-
అమృత్పాల్ సింగ్కు పెరోల్.. జులై 5న ఎంపీగా ప్రమాణం
ఖలిస్థానీ ఉగ్రవాది, వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్పాల్ సింగ్ లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని డిబ్రూగఢ్లో జైల్లో ఉన్న అమృత్పాల్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని ఖదూర్సా హిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.అమృత్పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారానికి బుధవారం స్పీకర్ను కలిసి అనుమతి కోరినట్లు ఫరీద్కోట ఎంపీ సరభ్జీత్ సింగ్ ఖల్సా వెల్లడించారు. లోక్సభలో కాకుండా.. స్పీకర్ ఛాంబర్లో జులై 5న ప్రమాణం చేసేందుకు ఓం బిర్లా అనుమతి ఇచ్చారని తెలిపారు. అతడికి ఐదవ తేదీ నుంచి నాలుగురోజులకు పేరోల్ లభించినట్లు చెప్పారు. ఇక అదే రోజు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో నిందితుడిగా ఉన్న బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్ప్రమాణ స్వీకారం కూడా ఉండనుంది. -
నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్
వాషింగ్టన్/ఒట్టావా: ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు తాజాగా మరో భారతీయుడిని అరెస్ట్చేశారు. బ్రాంప్టన్ సిటీలో నివసించే 22 ఏళ్ల అమన్దీప్ సింగ్ను హత్య, హత్యకు కుట్ర నేరాల కింద అరెస్ట్చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఉదంతంలో గత వారమే ముగ్గురు భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్చేశారు. అమన్దీప్ను ఒంటారియాలో మే 11న అరెస్ట్చేసినట్లు రాయల్ కెనడియన్ పోలీసులు ఆదివారం ప్రకటించారు. బ్రిటిష్ కొలంబియాలో 2023 జూన్ 18వ తేదీన గురునానక్ గురుద్వారా వద్ద 45 ఏళ్ల నిజ్జర్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెల్సిందే. నిజ్జర్ను చంపిన ఇద్దరు షూటర్లలో అమన్దీప్ ఒకడని గ్లోబల్ న్యూస్ ఒక కథనం వెలువర్చింది. -
భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్కు ఉగ్ర బెదిరింపులు
భారత్-ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్కు ఉగ్రవాద బెదింపులు వచ్చాయి. ఈ మ్యాచ్కు ఆటంకం కలిగిస్తానని నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ సోషల్మీడియాలో ఓ బెదిరింపు వీడియోను పోస్ట్ చేశాడు. మ్యాచ్కు అంతరాయం కలిగించాలని పన్నున్ సీపీఐ మావోయిస్ట్ పార్టీకి విజ్ఞప్తి చేశాడు. ఈ ఉదంతంతో అలర్ట్ అయిన రాంచీ పోలీసులు టెస్ట్ మ్యాచ్కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనంగా వెయ్యి మంది పోలీసులను మొహరించినట్లు రాంచీ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పన్నున్పై బెదిరింపు కేసును నమోదు చేశారు. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఎవరీ పన్నున్.. భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్కు ఆటంకం కలిగిస్తానని బెదిరించిన పన్నున్.. కెనడా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు. ఇతను అమెరికా, కెనడా దేశాల్లో ఉంటూ పంజాబ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక ఖలిస్తాన్ పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటాడు. ఇతనిపై యాంటి టెర్రర్ ఫెడరల్ ఏజెన్సీ 2019లో కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి పన్నున్ ఎన్ఐఏ నిఘాలో ఉన్నాడు. ఫిబ్రవరి 3, 2021న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు పన్నున్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2023 నవంబర్ 29న పన్నున్ను ప్రత్యేక నేరస్థుడిగా ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్లు అయిపోయాయి. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ గెలుపొందగా.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్, రాజ్కోట్లో జరిగిన మూడో టెస్ట్ల్లో టీమిండియా విజయాలు సాధించింది. ఈ సిరీస్లోని నాలుగో టెస్ట్ రాంచీలో, ఐదు టెస్ట్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఐదో టెస్ట్ మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది. -
భారత వ్యతిరేక కార్యకలాపాల అడ్డాగా కెనడా
