనే పలు సీన్లను యాడ్ చేశాడు. సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగానే వాడుకున్నాడు. యువకుడి ఎన్కౌంటర్ సీన్ తర్వాత కథపై ఆసక్తి పెంచుతుంది.ఫస్టాఫ్లో జితేందర్ రెడ్డి బాల్యంతో పాటు ఆయన స్టూడెంట్ లీడర్గా ఎదిగిన తీరును చూపిస్తూనే నక్సల్స్కి ఎలా టార్గెట్ అయ్యారనేది చూపించారు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్లలో నాటకీయత ఎక్కువైనట్లు కనిపిస్తుంది. కొన్ని చోట్ల సాగదీతగానూ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. చాలా చోట్ల గూస్బంప్స్ సీన్లు ఉంటాయి. అప్పటి ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి నక్సల్స్పై చేసే ఫిర్యాదు సీన్, ఎన్నికల ప్రచారం, క్లైమాక్స్ సన్నీవేశాలు అదిరిపోతాయి. అయితే ఈ కథ మాత్రం ఓ వర్గం వారికి ఎంత బాగా నచ్చుతుందో అంతే స్థాయిలో మరో వర్గం నుంచి వ్యతిరేకత రావొచ్చేమో. సినిమాలో కీలకమైన పాత్రల్లో కూడా అంతగా గుర్తింపులేని నటీనటులను పెట్టుకోవడం కూడా కొంతవరకు మైనస్ అయిందనే చెప్పాలి.ఎవరెలా చేశారంటే..జితేందర్ రెడ్డి పాత్రకు రాకేశ్ వర్రే న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. తెరపై నిజంగానే జితెందర్ రెడ్డిని చూసినట్లుగా అనిపిస్తుంది. ఆర్సెసెస్ నాయకుడు గోపన్నగా సుబ్బరాజు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నక్సలైట్గా ఛత్రపతి శేఖర్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. లాయర్గా రియా సుమన్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జితేందర్ రెడ్డి పర్సనల్ పీఏ పాత్రలో రవిప్రకాశ్ బాగా మెప్పించాడు. రవి ప్రకాశ్ తండ్రి పాత్రను పోషించిన వ్యక్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. క్లైమాక్స్ సాంగ్స్ హృదయాలను హత్తుకుంటుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కొన్ని విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - Rating: 2.75/5 -
ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది.. తప్పు చేశా: రాకేశ్
ఉయ్యాలా జంపాల, ‘మజ్ను’ చిత్రాల ఫేం విరించి వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే హీరోగా నటించారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హీరో రాకేశ్ వర్రే ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ఆ తప్పు చేయకుండా ఉండాల్సిందని మాట్లాడారు. ఆ వివరాలేంటో చూసేద్దాం.రాకేశ్ వర్రే మాట్లాడుతూ.. 'నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను. ఇండస్ట్రీలో సెట్ అవ్వడానికి చాలా రోజులు టైమ్ పట్టింది. కానీ కొత్తవాళ్లను ఎంకరేజ్ చేద్దామని పేకమేడలు ప్రాజెక్ట్ చేశా. ఆ తర్వాత నాకు అర్థమైంది. ఆ ప్రాజెక్ట్ చేయకుండా ఉండాల్సిందని. అదే నేను వేసిన రాంగ్ స్టెప్. నాకు ఒక సక్సెస్ వస్తే చాలనుకున్నా. కానీ ఇక్కడ మార్కెట్ అనేది ముఖ్యం. పేకమేడలు మాకు మూడేళ్లు పట్టింది. చేస్తూనే ఉన్నాం. ఎవరైనా మాకు బ్రాండ్ ఉండి ఉంటే ఏడాదిన్నరలోనే పూర్తి చేసేవాళ్లం. ఇక్కడ మనకు బ్రాండ్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు. రాకేశ్ వర్రే ఒక బ్రాండ్ అయ్యాకే కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తా. తప్పకుండా చేస్తా. ఇది నేను నేర్చుకున్న గుణపాఠం. పేకమేడలు సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నా' అని అన్నారు. కాగా.. పేకమేడలు చిత్రానికి రాకేశ్ వర్రే నిర్మాతగా వ్యవహరించారు. కాగా.. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం ధర్మం కోసం నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. అంతే కాకుండా ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్తో మాట్లాడటం ట్రైలర్లోనూ చూపించారు. కాగా.. ఈ చిత్రంలో వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటించారు. -
జితేందర్ రెడ్డి మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్
-
Jithender Reddy Trailer: జగిత్యాల టైగర్ అంటారు.. పేరు జితేందర్ రెడ్డి!
‘ఉయ్యాలా జంపాల’, ‘మజ్ను’ చిత్రాల ఫేం విరించి వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో ఉండగా, ప్రధాన పాత్రలు పోషించిన రాకేష్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం ధర్మం కోసం నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమా లో చూపించారు. అంతే కాకుండా, ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్తో మాట్లాడటం ట్రైలర్ లో చూపించారు. వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
రియల్ స్టోరీ ఆధారంగా వస్తోన్న హిస్టారికల్ మూవీ.. గ్లింప్స్ అదుర్స్!
మిర్చి, బాహుబలి, ఎవరికి చెప్పొద్దు లాంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా విరించి వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్మాత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..'చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటి ఒక చరిత్రే జితేందర్ రెడ్డి జీవితం. రాకేష్ ఈ సినిమాతో జితేందర్ రెడ్డిగా ఆ పాత్రలో జీవించారు. ప్రతి ఒక్కరికి జితేందర్ రెడ్డి పాత్ర గుర్తుండిపోతుంది. చరిత్ర అంటే జరిగిన నిజాన్ని తెలుసుకోవడం. అలాంటి ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ల చరిత్ర తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు. నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ..'ఇందులో నా క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్గా చాలా సినిమాల్లో నటించా. కానీ ఇది కచ్చితంగా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. గ్లింప్స్ చూసిన తర్వాత సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. విరించి వర్మ గతంలో చేసిన సినిమాలు నాకు చాలా ఇష్టం. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ..'నేను గతంలో చేసిన రెండు సినిమాలు లవ్ స్టోరీస్ మంచి హ్యూమర్ ఉన్న సినిమాలు. అది మాత్రమే కాదు మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న డ్రామా అంటే చాలా ఇష్టం. అదేవిధంగా జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కోసం ఆయన విలేజ్కు వెళ్లి ఆయన స్నేహితులతో, ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యి ఎన్నో విషయాలు తెలుసుకుని ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చా. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. -
కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి.. రఘునందన్రావు సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని చేరిన జితేందర్రెడ్డి, రంజిత్రెడ్డి కంపెనీల బాగోతం బయటపెడుతామని బీజేపీ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందర్రావు అన్నారు. బీజేపీకి సిద్ధాంతం లేదని కొందరు పార్టీ మారినవారు అంటున్నారని, ఆయన కొడుక్కి సీటు ఇస్తే సిద్ధాంతం ఉన్నట్లు.. లేదంటే లేనట్లా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘పార్టీలోకి రాగానే జాతీయ కార్యవర్గ సభ్యుడి సీటిచ్చి కూర్చోబెడితే బీజేపీ సిద్ధాంతం మంచింది.. లేకుంటే మంచిది కాదు. ఎంపీ సీటు దక్కకుంటే సిద్ధాంతాలు లేని పార్టీనా?. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పార్టీకి క్షమాపణలు చెప్పాలి. బీజేపీ తప్ప.. ఏ పార్టీకి సిద్ధాంతం లేదు. మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడటం బాధాకరం. ఏ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఏ కంపెనీ, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పార్టీ మారి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేశారు. బీజేపీపై ఈ వ్యాఖ్యలు పొరపాటున వ్యాఖ్యానించారని భావిస్తున్నా. చేవెళ్ల ఎంపీతో ఉన్న వ్యాపార లావాదేదీలేంటి?. మీరిద్దరూ కలిసి కాంగ్రెస్లో చేరి మల్కాజ్ గిరి, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్లకు ఎంత ఖర్చు పెడాతారని చెప్పారు. మా పార్టీలో చాలారోజులు మాతో కలిసి పనిచేశారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగడంలేదు. ఈస్ట్రన్, వెస్ట్రన్, సదరన్ కన్స్ట్రక్షన్, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలేవి?. సర్వే నంబర్ 343లో ఉన్న ప్రభుత్వ భూమిఎంత? ఎన్నిఫ్లోర్లు ఇవ్వాలి? ఎన్ని ఇచ్చారు?. కడితే ఎంత ఖర్చవుతుంది.. అమ్మితే ఎంత వస్తుంది?. గత ప్రభత్వ హయాంలో ఏం చేశారు.. ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎలా చేతులు మారుతున్నాయి. అసలు ఏరకంగా మీరిద్దరూ కలసి ఎన్నికలకు కమర్షియల్ చేయాలనుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీలుగా గెలిచిన ఎంపీలందరిలో ఎక్కువ లబ్ధి పొందింది వారే. భూమికి భూమి ఎక్కడా ఇవ్వలేదు.. కానీ ఆయనకు మాత్రం ఇచ్చారు. 25 ఫ్లోర్లకు అనుమతులిస్తే.. 33 ఫ్లోర్లు అయ్యాయి. పీసీసీ హోదాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో గుట్టలు కొడతారా? గుడులు మింగుతారా? ఏఐసీసీకి లేఖ రాస్తామని? చర్యలు తీసుకుంటామని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నట్లు? జితేందర్ రెడ్డి,రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక జరిగిన ఆర్థిక ప్రయోజనాలు ఏంటి? కంపెనీల ప్రయోజనాలు ఏంటి?. ఎన్నికలకు మీరు పంపిచే డబ్బుకు సంబంధించి పూర్తి సమాచారం మాకు వచ్చింది. ఏ కంపెనీ నుంచి ఎంత వస్తోందనే వివరాలు ప్రజల ముందు ఉంచుతాం. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో జాబితాలో కేవలం జితేందర్ రెడ్డి కుమారుడి ఒక్కరి పేరే వచ్చింది. అప్పుడు పార్టీకి సిద్ధాంతం ఉంది.. ఇప్పుడు లేదా?. షేక్పేటలోని సర్వే నంబర్ 403ఒక సంచలనం. అందులో ఎలా బ్లాస్టింగ్స్ అవుతున్నాయి.. వందల కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయనే అంశాలపై విచారణ జరగాలి. వారు చేసే అడ్డగోలు దందాపై ఈడీ, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జితేందర్రెడ్డి వెంట్రుక కూడా కొనలేరని వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు వందల కోట్లు చేతులు మారుతున్నాయి. ఇప్పుడున్న స్పీకర్ గతంలో ప్రెస్మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి రూ.500 కోట్ల స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరి ఆర్థిక నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు పంపించే డబ్బు సంచులతోనూ అప్రమత్తంగా ఉండాలి’ అని రఘునందన్ రావు అన్నారు. -
ఇంట్రస్టింగ్గా జితేందర్ రెడ్డి వీడియో.. ఆయనెవరో తెలిసేది ఆరోజే!
