medarametla
-
రహదారే.. రన్వే.. జాతీయ రహదారిపై యుద్ధ విమానాల ల్యాండింగ్ సక్సెస్
సాక్షి ప్రతినిధి, బాపట్ల/అద్దంకి/మేదరమెట్ల: నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే 16వ నంబర్ జాతీయ రహదారి.. సోమవారం ఉదయం బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో కొంతసేపు నిర్మానుష్యంగా మారింది. ఆ వెంటనే సరిగ్గా 11.03 గంటలకు నాలుగు యుద్ధ విమానాలు వరుసగా ఒకదాని వెంట ఒకటిగా దూసుకువచ్చాయి. స్థానికులు సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా.. రెండు యుద్ధ విమానాలు రహదారిని తాకగా.. మరో రెండు అతి సమీపంలో చక్కర్లు కొట్టి వెళ్లిపోయాయి. అంతే అక్కడ ఉన్న వైమానిక దళ అధికారులు, సిబ్బంది, పోలీసులు చప్పట్లతో తమ సంతోషం వ్యక్తం చేశారు. అత్యవసర ల్యాండింగ్ కోసం.. యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం చెన్నై–కోల్కతా జాతీయ రహదారి–16పై రేణింగివరం నుంచి మేదరమెట్లకు వెళ్లే దారిలో పి.గుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల పొడవున, 33 మీటర్ల వెడల్పుతో ల్యాండింగ్ స్ట్రిప్ నిర్మించారు. గతంలో ఒకసారి దీనిపై ట్రయల్ రన్ నిర్వహించారు. తాజాగా సోమవారం మరోసారి ఈ స్ట్రిప్పై బాపట్ల జిల్లా సూర్యలంక వైమానిక దళం ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఉదయం 11.03 గంటలకు నాలుగు యుద్ధ విమానాలు రన్వే స్ట్రిప్పై ఎగురుతూ వెళ్లాయి. 11.05 గంటల నుంచి 11.06, 11.07 గంటల సమయంలో రెండు విమానాలు ఐదు అడుగుల ఎత్తులో రన్వేపై వెళ్లాయి. ఆ తర్వాత 11.19 గంటలకు ఒకటి, 11.24 గంటలకు మరొకటి ఎయిర్ స్ట్రిప్ను తాకుతూ(డెడ్లైన్)లో వెళ్లాయి. 11.28 గంటలకు సుఖోయ్–30, హాక్ విమానాలు రెండు అతి తక్కువ ఎత్తులో దూసుకెళ్లాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి ఏఎన్–32 ట్రాన్స్పోర్టు విమానం ల్యాండ్ అయ్యింది. ఇదే విమానం ఎయిర్ స్ట్రిప్పై కొంతదూరం నెమ్మదిగా వెళ్లి.. 12.08కి టేకాఫ్ తీసుకుంది. డారి్నయర్ ట్రాన్స్పోర్టు విమానం 12.30 గంటలకు ల్యాండ్ అయ్యి.. 12.39 నిమిషాలకు విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. దీంతో వైమానిక దళ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక ఏర్పాట్లు.. యుద్ధ విమానాల ల్యాండింగ్ నేపథ్యంలో జాతీయ రహదారికి ఇరువైపులా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ను మళ్లించారు. పోలీస్ బలగాలు, సాయుధ మిలటరీ బలగాలు, వైమానిక దళానికి చెందిన ప్రత్యేక ఫైర్ ఇంజిన్లు ఏర్పాటు చేశారు. అలాగే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్టేషన్ నుంచి వైమానిక దళ అధికారులు విమానాలకు మార్గనిర్దేశం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు వైమానిక దళ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. ‘వరదలు, భూకంపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, తీర ప్రాంతాల్లో చొరబాటుదారులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో విమానాలు ల్యాండ్ చేయడానికి అనువుగా జాతీయ రహదారి–16పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. గతేడాది డిసెంబర్లో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు కూడా ట్రయల్రన్ విజయవంతమైంది’ అని చెప్పారు. కార్యక్రమంలో వైమానిక దళ అధికారులు ఏవీఎం కుకరేజ్, జేపీ యాదవ్, విజయ్, ఎస్పీ వకుల్ జిందాల్, అడిషనల్ ఎస్పీ పాండురంగ విఠలేశ్వర్, జేసీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘సిద్ధం’ సభలతో విపక్షాల్లో వణుకు
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు భీమిలి, దెందులూరు, రాప్తాడులలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు ప్రజాసముద్రం పోటెత్తింది. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజాసభగా రాప్తాడు సభ నిలిచింది. పేదంటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన తెచ్చేందుకు వైఎస్సార్సీపీని మళ్లీ గెలిపిచేందుకు సిద్ధమా అని సీఎం జగన్ పిలునిస్తే.. మేం సిద్ధమే అంటూ లక్షలాది మంది ఒక్కసారిగా పిడికిళ్లు పైకెత్తి మేం సిద్ధమే అంటూ చేసిన సింహనాదంతో దిక్కులు పిక్కటిల్లాయి. ఈ మూడు సభలు ఒకదానికి మంచి మరొకటి గ్రాండ్ సక్సెస్ కావడం.. టీడీపీ–జనసేన పొత్తు లెక్కతేలాక తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభకు జనం మొహం చాటేయడంతో చంద్రబాబు, పవన్కళ్యాణ్లు తమకు ఘోర పరాజయం తప్పదనే భయంతో గజగజ వణికిపోయారు. ఎన్నికల్లో కనీసం ఉనికినైనా చాటుకోవాలనే లక్ష్యంతో ఢిల్లీ వెళ్లి కాళ్లబేరానికి దిగజారి బీజేపీతో జట్టు కట్టారు. ప్రభంజనాన్ని ముందే పసిగట్టి చౌకబారు డ్రామాలు.. మరోవైపు.. బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక ఆదివారం మేదరమెట్లలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సిద్ధం చివరి సభకూ లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారని గ్రహించిన చంద్రబాబు తన ప్రావీణ్యానికి మరింత పదును పెట్టారు. సభా ప్రాంగణంలో ఉ.11 గంటలకు ముందు ఫొటోలు తీయించారు. ఆ తర్వాత.. నవ్విపోదురు గాక నా(రా)కేంటి సిగ్గు అనే రీతిలో జనం పలుచగా ఉన్నారని, సిద్ధం సభ ఫెయిల్ అంటూ సామాజిక మాధ్యమాల్లో పచ్చముఠా వీరంగం వేసింది. తండ్రికి తగ్గ తనయుడినని లోకేశ్ కూడా ఎక్కడా తగ్గకుండా చౌకబారు డ్రామాకు తెరతీసి రెచి్చపోయారు. ఇక సభకు హాజరయ్యే ప్రజలు కూర్చోవడం కోసం కింద గ్రీన్మ్యాట్ వేస్తే.. జనం హాజరుకాకున్నా హాజరైనట్లు చూపేలా గ్రాఫిక్స్ సృష్టించేందుకు వాటిని వేసినట్లు హోరెత్తించారు. అందుకే సభ ప్రత్యక్ష ప్రసారాలను 45 నిముషాలు ఆలస్యంగా ఇస్తున్నారంటూ ఇష్టమొచి్చనట్లు చౌకబారు ఆరోపణలు చేశారు. సభ పూర్తయిన తర్వాత ఉదయం తాము తీసిన ఫొటోలను గ్రాఫిక్స్ ద్వారా మాయచేసి జనం హాజరుకాకున్నా హాజరైనట్లు వైఎస్సార్సీపీ చిత్రీకరించిందంటూ ఎల్లో మీడియా శివాలెత్తింది. తద్వారా కూటమి శ్రేణులు డీలాపడకుండా చేసేందుకు ఈ ముఠా ఆపసోపాలు పడింది. లైవ్లో 1.50 కోట్ల వ్యూస్తో రికార్డు.. ఇక మేదరమెట్ల సిద్ధం సభకు దక్షిణ కోస్తాలోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 44 నియోజకవర్గాల నుంచి 15 లక్షల మందికి పైగా హాజరయ్యారని అంచనా. వందలాది ఎకరాల సువిశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత రీతిలో జనంతో కిక్కిరిసిపోయింది. మేదరమెట్ల నుంచి రేణంగివరం మధ్య సుమారు 18 కిమీల పొడవున జనప్రవాహం కొనసాగడం.. కోల్కత–చెన్నై జాతీయ రహదారితోపాటు అద్దంకి–నార్కాట్పల్లి జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ఆగిపోయాయి. ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్ చానెళ్లు, డిజిటల్, కేబుల్ టీవీలు, జాతీయ మీడియా ద్వారా కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఇలా 1.50 కోట్ల వ్యూస్తో మేదరమెట్ల సభ చరిత్ర సృష్టించింది. ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని తేలడంతో కూటమి నేతలు వణికిపోతున్నారు. ఆ భయంతోనే ఎల్లో ముఠా ఇలా చీప్ట్రిక్స్ ప్రయోగిస్తోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. -
సీఎం జగన్ సిద్ధం ప్రజా అభిమానం..చంద్రబాబు గుండెల్లో దడ..
-
‘నా మనవడ్ని చూసేందుకు వచ్చాను’
బాపట్ల: మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని తెలుసుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలు ఉదయం 7గంటలకే సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉదయాన్నే సభావేదిక వద్ద వృద్ధురాలు కలియతిరగడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. -
30 ఏళ్ళు మహానేతతో ఉన్న..సీఎం జగన్ గురించి ఒక్కటే చెప్తున్నా
-
అద్దంకి ప్రజలు భయపెడితే భయపడేవారు కాదు..టీడీపీకి స్ట్రాంగ్ కౌంటర్
-
చంద్రబాబుకి ఓటు వేస్తే..చంద్రముఖిని నిద్ర లేపినట్టే..