వాషింగ్టన్: కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతి, దానికి సంబంధించిన రగడపై అమెరికాతో లోతుగా చర్చించినట్టు విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో భేటీ అయ్యారు. హత్యపై కెనడా జరుపుతున్న దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని బ్లింకెన్ ఈ సందర్భంగా సూచించినట్టు విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం పేర్కొన్నారు. అనంతరం దీనిపై జై శంకర్ స్పందించారు. భారత్ లక్ష్యంగా వేర్పాటువాదం, హింస, వ్యవస్థీకృత నేరాలు, మనుషుల అక్రమ రవాణా వంటివాటికి కెనడా కొన్నేళ్లుగా అడ్డాగా మారుతోందని మండిపడ్డారు. ‘పైగా అక్కడి ప్రభుత్వం కూడా కొన్నేళ్లుగా అలాంటి వాటిని అనుమతిస్తున్న ధోరణి కనబరుస్తోంది. ట్రూడో సర్కారు రాజకీయ అనివార్యతలే ఇందుకు కారణం‘ అని ఆరోపించారు. ‘కెనడాలో భారత దౌత్యవేత్తలను బాహాటంగా బెదిరించే దుస్థితి నెలకొంది! కార్యాలయాలకు వెళ్లడం కూడా రిసు్కగా మారింది. అందుకే ఆ దేశానికి వీసా సేవలను కూడా ఆపేయాల్సి వచి్చంది‘ అని జైశంకర్ వివరించారు. బ్లింకెన్తో జైశంకర్ -
Sikh for Justice: వరల్డ్ కప్ కాదు.. టెర్రర్ కప్
అహ్మదాబాద్: కరడుగట్టిన ఖలిస్తాన్ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) సంస్థ అధినేత గురుపట్వంత్ సింగ్ పన్నూపై గుజరాత్ పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే క్రికెట్ ప్రపంచ కప్ ‘ప్రపంచ టెర్రర్ కప్’గా మారతుందంటూ సోషల్ మీడియాలో పన్నూ చేసిన హెచ్చరికలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా బెదిరింపులకు పాల్పడినందుకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసు అధికారులు శుక్రవారం వెల్లడించారు. ముందే రికార్డు చేసిన ఓ వాయిస్ మెసేజ్ను విదేశీ ఫోన్ నంబర్తో సోషల్ మీడియాలో పన్నూ పోస్టు చేశాడని తెలిపారు. +447418343648 అనే నంబర్తో దేశవ్యాప్తంగా చాలామందికి ఈ మెసేజ్ అందిందని పేర్కొన్నారు. మెసేజ్ అందుకున్నవారు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. సబ్ఇన్స్పెక్టర్ హెచ్.ఎన్.ప్రజాపతి ఫిర్యాదు మేరకు పన్నూపై కేసు పెట్టినట్లు వివరించారు. +44 అనేది యునైటెడ్ కింగ్డమ్(యూకే) కోడ్ కావడం గమనార్హం. అయితే, ఇంటర్నెట్ కాల్ టెక్నాలజీతో ఇలా విదేశీ ఫోన్ నంబర్ల నుంచి సందేశం వస్తున్నట్లు తప్పుదోవ పట్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే పన్నూ హెచ్చరికల మెసేజ్ ఎక్కడి నుంచి వస్తోందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ...ఇట్లు గురుపట్వంత్ సింగ్ పన్నూ విదేశీ ఫోన్ నంబర్తో వచి్చన కాల్ను రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రి–రికార్డెడ్ వాయిస్ మెసేజ్ వినిపిస్తోందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు జీతూ యాదవ్ తెలియజేశారు. ‘‘అమర వీరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు కచి్చతంగా ప్రతీకారం తీర్చుకుంటాం. మీ బుల్లెట్లకు వ్యతిరేకంగా బ్యాలెట్లు ఉపయోగిస్తాం. మీరు సాగిస్తున్న హింసాకాండకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తాం. అక్టోబర్ 5వ తేదీని గుర్తు పెట్టుకోండి. ఆ రోజు క్రికెట్ ప్రపంచ కప్ కాదు, ప్రపంచ టెర్రర్ కప్ ప్రారంభమవుతుంది. సిఖ్స్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో ఖలిస్తాన్ జెండాలతో అహ్మదాబాద్ను ముట్టడిస్తాం.. ఇట్లు గురుపట్వంత్ సింగ్ పన్నూ’’ అంటూ ఆ సందేశంలో హెచ్చరికలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. అహ్మదాబాద్ నగర ప్రజలకు గత రెండు రోజులుగా ఈ మెసేజ్ వస్తోందన్నారు. ఎవరీ పన్నూ? సిక్కుల కోసం భారత్లో ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం ఏర్పాటే తన జీవితాశయమని ప్రకటించుకున్న గురుపట్వంత్ సింగ్ పన్నూ పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ సమీపంలోని ఖంజోత్ అనే గ్రామంలో జని్మంచాడు. న్యాయ విద్య అభ్యసించాడు. అనంతరం కెనడాకు వలస వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. కెనడా పౌరసత్వం కూడా సంపాదించాడు. సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థను స్థాపించాడు. భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. భారత్లో జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో అతడి హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుగా కెనడాతోపాటు అమెరికా, యూకే, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో ర్యాలీలు నిర్వహించాడు. ఖలిస్తాన్కు అనుకూలంగా వివిధ దేశాల ప్రభుత్వాల మద్దతును కూడగట్టడానికి లాబీయింగ్ చేస్తున్నాడు. హరిదీప్ సింగ్ నిజ్జర్ హత్యపై పన్నూ తీవ్రంగా రగిలిపోయాడు. కెనడాలోని హిందువులంతా దేశం విడిచి వెళ్లిపోవాలని కొన్ని రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేశాడు. 2020 జూలైలో పన్నూను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు కెనడాలో అజ్ఞాతంలో ఉన్నాడు. -
Trudeau: భారత్పై స్వరం మార్చి ఆ వెంటనే..