'ధీరుడు ఒకసారే మరణిస్తాడు.. కానీ, పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు' అన్న డైలాగుతో రిలీజైన 'జితేందర్ రెడ్డి' షార్ట్ వీడియో ఆసక్తిని పెంచుతోంది. అసలు ఎవరు ఈ 'జితేందర్ రెడ్డి'? ఆయన గురించి తెలుసుకోవడానికి ఏముంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి ప్రేమ కథలను దర్శకత్వం వహించిన విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'జితేందర్ రెడ్డి'. ఇటీవలే రిలీజైన పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచగా సెప్టెంబర్ 18న విడుదలైన 'జితేందర్ రెడ్డి' వీడియో సినిమాపై అంచనాలను పెంచేసేంది. 'జితేందర్ రెడ్డి' అనే నేను అంటూ ఆయన చేసిన హామీ, అలాగే ఆ వీడియోలో చూపించిన 'ధీరుడు ఒకసారే మరణిస్తాడు కాని పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు' అన్న మాట ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. కాగా ఈ సినిమాలో 'జితేందర్ రెడ్డి'గా చేసింది ఎవరు? అని తెలుసుకోవాలంటే ఈ నెల 21 వరకు ఆగాల్సిందే! ఎందుకంటే ఆరోజే చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేయనుంది. ఈ చిత్రానికి వి.ఎస్ జ్ఞాన శేఖర్ కెమెరామెన్గా వ్యవహరిస్తుండగా ఎన్నో సూపర్హిట్ చిత్రాలకు సంగీతం అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. నాగేంద్రకుమార్ ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చదవండి: గాఢంగా ప్రేమించిన ప్రియుడు మరో అమ్మాయితో.. బ్రేకప్పై స్పందించిన నటుడి భార్య -
'ఉయ్యాలా జంపాలా' దర్శకుడి యాక్షన్ మూవీ
'ఉయ్యాల జంపాల', 'మజ్ను' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ.. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత కొత్త మూవీ ప్రకటించాడు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న 'జితేందర్ రెడ్డి' సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ని ప్రముఖ డైరెక్టర్ దేవకట్టా.. శనివారం విడుదల చేశారు. (ఇదీ చదవండి: ఆగిపోయిన తెలుగు 'బిగ్బాస్ 7'.. కారణం అదే?) 1980లో జరిగే ఓ పీరియడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా నడిచే యాక్షన్ డ్రామా. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. డైరెక్టర్ విరించి వర్మ.. తీసిన రెండు సినిమాలు లవ్ స్టోరీస్. ఈసారి మాత్రం పవర్ఫుల్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నారు. హీరోతోపాటు ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తారు. (ఇదీ చదవండి: శోభా కన్నీళ్లు.. టాప్-5లో ఉండవని నాగ్ కౌంటర్!) -
జితేందర్ రెడ్డి ట్వీట్ పై ఈటల కౌంటర్
-
జితేందర్ రెడ్డి ట్వీట్ పై బీజేపీ సీనియర్ నేతల అసహనం
-
తెలంగాణలో దారితప్పుతున్న బీజేపీ బండి!
హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీనే ప్రధాన పోటీ అని భావిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఆ పార్టీ గాడి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకూ పెద్దగా అసంతృప్తి ఛాయలు పెద్దగా కనిపించని రాష్ట్ర బీజేపీలో ఇప్పుడు ఆ పరిస్థితి మరింత ముదిరినట్లే ఉంది. తెలంగాణ బీజేపీలో కూడా పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవనేది తాజాగా బయటపడింది. నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయనే విషయం బహిర్గతమైంది. జితేందర్రెడ్డి వివాదాస్పద ట్వీట్! మహబూబ్నగర్ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కలకలం రేపుతోంది. సొంత పార్టీ నేతల తీరును విమర్శిస్తూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమయ్యింది. దున్నపోతుల్ని వ్యాన్లోకి ఎక్కించే ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన జితేందర్రెడ్డి.. తెలంగాణ బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రధానంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్తో సహా పలువురిపై గత కొంతకాలంగా గుర్రుగా ఉన్న జితేందర్రెడ్డి.. ఇప్పుడు అందులో భాగంగా దున్నపోతుల వీడియో-దానికి క్యాప్షన్ ఇవ్వడం ఒక్కసారిగా అలజడి రేపింది రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో.. అధిష్టానానికి జితేందర్రెడ్డి వ్యవహారం! ఈ ట్వీట్ వ్యవహారం ఇప్పటికే అధిష్టానానికి చేర్చారు స్థానిక నేతలు. అసలు దున్నపోతుల వీడియో.. ఈ ట్రీట్మెంట్ అవసరం అని ఎవరిని ఉద్దేశించి పెట్టారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాన్ని ట్విట్టర్లో ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి జితేందర్రెడ్డి వెనుకాల ఎవరున్నారనే కోణంలో అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగా జితేందర్రెడ్డి అసంతృప్తా.. ఆక్రోషమా అనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ యత్నం దీన్ని అవకాశంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో క్రమేపీ బలాన్ని తిరిగి పుంజుకుంటున్న కాంగ్రెస్.. బీజేపీలో విభేదాల్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఇప్పటివరకూ బీఆర్ఎస్-బీజేపీ ఒకటే అంటూ వ్యాఖ్యానిస్తూ వస్తున్న కాంగ్రెస్.. బీజేపీ తాజా వివాదంపై స్పందించింది. తెలంగాణ బీజేపీలో ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరొకవైపు బీజేపీలో కొత్తగా చేరిన నేతలు మాత్రం అంతర్మథనంలో పడ్డారు. బీజేపీలో పట్టాలు తప్పిన క్రమశిక్షణ అధిష్టానం ఆదేశాలతో గీత దాటుతున్న నేతలకు వార్నింగ్ లెటర్ విడుదల చేశారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు. క్రమశిక్షణా రాహిత్యం, నిర్లక్ష్యపూరిత వైఖరి సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి నష్టం చేస్తున్న నేతలను సహించేది లేదన్నారు. పార్టీపైనా, పార్టీ నాయకత్వంపైనా బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తే పార్టీకి నష్టం చేసినట్లే అని ఆయన పేర్కొన్నారు. ‘ పార్టీ ఎజెండా కంటే వ్యక్తిగత ఎజెండాలు ఎప్పటికీ ఎక్కువ కాదు. పార్టీలో ఒక 'లక్ష్మణ రేఖ' ఉందని మర్చిపోకూడదు. మా పార్టీకి చెందిన కొందరు నాయకులు, పార్టీకి నష్టం చేకూరేలా చేస్తోన్న అవాంఛనీయ బహిరంగ ప్రకటనలు, మీడియా లీకులు, యథాలాపంగా చేస్తోన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు, చేస్తోన్న వాళ్లు తాము అసలు ఏ పార్టీలో ఉన్నామో మర్చిపోతున్నారా?, ఇది బీఆర్ఎస్-కాంగ్రెస్ కాదు.. బీజేపీ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. పార్టీనీ, పార్టీ నాయకత్వాన్నీ బహిరంగంగా విమర్శించే సంస్కృతి, వ్యవస్థ బీజేపీలో లేవు. ఉండవు. ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తోన్న వాళ్లంతా పార్టీలో కీలక హోదాలలో ఉన్నవారే. వాళ్లకు తమ గొంతు వినిపించడానికి పార్టీ తగిన అవకాశాలు ఉన్నాయి.. ప్రత్యేక వేదిక కూడా ఉంది’ అని పేర్కొన్నారు. This treatment is what's required for Bjp Telangana leadership.@blsanthosh @BJP4India @AmitShah @sunilbansalbjp @BJP4Telangana pic.twitter.com/MMeUx7fb4Q— AP Jithender Reddy (@apjithender) June 29, 2023 చదవండి: ఇదీ తెలంగాణలో సంగతి.. మోదీ వద్ద చర్చ! -
బీజేపీ నేత జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్
-
విచారణకు హాజరుకావాలని జితేందర్రెడ్డి పీఏ రాజుకు నోటీసులు
-
మా ఇంటికి ఎవరొచ్చినా బస కల్పించడం నా బాధ్యత: జితేందర్రెడ్డి
-
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. డీకే అరుణ రియాక్షన్
-
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. డీకే అరుణ, జితేందర్ రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో బీజేపీ నేతలపై ఆరోపణలు రావడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని పేర్కొన్నారు. కేసు వెనక రాజకీయ, ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పే వారిపై కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్, పోలీసులు కథ రక్తి కట్టిస్తున్నారని, మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ వేయాలన్నారు. కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారంతా ఒకప్పుడు మంత్రి అనుచరులేనని, వారితో తమకెలాంటి సంబంధం లేదన్నారు. సుపారీ ఇవ్వగలిగే శక్తి టీఆర్ఎస్ నేతలకు తప్ప ఎవరికీ లేదన్నారు. మున్నూరు రవిపై ఎక్కడా ఆరోపణలు లేవు మరోవైపు మాజీ ఎంపీ జితేంతర్ రెడ్డి మాట్లాడుతూ.. మున్నూరు రవి తమ ఇంటికి రావడం ఇదేం తొలిసారి కాదని అన్నారు. మహబూబ్నగర్ నుంచి ఢిల్లీకి కార్యకర్తలు ఎవరొచ్చినా అతిథ్యం ఇస్తానని తెలిపారు. ఉద్యమ కారులకు వసతి కల్పించడం తన బాధ్యత అని అన్నారు. మున్నూరు రవిపై ఎక్కడా ఆరోపణలు లేవని, క్రిమినల్ చర్రిత లేదని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ నాయకత్వానికి వివరిస్తున్నామని తెలిపారు. బీజేపీ నేతలపై కక్ష తీర్చుకునేందుకు ఈ ప్లాన్ అని విమర్శించారు. తాను విచారణకు సిద్దమేనని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. ప్రభుత్వానికి సీబీఐపై నమ్మకం లేకుంటే రిటైర్డ్ జడ్జీతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జితేందర్రెడ్డి ఇంటిపై దాడి ఇదిలా ఉండగా.. మహబూబ్నగర్లోని మాజీ ఎంపీ జితేందర్రెడ్డి ఇంటిపై దాడి చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఆయన ఇంట్లోని కారు అద్దాలు ధ్వంసం చేశారు. గేటు ముందు టైర్ను తగల బెట్టారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని జితేందర్రెడ్డి తన ట్విటర్లోషేర్ చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో కిడ్నాప్ ఘటన అనంతరం మహబూబ్నగర్లో దుండగులు తన ఇంటిపై దాడి చేసి బెదిరించారని ఈ విషయంపై మహబూబ్నగర్ పోలీసులకు, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాగా మహబూబ్నగర్కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్లు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారని, వీరిని జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్లో ఉన్నట్లు తేలడంతో అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపిన విషయం తెలిసిందే. జితేందర్ రెడ్డి డ్రైవర్, పీఏ రాజు వీరికి షెల్టర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఈ హత్య కుట్రకు సంబంధించి జితేందర్రెడ్డి పాత్రపై కూడా విచారణ జరుతామని సీపీ ఎవల్లడించారు. ఈ నేపథ్యంలోనే జితేందర్రెడ్డి ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. -