-
చరిత్ర సృష్టించిన సీఎం జగన్ నాలుగు సిద్ధం సభలు
-
రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై ఓటు అనే అస్త్రం ప్రయోగించాలని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు.. బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభకు పోటెత్తిన జనం..ఇంకా ఇతర అప్డేట్స్
-
మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగం
-
సోషల్ మీడియాలో ‘సిద్ధం’ సంచలనం
సాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం సీఎం జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభ సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో వైఎస్ జగన్ ఎగైన్, వైనాట్ 175, సిద్ధం హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్లో దేశంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అభిమానులు భారీగా పోస్టులు చేశారు. జన సముద్రాన్ని తలపించిన సభా ప్రాంగణం.. సీఎం జగన్ ర్యాంప్పై నడుస్తున్న ఫొటోలు.. ప్రసంగిస్తుండగా జనం నీరాజనాలు పలుకుతున్న ఫొటోలతో ఎక్స్,Cలు నిండిపోయాయి. సాధారణంగా ఎక్స్లో పోస్టులు చేయడం, వాటిపై స్పందించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యక్ష ప్రసారాలను తక్కువగా చూస్తారు. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ ప్రసంగాన్ని ‘ఎక్స్’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11 వేల మంది వీక్షించడం సంచలనం రేపింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన సభను ఎక్స్ ద్వారా 2,400 మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగా, టీఎంసీ లోక్సభ అభ్యర్థులను పరిచయం చేస్తూ పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సభను 1,200 మంది తిలకించారు. లైవ్ సభల్లో టాప్.. ‘ఎక్స్’ చరిత్రలో అత్యధిక మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన రాజకీయ సభల్లో సీఎం జగన్ మేదరమెట్ల సభ అగ్రస్థానంలో ఉందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. మరో సామాజిక మాధ్యమం యూట్యూబ్లో సాక్షి టీవీ ద్వారా మేదరమెట్ల సభను 56 వేల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇదే రీతిలో యూట్యూబ్లో ఎన్టీవీ, టీవీ 9 లాంటి ఛానళ్లలో భారీ ఎత్తున సిద్ధం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇటు సామాజిక మాధ్యమాలు.. అటు వివిధ టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది ‘సిద్ధం’ సభను తిలకించారు. సీఎం జగన్పై వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న ఆదరణ, విశ్వసనీయతకు నిదర్శనంగా ఈ సభ నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మనవడి కోసం వచ్చాను మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని తెలుసుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలు ఉదయం 7గంటలకే సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉదయాన్నే సభావేదిక వద్ద వృద్ధురాలు కలియతిరగడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. – అద్దంకి వేదిక వద్ద ప్రైవేట్ డ్రోన్ ‘సిద్ధం’ సభా వేదిక వద్ద కుడి వైపు ఓ ప్రైవేట్ డ్రోన్ ఎగరటాన్ని గుర్తించిన మంత్రి అంబటి రాంబాబు దాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. అనుమతి లేకుండా ఇక్కడ డ్రోన్ ఎలా ఎగరవేస్తున్నారు? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నారా లోకేష్ ఇలా దొంగచాటుగా డ్రోన్లను పంపడం కాకుండా ధైర్యముంటే నేరుగా రావాలని నరసరావుపేట పార్లమెంట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. -
రాజకీయ కుంభమేళా!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, బాపట్ల: దక్షిణ కోస్తా ప్రాంతంలో వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన ‘సిద్ధం’ సభ కుంభమేళాను తలపించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ సునామీకి తాజా సభ మరో తార్కాణమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. మేదరమెట్ల–రేణంగివరం మధ్య కోల్కతా–చెన్నై జాతీయ రహదారికి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో నిర్వహించిన సిద్ధం సభకు ఉదయం 9.30 గంటల నుంచే కార్యకర్తలు, నేతలు, అభిమానుల ప్రవాహం మొదలైంది. మధ్యాహ్నం 2.45 గంటలకు సభా ప్రాంగణం మొత్తం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత సభకు వస్తున్న వారంతా జాతీయ రహదారిపై(అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలు దిగడానికి వీలుగా పది లేన్లతో నాలుగు కి.మీ.పొడవున అభివృద్ధి చేశారు) నిలబడిపోయారు. సభకు తరలివస్తున్న లక్షలాది మంది ప్రజలు వాహనాల్లోనే ఉండిపోయారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. మేదరమెట్ల–రేణంగివరం మధ్య 18 కి.మీ. పొడవున ఆరు వరుసల రహదారిపై వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మేదరమెట్ల నుంచి అద్దంకి వైపు వెళ్లే నార్కెట్పల్లి జాతీయ రహదారిపై ఏడు కి.మీ. పొడవున వాహనాలు స్తంభించిపోయాయి. సీఎం జగన్ ప్రసంగం పూర్తయిన తర్వాత కూడా సభకు జనప్రవాహం కొనసాగడం గమనార్హం. శ్రేణుల్లో సరి కొత్త ఉత్సాహం.. బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక వైఎస్సార్సీపీ నిర్వహించిన ఈ సభకు జనం పోటెత్తడంతో పార్టీ శ్రేణుల్లో సరి కొత్త ఉత్సాహాన్ని నింపింది. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ఉత్తరాంధ్రలో జనవరి 27న నిర్వహించిన భీమిలి సభ, ఉత్తర కోస్తాలో ఫిబ్రవరి 3న జరిగిన దెందులూరు సభ, రాయలసీమలో ఫిబ్రవరి 18న నిర్వహించిన రాప్తాడు సిద్ధం సభలు ఒకదానికి మంచి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. వాటికి మించి మేదరమెట్ల సభ సూపర్ హిట్ కావడం సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎన్నికల సన్నాహక సభలు ఈ స్థాయిలో గ్రాండ్ సక్సెస్ కావడంతో టీడీపీ–జనసేన–బీజేపీ నేతలు వణికిపోతున్నారు. మారుమోగిన ‘సిద్ధం’.. రాష్ట్రంలో 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేసిన మంచిని వివరించడంతోపాటు చంద్రబాబు–పవన్ కళ్యాణ్పై పదునైన విమర్శలతో విరుచుకుపడుతూ సీఎం జగన్ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. 2014 ఎన్నికల్లోనూ ఆ మూడు పార్టీలు జట్టు కట్టాయని గుర్తుచేస్తూ రుణమాఫీ పేరుతో రైతులకు, మహిళలకు చంద్రబాబు చేసిన మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానంటూ యువతను చంద్రబాబు వంచించిన వైనాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు అదే కూటమి మరోసారి జత కట్టిందని, చంద్రబాబు హామీలకు శకుని చేతిలో పాచికలకు తేడా లేదంటూ విమర్శించడంతో జనం హర్షధ్వానాలు చేశారు. మాట నిలబెట్టుకుంటూ ఎన్నికల హామీల్లో 99 శాతం అమలు చేశామని, డీబీటీతో రూ.2.65 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశామని.. పేదలు బాగుపడటం చూసి చంద్రబాబు కుళ్లుకుంటున్నారని సీఎం జగన్ విమర్శించినప్పుడు జనం నుంచి అనుహ్య స్పందన లభించింది. మరో చారిత్రక విజయానికి, మహా సంగ్రామానికి సిద్ధమా? అని సీఎం జగన్ ప్రశ్నించగా లక్షలాది మంది పిడికిళ్లు బిగించి సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. రైతన్నల రాజ్యం.. సీఎం జగన్ అన్నదాతల శ్రేయస్సును కాంక్షిస్తూ రైతు రాజ్యం తీసుకొచ్చారు. వైఎస్సార్ రైతు భరోసాతో పాటు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు అందచేశారు. ప్రతి కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు పెద్ద పీట వేసి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. ఉద్యోగాలు, పదవులు, రుణాలు, ఇళ్ల స్థలాలు... అన్నింటా వారికే ప్రాధాన్యం ఇచ్చారు. పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు చేరువ చేసి విద్యా దీపాలు వెలిగించారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా ఒకటో తేదీనే టంచన్గా రూ.3 వేలు చొప్పున సామాజిక పింఛన్లను ఇంటివద్దే పారదర్శకంగా అందించే విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. లక్షల సంఖ్యలో సచివాలయ ఉద్యోగాలతోపాటు గ్రూపు 1, గ్రూపు 2, డీఎస్సీతో యువత కలలను నెరవేరుస్తున్నారు. సీఎం జగన్ను ప్రతి పేద కుటుంబం తమ పెద్ద బిడ్డ మాదిరిగానే భావిస్తూ ఆశీర్వదిస్తోంది. – చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రీజినల్ కో–ఆర్డినేటర్, ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్త. సముద్రంలో కలిపేస్తాం.. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు సీఎం జగనైతే 14 ఏళ్లు అందరినీ వంచించిన మోసగాడు చంద్రబాబు. మొనగాడు కావాలో.. మోసగాడు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. సీఎం జగన్ను గద్దె దింపేంత వరకు విశ్రమించబోనంటున్న చంద్రబాబు తనకు దత్తపుత్రుడు తోడైనా ధైర్యం చాలక ఇప్పుడు ముగ్గురం కలిసే వస్తామంటున్నారు. ఆయన సింగిల్గా వస్తే చితకబాదుతాం. ఇద్దరొస్తే విసిరి కొడతాం. ముగ్గురూ కలిసి వస్తే సముద్రంలో కలిపేస్తాం. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని 50 శాతానికిపైగా ప్రజలు కోరుకుంటున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా ఆయన్ను ఏమీ చేయలేరు. టీడీపీ – జనసేన జెండాలు ఎత్తేసే సభలు నిర్వహిస్తున్నాయి. – అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి వంచన చరిత్ర బాబుదే సీఎం జగన్కు పాలన చేతకాదని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు నాలుక మడత పెట్టి ఆయన ఒక బటన్ నొక్కితే నేను ఐదు బటన్లు నొక్కుతానని నమ్మబలుకుతున్నారు. కరోనా సమయంలో బడికి వెళ్లని పిల్లలకు ఎవరి అబ్బ సొమ్ములా అమ్మ ఒడి ఇచ్చారని విమర్శించిన చంద్రబాబు తాను ఒక్కరికైతే రూ.15 వేలు, ముగ్గురు పిల్లలుంటే రూ.90 వేలు చొప్పున ఇస్తామంటున్నారు. ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడి ప్రజలను మోసగించాలని ప్రయత్నిస్తున్నారు. రైతులు, డ్వాక్రా మహిళలనూ రుణమాఫీ పేరుతో వంచించిన చరిత్ర చంద్రబాబుదే. సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా మాటకు మించి పెట్టుబడి సాయాన్ని అన్నదాతలకు అందచేశారు. మాట ప్రకారం పొదుపు సంఘాల మహిళలను కూడా ఆదుకున్నారు. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పేద బిడ్డలకు ప్రోత్సాహం.. సీఎం జగన్ నిరుపేద బిడ్డలకు ఇంగ్లిషు మీడియం చదువులను అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచంతో మన విద్యార్థులు పోటీ పడేలా ప్రోత్సహిస్తున్నారు. చేయూతతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. నిజమైన సాధికారత అంటే కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవటమే. మహిళల రక్షణ కోసం ‘దిశ’ తీసుకొచ్చారు. 1.40 లక్షల మంది మహిళల ఫోన్లలో దిశ రిజిస్టర్ కావడం సీఎం జగన్ కల్పిస్తున్న భరోసాకు నిదర్శనం. – మేకతోటి సుచరిత, హోంశాఖ మాజీ మంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ‘సిద్ధం’ బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు ఆత్మ గౌరవంతో తలెత్తుకుని ముందుకు సాగటానికి సీఎం జగన్ కల్పిస్తున్న భరోసానే కారణం. ప్రతి కార్యకర్త, నాయకుడు 45 రోజులు పాటు కష్టపడితే ఆ తరువాత ఐదేళ్లు సీఎం జగన్ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. 2024 తరువాత రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ మాత్రమే ఉంటుంది. జగనన్నను ఎదుర్కొనే దమ్ములేక ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ వెళ్లి కాళ్లా వేళ్లా పడుతున్నారు. – అనిల్కుమార్ యాదవ్, నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త ఊరూరా ఘన స్వాగతం.. నన్ను అద్దంకి పంపించి ఇంత పెద్ద వైఎస్సార్ కుటుంబాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రతి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఇంటికి చేరిన సంక్షేమ పథకాలు సీఎం జగన్ మంచితనం, మానవత్వాన్ని చాటుతున్నాయి. 70 ఏళ్ల పెద్దమ్మ కూడా జగనన్నా అంటోందంటే వారి మనసుల్లో సీఎం జగన్ చిరస్థాయిలో నిలిచారనేందుకు నిదర్శనం. – పాణెం హనిమిరెడ్డి, అద్దంకి వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఒక నమ్మకం.. భరోసా జగనన్న అంటే.. ఒక నమ్మకం.. ఒక భరోసా. పేదలకు అండగా ఉంటూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చేయూతనందిస్తున్నారు. దాదాపు 36 సంక్షేమ పథకాల ద్వారా డీబీటీతో నేరుగా రూ.2.50 లక్షల కోట్లకు పైగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పారదర్శకంగా జమ చేశారు. పిల్లల చదువులు మొదలుకొని మహిళలు సాధికారతతో ఎదిగేలా తోడుగా నిలుస్తున్నారు. పేదలకు ప్రధానంగా కావాల్సింది విద్య, వైద్యం. వీటిని భరోసాగా వారికి అందించిన ఘనత సీఎం జగన్దే. – నందిగం సురేష్, బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నా కుటుంబానికి అన్ని పథకాలు అందాయి. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు నా కుటుంబానికి అందాయి. నా భార్యకు వైఎస్సార్ చేయూత, డ్వాక్రా రుణమాఫీ అందాయి. నాకు సెంట్రింగ్ పని నిమిత్తం పెట్టుకున్న రుణం రూ.3లక్షలు కూడా అందజేసిన మనసున్న వ్యక్తి సీఎం జగనన్న. తిరిగి జగనన్నను సీఎంను చేసుకునేందుకు పాటుపడతాం. – షేక్ మీరావలి, సంతనూతలపాడు జగనన్నను చూడాలన్న కోరికతో వచ్చా సీఎం జగన్ ఇచ్చినన్ని సంక్షేమ పథకాలను ఏ ముఖ్యమంత్రీ ఇవ్వలేకపోయారు. అందుకే జగనన్న అంటే ఎనలేని అభిమానం. ఆయన సభ ఎక్కడ జరిగినా, ఎంత దూరమయినా వెళుతుంటాను. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది. రానున్న ఎన్నికల్లో ఆయన మళ్లీ సీఎం అవడం ఖాయం. – సీహెచ్ రామ్మూర్తి, విశాఖపట్నం 3 చక్రాల బండిపై 80 కి.