మాంట్రియల్: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో.. ఒక్కసారిగా స్వరం మార్చారు. భారత్తో సత్సంబంధాల విషయంలో కెనడా కట్టుబడి ఉందని.. ఆ విషయంలో వెనక్కి తగ్గబోదంటూ వ్యాఖ్యానించారాయన. గురువారం మాంట్రియల్లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గ్లోబల్ స్థాయిలో భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యత చూస్తున్నాం. ఇలాంటి టైంలో కెనడా, దాని మిత్రపక్షాలు భారత్తో సంబంధాలు మరింత మెరుగుపర్చుకోవాలనే తీవ్రంగా ప్రయత్నిస్తాయి’’ అని వ్యాఖ్యానించారాయన. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. భౌగోళిక రాజకీయంలో కీలక పాత్ర పోషిస్తోంది. కిందటి ఏడాది మేం(కెనడా) ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని అందించాం. తమ దేశం ఇప్పటికీ భారత్తో సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకోవడానికి కట్టుబడి ఉంది అని తెలిపారు. అమెరికా మాతోనే.. అయితే అదే సమావేశంలో ఆయన కాసేపటికి మళ్లీ పాతపాటే పాడారు. నిజ్జర్ హత్యోదంతాన్ని మళ్లీ హైలైట్ చేశారు. నిజ్జర్ హత్యను ప్రజాస్వామ్యం, చట్టాలను అనుసరించే దేశాలు తీవ్రంగా పరిగణించాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మరోవైపు నిజ్జర్ హత్యపై అమెరికన్లు తమతోనే ఉన్నారని ప్రకటించారు. భారత్ విదేశాంగ మంత్రితో భేటీ సమయంలో ఈవిషయాన్ని లేవనెత్తుతానని అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాటిచ్చారని ట్రూడో వెల్లడించారు. నిజ్జర్ హత్యను ప్రజాస్వామ్య దేశాలు సీరియస్గా తీసుకోవాలని ట్రూడో పిలుపు ఇచ్చారు. ‘‘కెనడా, దాని మిత్రదేశాలు భారత్తో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ, అదే సమయంలో చట్టాలను అనుసరించే దేశంగా.. నిజ్జర్ హత్య విషయంలో మాతో కలిసి భారత్ పనిచేసి వాస్తవాలను వెలికితీయాలి. కెనడియన్కు మా గడ్డపై హత్య చేయడంలో భారత ఏజెంట్ల పాత్ర నిర్ధారించే విషయంలో అమెరికా మాతోనే ఉంది’’ అని పేర్కొన్నారు. -
నిజ్జర్పై 50 రౌండ్ల కాల్పులు.. సీసీటీవీలో రికార్డు
ఒట్టావా: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్-కెనడా మధ్య వివాదానికి కారణమైంది. ఈ హత్య వెనుక భారత్ హస్తముందని ఆ దేశ ప్రధాని ఆరోపించాక రెండుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉండగా ఈ కేసు విచారణలో భాగంగా హర్దీప్ సింగ్ హత్యకు సంబంధించిన వీడియో ఒకటి బయటపడింది. వీడియోలో ఈ వీడియోకు సంబంధించి ప్రముఖ పత్రిక ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ ఏడాది జూన్ 18న కెనడాలో బ్రిటీష్ ప్రావిన్స్లోని సర్రే గురుద్వారా ఎదురుగా నిజ్జర్ హత్య జరిగింది. విచారణలో భాగంగా పోలీసులు అక్కడి గురుద్వారా సీసీ కెమెరాల్లో నిజ్జర్ హత్య తాలూకు దృశ్యాలు రికార్డయ్యాయి. 90 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ముఖానికి మాస్కులు ధరించిన ఆరుగురు దుండగులు రెండు వాహనాలపై వచ్చి నిజ్జర్పై కాల్పులు జరిపారని ఆ పత్రికా కథనంలో పేర్కొంది. దుండగులు మొత్తం 50 రౌండ్లు కాల్పులు జరపగా అందులో 34 నిజ్జర్ శరీరంలో దూసుకెళ్లాయని తెలిపింది. నిజ్జర్ హత్యను ప్రత్యక్షంగా చూసిన వారు తెలిపిన వివరాలతోపాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి పోలీసులు. భూపేందర్ సింగ్ అనే వాలంటీర్ అక్కడ ఆ సమయంలో ఫుట్ బాల్ ఆడుకుంటున్నానని కాల్పుల శబ్దం విని ఏవో టపాసులు అనుకున్నానని తెలిపాడు. వెంటనే పార్కింగ్ వద్దకు వెళ్లి చూస్తే నిజ్జర్ ట్రక్ అద్దాలు మొత్తం రక్తసిక్తమై ఉన్నాయని తెలిపాడు. తనతోపాటు మరికొందరు స్నేహితులు కారు డోర్ తెరిచి చూస్తే అప్పటికే నిజ్జర్ చనిపోయాడన్నాడు. కాల్పులు జరిపిన దుండగులు మాస్కులు ధరించి హుడీలు ధరించి ఉన్నారని తెలిపాడు. ఇది కూడా చదవండి: భారత్తో సైనిక సంబంధాలకు ఢోకా లేదు: కెనడా సైనికాధికారి -
Canada-India relations: పంచనేత్రం!
ఖలిస్తాన్ అంశం భారత్, కెనడా మధ్య అగ్గి రాజేస్తోంది. ఖలిస్తాన్ సానుభూతిపరుడు నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని సాక్షాత్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ అంశంలో ట్రూడో ఇతర దేశాల మద్దతు కూడగట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఫైవ్ ఐస్ (అయిదు కళ్లు) కూటమి తనకు అండగా ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు. మన దేశంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆయా దేశాల అధినేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఇంతకీ ఈ ఫైవ్ ఐస్ కూటమి అంటే ఏమిటి ? కెనడా, భారత్ వివాదంలో ఎందుకు కీలకంగా మారింది ? ► ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవడానికి అయిదు దేశాలతో ఏర్పాటైన కూటమిని ఫైవ్ ఐస్ (అయిదు కళ్లు) అని పిలుస్తారు. అమెరికా ఆధ్వర్యంలో నడిచే ఈ కూటమిలో యూకే, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, కెనడా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ అయిదు దేశాలకు చెందిన నిఘా సంస్థలు అధికారిక, అనధికారిక ఒప్పందాల ప్రకారం ఒకరికొకరు సహకారం అందించుకుంటాయి. భద్రతా పరంగా నిఘా సంస్థలకు అందే సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాయి. ప్రపంచ చరిత్రలో ఈ ఫైవ్ ఐస్ కూటమి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమాచారాన్ని బదిలీ చేసుకుంటుందని పేరు పొందింది. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని తీవ్రమైన ఆరోపణలు చేసిన ట్రూడో ఈ కూటమిలో మిగిలిన నాలుగు దేశాల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సమాచార మార్పిడి ఇలా..! ► మానవ మేధ, సిగ్నల్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్, భౌగోళిక, ఉపగ్రహ ఆధారిత ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఒకరికొకరు పంచుకుంటాయి. రాడార్లు, ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్కింగ్ ద్వారా సమాచార మార్పిడి జరుగుతుంది. ఉపగ్రహ ఛాయాచిత్రాలను కూడా పంచుకుంటూ భద్రతాపరంగా హెచ్చరికలు పంపుకుంటూ ఉంటాయి. ఏ సమయంలో సహకరించుకున్నాయి? ► వియత్నాం యుద్ధం, ఫాక్ల్యాండ్స్ యుద్ధం, గల్ఫ్ వార్, ఇరాన్ ప్రధాని మహమ్మద్ మొసాదిని పదవీచ్యుతుడిని చేయడం, చిలీ అధ్యక్షుడు సాల్వడార్ అలెండెను గద్దె దింపడం, ఉగ్రవాదంపై పోరాటం సమయంలో ఈ దేశాలు మూడో కంటికి తెలీకుండా సమాచారాన్ని అందించుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం నాటి కూటమి.. ► ఈ కూటమి ఏర్పాటు ఇప్పటిది కాదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా, యూకే తొలుత చేతులు కలిపి నిఘా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి 1946లో ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. దీనినే బ్రూసా ఒప్పందం అని పిలుస్తారు. అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఎప్పుడైతే తారాస్థాయికి చేరుకుందో ఆ సమయంలో ఈ కూటమిలో ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, కెనడా వచ్చి చేరాయి. నార్వే, డెన్మార్క్, పశ్చిమ జర్మనీలు తాత్కాలికంగా చేరినప్పటికీ , 1955 నాటికి మళ్లీ ఈ అయిదు దేశాలే సభ్యులుగా మిగిలాయి. 1990 వరకు ఈ కూటమి గురించి బాహ్య ప్రపంచానికి తెలీదు. న్యూజిలాండ్కు చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు నిక్కీ హేగర్, అమెరికన్ జర్నలిస్టు జేమ్స్ బామ్ఫార్డ్, బ్రిటిష్ జర్నలిస్టు డంకెన్ క్యాంప్బెల్ పరిశోధనాత్మక కథనాలతో ఈ కూటమి గురించి అందరికీ తెలిసింది. 2013లో అమెరికాకు చెందిన జాతీయ భద్రతా సంస్థ సభ్యుడైన ఎడ్వర్ స్నోడెన్ ఈ కూటమి కార్యకలాపాలకు సంబంధించిన రహస్య పత్రాలను విడుదల చేయడంతో ఫైవ్ ఐస్పై చర్చ జరిగింది. మళ్లీ ఇన్నేళ్లకి ఆ అయిదు కళ్ల కూటమితో ట్రూడో సంప్రదింపులు జరుపుతూ ఉండడం తిరిగి తెరపైకి వచి్చంది. ఇప్పుడేం జరుగుతోంది? మన దేశంలో జరిగిన జీ–20 సదస్సు కంటే ముందే ట్రూడో అమెరికా, బ్రిటన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాధినేతలతో చర్చలు జరిపి నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ అంశాన్ని భారత్ దగ్గర ప్రస్తావించాలంటూ ఆయా దేశాల అధినేతలతో సంప్రదింపులు జరిపినట్టు వివిధ అంతర్జాతీయ పత్రికలు కథనాలు వెల్లడించాయి. నిజ్జర్ హత్యపై దర్యాప్తుకి భారత్ సహకరించేలా ఒత్తిడి పెంచాలని ట్రూడో స్వయంగా బైడెన్, రిషి సునాక్ వంటి వారిని కోరారు. అయితే ఈ హత్యను బహిరంగంగా ఖండించడానికి నిరాకరించిన ఆయా దేశాలు దర్యాప్తు మరింతగా లోతుగా జరగాలని మాత్రమే అంటున్నాయి. ఈ దర్యాప్తుకి భారత్ సహకరించాలని అమెరికా అంటే, బ్రిటన్ కూడా అదే మాట మీదుంది. అయితే భారత్తో తమకున్న వాణిజ్య అంశాలపై దీని ప్రభావం ఉండబోదని బ్రిటన్ స్పష్టం చేసింది. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయంపై తమ దగ్గర ఆధారాలున్నాయని ట్రూడో చెబుతూ ఉంటే, మరింత లోతుగా విచారణ చేయాలని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సూచిస్తున్నాయి. వాస్తవాలు బయటపడేవరకు తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని న్యూజిలాండ్ తెగేసి చెప్పేసింది. దీంతో ట్రూడో భారత్ను రెచ్చగొట్టేలా దౌత్యపరమైన చర్యలకు దిగుతూ రాయబారుల్ని దేశం నుంచి వీడి వెళ్లా లని ఆదేశించారు. భారత్ మరో అడుగు ముందుకు వేసి కెనడా పౌరుల వీసాలను కూడా నిలిపివేసింది. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ట్రూడో నాయకత్వ పటిమపై వ్యతిరేకత ఎదురు కావడం ఆయనకు గట్టి షాక్ ఇచ్చింది. ఆయనకున్న పాపులారిటీ 31శాతానికి పడిపోయిందని తాజా సర్వేలో వెల్లడైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్?