ఈటలపై నిందలను ప్రజలు నమ్మడం లేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘ఈటల రాజేందర్పై ప్రభుత్వం వేసిన నిందలను ప్రజలెవరూ విశ్వసించడం లేదు. కేసులకు భయపడి ఆయన బీజేపీలో చేరాడనడంలో వాస్తవం లేదు. హుజూరాబాద్లో ఆయనకు ప్రజాబలం మెండుగా ఉంది. ఈ నియోజకవర్గాన్ని ఆయన అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చేశారు. అదే ఆయనను గెలిపిస్తుంది. గ్యాస్, పెట్రో ధరలు, దళితబంధు నిలుపుదలలో టీఆర్ఎస్ మాపై చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలే. రాబోయే ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు’అని బీజేపీ నేత, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇన్చార్జి, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నిక నేపథ్యంలో ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. సాక్షి: ఈటల రాజేందర్ ప్రచారానికి ప్రజల్లో స్పందన ఎలా ఉంది? జితేందర్: ఈటలకు హుజూరాబాద్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బడుగుల ప్రతినిధిగా ఆయనకు ఉన్న గుర్తింపు కలసివస్తోంది. ఇందుకు జనాల నుంచి వస్తున్న అపూర్వ స్పందనే కారణం. సాక్షి: ఈ ఉపఎన్నికలో అటు వైపు మంత్రి హరీశ్రావు ప్రచారం చేస్తున్నారు. మరి రాజేందర్ విజయంపై మీ పార్టీ ధీమాగా ఉందా? జితేందర్: టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. గతంలో హుజూర్నగర్, దుబ్బాక ఉప ఎన్నికల్లో వారిచ్చిన హామీలేవీ నిలుపుకోలేదు. హుజూరాబాద్లో మౌలిక సదుపాయాలతో పాటు అన్నిరంగాల్లో రాజేందర్ చేసిన అభివృద్ధి చాలా బాగుంది. సాక్షి: కేసులకు భయపడే రాజేందర్ మీ పార్టీలో చేరారన్న ప్రచారంపై మీ స్పందనేంటి? జితేందర్: అసలు ప్రభుత్వం వేసినవి అన్నీ నిందలే. ఈటల సౌమ్యుడు. అందుకే, ఆయనను పార్టీలో చేర్చుకున్నాం. నియోజకవర్గ ప్రజలెవరూ కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఆరోపణలను నమ్మడం లేదు. సాక్షి: దళితబంధును మీపార్టీ వారే ఆపారన్న ఆరోపణలను మీరెలా తిప్పికొడతారు? జితేందర్: అవన్నీ అసత్యాలు. ప్రభుత్వం పథకం ప్రారంభించి రెండు నెలలు దాటుతోంది. ఇంతకాలం లబ్ధిదారుల ఖాతాల్లో పూర్తిస్థాయిలో డబ్బులు ఎందుకు వేయలేదు. ఖాతాల్లో ఫ్రీజ్ అయిన డబ్బులను విడుదల చేయాలని మాత్రమే సీఈసీని మేం లేఖ ద్వారా కోరాం. సాక్షి: గ్యాస్, పెట్రో ఉత్పత్తుల ధరలు మీకు ప్రతికూలంగా మారతాయన్న ఆందోళన ఉందా? జితేందర్: గ్యాస్, పెట్రోల్ అంతర్జాతీయ ధరల మీద ఆధారపడి ఉంటాయి. కేంద్రంతోపాటు రాష్ట్రాలూ పన్నులు వేస్తున్నాయి. ఆ నిధులను మేం రక్షణ, కేంద్ర పథకాలు, మౌళికసదుపాయాల కోసం వినియోగిస్తాం. వీళ్లు మాత్రం ఆ నిధులను కాళేశ్వరానికి మళ్లించి కమీషన్లు తీసుకుంటున్నారు. సాక్షి: రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు ఇవ్వడం లేదన్న విమర్శలపై మీరేమంటారు? జితేందర్: కరీంనగర్ రైల్వేలైన్, ఆర్వోబీలు, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీల్లో సగం రాష్ట్రవాటా ఉండాలి. మా వంతు నిధులు మేం భరిస్తున్నాం. రాష్ట్రం ముందుకు రాకుండా మమ్మల్ని నిందించడం తగదు. సాక్షి: కేంద్ర వ్యవసాయ చట్టాలతో జమ్మికుంట, హుజూరాబాద్ మార్కెట్లు మూతబడతాయన్న టీఆర్ఎస్ ఆరోపణలపై ఏమంటారు? జితేందర్: రైతులంతా మా చట్టాలతో చాలా సంతోషంగా ఉన్నారు. ముందు మీరు మార్కెట్లలో రైతుల నుంచి వసూలు చేసే సెస్ భారం తగ్గించాలని కోరుతున్నాం. సాక్షి: గతంలో ఇక్కడ బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి గెలిస్తే అది ఎవరిబలం? జితేందర్: అది ఇద్దరి బలం. స్థానికంగా రాజేందర్కు తిరుగులేని ప్రజాదరణ ఉంది. అందులో అనుమానమేమీ లేదు. విజయం సాధిస్తే అందులో సింహభాగం ఈటలదే అవుతుంది. సాక్షి: రాజేందర్కు పార్టీలో కీలక నేతలు సరిగా సహకరించడం లేదన్న ఆరోపణలపై ఏమంటారు? జితేందర్: అవన్నీ సత్యదూరమైన మాటలు. ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు ఇన్చార్జీలు ఐదున్నరనెలలుగా కష్టపడుతున్నారు. స్టార్ క్యాంపెయినర్లు, కేంద్రమంత్రులు కూడా ఈటల వెంట ఉన్నారు. సాక్షి: ఈ ఉప ఎన్నిక తరువాత ఈటల కాంగ్రెస్లోకి వెళతారన్న ప్రచారంపై ఏమంటారు? జితేందర్: ఈటల గెలిచాక. టీఆర్ఎస్సే వెళ్లి కాంగ్రెస్లో విలీనమవుతుంది. సాక్షి: దుబ్బాక, బల్దియా తరహాలో ప్రత్యేక వ్యూహాలేమైనా అనుసరిస్తున్నారా? జితేందర్: మాకు ఎలాంటి వ్యూహాలు లేవు. ప్రజల అండదండలే మాకు శ్రీరామ రక్ష. గతం కంటే భారీ మెజారిటీతో ఈటల గెలుస్తారు. -
ఆ నలుగురు నేతల గుప్పిట్లో బీజేపీ
ఆ పార్టీలో ఆ నలుగురు నేతలు తమ ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారట. దీంతో కొత్త, పాత నేతల మద్య విభేదాలు భగ్గుమంటున్నాయి. బయట అందరితో కలిసికట్టుగా ఉన్నట్టు కనిపించినా లోలోపల గోతులు తీస్తారనే ప్రచారం ఉంది. జిల్లాలో పార్టీ బలపడేందుకు అవకాశాలు ఉన్నా ఆ నలుగురు నేతల తీరు ఇబ్బందిగా మారిందని కార్యకర్తలు అంటున్నారు. మరో వైపు తన కుమారుడిని రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎవరా నేతలు... ఎక్కడ జరుగుతోంది ఈ వ్యవహారం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీకి మంచి పట్టుంది. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. పార్టీ బలపడేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ నేతల మధ్య సమన్వయలోపం.. ఆధిపత్య పోరు.. వర్గ విభేదాలు పార్టీకి నష్టం కల్గిస్తున్నాయి. గతంలో అలంపూర్ నుంచి రవీంద్రనాథ్రెడ్డి బీజేపీ తరపున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 జితేందర్రెడ్డి బీజేపీ నుంచి ఎంపీగా మహబూబ్నగర్ నుంచి గెలిచారు. 2008లో జరిగిన ఉపఎన్నికల్లో మహబూబ్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి యెన్నం శ్రీనివాస్రెడ్డి గెలిచారు. 2014, 2018 సాధారణ ఎన్నికల్లో ఆచారి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కల్వకుర్తి, మహబూబ్నగర్ సెగ్మెంట్లతో పాటు పలు పట్టణాల్లో పార్టీకి బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. గత లోక్సభ ఎన్నికల ముందు మాజీమంత్రి డీకే అరుణ, మాజీఎంపీ జితేందర్రెడ్డితో పాటు వారి అనుచరులు బీజేపీలో చేరిన తర్వాత జిల్లాలో పార్టీ బలం మరింత పెరిగింది. పార్టీ క్యాడర్లో జోష్ పెరిగింది. (అగ్గిరాజేస్తున్న ఆధిపత్య పోరు) 2019 లోక్సభ ఎన్నికల్లో డీకే అరుణ మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేసి అధికార టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. గెలవకపోయినా పార్టీ క్యాడర్కు ఓ కొత్త ఊపునిచ్చింది. మహబూబ్నగర్, మక్తల్ సెగ్మెంట్లో టీఆర్ఎస్ కంటే అధికంగా ఓట్లు సాధించారు. తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు పెంచిన ఆ పార్టీ మక్తల్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోగా నారాయణపేట, భూత్పూరు, అమరచింతలో అధిక స్థానాలు గెలుచుకుంది. డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షపదవి రావటంతో మరింత విశ్వాసం పెరిగింది. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీజేపీలో చేరారు. ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఇబ్బందిగా ఆ నలుగురు.. ఇక దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలవటంతోపాటు హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలవటంతో జోష్ మీద ఉన్న ఆపార్టీ జిల్లాలో కూడా దూకుడు పెంచింది. పార్టీ కార్యక్రమాలను, ప్రజాసమస్యలపై తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. మరోవైపు ఇతర పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు, ఆయా నియోజకవర్గాల్లోని బలమైన నేతలను పార్టీలోకి ఆకర్షించేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మొదటి నుంచి పార్టీలో ఉన్న నలుగురు నేతల తీరు ఇబ్బందిగా మారిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అందులో పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, సీనియర్ నాయకులు నాగూరావునామాజీ, ఆచారి, కొండయ్య పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొత్తగా పార్టీలో చేరిన నేతలకు వీరు సహకరించటం లేదనే ప్రచారం సాగుతుంది. గతంలో పార్టీలో చేరి మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేసిన నాగం జనార్దన్రెడ్డికి ఈ నేతలతో పాటు రాష్ట్రనేతల్లో కొందరు పొమ్మనలేక పొగపెట్టారట. పలు సందర్భాల్లో అవమానపరిచారనే ఉద్దేశ్యంతో ఆయన పార్టీని వీడారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి విషయంలో కూడా ఈ పాతనేతల తీరు అభ్యంతరకరంగా ఉండటంతో ఆయన పార్టీని వీడారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ పర్యటనలో అవమానం జరిగిందని పార్టీ అధ్యక్షుడు ఎర్రశేఖర్ రాజనామా చేయటం సంచలనం రేపింది. జిల్లాలో అధ్యక్షుడి పర్యటన వివరాలు కూడా తనకు తెలియకుండా ఈ నేతలు పావులు కదిపారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఓ నాయకుడు మండల