మీ. ప్రయాణించి వచ్చా.. మాది బాపట్ల పట్టణం ఇందిరానగర్ కాలనీ. దివ్యాంగులం అయిన మాకు జగనన్న సీఎం అయిన తర్వాత చేసిన మేలు జీవితంలో మరువలేం. మాకు గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు చక్రాల బండ్లు పంపిణీ చేశారు. జగనన్న మీద అభిమానంతో 80 కిలోమీటర్లు మూడు చక్రాల బండిమీద ప్రయాణం చేస్తూ వచ్చాను. అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి జగనన్న పాలనలోనే పెన్షన్లు సక్రమంగా వస్తున్నాయి. జగనన్న మాకు చేస్తున్న మేలును మేము జీవితంలో మరువలేం. – చల్లా రామయ్య, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆరోగ్యం బాగోలేదు.. అయినా నా మనవడిని చూద్దామని వచ్చా.. నాది జె.పంగులూరు మండలం రేణంగివరం గ్రామం. నా వయస్సు 73 ఏళ్లు. నాకు మూడు రోజులుగా జ్వరం. ఒళ్లంతా నొప్పులు. నా మనవడిని చూడాలని ఎప్పటి నుంచో కోరిక. మా ఊరి దగ్గరకు వచ్చినప్పుడైనా చూద్దామనుకుంటే జ్వరం వచ్చింది. అయినా సరే చచ్చినా ఫర్లేదు అనుకుని బయల్దేరాను. అందరూ ముసలిదానివి ఆ జనంలో తొక్కుతారు. చచ్చిపోతావని చెప్పారు. అయినా సంతోషమే అంటూ వచ్చాను. దేవుడి దయవల్ల నన్ను పోలీసులు స్టేజీ దగ్గరకు తీసుకెళ్లి కూర్చొబెట్టారు. నేను నా మనుమడిని దగ్గరగా చూశాను. ఈ జన్మకు ఇది చాలు. – భూమి రాములమ్మ 370 కి.మీ. ప్రయాణించి వచ్చా.. నాది తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా. నేను హైదరాబాద్లో నివాసం ఉంటున్నా. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. విద్యా వ్యవస్థలో జగనన్న తీసుకుంటున్న సమూలమైన మార్పుల కారణంగా జగనన్నకు అభిమానిగా మారాను. ఇంత అభిమానం ఉన్న నాకు జగనన్నకు ఓటేసే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అబ్బాయిని వివాహం చేసుకుని జగనన్నకు ఓటు వేసి ఆయనకు మద్దతుగా నిలవాలన్నది నా కోరిక. ఆయన మీద అభిమానంతో 370 కి.మీ ప్రయాణం చేసి అద్దంకి సిద్ధం సభకు వచ్చా. జగనన్నను దగ్గరగా చూడటంతో నా జన్మ ధన్యమైంది. – తోకాటి నిదూష – కరీంనగర్ దివ్యాంగుడిని అయినా దిగులు లేదు దివ్యాంగుడిని అయినా నా జీవనంపై దిగులు పడకుండా ప్రభుత్వం నెల నెలా రూ.మూడు వేల పింఛన్ నగదు అందజేసి నాలో మనోధైర్యం నింపుతోంది. త్రిచక్ర వాహనాన్ని కూడా అందజేశారు. అలాగే నా కుటుంబంలో అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సంక్షేమం ప్రతి ఒక్కరికీ అందాలంటే జగనన్న తిరిగి ముఖ్యమంత్రి కావాలి. – ఆర్.ఆంజనేయులు, ఒంగోలు బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ జగన్తోనే.. మాది ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం చింతగుంట్ల గ్రామం. మా అభిమాన హీరో, మా ఇంటి ఆశాదీపం అయిన మా జగనన్నను చూసేందుకు బైక్పై 100 కి.మీ.ప్రయాణించి వచ్చాం. మా బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ జగనన్నతోనే ఉంటాం. సీఎం హోదాలో ఉన్న జగనన్న కామన్ మేన్గా నడుచుకుంటూ మా మధ్యలోకి రావడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. – రాంబాబు, నాగరాజు, అశోక్ నా రెండు కాళ్లూ సహకరించకున్నా జగన్ కోసం వచ్చా.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం వైఎస్ జగన్ను చూసేందుకు వచ్చాను. నా రెండు కాళ్లు సహకరించకపోయినా మార్కాపురం నుంచి వచ్చాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలు మా కుటుంబానికి అందాయి. పంటల బీమా, డ్వాక్రా రుణమాఫీ వంటి వాటితో మా జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు జగన్. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలి. – ఎం.వెంకటేశ్వరరెడ్డి, మార్కాపురం తెలంగాణ నుంచి వచ్చా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు మా ఇంట్లో వెలుగులు నింపాయి. బతుకుదెరువు కోసం నేను బేల్దారి మే్రస్తిగా తెలంగాణ రాష్ట్రం హన్మకొండలో పనిచేస్తున్నాను. నా కుటుంబం ఇక్కడే ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలున్నారు. అమ్మ ఒడి, ఇళ్ల పట్టా, వైఎస్సార్ చేయూత వంటి పథకాలు మాకు అందాయి. సీఎం జగన్ మా ప్రాంతానికి వస్తున్నాడని తెలిసి హన్మకొండ నుంచి ఆయనను చూసేందుకు సిద్ధం సభకు వచ్చాను. – గంగుల అశోక్, మర్రిపూడి నా మనవడిని దగ్గరగా చూడాలన్న ఆశ నెరవేరింది.. జీవిత చరమాంకంలో ఉన్న మాలాంటి వృద్ధులకు అండగా నిలిచిన నా మనవడు జగన్ను దగ్గరగా చూడాలని సిద్ధం సభకు వచ్చాను. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు పింఛన్ అందించి మాలాంటి వారికి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా చూస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకున్నా. నా మనవడిని దగ్గరగా చూడాలనే ఆశ నెరవేరింది. – చెన్నక్క, పొదిలి జగన్ నూరేళ్లూ చల్లగా ఉండాలి రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ప్రతి ఇంటికీ పెద్ద కొడుకుగా సీఎం జగన్ నిలిచారు. మా ఇంట్లో రైతు భరోసా వచ్చింది. ఇల్లు కూడా కట్టుకున్నాం. మంచి మనసున్న సీఎం జగన్ను చూసేందుకు వృద్ధాప్యంలో ఉన్నా, భార్యాభర్తలం ఇద్దరం వచ్చాం. ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలి. మళ్లీ ఆయనే సీఎం కావాలన్నది మా కోరిక. – అనంత సీతమ్మ, జె.పంగులూరు -
Addanki Siddham Sabha Photos: కిక్కిరిసిన రోడ్లు, జన సముద్రం (ఫొటోలు)
-
అద్దంకి సిద్ధం సభ: కిక్కిరిసిన రోడ్లు, ఒక్కటైన హృదయాలు
సాక్షి, బాపట్ల: అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ‘సిద్ధం సభ’ విజయవంతమైంది. సిద్ధం సభకు లక్షాలాదిగా ప్రజలు హాజరై.. సీఎం వైఎస్ జగన్ ప్రసంగాన్ని ఉత్సాహంగా విన్నారు. కార్యకర్తలు, అభిమానులతో సభకు వచ్చే.. అన్ని దారులు నిండిపోయాయి. రోడ్లన్ని కిక్కిరిసి.. హృదయాలు ఒక్కటైయ్యాయి. సభా ప్రాంగణంలో ఎంత మంది ఉన్నారో.. సభ బయట అంత మంది కంటే ఎక్కువే ఉన్నారు. -
ఆంధ్రప్రదేశ్ ‘సిద్ధం’ (ఫొటోలు)
-
2024లో జగనే సీఎం: కాకాణి గోవర్థన్ రెడ్డి
సాక్షి, బాపట్ల: చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు. పగటి వేశాగాళ్లు వలే సంవత్సరానికి ఒకసారి బయటి వచ్చి పద్యాలు, మాటలు చెప్పి.. చందాలు పట్టుకొని పోయిన విధంగా ఇవాళ మరల చంద్రబాబు బయటకు వచ్చారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన సిద్ధం సభలో కాకాణి ప్రసంగించారు. ‘చంద్రబాబు రకరకాల వాగ్ధానాలు చేస్తున్నారు. సీఎం జగన్పై విమర్శలు చేసిన చంద్రబాబు తాను అధికారంలోకి సీఎం జగన్ ఒకసారి బటన్ నొక్కితే.. తాను ఐదు బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నానని నాలుక మడతబెట్టి మాట్లాడుతున్నాడు. అమ్మ ఒడిపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పడు మళ్లీ మాట మార్చాడని మండిపడ్డారు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు... 2024లో జగనే సీఎం అవుతారు’ అని కాకాణి అన్నారు. -
అద్దంకి సిద్ధం సభలో బాబు&కోపై సీఎం జగన్ పంచ్లు
సాక్షి, బాపట్ల: బిందువు బిందువు కలిసి సింధువైనట్లుగా.. నా మీద, నా పార్టీ మీద నమ్మకంతో ప్రభంజనంలా సిద్ధమంటూ ఉప్పెనలా తరలి వచ్చిన జన సమూహం ఓ మహా సముద్రంలా కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆదివారం సాయంత్రం బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలో మేదరమెట్ల సిద్ధం సభలో ప్రసంగించారాయన. ఈ సందర్భంగా సీఎం జగన్.. బాబు&కోపై పంచ్లు వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒకటే ఒక సూటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ కు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఏమైంది? ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంత మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఇంట్లో ఉన్నారు పార్టీల పొత్తులతో బాబు ... ప్రజలే బలంగా మనం తలబడపోతున్న మహాసంగ్రామానికి మీరంతా సిద్ధమా..? జగన్ను ఓడించాలని వారు.. పేదలను గెలిపించాలని మనం మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవాడానికి మీరంతా సిద్ధమా...? సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధం.. సిద్ధమంటే ప్రజాసముద్రం ఇప్పటీకే ఉత్తారంధ్ర సిద్ధం, ఉత్తర కోస్తా సిద్ధం, రాయలసీమ సిద్ధం ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధం నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ మూడు పార్టీలతో చంద్రబాబు కూటమి చంద్రబాబు జేబులో ఉన్న మరో నేషనల్ పార్టీ చంద్రబాబు సైకిల్కు ట్యూబ్లు లేవు టైర్లు లేవు.... చంద్రబాబు సైకిల్ తుప్పుపట్టింది ఈ తుప్పు పట్టిన సైకిల్ తోయడానికి వేరే పార్టీలు కావాలి సైకిల్ చక్రం తిరగక.. ఢిల్లీ చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నాడు చిత్తశుద్ధితో మనం చేసిన మంచే చంద్రబాబును పొత్తుల వైపు పరుగులు పెట్టేలా చేసింది విరగగాసిన మామిడి చెట్లులా మనముంటే.. తెగులుపట్టిన చెట్టులా చంద్రబాబు పరిస్థితి ఉంది మీ అన్న మాటిస్తే.. తగ్గేదేలే రాబోయే ఎన్నికల్లో ప్రజలది కృష్ణుడి పాత్ర, నాది అర్జునుడి పాత్ర, ఇది ధర్మ, అధర్మాల మధ్య జరిగే యుద్ధం చంద్రబాబు సైకిల్ తప్పు పట్టిపోయింది, టీడీపీకి సైకిల్ కు టైర్లు లేవు, ట్యూబ్ లు లేవు, తుప్పుపట్టిన సైకిల్ ను తోయడానికి ఇతర పార్టీలు కావాలి శకుని చేతిలోకి పాచికలకు .. బాబు ఇచ్చిన వాగ్దానాలకు తేడా లేదు, చంద్రబాబు తాజా మేనిఫెస్టో లోని వాగ్దానాలు చూస్తే పక్క రాష్ట్రాల్లోంచి కొన్ని హామీలు తీసుకొచ్చి కిచిడి చేస్తాడు మంచి చేసి మేం విరగకాసిన మామిడిచెట్టులా ఉంటే మోసం చేసి, వెన్నుపోట్లు పొడిచినందుకు చంద్రబాబు పరిస్థితి తెగులుపట్టిన చెట్టులా ఉంది ఫ్యాన్ ఇంట్లో ఉండాలి .. సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి మీ అన్న చేసేదే మేనిఫెస్టో లో పెడతాడు, మీ అన్న మాట ఇస్తే తగ్గేదే లే, చేసేదే చెప్తాం .. చెప్పామంటే చేస్తాం -
నాకు మద్దతు పలికేందుకు వచ్చిన ప్రజా సముద్రానికి సెల్యూట్: సీఎం జగన్
సాక్షి, బాపట్ల: బిందువు బిందువు కలిసి సింధువైనట్లుగా.. నా మీద, నా పార్టీ మీద నమ్మకంతో ప్రభంజనంలా సిద్ధమంటూ ఉప్పెనలా తరలి వచ్చిన జన సమూహం ఓ మహా సముద్రంలా కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆదివారం సాయంత్రం బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్ల సిద్ధం సభలో లక్షల మంది జనసందోహం నడుమ ప్రసంగించారాయన. మేదరమెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం.. ఓ జన ప్రవాహం కనిపిస్తోంది. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు నాపై నమ్మకంతో వచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మరో ఐదేళ్లు ఈ ప్రయాణం కొనసాగిద్దాం. పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరు సిద్ధమా? అని సీఎం జగన్ అనగానే.. లక్షల మంది సిద్ధం అంటూ బదులిచ్చారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తా.. దక్షిణ కోస్తా సిద్ధం. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం. సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధమని.. ఓ ప్రజా సముద్రమని సీఎం జగన్ అన్నారు. రాబోయే కురుక్షేత్రంలో ప్రజలది శ్రీకృష్ణుడ్ని పాత్ర అని.. తనది అర్జునుడి పాత్ర అని.. కౌరవ సైన్యంపై యుద్ధం చేయబోతున్నామని అన్నారు. జమ్మి చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చిందని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. -
ఎన్ని పార్టీలు ఏకమైనా యుద్ధానికి సీఎం జగన్ సిద్ధం: చెవిరెడ్డి
సాక్షి, బాపట్ల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ రైతులు గురించే ఆలోచించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో చెవిరెడ్డి ప్రసంగించారు. ‘సీఎం జగన్ ప్రతి ఊర్లో రైతు భరోసా కేంద్రాన్ని పెట్టారు. మహిళలు, విద్యార్థులకు ఎంతో చేశారు. ఒకటో తేదీనే రూ.3 వేల పెన్షన్ అందిస్తున్నారు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా యుద్ధానికి జగన్ సిద్ధం. సంక్షేమానికి సీఎం జగన్ సిద్ధం అంటున్నారు’ అని చెవిరెడ్డి తెలిపారు. -
జగన్ వన్స్మోర్ నినాదాలతో మారుమోగిన అద్దంకి సిద్ధం సభ (ఫొటోలు)
-
మొనగాడు కావాలా?.. మోసగాడు కావాలా?: మంత్రి అంబటి
సాక్షి, బాపట్ల: అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ సిద్ధం సభ నిర్వహిస్తోంది. సిద్ధం సభలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పంచ్లతో దద్దరిల్లేలా చేశారు. సీఎం జగన్ మొనగాడు.. చంద్రబాబు మోసగాడని అన్నారు. ‘సింగిల్గా వస్తే చితకబాదుతాం. ఇద్దరు వస్తే విసిరి కొడతాం. ముగ్గురు కలిసి వస్తే విసిరి సముద్రంలో ముంచేస్తాం. 14 ఏళ్లలో చంద్రబాబు చేసిన మేలు ఒక్కటీ లేదు. ... చంద్రబాబు రా .. కదలి రా అంటే ఎవరూ రావడం లేదు. ఎంతమందితో కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయం. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగనన్న. 14 ఏళ్లు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కిన మొసగాడు చంద్రబాబు. మొనగాడు కావాలా?. మోసగాడు కావాలా?. ... టీడీపీ కదలి రా అంటే ఎవరూ వెళ్లడం లేదు. ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్ నిలబెట్టుకున్నారు. ప్రతి విషయంలో చంద్రబాబు మోసం చేశారు. ఒంటరిగా వచ్చే ధైర్యం చంద్రబాబుకు లేదు. అందుకే దత్తపుత్రుడితో కలిసి వస్తున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరు. వాళ్లది జెండా సభ కాదు.. జెండా ఎత్తేసే సభ. పవన్ సీఎం కావాలని కాపులు అడుగుతారని ఎంపీగా పోటీ చేయించాలని ప్లాన్ చేశారు’ అని మంత్రి అంబటి అన్నారు. -
Watch Live: మేదరమెట్లలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ..