న్యూఢిల్లీ: కెనడాలో బుధవారం రాత్రి జరిగిన గ్యాంగ్వార్లో మరో ఖలిస్థాన్ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె ప్రత్యర్ధులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ హత్యకు పూర్తి బాధ్యత తమదేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మాదే బాధ్యత.. కెనడాలో జరిగిన ముఠా కాల్పుల్లో ఖలిస్థా ఉగ్రావది సుఖ దునెకె హత్యకు గురయ్యాడు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఈ హత్య తామే చేయించామని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గ్యాంగ్స్టర్లు గుర్లాల్ బ్రార్, విక్కీ ముద్దుకేరా హత్యలతో సుఖ దునెకెకు సంబంధముందని వాడు మాదకద్రవ్యాలకు బానిసాయి ఫేక్ వీసా మీద కెనడా పారిపోయాడని వాడు చేసిన తప్పులకు శిక్ష పడిందని మా శత్రువులు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బ్రతకరని హెచ్చరించారు. లారెన్స్ పాత్రపై అనుమానాలు.. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు ఆరోపణల్లో అహ్మదాబాద్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూస్వాలా హత్య కేసులో కూడా లారెన్స్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు. సోషల్ మీడియా పోస్టును బట్టి ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు భారత్ కెనడా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ హత్య జరగడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అక్కడి వారికి ట్రావెల్ అడ్వైజరీ మార్గదర్శకాలు చేసి వీసా సేవలను నిలిపివేసింది. చిలికి చిలికి.. భారత్ కెనడా మధ్య సంబంధాలు అంతకంతకు బలహీనపడుతున్నాయి. ఖలిస్థాన్ ఉద్యమం పేరిట ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ర్యాలీగా నిర్వహించి వివాదానికి తెరతీశాయి. ఆనాడు భారత దేశం ఆ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసినా తేలిగ్గా తీసుకున్న కెనడా తర్వాత జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ ఏజెంట్లు కారణమంటూ చేసిన వ్యాఖ్యలు తగువుకు ఆజ్యం పోశాయి. ఇంతలోనే మరో ఉగ్రవాది హత్య జరగడంతో కెనడా వీసాలను నిలిపివేసింది. BIG ⚡️Lawrence Bishnoi gang claims responsibility for K-terrorist Sukhdool Singh's killing in Canada pic.twitter.com/6ZN1T30pb4 — Megh Updates 🚨™ (@MeghUpdates) September 21, 2023 ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులో దూసుకెళ్తున్న భారతీయుడు -
40 ఏళ్లుగా కెనాడాలోచాప కింద నీరులా ఉగ్రవాదం
కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాద ఉగ్రవాదానికి 40 ఏళ్ల చరిత్ర ఉంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మానవ అక్రమ రవాణా, హత్యలు, వ్యవస్థీకృత నేరాలు వంటివి ఖలిస్తాన్ వేర్పాటు వాదులకు గత నాలుగు దశాబ్దాలుగా నిత్యకృత్యంగా మారాయి. అయినా అక్కడ ప్రభుత్వాలు ఖలిస్తాన్ వేర్పాటు వాదుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి దీనికి ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధాన కారణం. భారత్ తర్వాత ప్రపంచంలో కెనడాలో సిక్కు జనాభా అధికంగా ఉంది. కెనడా జనాభా లెక్కల ప్రకారం దాదాపుగా 8 లక్షల మంది సిక్కులు (మొత్తం జనాభాలో 2%పైగా) ఉన్నారు. వీరి జనాభా శరవేగంతో పెరుగుతూ వస్తోంది. కెనడాలో న్యూ డెమోక్రాటిక్ పార్టీ (ఎన్డీపీ) పగ్గాలను సిక్కు నాయకుడైన జగ్మిత్ సింగ్ ధాలివాల్ 2017 సంవత్సరంలో చేపట్టిన తర్వాత ఖలిస్తాన్ వేర్పాటు వాదుల ఎజెండాకు మద్దతు పలికారు. 2021లో ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలవలేకపోవడంతో ఎన్డీసీ మద్దతు తీసుకోవాల్సి వచ్చింది.దీంతో ఖలిస్తాన్ వేర్పాటువాదులు మరింత చెలరేగిపోతున్నా ప్రధాని ట్రూడో ఏమీ చేయలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం కెనడా పార్లమెంటులో 18 మంది సిక్కు ఎంపీలు ఉన్నారు. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) అనే సంస్థ ప్రత్యేక ఖలీస్తాన్పై రెఫరెండం చేపట్టి తమకు లక్ష మందికిపైగా మద్దతు పలుకుతున్నట్టుగా ప్రకటించింది. 2019 నుంచి పెరిగిన దాడులు ♦ జగ్మిత్ సింగ్ బృందం ఖలిస్తాన్ విషయంలో మరింత చురుగ్గా ఉంటూ దాడులకుప్రోత్సహిస్తోంది. కెనడాతో పాటు అమెరికా, యూకే, ఆ్రస్తేలియాలో ఇటీవల కాలంలోవీరి దాడులు పెరిగిపోతున్నాయి. ♦ భారత కార్యాలయాలు, హిందూఆలయాలపై విచ్చలవిడిగా దాడులుజరుగుతున్నాయి. మార్చిలో లండన్లో భారత హైకమిషనర్ కార్యాలయంపై దాడి జరిగింది. ♦2022 మేలో మొహాలిలో పంజాబ్ ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్పై గ్రెనేడ్ దాడి వెనుక(ఎస్ఎఫ్జే) హస్తం ఉంది. ♦ దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యను కీర్తిస్తూ జూన్ 4న ఖలీస్తాన్ ఉద్యమకారులువివిధ కార్యక్రమాలు చేపట్టారు.రక్తపు మడుగులో పడి ఉన్న ఇందిర, ఒక సిక్కు చేతిలో తుపాకీ ఉన్న చిత్రాలకి సంబంధించిన కటౌట్లు టొరాంటో వీధుల్లో వెలిశాయి. దర్బార్ సాహిబ్పై దాడులకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగిందంటూ దానిపై రాశారు. ఒంటారియాలో భారీ ర్యాలీతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంబరాల్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా ఖండించారు.కెనడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వేర్పాటువాదుల ఆగడాలను చూసీచూడనట్టువదిలేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ♦ జులైలో ఆ్రస్టేలియాలోని సిడ్నీలో భారతీ విద్యార్థులపైఖలిస్తాన్ వేర్పాటువాదులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. అప్పట్లో ట్రూడో తండ్రి ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో తండ్రి పియరే ట్రూడో 1980లో కెనడా ప్రధానిగా ఉన్నారు. అప్పట్లోనే ఖలిస్తాన్ కార్యకలాపాలపై భారత ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఆయనకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆ నాటి ప్రభుత్వం కూడా ఉదాసీనంగానే వ్యవహరించిందని బ్లడ్ ఫర్ బ్లడ్ అనే పుస్తకంలో రచయిత టెర్రీ మిల్వెస్కీ పేర్కొన్నారు. అప్పట్లో ఖలిస్తాన్ ఉద్యమం కెనడాలో కూడా ఉవ్వెత్తున లేచింది. ఇందిరాగాంధీ హత్య తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో మళ్లీ వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. వాస్తవానికి ఖలిస్తాన్ ఉద్యమం ప్రజా మద్దతు ఉన్నది కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ‘‘‘ఖలిస్తాన్ ఉద్యమం భౌగోళిక రాజకీయాలకు సంబంధించినది. చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు తమ శత్రుదేశమైన భారత్కు ఇబ్బంది కలుగుతుందని ఖలిస్తాన్ వేర్పాటు వాదులకి సాయపడుతున్నాయి’’అని రచయిత టెర్రీ పేర్కొన్నారు. ఇందిర హత్యని ఒక సంబరంగా పేర్కొంటూ 2002లో టొరాంటో ప్రధాన కేంద్రంగా ప్రచురితమయ్యే సంజా సవేరా మ్యాగజైన్ కథనాలు వండి వార్చింది. ఆలాంటి పత్రికకు ప్రభుత్వం అత్యధికంగా వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం ద్వారా తన వైఖరి ఏంటో చెప్పకనే చెప్పింది. నిజ్జర్ హత్యతో రాజుకున్న చిచ్చు గత ఏడాది జూన్ 18న కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ను సర్రేలోని గురుద్వారాలో కాల్చి చంపడంతో భారత, కెనడాల మధ్య చిచ్చు రేగింది. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలతో ఇరు దేశాలు తమ రాయబారుల్ని వెనక్కి పిలిపించేదాకా వెళ్లాయి. పంజాబ్లో జలంధర్కు చెందిన నిజ్జర్ 1997లో కెనడాకు వలస వెళ్లాడు. ప్లంబర్గా పని చేస్తూనే ఖలిస్తాన్ వేర్పాటు వాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. సిక్స్ ఫర్ జస్టిస్లో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 2020లో భారత్ నిజ్జర్ను ఉగ్రవాదిగా ప్రకటించింది. 2007లో పంజాబ్లోని లూథియానాలో పేలుళ్లు, 2009లో పటియాలాలో రాస్ట్రీయ సిక్ సంగత్ అధ్యక్షుడు రూల్డా సింగ్ హత్యలో నిజ్జర్ ప్రమేయమున్నట్టు అనుమానాలున్నాయి. కెనడా, యూకే, అమెరికాలో భారత రాయబార కార్యాలయాల దాడుల వెనుక నిజ్జర్ హస్తం ఉన్నట్టుగా భారత్ విచారణలో తేలింది. -
కెనడాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఐదు రోజుల్లో వెళ్లిపోండి..
న్యూఢిల్లీ: ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా దౌత్యకార్యాలయంలోని భారతీయ ఏజెంట్ ప్రమేయముందని ఆరోపిస్తూ ఆయనకు బహిష్కరించిన కొద్దీ సేపటికే భారత్ దెబ్బకు దెబ్బ తీసింది. భారత్లోని కెనడా దౌత్యాధికారిని బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఖలిస్థానీ టైగర్ ఫోర్స్కు చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారతీయ ఏజెంట్కు సంబంధమున్నట్లు తమవద్ద ఆధారాలున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంటులో ప్రకటించారు. ఆయితే భారత ప్రభుత్వం ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఖండించింది. కెనడా ప్రధాని ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే భారత దౌత్యాధికారిని బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. దీనికి బదులుగా భారత్ కూడా కెనడాకు అంతే దీటుగా స్పందించింది. మన అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం చేసుకోకడమే కాకుండా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడిన నేరానికి భారత్లోని కెనడా దౌత్యాధికారిని వెంటనే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది భారత విదేశాంగ శాఖ. భారత్కు కెనడా హైకమిషనర్ అయిన కామెరూన్ మెక్కేను ఐదు రోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. The High Commissioner of Canada to India was summoned today by GOI and informed about it’s decision to expel senior Canadian diplomat and to leave India within the next five days! pic.twitter.com/wgJdvpLnzE — Prof.N John Camm (@njohncamm) September 19, 2023 ఇది కూడా చదవండి: గాయపడిన సైనికులకు జెలెన్స్కీ పరామర్శ -
ప్రధాని మోదీకి ఖలిస్తానీ నేత హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, హోం మంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్లకు కెనడాలో సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ తీవ్ర హెచ్చరికలు చేశాడు. భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కెనడాలోని సర్రే, వాంకోవర్లలో వేర్పాటువాదులు రెఫరెండం నిర్వహించిన విషయం తెలిసిందే. అంతకుముందు, పన్నూ సుమారు 5 వేల నుంచి 7 మంది వరకు పాల్గొన్న సమావేశంలో భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అందుకు సంబంధించిన ఒక వీడియో విడుదలైంది. ‘హర్దీప్ సింగ్ నిజ్జర్ను చంపిన వారికిదే నా హెచ్చరిక. మిమ్మల్ని ఘోరంగా చంపాలని పిలుపునిస్తున్నాం. మోదీ, జై శంకర్, దోవల్, షా.. మేం మీకోసం వస్తున్నాం’ అని పన్నూ హెచ్చరిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. వాంటెడ్ లిస్ట్లో ఉన్న నిజ్జర్ ఈ ఏడాది జూన్లో సర్రేలో హత్యకు గురైన విషయం తెలిసిందే. భారత వ్యతిరేక శక్తులు కెనడాలో తిష్టవేశాయని స్వయంగా ఆ దేశ ప్రధాని ట్రూడో ఎదుటే ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేసిన రోజే పన్నూ ఈ సమావేశం జరిపారు. Can anyone predict the fate of #GurpatwantSinghPannu? https://t.co/nnxJvZOxLS — Kartick Kumar Misraa (@kartickmisraa) September 13, 2023 ఇది కూడా చదవండి: పార్లమెంట్ ఉద్యోగులకు కొత్త యూనిఫామ్.. -
ఖలిస్తానీలకు దీటుగా భారతీయుల ర్యాలీ..