పార్టీ అధ్యక్షులకు ఫోన్లు చేసి తాము చెప్పినట్టు ఏర్పాట్లు చేయాలని హుకూం జారీ చేశాడట. లోలోపల గోతులు.. రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన వివరాలు తెలిపేందుకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎర్రశేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఆ నేతలు నారాయణపేట జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన ఉంటే నీవు ఎలా మీడియా సమావేశం పెడతావని.. కొత్తగా వచ్చిన నేతల పెత్తనం నడవదనే ధోరణితో మాట్లాడారట. అందుకే మీడియా సమావేశం రద్దు చేశారు. కానీ రాష్ట్ర నాయకుడు మాత్రం నారాయణపేటకు వెళ్లి అక్కడ మీడియా సమావేశం పెట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మహబూబ్నగర్లో రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన వివరాలు కూడా జిల్లా అధ్యక్షుడికి తెలియకుండా కేవలం పాత నేతల కనుసన్నల్లోనే నిర్వహించారు. మొత్తంగా ఈ పాత నేతలు కొత్తవారిని పార్టీలో ఎదకకుండా తొక్కెయటానికి వ్యూహాలు సిద్ధం చేస్తారనే టాక్ఉంది. అందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తూ లోలోపల గోతులు తీస్తారనే ప్రచారం ఉంది. మహబూబ్నగర్ పట్టణ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా గ్రూపు రాజకీయాలు చోటు చేసుకున్నాయి. బరిలో మాజీ ఎంపీ తనయుడు.. ఓ వర్గం నేతలు పార్టీ కార్యాలయం ముందే ఆందోళనకు దిగారు. జిల్లాలో పార్టీ బలపడెందుకు మంచి అవకాశాలు ఉన్నా నేతల మద్య విభేదాలు, అధిపత్యపోరు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. కొన్ని సెగ్మెంట్లో కొత్త, పాత నేతలు ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్నారు. మాజీఎంపీ జితేందర్రెడ్డి తన తనయున్ని వచ్చే ఎన్నికల్లో ఏదో నియోజకవర్గం నుంచి బరిలో దింపుతారనే ప్రచారం సైతం పార్టీలో కొనసాగుతుంది. అదే జరిగితే ఏ నియోజకవర్గంలో తమపై ప్రభావం పడుతుందోననే ఆందోళన సైతం కొందరు నేతల్లో నెలకొంది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ జిల్లాలో బలపడుతున్న బీజేపీ పార్టీకి కొందరు నేతల తీరు తీవ్రంగా నష్టం కలిగించే ప్రమాదం ఉందని పార్టీలోని సీనియర్లే గుసగుసలాడుతున్నారు. మరి జాతీయ ఉపాధ్యక్షహోదాలో ఉన్న డీకే అరుణ, పార్టీ హై కమాండ్తో మంచి సన్నిహితం ఉన్నమాజీఎంపీ జితేందర్రెడ్డి కొత్తపాత నేతల మద్య సమన్వయం చేసి పార్టీ బలోపేతం కోసం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. లేకుంటే పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. -
ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కరణ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ బీజేపీనేత జితేందర్రెడ్డి నామినేషన్లు అనూహ్యంగా తిరస్కరించబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ముగ్గురు నామినేషనన్లు వేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. గతంలో ఒలంపిక్ అసోషియేషన్ ఆఫ్ తెలంగాణకు నాయకత్వం వహించిన కె. రంగారావు నామినేషన్ను స్వీకరించగా.. జయేష్ రంజన్ క్యాట్ నుంచి అనుమతి పొందకపోవడంతో ఆయన నామినేషన్ను రిజెక్టు చేశారు. దీనిపై జయేష్ రంజన్, జితేందర్రెడ్డి కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ అధ్యక్ష ఎన్నికలు కాస్త రాజకీయనాయుడికి, ప్రభుత్వ అధికారికి మధ్య పోటీగా మారనున్నాయి. -
స్ట్రాంగ్ రూం వద్ద 144 సెక్షన్ అమలు: జితెందర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్నిపల్ ఎన్నికలు ముగియడంతో బ్యాలెట్ బాక్సులను ఎన్నికల నోడల్ అధికారుల గురువారం స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీ జితేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పటిష్టమైన బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను తరలించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేసి.. అధికారుల సమన్వయంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలకు తరలించామన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 9, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసి 5వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి స్ట్రాంగ్ రూమ్ల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, మూడేంచేల బలగాలతో భద్రత చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నెల 25న ఫలితాలు విడుదల నేపథ్యంలో పటిష్టమైన బంధోబస్తును కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. -
మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఇద్దరికీ సవాలే..!
ఆ ఇద్దరు సీనియర్లు.. టీఆర్ఎస్ లోకసభ పక్ష నేతగా పని చేసిన అనుభవం ఒకరిది. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర మాజీ మంత్రిగా సుదీర్ఘ అనుభవం మరొకరిది. రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఇరువురూ తమ పార్టీలను వీడి గత లోక్సభ ఎన్నికల ముందు కాషాయ కండువా కప్పుకున్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ పార్టీని బూత్ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. అందులో ఒకరు మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, మరొకరు మాజీ మంత్రి డీకే అరుణ. సాక్షి, మహబూబ్నగర్: గత లోక్సభ ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సీనియర్లు జితేందర్రెడ్డి, డీకే అరుణలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి బాగా కలిసొచ్చేందనే చెప్పాలి. రోజురోజుకు బలోపేతమవుతోన్న ఆ పార్టీ పలు పట్టణాల్లో అధికార టీఆర్ఎస్ను ఢీకొట్టేలా తయారైంది. అయితే.. ఈనెల 22న జరగనున్న ‘పుర’పోరు వీరికి ప్రతిష్టాత్మకంగా మారింది. వీరిద్దరి సారథ్యంలో బీజేపీ ఎన్ని పీఠాలు కైవసం చేసుకుంటుందో అనే చర్చ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్టాపిక్గా మారింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇరువురు నేతలు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రతంగ్పాండురెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్, గద్వాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డిలను సమన్వయం చేసుకుంటూ బీజేపీ అభ్యర్ధిత్వాల ఖరారుతో పాటు ప్రచార వ్యూహాలపై సమీక్షలు నిర్వహించుకుంటున్నారు. టార్గెట్ ‘టెన్’.. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఈసారి ఎలాగైనా కనీసం పది పుర పీఠాలు కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది. ఈ క్రమంలో అధిష్టానం గెలుపు బాధ్యతను డీకే అరుణ, జితేందర్రెడ్డిలకే ప్రధానంగా అప్పగించింది. ఇద్దరు సీనియర్లు కావడం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చెప్పుకోదగ్గ నాయకులు పార్టీలో లేకపోవడంతో ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలతో పాటు అభ్యర్థిత్వాల ఖరారు విషయంలోనూ వీరినే ముందుంచింది. ఈ ‘పుర’ ఫలితాలపైనే ఇరువురు నేతల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉందనే ప్రచారమూ కాషాయ శ్రేణుల్లో జరుగుతోంది. ఆశించిన ఫలితాలు సాధిస్తేనే కేంద్రంలో ఉన్న బీజేపీ నేతల ఆశీస్సులు అందే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఎన్నికలు ఇరువురు నేతలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ క్రమంలో డీకే అరుణ తన సొంత జిల్లా కేంద్రమైన గద్వాలతో పాటు అలంపూర్, వడ్డేపల్లి, అయిజ, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు. దాదాపు అన్ని చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులను ఢీ కొనే స్థాయిలో బీజేపీ అభ్యర్థిత్వాలు ఖరారుకు కసరత్తు చేస్తున్నారు. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో మిగతా మున్సిపాలిటీల్లోనూ ప్రచారం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రచారానికి ఐదు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఈ నెల 16నుంచి తనకు కేటాయించిన మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం చేసి.. మిగతా చోట్ల సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఇటు జితేందర్రెడ్డి మహబూబ్నగర్, నారాయణపేట, మక్తల్, భూత్పూర్, కోస్గి మున్సిపాలిటీలపై కాషాయం జెండా ఎగురవేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ మహబూబ్నగర్, గద్వాల, నారాయణపేట, మక్తల్, భూత్పూర్, అమరచింత, ఆత్మకూరు, కోస్గిలో బలంగా ఉంది. ఇతర మున్సిపాలిటీలను అటుంచితే.. మహబూబ్నగర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న స్థానిక మంత్రి శ్రీనివాస్గౌడ్ను ఢీ కొట్టడం జితేందర్రెడ్డికి సవాల్గా మారింది. ఇటు గద్వాలకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణకు స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కూడా గట్టిపోటీ ఇస్తున్నారు. దీంతో ఆ పుర పీఠంపై గులాబీ జెండా ఎగురుతుందా? కాషాయం జెండా ఎగురుతుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదీలావుంటే... 1999లోనే బీజేపీ నుంచి మహబూబ్నగర్ లోక్సభ సభ్యుడిగా గెలిచిన జితేందర్రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇటు 1996 నుంచి రాజకీయాల్లో ఉన్న డీకే అరుణకు ఉమ్మడి జిల్లాలో బలమైన కేడర్ ఉంది. చదవండి: అలాంటి వారిని గుర్తించలేరా? : డీకే అరుణ -