-
గ్యాలరీలు ఫుల్..
-
హుషారుగా.. అద్దంకి సిద్దం సభకు (ఫొటోలు)
-
అడ్డురాని అంగవైకల్యం...సిద్ధం సభకు వికలాంగులు
-
అంతులేని అభిమానం...గుండెలపై సీఎం జగన్ పచ్చ బొట్టు..
-
సీఎం జగన్ సిద్ధం సభ..డ్రైవర్ గా మారిన ఎమ్మెల్యే పిన్నెల్లి
-
15 లక్షల మందితో సిద్ధం సభ
-
పేరెంట్స్ కి పిల్లలు భారం కాకుండా జగనన్న చెయ్యందించాడు
-
జైత్రయాత్రకు మేం 'సిద్ధం' పబ్లిక్ గూస్ బంప్ కామెంట్స్
-
ముగ్గురు కలిసినా..సింహం సింగిల్ గా వస్తుంది..
-
జగన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..
-
సిద్ధం సభలో మొదలైన హంగామా
-
Watch Live: ఏపీ దద్దరిల్లేలా సిద్ధం సభ
-
200 ఎకరాల్లో సిద్ధం సభ
-
గత సభలకు మించి మేదరమెట్ల సిద్ధం భారీ ప్రణాళిక
-
Siddham Sabha: అద్దంకి సిద్ధం సభ హైలైట్స్
Medarametla Siddham Sabha Updates: 4:45PM, Mar 10th, 2024 సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఏమన్నారంటే.. బిందువూ బిందువూ సింధువైనట్లుగా.. నా మీద, మన పార్టీ మీద నమ్మకంతో చేయి చేయి కలిపి ప్రభంజనంలా ఇక్కడికి సిద్ధం అంటూ ఉప్పెనలా తరలి వచ్చిన ఈ జన సమూహం.. ఓ మహాసముద్రంలా ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తోంది. ఈ మేదరమెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం. ఓ జన ప్రవాహం. ఇంటింటి అభివృద్ధిని, సామాజిక వర్గాల సంక్షేమాన్ని, పేదలందరి ఆత్మగౌవరాన్ని మొత్తంగా రాష్ట్ర ప్రగతిని ఇలాగే కాపాడుకుని మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి, ఇక్కడున్న ప్రతి గుండె చప్పుడుకీ మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ సెల్యూట్ చేస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో జరగబోతున్న ఎన్నికల మహాసంగ్రామానికి, ఆ సంగ్రామంలో పేదవాడి భవిష్యత్ను కాపాడేందుకు, ఆ పేదవాడికి అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..! పార్టీల పొత్తులతో బాబు.. ప్రజలే బలంగా మనమూ.. తలపడబోతున్న ఈ మహాసంగ్రామానికి మీరంతా కూడా సిద్ధమేనా..! జగన్ను ఓడించాలని వారు.. పేదల్ని గెలిపించాలని మనం.. చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి మీరంతా కూడా సిద్ధమేనా..! సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం. ఇప్పటికే ఉత్తర కోస్తా సిద్ధం. ఇప్పటికే రాయలసీమ సిద్ధం. ఈరోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ, అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది. ప్రజలందరిదీ. అర్జునుడి పాత్ర మీ బిడ్డది. మీ అన్నది, మీ తమ్ముడిది. జమ్మి చెట్టు మీద ఇంత కాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, పేద సామాజికవర్గాల అభివృద్ధికి, అడ్డు పడుతున్న పెత్తందార్ల మీద ప్రయోగించాల్సిన ఇక సమయం వచ్చేసింది. నాకు, చంద్రబాబుకు ఉన్నట్టుగా పది మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు లేరు. నాకు చంద్రబాబు మాదిరిగా ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేదు. అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా నాకు లేదు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు మీ బిడ్డకు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు.. ఉన్నదల్లా.. నక్షత్రాలు ఎన్నున్నాయో అంత మంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు నాకు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. ప్రతి గడపలోనూ ఉన్నారు. నా ఎదుట ఇసుక వేస్తే కూడా రాలనంతగా ఈరోజు ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు, ప్రజానీకం.. మీలో ప్రతి ఒక్కరూ మీ జగన్కు, మీ అన్నకు, మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లుగానే ముందుకు నడుం బిగించాలి. బహుశా మరో నాలుగు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తోంది. చంద్రబాబు పార్టీలు, చంద్రబాబు జేబులో ఉన్న మరో పార్టీ.. వీరంతా కూడా మన మీద, మన పేదల భవిష్యత్ మీద వీరంతా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు. ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకు వచ్చినన్ని కూడా ఓట్లు రాని పార్టీలు. తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగట్టిన పార్టీలు, రాష్ట్ర ద్రోహుల పార్టీలు, మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, వ్యక్తులు. ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు. మనం 5 కోట్ల ప్రజల అండదండలతో ఇంటింటికీ మంచి చేసి మనం ఈరోజు సిద్ధం అంటుంటే వారి వెనుక ప్రజలు లేరు, చేసిన మంచి చెప్పుకునే పరిస్తితి లేదు కాబట్టి, అరడజను పార్టీలతో, అరడజను ఎల్లో మీడియా సంస్థలతో పొత్తులతో, ఎత్తులతో, జిత్తులతో ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతున్నారు. జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు చంద్రబాబు ఊదరగొట్టేవాడు. ఈరోజు ఏపీలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి, మంచి వల్ల మనకున్న ప్రజా బలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలపడలేక, ఏపీలో తన సైకిల్ చక్రం తిరగడం లేదని ఢిల్లీకి దత్తపుత్రుడితో కలిసి వెళ్లి పడిగాపులుగాసి, ఢిల్లీలో మోకరిల్లుతున్న పరిస్థితులు ఈరోజు చంద్రబాబు పరిస్థితి. కేవలం జగన్ ఒక్కడే ఇటువైపున. జగన్ వల్ల మంచి జరక్కపోయి ఉంటే ప్రతి ఇంటికీ, మేనిఫెస్టోలో చెప్పినది చేయకపోయి ఉంటే, జగన్ అనే ఒక్కడు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తించి ఉండకపోయి ఉంటే.. చంద్రబాబు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతున్నాడు? ఇంత మందితో పొత్తుల కోసం అగచాట్లు పడుతున్నాడు? ఎందుకు ఢిల్లీదాకా వెళ్లి అక్కడ మోకరిల్లుతున్నాడు. దీనికి కారణం చిత్తశుద్ధితో, నిజాయితీతో మనం చేసిన మంచి, అన్ని వర్గాల మీద మనం చూపిన కమిట్మెంట్, ఇంటింటికీ మనం చేసిన అభివృద్ధి. మన పార్టీ, మన ప్రభుత్వం నిండుగా విరగకాసిన మామిడిచెట్టులా మనం ఉంటే, చంద్రబాబు పార్టీ అందర్నీ మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి, గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు పరిస్థితి ఉంది. మన ఎమ్మెల్యేలు, నాయకులు అంతా ప్రతి నియోజకవర్గంలో గడపగడపకూ ప్రజల వద్దకు వెళ్లి చేసిన మంచిని చెబుతూ తిరుగుతుంటే చంద్రబాబు మాత్రం రామోజీ గడప, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప, టీవీ5 గడప, ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు.. ఇలా ఓ అరడజను గడపలు.. ఐదేళ్లుగా తన మనుషులను పంపి తాను తిరుగుతున్నాడు. ఇది కనిపిస్తున్న చంద్రబాబు మార్క్ రాజకీయం. మరి మీ జగన్ మార్క్ రాజకీయం.. మీ అన్న మార్క్ రాజకీయంలో విలువలున్నాయి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది. నిబద్ధత ఉంది. సిద్ధాంత బలం ఉంది. ఇంటింటికీ మంచి చేశాము అన్న చరిత్ర ఉంది. అన్నింటికీ మించి ప్రజల మీద, అక్కచెల్లెమ్మల మీద నమ్మకం ఉంది. మీ బిడ్డ పాలనలో ప్రతి ఇంట్లోనూ చిక్కటి చిరునవ్వులు కనిపించే పరిస్థితులున్నాయి. మన మార్క్ రాజకీయంలో ఇంటింటి అభివృద్ధి కూడా కనిపిస్తుంది. మన ఫ్యాన్ గిర్రున తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి రాదు. ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు. నేరుగా ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది. వారి గుండెల్లో ప్రేమ నుంచి వస్తుంది. మన ఫ్యాన్కు కరెంటు మనందరి ప్రభుత్వం ఇంటింటికీ చేసిన మంచి నుంచి వస్తుంది. మనం అందించిన నవరత్నాల నుంచి మన ఫ్యాన్కు కరెంటు వస్తుంది. లంచాలు లేని, వివక్ష లేని పాలన ఎవరైనా ఇవ్వగలుగుతారా అని ఆశ్చర్యం వెలిబుచ్చిన పరిస్థితుల నుంచి ఈరోజు లంచాలు లేని వివక్ష లేని పాలన అందించిన దాంట్లో నుంచి మన ఫ్యాన్కు కరెంటు వస్తుంది. మాటతప్పకుండా మేనిఫెస్టోను ఓ బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి ఇంత వరకు ఎవరూ ఎప్పుడూ చేయని విధంగా పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలు అమలు చేసిన ఆ నిజాయితీ నుంచి మన ఫ్యాన్కు కరెంటు వస్తుంది. చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటని గమనిస్తే.. చంద్రబాబుకు సైకిల్కు ట్యూబుల్లేవు. టైర్లు లేవు. చక్రాలే లేవు. తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది. తుప్పుపట్టిన సైకిల్ను తొక్కటానికి, తోయటానికి చంద్రబాబుకు వేరే పార్టీలు కావాలి. ఇదీ చంద్రబాబు గారి జాబ్ రిక్వైర్మెంట్. బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచీ కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు. ఒక్క స్కీము కూడా వినపడదు, కనిపించదు. పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు. ఈ ప్యాకేజీ స్టార్ అయితే, సైకిల్ సీటు తనకు కావాలని అడగడు. తన వారికి సీట్లు ఇవ్వకపోయినా ఈ పెద్దమనిషి అడగనే అడగడు. ఎందుకు ఇచ్చి తక్కువ సీట్లు ఇస్తున్నావని క్వశ్చన్ కూడా అడగడు. తాను తాగుతున్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు. స్టాండ్ అంటే నిలబడతాడు. ఎప్పుడు సైకిల్ను దిగమంటే అక్కడ దిగుతాడు. ఎప్పుడు సైకిల్ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు. విభేదించినట్లు డ్రామాలాడమంటే రక్తికట్టించేట్టు డ్రామా ఆడతాడు. వెనకటికి చంద్రబాబు లాంటి నాయకుడిని ఎవరో అడిగారట. అయ్యా.. పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని అడిగారట. అప్పుడు ఆ బాబు.. ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది. చీర కొనిపెడితే చిరిగిపోతుంది. ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది. కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని చెప్పాడట. ఈ 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు కూడా అలాంటోడే. అదే చేశాడు. ఎంత మందితో పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు పరిస్థితి సున్నా. ఈ సున్నా ఇంటూ ఎన్ని పార్టీలున్నా దాని విలువ ఒక బోడి సున్నానే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా.. ఇప్పుడు చంద్రబాబు ముగ్గురితో కలిసి పొత్తు అంటున్నాడు. ఈ ముగ్గురూ కలిసి 2014లో ఇలాగే పొత్తుగా ఏర్పడి ఈ ముగ్గురూ కలిసి ఒకే స్టేజీ మీద కూర్చుని వీళ్లంతా మీటింగులు పెట్టారు. ఒకే ప్రకటనలో ముగ్గురి ఫొటోలు వేసుకుని చంద్రబాబు సంతకం పెట్టి.. ఇంటింటికీ ఈ పాంప్లేట్ను పంపించాడు. రైతులకు రుణమాఫీ మీద మొదటి సంతకం చేస్తాను, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాం, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు డిపాజిట్ చేస్తాం, ఉద్యోగం వచ్చే దాకా నెలనెల రూ.2 వేలు నిరుద్యోగ భృతి, రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ, అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా గృహాలు మంజూరు చేస్తాం, రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాం.... ఇవీ ఇదే చంద్రబాబు, ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫొటో, ఇదే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫొటో. వీళ్లు ముగ్గురూ కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పాంప్లేట్ పంపించాడు. ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా కూడా అమలయ్యాయా? ప్రత్యేక హోదా ఇచ్చారా? మరి ఇవి గతంలో చేయకుండా, పొత్తులో వీరంతా భాగమై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి, మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి, పాంప్లేట్లుగా చేసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పంపి, మరోసారి ఇదే డ్రామాను, ఇవే పొత్తులు.. ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు మళ్లీ చంద్రబాబు పొత్తుల డ్రామాతో మీ అందరి ముందుకు వస్తున్నారు. చంద్రబాబు చూపిస్తున్న ఈ పొత్తులతో ఎవరికైనా ప్రయోజనం కలిగిందా? ప్రజలకు ఏ ఒక్కరూ కూడా మంచి చేయకపోగా, ప్రజలకు మంచి చేసిన జగన్ను టార్గెట్ చేయడానికి మాత్రమే వీళ్ల ఏకైక ఎజెండా కనిపిస్తోంది. చంద్రబాబుకు అధికారం ఎందుకు కావాలంఆటే ప్రజలకు మంచి చేయడం కోసం కాదు.