టొరంటో: ఖలిస్థాన్ మద్దతుదారుల ఫ్రీడం ర్యాలీకి దీటుగా వారి కంటే ఎక్కువ సంఖ్యలో హాజరై కెనడా భారతీయులు ఐక్యత చాటుతూ ర్యాలీ నిర్వహించారు. ఖలిస్థాన్ ఫ్రీడం ర్యాలీలో భాగంగా కెనడాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు భారత కాన్సులేట్ ఎదుట పోగయ్యారు. అయితే వారికంటే అధిక సంఖ్యలో వారికి దీటుగా భారత్ జెండాలతో ప్రదర్శన చేశారు అక్కడి భారతీయులు. అంతే మరి.. తాడిని తన్నే వాడొకడుంటే, వాడిని తలదన్నే వాడొకడుంటాడంటారు. మాజీ భారత ప్రధాని 1984లో తలపెట్టిన ఆపరేషన్ బ్లూ జరిగి 39 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు 5 కి.మీ ర్యాలీ నిర్వహించి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని శకటాల ద్వారా ప్రదర్శించి సర్దార్ సాహిబ్ సింగ్ హత్యకు ప్రతీకారంగా అని రాశారు. అది జరిగిన సరిగ్గా నెలరోజులకు ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను అక్కడి గురుద్వారా ఎదుటే కాల్చి చంపబడ్డాడు. దీంతో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు నిరసనగా జులై 8న ర్యాలీ నిర్వహించనున్నట్లు పోస్టర్లతో ఎంబసీ వద్ద హడావుడి చేశారు ఖలిస్తానీలు. ఒట్టావా భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, కాన్సులేట్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవలను నిజ్జర్ హంతకులుగా చిత్రీకరిస్తూ కొన్ని పోస్టర్లు వేయడం వివాదాస్పదమైంది. అమెరికా కాన్సులేట్ ముందు కూడా ఈ ర్యాలీకి సంబంధించిన పోస్టర్లతో అక్కడి ఖలిస్తానీలు రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం ర్యాలీకి సంబంధించి కెనడా, యూఎస్, యూకే ఎంబసీల ఎదుట పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. జులై 8 ఉదయాన్నే కెనడాలో ఖలిస్థాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున కెనడా కాన్సులేట్ వద్దకు చేరుకొని ఖలిస్థాన్ చిహ్నమున్న జెండాలు పట్టుకుని నిజ్జర్ కు జేజేలు పలుకుతూ భారత జెండాను చింపేసి కించపరిచారు. అందుకు దీటుగా కెనడాలోని భారతీయులు ఖలిస్తానీల కంటే రెట్టింపు సంఖ్యలో అక్కడికి చేరి ఖలిస్తానీలు భారతీయులు కాదని పోస్టర్లు రాసి "వందేమాతరం" "భారత్ మాతా కీ జై" అంటూ ఆకాశాన్ని తాకేలా నినదించారు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని ఖలిస్తానీలు దెబ్బకు ఖంగుతిన్నారు. #WATCH | Members of the Indian diaspora held a counter protest against pro-Khalistan supporters in front of the Indian consulate in Canada's Toronto on July 8 pic.twitter.com/lZvRiSdVs1 — ANI (@ANI) July 9, 2023 ఇది కూడా చదవండి: యుద్ధంలో కీలక పరిణామం..ఉక్రెయిన్ కమాండర్లు విడుదల.. -
మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ ఉగ్రవాది హతం..