‘కేసీఆర్ను ఓడించి.. వాళ్లను గెలిపిద్దాం’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారమని, ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రతికి ఉండగానే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అవుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్పై యుద్ధం చేసే ప్రతి ఒక్కరినీ తాను అభినందిస్తానని చెప్పారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్కు మొట్టమొదటి సారిగా సవాల్ విసిరిన ఆర్టీసీ కార్మికులకు అభినందనలు. సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తానని కేసీఆర్ అంటే.. ఎంతమందిని డిస్మిస్ చేసినా తాము సమ్మెలో పాల్గొంటామని కార్మికులు ధిక్కరించారు. ఆర్టీసీని అమ్ముతామని కేసీఆర్ అంటే... ఆర్టీసీని కాపాడుకుంటామని కార్మికులు ఉద్యమిస్తున్నారు. ఆర్టీసీని ఖతం చేయాలనుకుంటే కేసీఆర్ ఖతం అవుతాడు. కేసీఆర్ ఒంటరై ఓటమికి దగ్గరగా ఉన్నాడు. కేసీఆర్ వర్సెస్ ఆర్టీసీ కార్మికుల ఉద్యమం... కేసీఆర్ వర్సెస్ సమస్త తెలంగాణ సమాజంగా మారింది. హిట్లర్ లాగా కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవాలి గానీ మనం చేసుకోవద్దు. కేసీఆర్ తప్పా అన్ని పార్టీలు మనకు మద్దతుగా ఉన్నాయి కాబట్టి కేసీఆర్ను ఓడగొట్టి వేరేవాళ్ళని గెలిపిద్దామ’ని మందకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ను సాగనంపుదాం సీఎం కేసీఆర్ను ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని బీజేపీ నాయకుడు జితేందర్రెడ్డి అన్నారు. స్వప్రయోజనాల కోసం ఆర్టీసీని వాడుకుని ఇప్పుడు ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన కోదండరాంను కూడా కేసీఆర్ పక్కనపెట్టేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో రక్షణ ఉంటుందని.. ఆర్టీసీ కార్మికులు స్టీరింగ్ కాదు సుదర్శన చక్రం తిప్పుతారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోయాక వీధి లైట్స్ కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకుడు జి. వివేక్ ఆరోపించారు. కేసీఆర్ తుగ్లక్లా వ్యవహరిస్తూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని, వారి ఉద్యమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. -
పాలమూరుకు కేసీఆర్ చేసింది ఏమీ లేదు
కందనూలు: టీఆర్ఎస్ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి పాలమూర్కు చేసింది ఏమీలేదని బీజేపీ నాయకుడు, మాజీ ఎంపి జితేందర్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా ప్రసిడెంట్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదుకు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉమ్మడి పాలమూరుకు శిలాఫలకాలు తప్పా, చేసింది శూన్యం అని విమర్శించారు. ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులను ఆగమేఘాల మీద పూర్తి చేస్తూ, దక్షిణ తెలంగాణను ప్రాజెక్టులను పూర్తి చేయకుండ నియంతలా ప్రవర్థిస్తున్నారని ఆరోపించారు. పాలమూర్ ఎత్తిపోతల పథకం కింద చేపడుతున్న రిజర్వాయర్ ముంపు బాధితులకు న్యాయమైన పరిహారం చెల్లించకుండ, పోలీసులతో హింసించడం ఎంత వరకు సమజసం అన్నారు. మల్లాన్నసాగర్ ప్రజలకు రేట్లు పెంచి పరిహారం రూ.4 లక్షల నుంచి రూ.12లక్షలకు చెల్లిస్తూ ఇక్కడి ప్రజలకు ఎందుకు ద్రోహం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాకు రావల్సిన నీళ్లు రాక పాలమూరు ఆత్మగోశిస్తుందని అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వం వైపు చూస్తున్నారని, స్వచ్ఛందంగా వచ్చి బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. అంతకు ముందు బీజేపీ మొదటి సభ్యత్వం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన దళితుడు మీసాల మషన్న ఇంటికి వెళ్లి ఇచ్చారు. ఆనంతరం బస్టాండ్ వద్ద ఇద్దరు ముస్లిం మహిళలకు పార్టీ సభ్యత్వం అందజేశారు. కార్యక్రమంలో కొల్లాపూర్, నాగర్కర్నూల్ అసెంబ్లీ ఇన్చార్జ్లు సుధాకర్ రావు, దిలీపాచారి, పార్లమెంట్ కన్వీనర్ సుధాకర్ రెడ్డి, నాయకులు పోల్దాస్ రాము, దుర్గాప్రసాద్, శేఖర్ రెడ్డి,కృష్ణగౌడ్,అభిలాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలకే పరిమితమైంది
సాక్షి, నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని, చేతల్లో పూర్తిగా నర్వీర్యమై పోయిందని ఎంపీ జితేందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ. 35 వేల కోట్లతో భారీ ఎత్తున చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ ఇప్పటివరకు ఒక్క రిజర్వాయర్ కూడా పూర్తి చేయకపోవటం టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందని అన్నారు. టీఆర్ఎస్పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు ఎకరాకు రూ.6000 పెట్టుబడి సాయం చేసి బీజేపీ ఆదుకుంటుందని చెప్పారు. 60 ఏళ్లు దాటిన వృద్ధ రైతులకు పెన్షన్ స్కీము ప్రవేశపెట్టిన ఘనత బీజేపీదేనని కొనియాడారు. విదేశాల్లో దాచిన 4 లక్షల కోట్ల ధనాన్ని భారతదేశానికి తెప్పించిన ఘనత కూడా బీజేపీదేనని అన్నారు. -
అమెరికాలో గుండెపోటుతో తెలుగు వ్యక్తి మృతి
నార్త్ కరోలినా : అమెరికాలో నార్త్ కరోలినాలోని రాలేలో గుండెపోటుతో తెలుగు వ్యక్తి మృతిచెందాడు. నూకల జితేందర్ రెడ్డికి శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో డ్యూక్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే జితేందర్ రెడ్డి మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడికి భార్య కిరణ్, కుమారుడు రిషి ఉన్నారు. -
ఫెడరల్ ఫ్రంట్కు స్పందన లేదు
మహబూబ్నగర్ న్యూటౌన్: దేశంలో ఫెడరల్ ఫ్రంట్కు స్పందనలేకనే 16 స్థానాలతో చక్రం తిప్పుతానని సీఎం కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ జితేందర్రెడ్డి ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నివాసంలో ఆయన మాట్లాడారు. దేశంలో వివిధ రాష్ట్రాల సీఎంలను కలిసిన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్కు స్పందన కరువవడంతో 16 స్థానాలు గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతానని మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని, 300 స్థానాలు బీజేపీ, మిత్రపక్షాలు 50 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ కేసిఆర్ విధానాల వల్ల తెలంగాణ అప్పుల పాలైందని, గతంలో ఎంపీలు ఉన్నా ఏం చేయలేని కేసీఆర్ ఇప్పుడేదో చేస్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎంపీగా తనను గెలిపిస్తే పాలమూరు కష్టాలు తీర్చేందుకు పనిచేస్తానన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని, దేశ భద్రత, సమగ్రతకు నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ నాయకులు నాగూరావు నామాజీ, పద్మజారెడ్డి, శ్రీవర్దన్రెడ్డి, మనోహర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నా దగ్గర జవాబులేదు : జితేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : సీటు ఎందుకు రాలేదో తన దగ్గర సమాధానం లేదని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి స్పష్టం చేశారు. తన గురించి మంచి ఆలోచించే తప్పించి ఉంటారని అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం నడుచుకుంటానని తెలిపారు. తనను వ్యతిరేకించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. పార్టీలో తనకు ఉన్నత స్థానం కల్పించారని తెలిపారు. గెలిచినా.. ఓడినా ప్రజల మధ్య ఉండి పనిచేస్తానని తేల్చిచెప్పారు. -
ఈబీసీ బిల్లును స్వాగతించిన టీఆర్ఎస్
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లును తమ పార్టీ సమర్థిస్తుందని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. లోక్సభలో మంగళవారం రిజర్వేషన్ల రాజ్యంగ సవరణ బిల్లు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలస్యమైనా అగ్రవర్ణ పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ అమలవుతున్న తీరుగా.. తెలంగాణలో కూడా రిజర్వేషన్ల పెంపునకు అనుమతించాలన్నారు. విభజన జరిగాక తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందని తెలిపారు. -
ప్రధానిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయింపుపై వారు ప్రధానంగా ప్రధానితో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత జితేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో పార్టీ కార్యలయం నిర్మించడానికి భూమి కేటాయింపు అంశంపై మోదీతో చర్చించినట్టు తెలిపారు. ఉభయసభల్లో కలిపి 17మంది టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారని.. చట్ట ప్రకారం తమకు 1000 చదరపు గజాల స్థలం వస్తుందన్నారు. అర్బన్ డెవలప్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 1000 చదరపు మీటర్ల స్థలం ఇవ్వాలని చెప్పారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్ రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని తమకు కేటాయించాలని ప్రధానిని కోరినట్టు వెల్లడించారు. -
ఎంపీ జితేందర్రెడ్డికి నిరసన సెగ
సాక్షి, ఆత్మకూర్: మహబూబ్నగర్ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డికి టీఆర్ఎస్ శ్రే ణుల నుంచి నిరసన ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి టీఆర్ఎస్ అసమ్మతి వర్గానికి సహకరించారని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు ‘ఎంపీ.. గో బ్యాక్’అంటూ నినాదాలు చేశారు. సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూర్లో జరిగిన టీఆర్ఎస్ మక్తల్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో జితేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పాల్గొన్నారు. జితేందర్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో చిట్టెం రామ్మోహన్రెడ్డిని ఓడించేందుకు అసమ్మతి కుంపటిని రగిల్చారని ఆరోపిస్తూ మక్తల్, నర్వ మండలాల నేతలు నినాదాలు చేశారు. జితేందర్రెడ్డి స్పందిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాన ని, పార్లమెంటు సెగ్మెంట్లోని అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేశానన్నారు. -
ఆంధ్రబాబును మోస్తరా?