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయడం కోసం కాదు.. కారణం.. ఆ అధికారంతో ప్రజల్ని దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబుకు అధికారం కావాలి. గతంలో 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో.. ఇంటింటికీ పంపిన పాంప్లేట్.. టీవీ ఆన్ చేస్తే చాలు.. ఊదరగొట్టే అడ్వటైజ్మెంట్లు ఇవీ.. అడ్డగోలుగా మోసం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు.. తాజా మేనిఫెస్టోగా.. నరకలోకానికి, నారా లోకానికి రమ్మంటే ఎవరూ రారు కాబట్టి ఎంట్రన్స్లో స్వర్గం చూపించి.. లోపలికి వెళ్లాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబుకు అలవాటు. కిచడీ వాగ్దానాలన్నీ కలిపాడు. కర్ణాటకలో నుంచి కొన్ని, తెలంగాణ నుంచి కొన్ని.. వాళ్ల హామీలన్నీ కలిపి కిచడీ మేనిఫెస్టో తెచ్చాడు. అందులో వారు చూపించే గ్రాఫిక్స్, ఎల్లో మీడియా డిబేట్లు.. వారు చేసే ప్రచారాలు.. ప్రజలు ఆలోచన చేయాలి. చంద్రబాబు చేసే వాగ్దానాలకు శకుని చేతిలో పాచికలకు తేడా ఏమైనా ఉందా? చంద్రబాబు కేరక్టర్కు భిన్నంగా మనందరి ప్రభుత్వం కరోనా కష్ట సమయంలో కూడా ఏమాత్రం సాకులు చూపకుండా పేదలందరికీ మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికీ అందించాం. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అక్షరాలా రూ.2.65 లక్షల కోట్లు నేరుగా వెళ్లిపోవడం జరుగుతున్న పరిస్థితిని గమనించాలి. నాన్ డీబీటీ పద్ధతిలో అయితే ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ తీసుకోకుండా, మన దగ్గర భూముల విలువ తీసుకోకుండా, మనం సేకరించిన భూముల విలువలు మాత్రమే తీసుకుని నాన్ డీబీటీ కింద మనం చేసిన ఖర్చు.. ఈ 58 నెలల కాలంలో.. చేసిన ఖర్చు రూ.1.10 లక్షల కోట్లు. మొత్తంగా డీబీటీ, నాన్ డీబీటీ కలిపితే 58 నెలల కాలంలో మనం 3.75 లక్షల కోట్లు ఖర్చు చేశాం. అంటే ఏటా ఈ పథకాల మీద మీ బిడ్డ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిన, ప్రజలకిచ్చిన సొమ్ము సంవత్సరానికి రూ.75 వేల కోట్లు. అది కూడా మనం చాలా కష్టపడితే, ఎక్కడా కూడా లంచాలు లేకుండా చేస్తే. మనందరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని,ఇంటింటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పి గతంలో ఇదే ఈనాడు, ఇదే చంద్రబాబు ఎన్నెన్నో సందర్భాల్లో వాదించడం కూడా మన కళ్ల ఎదుట కనిపించిన సత్యం. ఇప్పుడు అదే నోటితో మరోసారి మోసం చేసేందుకు ఎలాగూ చెప్పేవన్నీ అబద్ధాలే కదా.. హద్దులెందుకు అని చంద్రబాబు ఈ మధ్య కాలంలో ఆరు వాగ్దానాలు అంటూ వదిలారు. ఏటా ఖర్చెంత అవుతుందని మా ఫైనాన్స్ వారిని లెక్కలు తీయమన్నాను. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తున్న కొన్ని పథకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగాల్సిందే. ఉదాహరణకు అలాంటి ఎనిమిది పథకాలు.. 66 లక్షల మంది పెన్షన్లకు మనం ఖర్చు చేస్తున్నది దాదాపు రూ.24 వేల కోట్లు. రైతన్నలకిచ్చే ఉచిత విద్యుత్కు ఖర్చు రూ.11 వేల కోట్లు. సబ్సిడీ బియ్యానికి రూ.4600 కోట్లు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 104, 108.. మరో రూ.4.400 కోట్లు, పూర్తి పీజు రీయింబర్స్మెంట్ కింద మీ జగనన్న ఇస్తున్నది విద్యాదీవెన, వసతి దీవెన కింద మరో రూ.5000 కోట్లు సంపూర్ణ పోషణ కింద రూ.2200 కోట్లు, గోరుముద్ద కింద రూ.1900 కోట్లు. కేవలం ఈ ఎనిమిది పథకాలకే.. ఖర్చు రూ.52,700 కోట్లు. ఇవి కచ్చితంగా ఎవరైనా చేయాల్సిందే. చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ ఆరు వాగ్దానాలకు ఎంత ఖర్చవుతుందో లెక్కేస్తే, ఇది పచ్చి మోసం అని తెలిసినా లెక్క వేయిస్తే.. అదనంగా కావాల్సింది ఏటా రూ.73,440 కోట్లు. ఇది కాక చంద్రబాబు ఈ మధ్యనే ఏడో హామీ అని చెప్పి బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అదనంగా పెంచి ఇస్తానన్న హామీని లెక్కేస్తే ఇది అదనంగా రూ.13872 కోట్లు. అంటే చంద్రబాబు చెప్పిన ఆరు సిక్సులు, ఈ ఏడో పథకానికి ఈరెండూ కలిపితే 87312 కోట్లు, ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా 8 స్కీములకు కచ్చితంగా ఎలాగూ చేయాల్సిన స్కీములకు ఖర్చయ్యేది మరో 52,700 కోట్లు. రెండూ కలిపితే అక్షరాలా రూ.1.40 లక్షల కోట్లు.. చంద్రబాబు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం రూ.1.40 లక్షల కోట్లు.. మనం ఎంతో కష్టపడితే, ఎక్కడా లంచాలు లేకుండా ప్రజలకు ఇస్తే, పాలనలో ఎన్నో మార్పులు తెచ్చి పాలన చేస్తే మీ బిడ్డ ప్రభుత్వం పూర్తిగా కట్టడి చేసి ఎంతో కష్టపడితే ఇవ్వగలిగింది సంవత్సరానికి రూ.75 వేల కోట్లయితే, చంద్రబాబు చెబుతున్న హామీలు.. ఇప్పటికే రూ.1.40 లక్షల కోట్లు దాటుతోందంటే.. ఇక ఆలోచన చేయండి.. ఈ పెద్దమనిషి చంద్రబాబు చెప్పే హామీలు మళ్లీ ప్రజల్ని ఎంతగా మోసం చేసేందుకు చెబుతున్నాడో అని అందరూ ఆలోచన చేయాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటే చంద్రబాబు మాట్లాడరు. ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో సుదీర్ఘంగా దీని గురించి వివరించడం జరిగింది. ఎలాగూ అబద్ధాలు చెప్పేటప్పుడు హద్దులెందుకు, భావదారిద్ర్యం ఎందుకని అబద్ధాలు చెప్పే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు. బాబు మేనిఫెస్టో ఏ ఒక్కరన్నా నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లుగానే ప్రజలందరూ మోసపోతారు అని తెలియజేస్తున్నా. ఈ 58 నెలల్లో ప్రజల కోసం 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. దాదాపు రూ.1.70 లక్షల కోట్లు డీబీటీగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించాం. దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు. మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిందంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది. అది కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది. ఇవన్నీ కొనసాగాలంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకు స్టార్ క్యాంపెయినర్గా కుటుంబాలు బయటకు రావాలి. వారు ఓటు వేయడమే కాకుండా వంద మందికి చెప్పి ఓటు వేయించాలి. ప్రతి ఇంట్లోనూ చెప్పాలి. పొరపాటు జరిగితే పేదవాడి భవిష్యత్ అంధకారం అవుతుందని ప్రతి ఇంట్లోనూ చెప్పాలి. ప్రతి గ్రామంలోనూ వివరించాలి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకం. ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో వివరించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో వేసే ఓటు వచ్చే 5 సంవత్సరాలు వారి భవిష్యత్ను ఎలా మారుస్తుందో వివరించాలి. 2019 ఎన్నికల ముందు మీ జగన్ ఓ మాట చెప్పాడు. గుర్తుందా? ఆ మాట.. మీ బిడ్డ వస్తాడు. మంచి రోజులు మీకు తెస్తాడని మీ బిడ్డ మాట ఇచ్చాడు. ఈరోజు మళ్లీ మీ అందరికీ.. ఐదేళ్ల తర్వాత మీ బిడ్డ మరో మాట చెబుతున్నాడు. నేను చెప్పే ఈ మాటను ప్రతి ఊర్లోనూ చెప్పండి. ప్రతి ఇంట్లోనూ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. పేద వాడి భవిష్యత్ బాగుపడాలంటే, జరుగుతున్న ఈ మంచి కొనసాగాలంటే, మళ్లీ జగనన్ననే తెచ్చుకుందామని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి, ప్రతి ఊళ్లోనూ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. మన అన్నను సీఎంగా తెచ్చుకుందాం. మన అన్న ప్రభుత్వాన్ని మనమే రక్షించుకుందాం. బాబు అనే మాయలేడి వలలో పడవద్దు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మరింత మంచి అన్నతో చేయించుకుందాం. మనందరి చల్లని దీవెనలతోనే ఇది సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరికీ వెళ్లి చెప్పండి. మీ కోసం నిలబడిన మన అన్నమీద అరడజను పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. ఆ అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, పేదలకు మీ అందరి తరఫున జగనన్న నిలబడ్డాడు. కాబట్టే అరడజను పార్టీలు, అరడజను బాణాలు ఎక్కుపెట్టాయి. అయినా అన్న పొత్తుల్ని నమ్ముకోలేదు, అన్న మనల్నే నమ్ముకున్నాడు, ఆ దేవుడిని నమ్ముకున్నాడు. అన్న ఒంటరిగానే సింహంలా మనందరికీ తోడుగా నిలబడ్డాడు. అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మన అన్న ప్రజల్ని, దేవుడి తప్ప పొత్తుల్ని, జిత్తుల్ని నమ్ముకోలేదు. మన అన్న ఎప్పుడూ మోసాలు చేయలేదు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మన అన్న నమ్ముకున్నది తాను చేసిన మంచిని, మంచి జరిగిన ప్రజల్ని మాత్రమే నమ్మకున్నాడు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మళ్లీ మన అన్నను గెలిపించేందుకు మనమంతా కూడా చేయి చేయి కలపాలి, మనమంతా ఒక్కటి కావాలి, మనమంతా సిద్ధం అని చెప్పాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. సీఎంగా అన్న వస్తేనే, నెలనెలా ఒకటో తేదీన మళ్లీ చిక్కటి చిరునవ్వులతో మన ఇంటికే రూ.3 వేల పెన్షన్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న వస్తేనే ఇచ్చిన ప్రతి ఇంటి పట్టాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న వస్తేనే అమ్మ ఒడి కొనసాగుతుందని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న వస్తేనే చేయూత పథకం అందుతుందని, రైతు భరోసా రైతన్నకు తోడుగా నిలుస్తుందని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ కింద విద్యాదీవెన, వసతి దీవెన కేవలం అన్న వస్తేనే జరుగుతుందని చెప్పండి. నేరుగా అక్కచెల్లెమ్మలకు ఎలాంటి వివక్ష లేకుండా డబ్బులు పడే పరిస్థితి రావాలంటే మళ్లీ అన్న ముఖ్యమంత్రి అయితేనే అని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న వస్తేనే గవర్నమెంట్ బడి బాగుపడుతుందని చెప్పండి, సీఎంగా అన్న వస్తేనే గవర్నమెంట్ ఆస్పత్రి బాగుపడుతుందని చెప్పండి. నవరత్నాల్లోని అన్నిపథకాలు కూడా కొనసాగుతాయని చెప్పండి. ఈ పథకాలు అందుకున్న మనందరం కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని చెప్పండి. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద అసెంబ్లీకి ఒక ఓటు, పార్లమెంటుకు ఒక ఓటు వేస్తేనే మళ్లీ అన్న సీఎం అవుతాడు. అన్ని పథకాలూ ఇంటికే వస్తాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. చెప్పేటప్పుడు.. అదే చంద్రబాబుకు ఓటు వేయడం అంటే.. మీకు అందే పథకాలన్నింటినీ కూడా రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అవుతుంది అని కూడా చెప్పండి. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయి. మళ్లీ లంచాలు, వివక్షల రాజ్యం మళ్లీ గ్రామాల్లో చెలరేగుతుంది. మళ్లీ అవ్వలు, తాతలు, రైతన్నలు క్యూలో నిలబడే పరిస్థితి, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి, ఎండనక, వాననక ఎవరైనా చనిపోతేగానీ ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి మళ్లీ వస్తుందని చెప్పండి. పొరపాటున చంద్రబాబుకు ఓటేయడం అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్న వాలంటీర్ వ్యవస్థ రద్దుకు మీరే ఓటు వేసినట్లు అవుతుందని చెప్పండి. బాబుకు ఓటు వేయడం అంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషుమీడియం రద్దుకు మీరే ఓటు వేసినట్లు అని చెప్పండి. బాబుకు ఓటు వేయడం అంటే గవర్నమెంట్ బడిని మళ్లీ కార్పొరేట్లకు అమ్మేయడం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. బాబుకు ఓటు వేయడం అంటే మళ్లీ వైద్యం కోసం అప్పులు కావడమే, రైతన్నలు రైతు భరోసాను వదులుకోవడమే, మళ్లీ మోసపోవడమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. బాబుకు ఓటు వేయడం అంటే చంద్రముఖిని మనమే వెళ్లి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని ప్రతి ఇంట్లోకి వెళ్లి చెప్పండి. మనం చేసిన మంచిని చూపించి మనం ఓటు అడుగుతున్నాం. గతంలో ఎప్పుడూ చంద్రబాబు మంచి చేయలేదు కాబట్టి మాయ చేసి చంద్రబాబు ఓటు అడుగుతున్నాడని చెప్పండి. వచ్చే ఎన్నికల్లో జగన్కు, ఫ్యాన్కు మీరు వేసే ఓటు మీ బిడ్డల బంగారు భవిష్యత్కు వేసే ఓటు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు మీరు వేసే ఓటు మన పేదరికం సంకెళ్లను తెంపుకోవడానికి, మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటున్న ఓటు అని చెప్పండి. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్లోనే ఉండాలి అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికీ ప్రతి ఊరికీ, ఇంత మంచి మనం చేశాం కాబట్టి, ఇంత మంచి చేసిన తర్వాత 2019కి మించిన మోజారిటీ, 175కు 1725.. 