కెనడా: భారత మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను సర్రేలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ వద్దనున్న గురునానక్ సిక్కు గురుద్వారా దగ్గర గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) గతంలో ప్రకటించిన 40 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో హర్దీప్ సింగ్ నిజ్జర్ పేరు కూడా ఉంది. పంజాబ్ నుంచి కెనడా పారిపోయి చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న నిజ్జర్ ను అప్పగించాల్సిందిగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కెనడా ప్రభత్వాన్ని కోరుతూ ఉంది. కానీ అంతలోనే కెనడాలోని గురునానక్ సిక్కు గురుద్వారా దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతడిని కాల్చి చంపేశారు. ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్.. భారత్ దేశంలో జరిగిన అనేక హింసాత్మక కార్యకలాపాల్లో అతని ప్రమేయముంది. ప్రస్తుతం నిజ్జర్ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు. కెనడాలోని భారత రాయబారి సంస్థ పైన ఇటీవల జరిగిన దాడుల్లో నిజ్జర్ ప్రమేయముందని స్వయంగా భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. పంజాబ్ రాష్ట్రాన్ని భారత్ దేశం నుండి వేరు చేయాలని డిమాండ్ చేస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్(SFJ) సంస్థతో కూడా నిజ్జర్ కు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రకటించని జాతీయ దర్యాప్తు సంస్థ. జలంధర్ కు చెందిన ఒక పూజారిని హత్య చేయడానికి ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ తో కలిసి కుట్ర పన్నాడన్న ఆరోపణల మీద జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అతని కోసం కెనడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. చివరకు కెనడా అధికారులు అతడిని అప్పగించేలోపే అనంతలోకాలకు వెళ్ళిపోయాడు నిజ్జర్. ఇది కూడా చదవండి: మెక్సికోలో పెను భూకంపం.. -
బంధాన్ని భంగపరిస్తే సహించం
సిడ్నీ: ఖలిస్తాన్ వేర్పాటువాద మూకలు ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడులకు తెగబడటాన్ని భారత ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియా, భారత్ బంధానికి భంగం కల్గించేలా జరుగుతున్న ఇలాంటి కుట్రలను సహించేది లేదని కరాఖండిగా చెప్పేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో విస్తృతస్తాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత అల్బనీస్ సమక్షంలోనే మీడియాతో మాట్లాడారు. ‘ భారత్, ఆస్ట్రేలియాల స్నేహపూర్వక సంబంధాలకు హాని తలపెట్టే ఎలాంటి శక్తులనైనా ఉపేక్షించేది లేదు. ఈ అంశంలో కఠినంగా వ్యవహరిస్తున్న అల్బనీస్కు నా కృతజ్ఞతలు. హిందూ ఆలయాలపై ఖలిస్తాన్ వేర్పాటువాదుల ఆగడాలను అణచేసేందుకు, ఖలిస్తాన్ మూకల కార్యకలాపాలపై ఇకమీదటా కఠిన చర్యలను కొనసాగిస్తానని అల్బనీస్ మరో సారి నాకు మాటిచ్చారు’ అని మోదీ ప్రకటించారు. టీ20 వేగంతో బంధం బలోపేతం భారత్, ఆస్ట్రేలియా సత్సంబంధాల బలోపేతాన్ని క్రికెట్ పరిభాషలో మోదీ సరదాగా చమత్కరించారు. ‘‘రెండు దేశాల మైత్రీ బంధం వేగంగా బలపడుతోంది. క్రికెట్కు వేగాన్ని తెచ్చిన టీ–20 మోడ్లోకి వచ్చేసింది. రెండేళ్లలో ఇక్కడికి రెండుసార్లు వచ్చా. ఏడాదిలో ఇది మా ఆరో భేటీ. ఇరుదేశాల బంధంలో పరిణతికి, సత్సంబంధాలకు ఇది నిదర్శనం. ఈసారి భారత్లో జరగబోయే క్రికెట్ ప్రపంచ కప్ పోటీలను వీక్షించేందుకు అల్బనీస్ను, ఆస్ట్రేలియాలోని క్రికెట్ వీరాభిమానులకు ఇదే నా ఆహ్వానం. ఇదే సమయంలో దీపావళి పర్వదిన వేడుకలు చూడొచ్చు. అల్బనీస్తో నిర్మాణాత్మక చర్చలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమున్నత శిఖరాలకు చేరుస్తాయి’’ అన్నారు. ఆస్ట్రేలియాలోని పలు వ్యాపారసంస్థల సీఈవోలతో కూడా మోదీ మాట్లాడారు. పలు రంగాల్లో భారత్లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. భారత్లోని డిజిటల్ ఆర్థిక, నవకల్పనల వ్యవస్థను ఆస్ట్రేలియాలోని వ్యాపారాలతో అనుసంధానించాలని ఆల్బనీస్ ఆకాంక్షించారు. -
సిక్కులు చేయకూడని పని చేశాడు.. అయినా!
నభా జైలు నుంచి తప్పించుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూ.. 24 గంటలలోపే పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తనను గుర్తుపట్టకూడదని ప్రపంచంలో ఏ సిక్కూ చేయని పని చేశాడు. మీసాన్ని పూర్తిగా తొలగించుకుని, గెడ్డం కూడా బాగా పొట్టిగా కత్తిరించేసుకున్నాడు. సాధారణంగా సిక్కులు తమ జుట్టును, మీసాలను, గెడ్డాన్ని కత్తిరించుకోరు. కానీ మింటూ మాత్రం.. తనను చూస్తే ఎవరైనా ముస్లిం అనుకోవాలి తప్ప సిక్కుగా గుర్తుపట్టకూడదని భావించాడు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కి ముంబై పారిపోదామని అనుకుంటుండగా.. పోలీసులకు చిక్కాడు. అంతకుముందు తాను 18 సంవత్సరాల పాటు ఉన్న గోవాకు వెళ్లిపోవాలన్నది మింటూ ప్లాన్ అని పోలీసులు చెప్పారు. ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ (కేఎల్ఎఫ్) చీఫ్ అయిన మింటూపై పది ఉగ్రవాద కేసులు ఉన్నాయి. ఇంతకుముందు డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్పై బాంబుదాడి కేసులో కూడా మింటూ ప్రధాన నిందితుడు. 2014లో థాయ్లాండ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చినప్పుడు పోలీసులు అరెస్టుచేశారు. ఆదివారం ఉదయం పోలీసు దుస్తుల్లో ఉన్న కొందరు సాయుధులు నభా జైలులోకి ప్రవేశించి, గాల్లోకి వందరౌండ్ల కాల్పులు జరిపి మింటూ సహా ఐదుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులను తీసుకుని పారిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి మింటూను 90 కిలోమీటర్ల దూరంలో హరియాణా వద్ద దింపారు. అక్కడ అతడు బస్సు ఎక్కి ఢిల్లీ వెళ్లాడు. ముందుగా జైల్లోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకడైన పర్వీందర్ సింగ్ పిండా ఉత్తరప్రదేశ్లో భారీ ఆయుధాలతో పట్టుబడ్డాడు. వాస్తవానికి తాము మింటూను, కశ్మీర్ సింగ్ను తీసుకెళ్లడానికి రాలేదని, పలు హత్యకేసులు, హైవే దోపిడీ కేసుల్లో నిందితుడైన విక్కీ గౌండర్ను తప్పించడానికి వచ్చామని అతడు చెప్పాడు. అందివచ్చిన అవకాశాన్ని మింటూ కూడా వాడుకున్నాడు.