సాక్షి, దేవరకద్ర: వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులు కడ్తాంటే అడ్డుకున్నరు.. ఇప్పుడు వారే దొంగ ఏడ్పులు ఏడుస్తుండ్రు.. ఇది పోను ‘ఆంధ్రా బాబు’తో పొత్తుపెట్టుకుని మీ ముందుకు వచ్చిండ్రు.. సిగ్గు లేని వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన ఆంధ్రబాబును కాంగ్రెస్ వారు భుజాలపై మోస్తున్నందుకు సిగ్గుపడాలని సీఎం కేసీఆర్ విమర్శించారు. శనివారం దేవరకద్రలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోడానికి చంద్రబాబు 35 కేసులు వేయించారని, ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఓ కేసు నడుస్తుందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు బాగుపడడం చూసి.. చంద్రబాబు కళ్లు మండుతున్నాయని, దీనికి కాంగ్రెస్ వారు తాళం కొడుతున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టులపై మహాకూటమి పేరుతో పోటీ చేస్తున్న నాయకులు కోర్టులో కేసులు వేసి ప్రజల ముందు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులపై కేసులు వేసిన వారిని తరమికొట్టాలని, ఎన్నికల్లో వారికి డిపాజిట్లు రాకుండా పాలమూరు ప్రజలు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. కోయిల్సాగర్, భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీటిని అందిస్తున్నామన్నారు. కర్వెన, వట్టెం రిజర్వాయర్లతో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఎన్నికల్లో టికెట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్దని.. వారి నాయకులే ఆరోపిస్తున్నారని విమర్శించారు. పార్టీ టికెట్లను అమ్ముకునే చరిత్ర ఉన్న వీరు నిజంగా ప్రజలకు మేలు చేస్తారా అని ఆలోచించాలని కోరారు. నాలుగున్నరేళ్లలోనే అభివృద్ధి.. తెలంగాణ ప్రజలను 67 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు చేయని ఆభివృద్ధిని.. తాము కేవలం నాలుగున్నరేళ్లలో చేశామన్నారు. పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరం దించడానికి కంకణం కట్టుకున్నామన్నారు. పాలమూరు ప్రాజెక్టును రూ.35 వేల కోట్లతో చేపట్టా మని, ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు కోర్టు లో కేసులు వేశారని ఆరోపించారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న పవన్కుమార్ కూడా ప్రాజెక్టు మీద కేసులు వేశారని, ఈ విషయంలో ప్రజలు చూస్తూ ఊరుకోరాదన్నారు. ఆంధ్రబాబుకు వంతపాడే ఓ నాయకుడు మక్తల్ నుంచి పోటీ చేస్తున్నారని, ఇక్కడి నుంచి ఇంటికి ఒకరు వెళ్లి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడించాలని సూచించారు. తెలంగాణ గడ్డపై నుంచి.. తెలంగాణ గడ్డపై నిలబడి ఆంధ్రకు ప్యాకేజీలు ప్ర కటిస్తారా అంటూ సీఎం కేసీఆర్ సోనియా, రాహుల్గాంధీలను దుయ్యబట్టారు. తెలంగాణలో సభలు పెట్టి ఆంధ్రకు విభజన చట్టం ప్రకారం ప్యాకేజీలు అమలు చేస్తామని చెప్పడంపై మండిపడ్డారు. తెలంగాణకు విభజన చట్టం ప్యాకేజీలు వర్తించవా.. ఇక్కడ పారిశ్రామిక ప్యాకేజీలు ఇచ్చి న తర్వాతనే ఆంధ్రకు ఇస్తామని.. ఇక్కడికి వస్తున్న రాహుల్గాంధీ ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. దేవుడు పంపిన దూత కేసీఆర్ దేవుడు పంపిన దూత కేసీఆర్ అని ఎంపీ జితేందర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు నెలల్లోనే తుమ్మిళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీటిని అందించారని కొనియాడారు. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రాష్ట్రాన్ని 67 ఏళ్లు పాలించిన నేతలు తెలంగాణలో కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే సాగు నీరందించారని విమర్శించారు. వలసలు, పేద జిల్లాగా పేరున్న పాలమూరుకు వలసలు వచ్చేలా చేశారన్నారు. మళ్లీ ఆశీర్వదించండి గతంలో ఉద్యమం త ర్వాత గెలిపించిన ప్ర జలు..ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆశీర్వదిం చి గెలిపించాలని టీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. 67 ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగున్నర ఏళ్లలో చేశామన్నారు. రూ.130 కోట్లు వెచ్చించి.. నియోజకవర్గంలో 400 చెరువులను పునరుద్ధరించామన్నారు. అలాగే రూ.2,600 కోట్లతో కర్వెన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, దీంతో ప్రతి ఎకరాకు సాగు నీరందుతుందన్నారు. దేవరకద్ర ఆర్ఓబీకి రూ.24.75 కోట్లు మంజూరు చేయించామన్నారు. -
జోగుళాంబ ఆలయానికి కేంద్ర ప్రసాదం
సాక్షి, జోగుళాంబ శక్తిపీఠం : తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఈ మేరకు పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడంపై అలంపుర్ ప్రాంత వాసి, మహబూబ్నగర్ ఎంపీగా ఉన్న ఏపీ జితేందర్రెడ్డి దృష్టి సారించారు. పార్ల మెంట్ సమావేశాల్లో భాగంగా ఇటీవల ప్రశ్నోత్తరాల సమయంలో అలంపూర్ జోగుళాంబ ఆలయ ప్రస్తావనను ఎంపీ తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రసాద్, హృదయ్ల్లో అలంపూర్ జోగుళాంబ ఆలయానికి స్థానం కల్పించాలని కేంద్రాన్ని కోరగా కేంద్ర పర్యాటక సహాయ శాఖ మంత్రి అల్ఫోన్ కన్న న్ంథనమ్ లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేస్తే పరిశీలిస్తామని వెల్లడించారు. దీంతో ఎంపీ జితేందర్రెడ్డి.. క్షేత్ర ప్రాశస్త్యం వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదించేందుకు సంసిద్ధులయ్యారు. కాగా, 2020లో తెలంగాణ వ్యా ప్తంగా అలంపూర్లో మాత్రం తుంగభద్ర పుష్కరాలు జరగనుండగా.. ఆలోగా ప్రసాద్, హృదయ్ పథకాల్లో ఆలయం చేరితే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఏమిటీ పథకాలు ? పురాతన వారసత్వ సంపద కలిగి పర్యాటకం గా ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం 2014–2015 ఆర్థిక సంవత్సరంలో ప్రసాద్, హృదయ్ పథకాలు ప్రవేశపెట్టింది. ఈ రెండు పథకాల కో సం ఏటా రూ.500కోట్లను బడ్జెట్లో కేటాయిస్తుంది. ఏదేని ఒక యాత్ర స్థలం లేదా యాత్రా స్థ లం కలిగిన పట్టణాన్ని కానీ ఆధునికీకరించి అభివృద్ధి చేసేందుకు ఈ పథకాలు ఉపయోగ పడతాయి. ఇందులో ప్రధానంగా ‘ప్రసాద్’ పథకం ద్వారా మతపరమైన వారసత్వ కేం ద్రాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. నేషన ల్ మిషన్ ఆఫ్ ఫిలిగ్రిమేజ్ రిజివనేషన్ అండ్ స్ప్రిచ్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) కింద ఇప్పటికే 10 రాష్ట్రాల్లో 13 పర్యాటక క్షేత్రాలు ఎంపిక చేశారు. ఇందులో అమరావతి(ఏపీ), గయ, పాట్నా(బీహార్), ద్వారక(గుజరాత్), అమృత్సర్(పంజాబ్) అజ్మీర్(రాజస్థాన్) కాంచీపురం, వేలంగి(తమిళనాడు), పూరీ(ఒడిసా), వారణాసి, మరియు మధుర(యూపీ), కేదారినాథ్(ఉత్తరఖాండ్) కామాఖ్య(అస్సాం) ఉన్నాయి. ఇక హెరిటేజ్ సిటి డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన(హృదయ్) ద్వారా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తారు. ఈ పథకం వర్తించడానికి వారసత్వ సంపద, సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాలను ఆదారంగా తీసుకుంటారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.15.60 కోట్లను ఈ పథకం అమలుకు మంజూరు చేశారు. వివిధ రాష్ట్రాల నునండి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా కేంద్ర పర్యాటక శాఖ – కేంద్ర పట్టణాభివృద్ది శాఖల మంత్రి అధ్యక్షతన జాతీయ కమిటీ ఎంపిక చేస్తుంది. అలంపూర్.. రెండింటికీ అర్హత కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్, హృదయ్ రెండింటి కింద అభివృద్ధి చేసేందుకు అలంపూర్ క్షేత్రానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కాడా లేని విధంగా నవబ్రహ్మ ఆలయాలు కలిగి ఉండటం, అష్టాదశ శక్తి పీఠాల్లో అయిదో శక్తిపీఠం కావడం, 1400 ఏళ్ల చరిత్ర కలిగిన పట్టణం కావడం, శ్రీౖశైల ముంపు నుంచి పీఠాధిపతులు, చారిత్రక పరిశోధకుల సూచన మేరకు కాపాడబడిన క్షేత్రంగా ప్రఖ్యాతి గాంచినా ఎవరు కూడా కేంద్రపథకాలపై దృష్టి సారించలేదు. అలంపూర్ నియోజకవర్గ వాసి అయిన పాలమూరు ఎంపీ జితేందర్రెడ్డి లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో అలంపూర్ ఆలయాల ప్రస్తావన తీసుకురావడం విశేషం. తొలి అడుగు జోగుళాంబ శక్తిపీఠం అభివృద్ధి చెందేలా ‘ప్రసాద్’ పథకంలో చేర్చాలని ఓ పక్క ఎంపీ జితేందర్రెడ్డి యత్నిస్తుండగా.. కేంద్రప్రభుత్వం సైతం అడుగులు వేస్తోందని సమాచారం. ఈ మేరకు ఆలయాల పూర్తి వివరాలు సేకరించేందుకు పర్యాటక శాఖకు చెందిన ఉద్యోగులు ముగ్గురితో కూడిన బృందం శనివారం పర్యటించింది. ఈ సందర్భంగా ఆలయాలు, విశిష్టత, పరిస ప్రాంతాలను వారు పరిశీలించి ఉద్యోగులను వివరాలు ఆరా తీశారు. గతంలోనే ఎంపీ దృష్టికి... అలంపూర్ క్షేత్రం అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరుతూ ఆలయ ఈఓ గురురాజతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు పలువురు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఎంపికైన సమయంలోనే జితేందర్రెడ్డిని హైదరాబాద్లో కలిసి విన్నవించారు. అనంతరం పలు సందర్భాల్లో జితేందర్రెడ్డిదీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఈ ఆలయాలు కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉండడంతో ఎలాంటి అభివృద్ధి, నిర్మాణ పనులు చేపట్టేందుకైనా ఆ శాఖ నుంచి అభ్యంతరాలు రావొద్దంటే కేంద్రప్రభుత్వ పథకాల్లో చేర్పించడమే మార్గమని భావించిన ఎంపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి నివేదిక తీసుకుంటాం.. అలంపూర్ ఆలయాలకు ‘ప్రసాద్’ పథకం వర్తించేలా కృషి చేస్తాను. ఆలయ చరిత్రతో పాటు సమగ్ర సమాచారం కోసం స్టేట్ డైరెక్టర్ విశాలాచ్చితో మాట్లాడి పూర్తి నివేదిక కోరతాను. అలంపూర్ ఆలయాలపై కేసీఆర్కు ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఇంకా పలువురిని నాయకుల విజ్ఞప్తులతో పాటు అమ్మవారిపై నాకు ఉన్న భక్తి మేరకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చాను. తప్పక సాధిస్తాననే నమ్మకం ఉంది. – ఏ.పీ.జితేందర్రెడ్డి,ఎంపీ, మహబూబ్నగర్ ఎంపీ ఆకాంక్ష సిద్ధించాలి ఎంపీ జితేందర్రెడ్డి అలంపూర్ ఆలయాల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ప్రతిపాదన అభినందనీయం. వారి ఆకాంక్ష సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. క్షేత్ర స్థాయిలో ఎలాంటి సమాచార సేకరణ, లేక ఇతర విషయాల్లోనైనా మా తరఫున పూర్తిగా సహకరిస్తాం. – బండి శ్రీనివాస్, జోగుళాంబ సేవసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చాలా సంతోషంగా ఉంది అలంపూర్ ఆలయాల అబివృద్ధికి కేంద్రప్రభుత్వ సాయం కోరడం చాల సంతోషంగా ఉంది. ఈ ప్రాంత వాసిగా ఎంపీ జితేందర్రెడ్డి గతంలో జోగుళాంబ ఆలయ పునఃనిర్మాణానికి కూడా ఎంతో సహకరించారు. ప్రస్తుతం ఈ ఆలయాలు ఈ రెండు పథకాల కింద ఎంపికైతే అభివృద్ధి పరుగులు తీస్తుంది. – గురురాజ, ఈఓ ఆర్థికంగా ముందంజలో ఉంటుంది ప్రసాద్–హృదయ్ పథకం కింద ఈ ప్రాంతం ఎంపికైతే రాబోయే కాలంలో యువకులు, నిరుద్యో గులకు ఉపాధి మార్గాలు మెరుగవుతాయి. పైగా ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందంజలో నిలుస్తుంది. పైగా రాష్ట్రానికి వన్నె తీసుకొస్తుంది. భారత్ దర్శన్లో భాగంగా అలంపూర్ క్షేత్రం ఎన్నికైతే దక్షిణ తెలంగాణకు గొప్ప ప్రవేశద్వారం అవుతుంది. – నందు, విద్యావేత్త, అలంపూర్ -
‘సాగునీటి ప్రాజెక్టులకు సాయం చేయండి’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభు త్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తగిన సాయం చేయాలని ఆ పార్టీ లోక్ సభాపక్ష నేత ఏపీ జితేందర్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ప్రకృతి విపత్తుల అంశంపై బుధవారం లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడా రు. రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని కోణాల్లో సంక్షేమ చర్యలు చేపట్టిందని, సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 46వేల చెరువులను పునరుద్ధరిస్తోందన్నారు. -
‘పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడండి’
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షకాల సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్టు టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత జితేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్ తరఫున ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బడ్జెట్ సమావేశాలు పూర్తిగా జరగలేదని గుర్తు చేశారు. ఈ సమావేశాల్లోనైనా సమస్యలపై చర్చ జరిగేలా చూడాలని కేంద్రాన్ని కోరామన్నారు. తెలంగాణకు సంబంధించి బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్, ఐఐఎం వంటి సమస్యలపై సభలో చర్చ జరిగేలా చూడాలని కేంద్రానికి విన్నవించామన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సమస్యలు ఉన్నందున.. అన్ని పార్టీల నేతలు కలిసి సమావేశాలు సజావుగా సాగేలా చూడాల్సిన అవసరముందన్నారు. టీడీపీ రెండు విషయాల్లో టీఆర్ఎస్ మద్దతు కోరిందని వెల్లడించారు. రాష్ట్ర విభజన హామీలపై తాము వాయిదా తీర్మానం ఇస్తామన్నారు. అది చర్చకు వస్తే తాము కూడా తెలంగాణ అంశాలను లేవనెత్తుతామన్నారు. టీడీపీ అవిశ్వాస తీర్మానికి కూడా మద్దతు అడిగిందని.. దానిపై తమ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. -
గంటన్నరలో హైదరాబాద్కు..