25 ఎంపీలకు 25 ఎంపీలు.. గెలవడానికి మనమంతా కూడా సిద్ధమేనా..! నా ప్రసంగం ముగించే ముందు ఒక్క మాట చెబుతున్నా. మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం. కానీ చేయగలిగిందే చెబుతాం. చేసేది మాత్రమే చెబుతాం. అందులో చెప్పిన ప్రతి ఒక్కటీ కూడా చేస్తాం. జగన్ మాట ఇచ్చాడంటే.. తగ్గేదే లేదు అని ఈ సందర్భంగా చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించిన పరిపాలన ఓ స్వర్ణయుగానికి దారి తీస్తోంది. 90 శాతం ప్రజలు తెల్లకార్డుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం కూడా పేదరికం సంకెళ్లను తెంచుకుని వాళ్లు అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కల. అలా చేయాలన్నది నా లక్ష్యం ప్రతి ఒక్క ఇంటి నుంచి క్వాలిటీ చదువులు, గొప్ప చదువులు, అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికీ అవకాశం కల్పించడం, ఆ పేద పిల్లల బతుకులు మార్చాలన్నది నా కల. అది నా లక్ష్యం. ప్రతి అక్కచెల్లెమ్మ తన కాళ్ల మీద తాను నిలబడేట్టుగా చిరునవ్వు ఉండాలన్నది నా కల. నా లక్ష్యం. ఏ ఒక్క రైతన్న కూడా వ్యవసాయం వల్ల నష్టపోయానని చెప్పే పరిస్థితి రాకూడదు. వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నది నా కల. అలా చేయాలన్నది నా లక్ష్యం. ఇక ఏ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఏ పేద కూడా పేదరికం వల్ల ఎదగలేకపోయాడన్న పరిస్థితి ఉండకూడదు. పేదవారికి సమానమైన అవకాశాలు రావాలి. సాధికారత కల్పించగలగాలి. అలా మార్చాలన్నది మీ బిడ్డ కల. మీ బిడ్డ సంకల్పం. మీ బిడ్డ లక్ష్యం. వైద్యం కోసం ఏ ఒక్కరూ మరణించే పరిస్థితి రాకూడదు. అప్పులపాలయ్యే పరిస్థితి, ఆస్తులమ్ముకునే పరిస్థితి రాకూడదు. అలా చేయాలన్నది నా కల. ఆ దిశగా అడుగులు వేసేది నా లక్ష్యం. వీటన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేయడానికి మాత్రమే మీ బిడ్డకు అధికారం కావాలి. లంచాలు, వివక్ష లేని వ్యవస్థ ఏర్పడాలన్నదే నా కల. నా లక్ష్యం. ఎవరూ కూడా లంచం అడిగే పరిస్థితి ఉండకూడదు. ఏ పేదవాడూ వివక్షకు లోనయ్యే పరిస్థితులు రాకూడదు. ఇది నా కల. ఇదే నా లక్ష్యం. ఇందుకోసమే మనకు అధికారం కావాలి. చదువుల పరంగా, వ్యవసాయం పరంగా, వైద్యం పరంగా మార్పులు తీసుకొచ్చాం. అక్కచెల్లెమ్మల సాధికారత విషయంలో ఎప్పుడూ చూడని రీతిలో అడుగులు వేశాం. సామాజిక న్యాయానికి అర్థం చెప్పాం. పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల పరంగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా ఎప్పుడూ చూడని విధంగా ఏపీని నంబర్ వన్ దిశగా అడుగులు వేగంగా పడుతూ కృషి చేస్తున్నాం. అద్భుత ఫలితాలు ఇచ్చేలా అడుగులు వేయాలన్నది, వేస్తావున్నది, ఈ ప్రయాణం మధ్యలో ఉన్నది, ఈ ప్రయాణం ముందుకు పోవాలి, పేదవాడి భవిష్యత్ మారాలన్నదే నా కల. దాని కోసమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ దిశగా ప్రయాణం కోసమే మనం అధికారం కావాలని కోరుకుంటున్నాం. పేదవాడి భవిష్యత్ మారాలని, మార్చాలని.. దీని కోసమే మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతున్నా. అధికారం అంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు. అధికారం పోతుందన్న భయం మీ బిడ్డలో ఎప్పుడూ ఉండదు, రాదు అని చెబుతున్నా. హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా.. ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వులు చూడటం కోసం. ప్రతి పేద వాడి ఇంట్లో మీ బిడ్డ ఫొటో చిరకాలం ఉండాలని, చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బతికుండటం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి. దాని కోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు. దానికోసమే మీ బిడ్డ పరితపిస్తున్నాడు. మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తున్నాడు. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగే కార్యకర్తలకు, అభిమానులకు, వాలంటీర్లకు ఒకే ఒక మాట చెబుతున్నా. ఇన్ని పదవులు, ఇన్ని హోదాలు భారతదేశ రాజకీయ చరిత్రలో మరే ఇతర పార్టీ కూడా ఎప్పుడూ ఇవ్వలేదు. మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి వాలంటీర్.. అందరూ నా కుటుంబ సభ్యులే. వారికి కచ్చితంగా మంచి జరుగుతుంది. మంచి జరిగించేందుకు మీ బిడ్డ ఉన్నాడు. వారు మరో రెండు మెట్లు ఎదిగేందుకు, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఎన్నడూ లేనన్ని కార్పొరేషన్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు మొదలు, ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిపించుకుని అవకాశాలిచ్చిన పార్టీ ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మన పరిపాలన చూశారు. అందరూ ఆలోచన చేయాలి. మన 5 సంవత్సరాల పరిపాలన చూశారు. గతంలో 5 సంవత్సరాల చంద్రబాబు పాలన చూశారు. ఈ రాష్ట్రానికి ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతున్నా. నాయకుడంటే చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చే సరికి రంగురంగుల మేనిఫెస్టో చూపి, రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకుని, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు చదువుకుంటున్న పిల్లలకు, ప్రతి సామాజిక వర్గాన్ని ఎలా మోసం చేయాలో దిక్కుమాలిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టో తెచ్చి అధికారంలోకి వచ్చాక చెత్తబుట్టలో వేసి మోసం చేస్తున్న చంద్రబాబులా నాయకుడు ఉండాలా? ఒక మాట నోట్లో నుంచి వచ్చాక, ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా, నష్టమైనా మాట మీద నిలబడే నాయకుడు.. నాయకుడంటే మాట ఇస్తే తగ్గేదే లేదని చెప్పే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా? అని అడుగుతున్నా. నాలుగు సార్లు ఆలోచన చేసి మాట ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మాట తప్పకూడదు. మడమ తిప్పకూడదు. ఏకంగా 99 శాతం మేనిఫెస్టో హామీలన్నీ నెరవేర్చాం కాబట్టే, ప్రతి ఇంటికీ మేనిఫెస్టో చూపించి ప్రతి కార్యకర్తా చెప్పే పరిస్థితి. ఇదీ నాయకుడంటే.. ఇదీ పార్టీ అంటే. నాయకుడంటే ప్రతి కార్యకర్తా కూడా కాలర్ ఎగరేసి అదిగో మా నాయకుడు.. అలాంటి వాడే మా నాయకుడు.. అని ప్రతి కార్యకర్తా కాలర్ ఎగరేసేలా నాయకుడు ఉండాలి. అలాంటి నాయకుడు, అలాంటి పాలన ఉన్నప్పుడే ప్రతి గ్రామంలో, ప్రతి కార్యకర్తా, ప్రతి అభిమానీ ప్రతి ఇంటికీ వెళ్లి మా అన్న ఇవన్నీ దేవుడి దయతో చేశాడు అని వారి చిరునవ్వుల మధ్య కాలర్ ఎగరేసి తిరుగుతాడు. నాయకుడంటే ఆ మాదిరిగా ఉండాలి. నాయకత్వం అంటే విశ్వసనీయత అనే పునాదుల మీద ఎప్పుడూ పెరుగుతుంది. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటా. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత మీ బిడ్డది. నాది. ప్రతి గ్రామానికీ మంచి చేశాం. ప్రతి ఇంటికీ మంచి చేశాం. ప్రతి పేదకూ మంచి చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా.. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు.. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికీ, రాష్ట్ర వ్యాప్తంగా 87 శాతం ఇళ్లకు ప్రతి ఇంటికీ మంచి జరిగింది. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో మీరందరూ మీ సచివాలయ పరిధిలో జరిగిన మంచి గురించి చూస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి సచివాలయం పరిధిలో ఏకంగా రూ.20 కోట్లకుపైగా మంచి జరిగి నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లినట్లు కనిపిస్తుంది. ఈ మార్పు గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగనిది. దేశంలో ఎక్కడా జరగని ఈ మార్పు. ప్రతి ఇంటికీ, ప్రతి ఊరికీ మంచి చేశాం. మన హయాంలోనే బడులు, ఆస్పత్రులు బాగుపడ్డాయి. వ్యవసాయం మారింది. ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. అందుకే చెబుతన్నా. వై నాట్ 175. వై నాట్ 25కు 25 ఎంపీ స్థానాలు అని గట్టిగా అడుగుతున్నా. చెబుతున్నా. పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గే పరిస్థితే ఉండకూడదని తెలియజేస్తున్నా. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఐదేళ్ల కాలంలో ఇంటికీ కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు కొనసాగించాలనే మనకు, వాటిని రద్దు చేయడమే టార్గెట్గా పెట్టుకుని డ్రామాలాడుతున్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు. ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే పెత్తందార్లు మరోవైపున ఉన్నారు. పెత్తందార్లను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..! ఈ యుద్ధం మాట ఇచ్చిన నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం. ఇది విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని, వెన్నుపోటుదారుల్ని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..! జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి చంద్రబాబునాయుడు ప్రచారాలు, ఈనాడు రోత రాతలు, ఏబీఎన్, టీవీ5 ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, వారి అబద్ధాలు, మోసాలు.. వీటన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్ను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..! ప్రతి ఒక్కరూ కూడా మీ జేబులోంచి సెల్ఫోన్ తీయండి.. సెల్ ఫోన్లో లైట్ బటన్ ఆన్ చేయండి.. సిద్ధం అని చెప్పండి.. ఇలా వెలుగుల బాటలో ప్రయాణానికి మరోసారి సిద్ధం అని చెప్పండి. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో కేవలం రెండు నెలల్లోగా మరో ఐదేళ్లు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు జగన్ అనే నేను.. మీ సేవకుడిగా సిద్ధం అని ఈ సందర్భంగా చెబుతున్నా. 4:27PM, Mar 10, 2024 సభా వేదికపైకి చేరుకున్న సీఎం జగన్ ర్యాంప్పై నలువైపులా తిరుగుతూ ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్ కాసేపట్లో ప్రసంగించనున్న సీఎం జగన్ జన సంద్రంగా మారిన మేదరమెట్ల లక్షలాదిగా తరలివచ్చిన జనం మేదరమెట్లలో ఇసుకేస్తే రాలనంత జనం ఎక్కువ మంది వీక్షించేలా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు 4:20PM, Mar 10, 2024 మేదరమెట్ల సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ సీఎం జగన్ ప్రసంగం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జనం 4:07PM, Mar 10, 2024 మేదరమెట్ల చేరుకున్న సీఎం జగన్ జనసంద్రమైన మేదరమెట్ల వైఎస్సార్సీపీ సిద్ధం సభకు పోటెత్తిన జన ప్రవాహం 15లక్షల మందికిపైగా వైఎస్సార్సీపీ శ్రేణులు వచ్చినట్లు అంచనా జై జగన్ నినాదాలతో హెరెత్తుతున్న మేదరమెట్ల సభా ప్రాంగణం వన్స్మోర్ జగన్ నినాదాలతో దద్దరిల్లుతున్న మేదరమెట్ల YSRCP కొత్త క్యాంపెయిన్ నా కల ఏపీలో వైఎస్సార్సీపీ కొత్త క్యాంపెయిన్ కు శ్రీకారం సిద్ధం సభ వేదిక పై నా కల ప్రచార కార్యక్రమం ప్రారంభం ఏపీ వ్యాప్తంగా నా కల పేరుతో హోర్డింగ్ లు యువత, రైతులు, మహిళలు, కార్మికులు, వృద్ధులు, విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం డ్రోన్ కలకలం సిద్ధం సభలో మంత్రి అంబటి రాంబాబు ప్రసంగిస్తూండగా... సభా ప్రాంగణంలో ఒకవైపు డ్రోన్ ఒకటి ఎగురుతూ కనిపించింది. అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే డ్రోన్ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అనుమతి లేకుండా డ్రోన ఎగురుతోందని, ఎవరో దాన్ని నియంత్రిస్తున్నారని సభా వేదికపై నుంచి ప్రకటించారు. సభకు హాజరైన వారు ఒక దిక్కుకు చూడటం కనిపించింది. అయితే ఈ అవాంతరం ఒకట్రెండు నిమిషాలకు మించి జరగలేదు. డ్రోన్ విషయాన్ని ప్రకటించిన తరువాత అంబటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. 3:40PM, Mar 10, 2024 ఆకాశం బద్ధలైందా.. నేల ఈనిందా అన్నట్టుగా ఉంది ఇక్కడ జనసంద్రాన్ని చూస్తే.. : మంత్రి అంబటి రాంబాబు ఏంటి ఈ జన ప్రవాహం అనిపిస్తోంది ఇక్కడకు సీఎం జగన్ హాజరయ్యేలోపు ఓ నాలుగు మాట్లాడదామని వచ్చా ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా 50 శాతం ప్రజలు సీఎం జగన్ కావాలనే అంటున్నారు సీఎం జగన్ మొనగాడు.. చంద్రబాబు మోసగాడు మొనగాడు కావాలా...?, మోసగాడు కావాలా...? సింగిల్ గా వస్తే చితకబాదుతాం ఇద్దరు వస్తే విసిరి కొడతాం ముగ్గురు కలిసి వస్తే విసిరి సముద్రంలో ముంచేస్తాం 14 ఏళ్లలో చంద్రబాబు చేసిన మేలు ఒక్కటీ లేదు చంద్రబాబు రా.. కదిలి రా అంటే ఎవరూ రావడం లేదు ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయం ఎలాంటి వివక్ష లేకుండా సీఎం జగన్ పారదర్శక పాలన చేశారు 3:25PM, Mar 10, 2024 చంద్రబాబు పచ్చి మోసగాడు: మంత్రి కాకాణి చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరు గతంలో రైతులు, అక్కా చెల్లెమ్మలను మోసం చేశాడు చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశాడు సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు 175కు 175 సీట్లు గెలిచి తీరుతాం 3:20PM, Mar 10, 2024 సీఎం జగన్కు ప్రజల అండదండలు ఉన్నాయి: అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో మన సత్తా చూపించాలి జగన్ను ఎదుర్కొనే దమ్ములేక పొత్తులు పెట్టుకున్నారు ఎంతమంది కలిసి వచ్చినా జగన్ మరోసారి సీఎం 3:10PM, Mar 10, 2024 మేదరమెట్ల బయల్దేరిన సీఎం జగన్ కాసేపట్లో సిద్ధం సభకు హాజరుకానున్న సీఎం జగన్ జనసంద్రమైన మేదరమెట్ల వైఎస్సార్సీపీ సిద్ధం సభకు పోటెత్తిన జన ప్రవాహం జన సునామీని తలపిస్తున్న మేదరమెట్ల సీఎం జగన్ పర్యటనలో స్వల్ప మార్పు సీఎం జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్ల పర్యటనలో స్వల్ప మార్పు వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్దం’లో పాల్గొననున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు అనంతరం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. అన్నిదారులు మేదరమెట్ల వైపే కోస్తాంధ్రలో కనివినీ ఎరుగుని రీతిలో భారీగా సిద్ధం సభ రైళ్లు, బస్సులు, కార్లు, సొంత వాహనాల్లో భారీగా తరలివస్తున్న వైఎస్సార్సీపీ క్యాడర్ రాజకీయ కుంభమేళాను తలపించనున్న సిద్ధం సభ మేదరమెట్లలో సీఎం జగన్ ఏం మాట్లాడతారనే ఆసక్తి విపక్షాలపై సీఎం జగన్ విసుర్లు ఎలా ఉండనున్నాయి? సీఎం జగన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ మేదరమెట్లకు పోటెత్తిన వైఎస్సార్సీపీ శ్రేణులు మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలుస్తారంటున్న జనం సీఎం జగన్ పథకాలే ప్రతిపక్షాలు కాపీ కొడుతున్నాయి: కార్యకర్తలు ఎంతమందితో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న గెలిచేది మాత్రం జగనే వైఎస్ జగన్ని మళ్లీ సీఎం చేయడానికి ప్రజలు ‘సిద్ధం’: ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధం సభకి 15 లక్షల మంది వస్తున్నారు చంద్రబాబు సిద్ధాంతాలు, విలువలు లేకుండా పొత్తు పెట్టుకున్నారు బీజేపీకి గత ఎన్నికల్లో 1 శాతం ఓట్లు వచ్చాయి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఎలాంటి ప్రయోజనం లేదు సీఎం జగన్ని ఓడించడం ఆ మూడు పార్టీల వలన కాదు గతంలో ఎన్డీఏలో ఉండి చంద్రబాబు ఏం సాధించారు సీఎం జగన్కి గత ఎన్నికల కంటే అధికంగా ఓట్ల శాతం వస్తుంది అధికారమే చంద్రబాబుఏకి పరమావధి జై జగన్ నినాదాలతో దద్దరిల్లుతున్న సిద్ధం సభ మేదరమెట్ల సిద్ధం సభకు యువత పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు జై జగన్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ జగన్ చేస్తున్న పాలన.. జనరంజకంగా సాగుతోందంటున్నారు ఎన్ని పార్టీలు పొత్తులతో కలిసి వచ్చినా తామంతా జగన్ వెంటే నడుస్తామని తేల్చి చెప్తున్నారు మేదరమెట్ల: సిద్ధం సభకు భారీగా తరలివస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు వేలాదిగా బస్సులు, కార్లు, ఇతర ప్రయివేటు వాహనాలన్నీ మేదరమెట్ల వైపే దాదాపు 15 లక్షల మంది కార్యకర్తలు హాజరు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు కొన్నిచోట్ల వాహనాలు దారి మళ్లింపు సిద్ధం సభకు సర్వం సిద్ధం ప్రత్యేక కాన్సెప్ట్తో ర్యాంప్ రూపొందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ 175 కాన్సెప్ట్తో Y ఆకారంలో ర్యాంప్ ర్యాంప్ చివర 75 అడుగుల ఎత్తులో రెండు వైపులా వైఎస్సార్ కాంగ్రెస్ జెండా రెపరెపలు సీఎం జగన్ ఎన్నికల నినాదంతో ర్యాంప్ ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిన వై నాట్ 175 కాన్సెప్ట్ ఇదే ర్యాంప్పై నడిచి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేయనున్న సీఎం జగన్ దద్దరిల్లనున్న అద్దంకి సిద్ధం సభ 🔥✊🏻 సీఎం @ysjagan కు మద్దతు తెలపడానికి నాయకులు, క్యాడర్ సర్వం సిద్ధం #Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/aIC07wOoDl — YSR Congress Party (@YSRCParty) March 10, 2024 ►రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద ఆదివారం జరగనున్న ‘సిద్ధం’ ఆఖరి సభకు సర్వం సిద్ధమైంది. చరిత్రలో నిలిచిపోయేలా పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద కోల్కత–చెన్నై జాతీయ రహదారి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లుచేశారు. ►దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో కదలిరానున్నారు. వీరిని ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సీఎం జగన్ ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ►రాప్తాడు సభ ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతిపెద్ద ప్రజాసభగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. మూడు సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. టైమ్స్నౌ–ఈటీజీ, జీన్యూస్ మ్యారిటైజ్ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని తేలడంతో చివరి ‘సిద్ధం’ సభకు కూడా ఉరిమే ఉత్సాహంతో కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ ఎత్తున తరలివెళ్లడానికి సంసిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీ దూకుడు ►ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి జనవరి 27న భీమిలి వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం జగన్ సమరశంఖం పూరించారు. ఓ వైపు జనబలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా శాసనసభ, లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ‘సిద్ధం’ సభలు నిర్వహిస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ సభలు పూర్తవడం.. అవి గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా సీఎం జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రతి ఇంటా గుర్తుచేస్తూ.. ప్రభుత్వంవల్ల మంచి జరిగి ఉంటే.. మరింతగా మంచి చేయడానికి వైఎస్సార్సీపీని ఆశీర్వదించి, ఓటు వేయాలని శ్రేణులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. వీరికి ప్రజలు నీరాజనాలు పలుకుతుండటంతో మరింత నూతనోత్సాహంతో వారు ప్రచారంలో పాల్గొంటున్నారు. పొత్తుల లెక్కతేలినా నైరాశ్యం.. ఇక టీడీపీ–జనసేన పొత్తుల లెక్క తేలాక రెండు పార్టీలు మొదటిసారిగా ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ సభకు జనం మొహం చాటేశారు. ‘రా కదలిరా’ పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు ప్రజలు తరలిరావడంలేదు. టీడీపీ–జనసేన పొత్తును ఆదిలోనే జనం ఛీకొట్టడం.. వైఎస్సార్సీపీ సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆ రెండు పార్టీల శ్రేణులు నైతిక స్థైర్యాన్ని కోల్పోయాయి. అలాగే, టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక టైమ్స్నౌ–ఈటీజీ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ 49 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ 21–22 లోక్సభ స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని.. టీడీపీ–జనసేన కూటమి 45 శాతం ఓట్లతో 3–4 లోక్సభ స్థానాలకే పరిమితమవుతుందని తేల్చిచెప్పింది. ఇది ఆ రెండు పార్టీ శ్రేణులను తీవ్ర షాక్కు గురిచేసింది. దీంతో ఎన్నికలకు ముందే శ్రేణులు కకావికలమవుతుండటంతో ఉనికి చాటుకునేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లావేళ్లాపడి.. ఆ పార్టీతోనూ పొత్తు ఖరారు చేయించుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం ఎస్పీ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సిద్ధం సభకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా మొత్తం సుమారు 4,200 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. నలుగురు ఎస్పీలు, 14 మంది అడిషనల్ ఎస్పీలు, 21 మంది డీఎస్పీలు, 92 మంది సీఐలు, 292 మంది ఎస్ఐలతోపాటు ఏఆర్ నుంచి 400 మంది, స్పెషల్ ఫోర్స్ సుమారు 160 మంది బందోబస్తులో ఉన్నారన్నారు. పదివేలకు పైగా బస్సులు, ఇతర వాహనాలు వచ్చే అవకాశమున్నందున దానికి అనుగుణంగా 338 ఎకరాల్లో 28 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటుచేశామని ఎస్పీ చెప్పారు. పటిష్ట ఏర్పాట్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లుచేస్తోంది. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి అక్కడే మకాంవేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. ఆదివారం సా.3 గంటల నుంచి 5 గంటల వరకూ ఈ సభ జరుగుతుంది. రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి విడదల రజిని, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి సమన్వయకర్త పాణెం చిన హనిమిరెడ్డి తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. ► ఆదివారం ఉ.10 గంటల నుంచి వాహనాల దారి మళ్లింపు చేపడుతున్నట్లు ఎస్పీ జిందాల్ చెప్పారు. నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుంచి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డ రోడ్డు మీదుగా హైదరాబాద్కు దారి మళ్లిస్తామన్నారు. ► హైదరాబాద్ వైపు నుంచి ఒంగోలు వైపునకు వచ్చే భారీ వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా.. ► నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్లే సాధారణ వాహనాలను మేదరమెట్ల వద్ద నుంచి నామ్ హైవేపై అద్దంకి, సంతమాగులూరు మీదుగా మళ్లిస్తున్నారు. ► ఒంగోలు వైపు నుంచి విశాఖ వైపు ఎన్హెచ్ 16పై వెళ్లే వాహనాలను త్రోవగుంట నుంచి ఎన్హెచ్ 216 పైకి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపుతున్నారు. ► ఒంగోలు వైపు నుంచి విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా వాహనాలను మళ్లిస్తారు. ► ఒంగోలు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా.. విశాఖపట్నం నుంచి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాటిని నర్సాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా.. గుంటూరు నుంచి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాహనాలను బుడంపాడు అడ్డరోడ్డు నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా మళ్లిస్తున్నారు. ► 16వ నంబర్ ఎన్హెచ్పై మేదరమెట్ల గ్రోత్ సెంటర్ నుంచి బొల్లాపల్లి టోల్ప్లాజా వరకు ఎలాంటి వాహనాలను అనుమతించడంలేదని.. సిద్ధం సభ ప్రాంగణానికి వచ్చే వాహనాలనే అనుమతిస్తామని చెప్పారు. ఈ ఆంక్షలు ఆదివారం రాత్రి 8 వరకూ అమల్లో ఉంటాయన్నారు. -
ఆంధ్రప్రదేశ్లో జైత్రయాత్రకు ‘సిద్ధం’.. నేడు బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా వైఎస్సార్సీపీ ఎన్నికల సన్నాహక సభ..ఇంకా ఇతర అప్డేట్స్
-
వావ్.. మేదరమెట్ల సిద్ధం సభా ప్రాంగణం డ్రోన్ విజువల్స్
వైఎస్సార్సీపీ జెండాలతో.. అశేష జన వాహిని నడుమ సీఎం జగన్ నినాదాలతో గత మూడు సిద్ధం సభలు హోరెత్తడం చూశాం. ఇక ఆఖరి సిద్ధం సభ అంతకు మించి ఉండబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం నాడు బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్లలో వైఎస్సార్సీపీ సిద్ధం సభ జరగబోతోంది. గత ఐదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెబుతూనే.. రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తామో సీఎం జగన్ ఈ వేదిక నుంచి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అలాగే.. ఎన్నికలకు ఈ వేదిక నుంచే సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం డ్రోన్ విజువల్స్ నెట్టింట పలువురిని ఆకట్టుకుంటున్నాయి.. -
Siddam Sabha: అందరి చూపు.. ఆఖరి ‘సిద్ధం’ వైపు