రాజాపూర్ (జడ్చర్ల): హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకు జరుగుతున్న డబుల్ రైల్వే లైన్ పనులు పూర్తయితే గంటన్నరలో హైదరాబాద్ చేరుకోవచ్చని.. దీంతో వ్యాపారస్తులు, ఉద్యోగులకు సమయం కలిసొస్తుందని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు జితేందర్రెడ్డి తెలిపారు. జిల్లాలోని దివిటిపల్లి గ్రామం నుండి రాజాపూర్ వరకు జరుగుతున్న రైల్వే లైన్ పనులను ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణారెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ట్రాలీపై వెళ్తూ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాజాపూర్ మండల కేంద్రంలో అండర్ బ్రిడ్జి పనులు కొందరు రైతులు అడ్డుకున్నారని రైల్వే సిబ్బంది ఎంపీ దృష్టికి తీసుకురాగా.. స్థానికులతో చర్చించాలని జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డికి సూచించారు. ఈ విషయమై కలెక్టర్తో కూడా చర్చిస్తామని ఆయన అధికారులకు తెలిపారు. నిధుల కొరత లేదు.. డబుల్ లైన్ పనులు పరిశీలించిన తర్వాత అధికారులకు పలు సూచనలు చేసిన ఎంపీ జితేందర్రెడ్డి ఆ తర్వాత రాజాపూర్లోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజల చిరకాల కోరిక వచ్చే డిసెంబర్ నాటికి కలసాకారం కానుందని ఎంపీ చెప్పారు. రూ.1,207 కోట్ల నిధులు రైల్వే డబ్లింగ్ పనులు, విద్యుద్ధీకరణకు మంజూరయ్యాయన్నారు. మొత్తం 100 కిలోమీటర్ల రైల్వే లైన్లో 25 కిలోమీటర్ల లైన్ ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేసి డెమో రైలు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ లైన్లో 154 చిన్న బ్రిడ్జిలు, 9 పెద్ద బ్రిడ్జిల పనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డబుల్ లైన్ పనులు ఎంపీ జితేందర్రెడ్డి ఫ్లోర్లీడర్గా ఉండడంతో వేగంగా జరుగుతున్నాయన్నారు. దివిటిపల్లి రైల్వే స్టేషన్ పక్కనే ఐటీ కారిడార్, మల్టిపుల్ పరిశ్రమలు వస్తున్నందున ఈ స్టేషన్ను జంక్షన్గా ఏర్పాటు చేస్తూ మోడ్రన్ రైల్వేస్టేషన్గా అభివృద్ధి చేయాలని కోరారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్తోపాటు ప్రాజెక్ట్ మేనేజర్ కృష్ణారెడ్డి తెలిపారు. -
హామీ వస్తే కూర్చుంటాం..!
సాక్షి, న్యూఢిల్లీ: తమ న్యాయమైన డిమాండ్లపై హామీ ఇస్తే సభలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ ప్రకటించింది. సోమవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమై, వాయిదా పడిన సందర్భంలో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎంపీలు ఎ.పి.జితేందర్రెడ్డి, బి.వినోద్కుమార్, సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్, నగేశ్, కొత్త ప్రభాకర్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, బీబీ పాటిల్ పాల్గొన్నారు. ధర్నా వద్ద టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత జితేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘మా డిమాండ్లను పార్లమెంటు ముందు పెట్టాం. రిజర్వేషన్లను రాష్ట్రాలకు వదిలిపెట్టాలి. రాష్ట్రాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్రాలు పనిచేస్తాయి. కేంద్రంలో ఉన్న ఉద్యోగాల కోసంగానీ, విద్యా శాఖ లో కానీ రిజర్వేషన్లు అడగడం లేదు. మా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు, విద్యావకాశాల్లో మాత్రమే రిజర్వే షన్లు పెంచుకుంటాం. ఆ దిశగా బిల్లు తెచ్చాం. 9వ షెడ్యూలులో పొందుపరచాలని అడిగాం. నాలుగేళ్లుగా వేచిచూస్తున్నాం. కానీ ఇప్పటివరకు కేంద్రం ఏ ఒక్క అంశాన్ని అమలుచేయలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయలేదు. ఎయిమ్స్, బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం.. ఏవీ ఇవ్వలేదు. హైకోర్టు విభజించలేదు. అందుకే రెండు వారాలుగా పోరాడుతున్నాం. కచ్చితమైన హామీ వచ్చే వరకు పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఆందోళన కొనసాగుతుంది: జితేందర్రెడ్డి కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాలు సభ ముందుకు వచ్చేలా మీరు మద్దతుగా నిలబడితే ఈ అంశాలన్నీ చర్చకు వస్తాయి కదా అని మీడియా ప్రశ్నించగా ‘రెండు వారాలుగా మా డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నాం. డిమాండ్లను హౌస్లో పెట్టి పరిష్కరించుకుంటాం. ఎవ్వరినీ అనుసరించాల్సిన అవసరం మాకు లేదు. సరైన హామీ లభించే వరకు ఆందోళన కొనసాగుతుంది’అని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయని ప్రస్తావించగా ‘వాళ్లకు వాళ్లు ఆరోపణలు చేసుకోవడం కాదు. ఈరోజు వాళ్లకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని మనసొచ్చింది. మా ప్రజల ఆకాంక్షలు, డిమాండ్లు మాకు ముఖ్యం. మా డిమాండ్లపై వాళ్లు వాగ్దానం చేసి మమ్మల్ని కూర్చోబెడితే కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం’అని స్పష్టం చేశారు. చర్చ జరిగితే మాట్లాడుతాం: వినోద్ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ‘16వ లోక్సభ ప్రారంభమైన మొదటి రోజు నుంచి పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తున్నాం. ఏపీలోకి 7 మండలాలు పోయిన రోజు నుంచి ఆందోళన చేస్తున్నాం. బీజేపీని నిలదీస్తున్న పార్టీల్లో టీఆర్ఎస్ మొదటి వరసలో ఉంది. రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచుతూ తెచ్చిన బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాలని మేం బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచీ పోరాటం చేస్తున్నాం. అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ అనుమతిస్తే చర్చలో కూడా మేం మాట్లాడుతాం. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను లేవనెత్తుతాం. టీడీపీ ఇప్పటికీ విభజన అశాస్త్రీయంగా జరిగిందని మాట్లాడుతోంది. వాళ్ల హక్కుల గురించి మాట్లాడితే మద్దతు ఇస్తాం. కానీ, ఇప్పటికీ విభజ నను వ్యతిరేకించేలా స్వరం వినిపిస్తోంది. కాం గ్రెస్ నేతల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. యూపీలో రెండు ప్రాంతీయ పార్టీలు గెలిస్తే వీళ్లు సంబరాలు చేసుకున్నారు’అని అన్నారు. మేం ఎవరిపై కేసు పెట్టాలి: సీతారాంనాయక్ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ ‘గిరిజనులు, దళితుల మనోభావాలను కించపరిచినవారిపై అట్రా సిటీ కేసు పెట్టే హక్కును రాజ్యాంగం కల్పించింది. మేం నెలరోజులుగా గిరిజనుల రిజర్వేషన్లపై మాట్లా డుతున్నా పట్టించుకోనప్పుడు ఎవరిపై కేసు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ జనాభా లేనిపక్షంలో రిజర్వేషన్లు కొనసాగించేవారా? నా ఉద్దేశం ఎవరిపైనో కేసులు పెట్టా లని కాదు. ఇంతమంది ఎంపీలం ఆందోళన పట్టించుకోకుంటే ఎవరిని దోషులను చేయాలి’ అని వాపోయారు. -
'హైకోర్టు విభజన ఎందుకు చేయడంలేదు'
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా హైకోర్టు విభజన ఎందుకు జరగలేదని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల న్యాయవాదులు నష్టపోతున్నారన్నారు. అన్ని సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా కేంద్రం హైకోర్టు విభజన చేయడం లేదన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం హైకోర్టును తక్షణమే విభజించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కొత్త రాష్ర్టాలు ఏర్పడినప్పుడు హైకోర్టు విభజనలో అప్పటి ప్రభుత్వాలు ఆలస్యం చేయలేదని ఎంపీ జితేందర్రెడ్డి గుర్తు చేశారు. -
తెలంగాణ శకటానికి అవకాశమివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం ప్రదర్శనకు అవకాశమివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్రెడ్డి, బీబీ పాటిల్ కోరారు. సోమవారం అరుణ్ జైట్లీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలసిన ఎంపీలు.. తెలంగాణలో ఎయిమ్స్, ఐఐఎం ఏర్పాటుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి మూడో విడత నిధులు కేటాయించాలని, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు వివిధ దశల్లో ఎంపికైన తెలంగాణ బతుకమ్మ శకటాన్ని చివరి దశలో కేంద్ర రక్షణ శాఖ తిరస్కరించిన విషయం తెలిసిందే. -
జీఎస్టీ బిల్లుకు మద్దతిస్తాం: ఎంపీ వినోద్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిస్తుందని ఎంపీ వినోద్ వెల్లడించారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆదివారం టీఆర్ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం వినోద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అపరిష్కృత సమస్యలపై సోమవారం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుస్తారని తెలిపారు. పార్లమెంట్లో హైకోర్టు విభజన అంశంపై పోరాడుతామని మరో ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. అంశాలవారిగా కేంద్రానికి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
జాతీయ ప్రాజెక్టు ప్రతిపాదన రాలేదు
‘కాళేశ్వరం’పై కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించాలనే ప్రతిపాదననేది తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర జల సంఘానికి అందలేదని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సహాయమంత్రి సన్వర్లాల్ జాట్ తెలిపారు. లోక్సభలో గురువారం టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ 16 ప్రాజెక్ట్లను కేంద్రం ఇప్పటికే జాతీయ ప్రాజెక్ట్లుగా ప్రకటించిందని, అదనంగా 14 ప్రాజెక్ట్లను జాతీయ ప్రాజెక్ట్లుగా ప్రకటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపాయని చెప్పారు. తెలంగాణకు చెందిన ప్రాణహిత- చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ను జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించాలనే ప్రతిపాదన అందిందని, అయితే, ఈ ప్రాజెక్ట్కు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు చెందిన సలహా సంఘం ఆమోదం లభించాల్సి ఉందని సన్వర్లాల్ తెలిపారు. కాళేశ్వరంపై కేంద్రమంత్రి ఇచ్చిన జవాబుతో జితేందర్రెడ్డి అంగీకరించలేదు. ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, అందుకు అనుగుణంగానే కాళేశ్వరం, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్లను జాతీయ ప్రాజెక్ట్లుగా ప్రకటించే ప్రతిపాదనలను పరిశీలించాలని ప్రధానమంత్రి, జలవనరులశాఖ మంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి గతనెలలో లేఖ రాశారని జితేందర్రెడ్డి పేర్కొన్నారు. జువ్వాది చొక్కారావు ఎత్తిపోతల పథకానికి సంబంధించి సవరించిన వ్యయ అంచనాలతో కూడిన పెట్టుబడులకు సంబంధించిన అనుమతులను తెలంగాణ ప్రభుత్వం ఇంకా అందించాల్సి ఉందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. సిరిసిల్లలో పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలి: ఎంపీ వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఎంపీ బి.వినోద్కుమార్ కేంద్రాన్ని కోరారు. గురువారం లోక్సభ జీరో అవర్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. -
వాటర్గ్రిడ్కు నిధులు ఇవ్వలేం
లోక్సభలో ఎంపీ జితేందర్రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు నిధులు అందించలేమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్సభలో గురువారం టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిస్తూ.. కేంద్ర తాగునీటి శాఖ సహాయ మంత్రి రాంకృపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. వాటర్గ్రిడ్ పథకానికి అయ్యే మొత్తం వ్యయం రూ. 42,474 కోట్లలో సగం నిధులను భరించాల్సిందిగా కేంద్రాన్ని తెలంగాణ సీఎం కోరారని, ఆ విధంగా నిధులు ఇవ్వలేమని పేర్కొన్నారు. అయితే ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి అందే నిధులను వాటర్గ్రిడ్ పథకానికి వినియోగించుకోవచ్చని చెప్పారు. అవసరమైతే విదేశీ సంస్థల నుంచి ఆర్థికసాయం పొందే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని తెలిపారు. -
పాఠశాలల పరిస్థితులు మెరుగుపర్చాలి: జితేందర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని అనేక పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేనందున కేంద్రం తగినన్ని నిధులు మంజూరు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి లోక్సభలో కేంద్రాన్ని కోరారు. గురువారం ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. 450 నుంచి 600 మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ ఆయా పాఠశాలల్లో గదులు మాత్రం ఒకటీ రెండే ఉంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. గదుల నిర్మాణానికి, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. -
ఇవీ అవసరాలు..!
లోక్సభలో మనవారు కొలువుదీరారు. సభ్యులుగా ప్రమాణస్వీకారమూ చేశారు. ఇక మిగిలిందల్లా జిల్లా వాసుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో సంకల్పం చెప్పుకోవడమే. వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపి పాలమూరు వాకిట ప్రగతి కాంతులు చిందించడమే. నిధులను రప్పించుకొని అభివృద్ధికోసం అహరహం శ్రమించాల్సిందే. కర్తవ్య దీక్షకు కంకణం కట్టుకొని కార్యరంగంలోకి ఉరకాల్సిందే. ఇదే మన ఎంపీలు జితేందర్, నంది ఎల్లయ్యల నుంచి ఈ ప్రాంతవాసులు ఆశిస్తున్నారు. సాక్షి, మహబూబ్నగర్: ‘సార్వత్రిక’ సమరం ముగిసింది. కొత్త ప్రభుత్వాలు కేంద్ర, రాష్ట్రాల్లో కొలువుదీరాయి. జిల్లానుంచి ఎన్నికైన ఏపీ జితేందర్ రెడ్డి (టీఆర్ఎస్), నంది ఎల్లయ్య (కాంగ్రెస్)లు మహబూబ్నగర్, నాగర్కర్నూలు పార్లమెంటు స్థానాలనుంచి గెలుపొంది లోక్సభ సభ్యులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశా రు. ఈ నేపథ్యంలో జిల్లా వాసుల దృష్టంతా పేదరికంతో మగ్గుతున్న తమ ప్రాంతాన్ని ప్రగతి రస్తాపై ప్రతినిధులు నడిపించాలని కోరుకుంటున్నారు. కోటి ఆశలతో వారి ప్రాతినిధ్యంపై నమ్మకం పెట్టుకున్నా రు. పార్లమెంటులో పాలమూరు గొంతు వినిపించి ఇక్కడి అవసరాలు తీర్చాలని కోరుకుంటున్నారు. కార్యాచరణ ప్రణాళికతో... టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేతగా జితేందర్రెడ్డి, మంచి పార్లమెంటేరియన్గా నంది ఎల్లయ్య ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో అవగాహనతో అగ్రభాగాన నిలువగలరన్న ఆ శాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. జలయజ్ఞంలో భా గంగా జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా శాసనసభ్యులతో కలిసి కృషిచేయాల్సిన బాధ్యత ఎంపీలపై ఉంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశా లు కల్పించే దిశగా కొత్త పరిశ్రమలను జిల్లాకు తీసుకొచ్చే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కర్తవ్యం వీరిపై ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉన్న పాలమూరును ఇండస్ట్రీయల్ కారిడార్గా అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మందకొడిగా జలయజ్ఞం... జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో చేపట్టి న నాలుగు భారీ ఎత్తిపోతల పథకాల ప నులు నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకాన్ని రూ.2990 కోట్ల వ్యయంతో ప్రారంభించినప్పటికి ఇప్పటి వరకు 80 శాతం పనులు కూడా జరగలేదు. రూ. 2601 కోట్లు ఖర్చుచేసినప్పటికీ ఒక్క ఎ కరాన్ని కూడా సాగునీటిని అందించలేని పరిస్థితి నెలకొని ఉంది. 2014-15 సంవత్సరం నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా జిల్లాలోని 3.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంది. ఈ పనుల పురోగతిపై ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులతో కలిసి ఎంపీలు కృషిచేయాల్సిన అవసరం ఉంది. 38,250 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా రూ.459 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. ఇంకా పది శాతం పనులు పూర్తికావాల్సిన అవసరం ఉంది. 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో రూ. 1863 కోట్ల అంచనా వ్యయంతో జవ హర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులు చేపట్టినప్పటికిని ఇప్పటి వరకు 85 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు ఈ ఏడాదిలోగా పూర్తయినట్లయితే రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. రూ.2158 కోట్ల అంచనా వ్యయంతో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకం పనులు 91 శాతం వరకు పూర్తయినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది వరకు పూర్తిచేయాలన్న లక్ష్యంతో పనులు కొనసాగిస్తున్నప్పటికీ నిధుల లేమితో నత్తనడకన నడుస్తున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు ఎత్తిపోతల పథకంపై దృ ష్టి సారించాల్సి ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను తీసుకురావడం ద్వారా అధిక నిధులను రాబట్టవలసింది. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులను సాధించుకున్నట్లయితే జిల్లాలోని ఎడారి, బీడు భూములను సస్యశ్యామలం చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పర్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. వేధిస్తున్న వలసలు... పనుల లేమి వల్లనే జిల్లా నుంచి ఏటా పదకొండు లక్షల మంది ప్రజలు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. వీటిని నివారిం చేందుకు జిల్లాను పారిశ్రామికగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి, డబుల్లైన్ ఏర్పాటు ముఖ్యమే. తాగునీటి స మస్య కూడా తీవ్రంగా ఉంది. మున్సిపాలిటీలు న గర పంచాయతీల్లోని ప్రజలు తాగునీటి సమస్యను ఎ దుర్కొంటున్నారు. జిల్లా కేంద్రమైన మహబూబ్నగర్లోనే 20 రోజులకోమారు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఇదే పరిస్థితి మిగతా పట్టణాల్లో కూడా నెలకొని ఉంది. అచ్చంపేట, కల్వకుర్తి తదితర నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ వేధిస్తోంది. జిల్లాలో సుమారుగా 160 గ్రామాల్లో ఈ ఇబ్బంది ఉంది . మహానేత వైఎస్.రాజశేఖర్రెడ్డి హయాంలో జిల్లాకు మంజూరైన సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం దృష్టి సారించాలి. తెలంగాణ తొలి ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి అత్యధికంగా నిధులను రాబట్టేందుకు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో కృషిచేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం సంకల్పం చెప్పుకోవాలని కొత్త ఎంపీలను జిల్లా ప్రజలు కోరుతున్నారు.