సాక్షి, బాపట్ల జిల్లా: సీఎం జగన్ పాలనపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని మంత్రి విడదల రజని అన్నారు. మేదరమెట్ల ‘సిద్ధం’ సభకు వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. శనివారం మేదరమెట్ల ‘సిద్ధం’ ఏర్పాట్లను పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. మేదరమెట్ల సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. సిద్ధం సభలకు ప్రజాభిమానం వెల్లువెత్తుతోందని, ఏపీ రాజకీయ చర్రితలోనే సిద్ధం సభలకు కనీవిని ఎరుగని ప్రజామద్దతు లభిస్తోందన్నారు. గత మూడు సిద్ధం సభలకు ప్రజలు, పార్టీ శ్రేణులు లక్షలాదిగా హాజరైన నేపథ్యంలో.. ఆదివారం బాపట్ల జిల్లాలో జరిగే నాలుగో సిద్ధం సభకు భారీఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికి కనబడేటట్లుగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ప్రజలకు చేరువగా వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. ఐదేళ్ల పాలన ప్రగతిని సీఎం.. ప్రజలకు వివరించున్నారు. సీఎం ప్రసంగం కోసం ఆసక్తిగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. సిద్ధం సభ కోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చేవారి కోసం వందల సంఖ్యలో గ్యాలరీలు ఏర్పాటు సిద్ధం చేశారు. సభకు తరలివచ్చేవారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సభావేదిక నుంచి పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. -
ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి రాదు: విజయసాయిరెడ్డి
సాక్షి, బాపట్ల: జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి చెందిందని.. కాబట్టే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో వైఎస్సార్సీపీ నిర్వహించబోయే సిద్ధం ముగింపు సభ ఏర్పాట్లను గురువారం సాయంత్రం పర్యవేక్షించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికలకు సిద్ధం అయ్యాం. సిద్ధం సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మేదరమెట్ల సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మా అంచనా ప్రకారం 15 లక్షల మంది వస్తారని అనుకుంటున్నాం. సభా ప్రాంగాణాన్ని అవసరమైతే ఇంకో 200 ఎకరాలకు పొడిగిస్తాం. ఇదే ఆఖరి సిద్ధం సభ.. .. వైఎస్సార్సీపీ సంక్షేమ పాలనలో ఏపీలో 87 శాతం కుటుంబాలు సంక్షేమ పథకాలు పొందారు. ఏపీ అభివృద్ధి చెందినది కాబట్టి తలసరి ఆదాయం పెరిగింది. రామాయపట్నం పోర్ట్ ని రికార్డు సమయంలో ముఖ్యమంత్రి పూర్తి చేశారు. పోర్టులు అభివృద్ధి పరిచాం. ఇదంతా అభివృద్ధి కాదా?. విశాఖ ఎయిర్పోర్టును కూడా అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి.. తప్పడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొదు. .. టీడీపీ జనసేన 20 ఎకరాలలో సభ పెట్టి 6 లక్షలు వచ్చారని డబ్బాలు కొట్టారు. టీడీపీ బీసీ డిక్లరేషన్ అనేది హాస్యాస్పదం. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారు అని గతంలో చంద్రబాబు అన్నారు. కానీ, 75 శాతం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవులిచ్చారు. 2024 ఎన్నికలకు నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల ప్రచారం ముమ్మరం అవుతుంది. ఎటువంటి పరిస్థితిలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాదు. మా టార్గెట్ 175 సీట్లు కొట్టి తీరుతాం. మేదరమెట్ల సిద్ధం వేదికగా వచ్చే ఏదేళ్లలో చేయబోయే కార్యక్రమాల్ని వివరిస్తాం. రాబోయే కాలంలో మరింత చిత్తశుద్ధితో పనిచేస్తాం’’ అని విజయసాయిరెడ్డి అన్నారాయన. -
Siddam Sabha: బాపట్ల ‘సిద్ధం’.. మార్చి 10న
సాక్షి, బాపట్ల జిల్లా: అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ సభను మార్చి 10న నిర్వహించనున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మార్చి 3న జరగాల్సిన సభను మార్చి 10వ తేదీకి మార్పు చేసినట్లు ఆయన తెలిపారు. సిద్ధం సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. మొత్తం 15 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ‘‘98 ఎకరాలలో సభ ప్రాంగణం ఉంటుంది. పార్కింగ్ కోసం కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. 6 జిల్లాల నుంచి ప్రజలు హాజరవుతారు. ప్రభుత్వ పథకాలు, పాలన తీరుపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో దిశా నిర్ధేశం చేస్తారు. 13,14 తేదీలలో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం. ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు ఉండవచ్చు’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘‘సిద్ధం సభలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పేద వర్గాలతో పాటు అగ్రకులాలలో కూడా వైఎస్సార్సీపీపై అపూర్వ స్పందన ఉంది. ప్రభుత్వం పథకాలు గురించి సిద్ధం సభల్లో వివరిస్తున్నాం. గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ చేయని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పాలన చేసింది. ప్రజల స్పందన చూస్తే 175 కి 175 సీట్లు వస్తాయనే నమ్మకం మాకు ఉంది. మేదరమెట్ల సిద్ధం సభలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ ప్రసంగిస్తారు. 5 గంటలకు సభ ముగుస్తుంది’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. ‘‘మేనిఫెస్టో పై చర్చ జరుగుతోందని.. అతి త్వరలో విడుదల చేస్తామన్నారు. సిద్ధం సభలోపే అన్ని సీట్లు ప్రకటించడం జరుగుతుందని, పొత్తులు ఎవరు పెట్టుకున్నా.. ప్రజలు మా వైపే ఉన్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ఆస్తుల అమ్మకం.. పవన్ సరికొత్త నాటకం -
బాపట్ల: మార్చి 3న మేదరమెట్లలో ‘సిద్ధం’
సాక్షి, బాపట్ల జిల్లా: వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ నాలుగో సభ ఖరారైంది. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైఎస్సార్సీపీ సిద్ధం సభ నిర్వహించనున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదరమెట్ల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్లపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. కాగా.. భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన సభలకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. కంచు కోటలను బద్దలు కొట్టేలా జరుగుతోన్న సిద్ధం సభకు కీలక ప్రాంతాలను వేదికలుగా వైఎస్సార్సీపీ ఎంచుకుంటోంది. భారీ సభల నిర్వహణ ద్వారా రాజకీయంగా పైచేయి సాధించటంతో పాటుగా.. వైఎస్సార్సీపీ కేడర్లో కొత్త ఉత్సాహం పెరుగుతోందని భావిస్తున్నారు. ఈ సభలోనే సీఎం జగన్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. గెలుపు నినాదంతో పాటు రైతులకు, మహిళలకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని సమాచారం. నాలుగు ముఖ్యమైన రీజియన్లలోని నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలు పూర్తి అయిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో కీలక సమావేశం ఉండవచ్చు. ఆ తర్వాత పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దూసుకెళ్తోంది వైఎస్సార్సీపీ. ఇదీ చదవండి: కుప్పం నుంచే చంద్రబాబు బైబై అంటున్నాడు: సీఎం జగన్ -
'మేదరమెట్లలో టీటీటీ కళ్యాణమంటపం ఏర్పాటు చేస్తాం'
సాక్షి, ప్రకాశం : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన స్వగ్రామమైన మేదరమెట్లలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన ఇంటివద్ద భోగిమంటలు వేసి అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 400 మందికి వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు. వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి సంబంధించిన శస్త్ర చికిత్సలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో చేర్చారని గుర్తుచేశారు. సంక్రాంతికి ప్రతి ఏటా స్వగ్రామంలో గడపటం ఆనందానిస్తోందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మేదరమెట్లలో టీటీడీ కళ్యాణమంటపం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన వెల్లడించారు. -
తమ్ముళ్లే సూత్రధారులు..!
అధికారంలో ఉన్న ఐదేళ్లు అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడిన టీడీపీ నేతలు అధికారం కోల్పోయినా తీరు మార్చుకోవడం లేదు. సహజ వనరులను కొల్లగొట్టడం, సంపదను దోచుకోవడంతో ఆగక ప్రజారోగ్యంతోనూ చెలగాటమాడుతున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కా తయారీ కేంద్రాన్ని శుక్రవారం పోలీసులు మేదరమెట్లలో గుర్తించిన విషయం తెలిసిందే. అయితే గుట్కా మాఫియాను నడుపుతున్నది మాత్రం టీడీపీ నేతలే అనేది స్పష్టమవుతోంది. గుట్కా తయారీ కేంద్రాన్ని నడుపుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన బలగాని ప్రసాద్ కేవలం పాత్రధారి మాత్రమేనని సూత్రధారులంతా టీడీపీ ఎమ్మెల్యే అనుచరులేననే చర్చ జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు పోలీసు అధికారుల అండదండలతో స్థానిక టీడీపీ నేత హనుమంతరావుకు చెందిన గోడౌన్లో గుట్కా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులకు పెద్ద మొత్తంలో నెలవారీ మామూళ్లు ఇస్తూ తమ పని చక్కబెట్టుకుంటున్నారు. గుట్కా తయారీ కేంద్రం గుట్టు రట్టు కావడంతో టీడీపీ నేతలు తమకేమీ సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నాలకు తెరతీశారు. సాక్షి, ఒంగోలు : కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో మూడేళ్ల క్రితం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు నలుగురు కలిసి గుట్కా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక పరమైన అంశాలను చూసుకుంటూ నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు నెల్లూరు జిల్లకు చెందిన బలగాని ప్రసాద్ అనే వ్యక్తిని నియమించారు. అప్పట్లో అక్కడ పనిచేసిన ఎస్సైతో పాటు ఎస్బీ అధికారులకు సైతం తెలిసే గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు సమాచారం. నెలకు రూ.2 లక్షల చొప్పున పోలీసులకు మామూళ్లు ముట్టచెప్పి అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తూ వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేతో దగ్గరగా ఉండే మార్కెట్యార్డు మాజీ వైస్ చైర్మన్తో పాటు హనుమంతరావు (బుల్లబ్బాయ్), గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలు భాగస్వామ్యంతో గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఓ హెడ్ కానిస్టేబుల్ ద్వారా ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు నెలవారీ మామూళ్లు ఇస్తూ హనుమంతరావుకు చెందిన గోడౌన్లో గుట్టుగా గుట్కా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. రాత్రి వేళల్లో గుట్కాను ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేందుకు కూడా అప్పట్లో పని చేసిన ఎస్బీ అధికారులు వీరికి పూర్తి స్థాయిలో అండదండలు అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుట్కా తయారీ కేంద్రం ద్వారా అడ్డగోలుగా సంపాదించిన టీడీపీ నేతలు గ్రామాల్లో పెద్ద పెద్ద ఇళ్లు నిర్మించడమే కాకుండా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ ఎమ్మెల్యేకు చందాలు కూడా ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసు నుంచి తప్పించాలంటూ భారీ ఆఫర్లు.. గుట్కా తయారీ కేంద్రానికి వచ్చి రూ.3కోట్ల విలువ చేసే యంత్రాలు, తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్న జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను వదిలేది లేదని స్పష్టం చేశారు. అయితే తాను బలగాని ప్రసాద్కు గోడౌన్ను లీజకు ఇచ్చానేతప్ప తనకేమీ సంబంధం లేదని టీడీపీ నేత హనుమంతరావు తప్పించుకునే యత్నం చేస్తున్నాడు. బలగాని ప్రసాద్ ఒక్కడే గుట్కా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నట్లుగా చూపి తమ పేర్లు తొలగించాలంటూ టీడీపీ నేతలు ఓ పోలీసు అధికారికి భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో విచారణ అధికారులకు, ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ కేసు నుంచి టీడీపీ నేతలను తప్పించేందుకు సదరు పోలీసు అధికారి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోతుగా విచారణ జరిగితే తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోననే భయంతో గతంలో గుట్కా మాఫియాకు అండదండలు అందించిన పోలీసు అధికారులు సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎస్పీ గ్రామంలో రహస్య విచారణ జరిపితే కళ్లు చెదిరే వాస్తవాలు బయటకొస్తాయని చెబుతున్నారు. ఒత్తిళ్లకు తలొగ్గం.. : అశోక్ వర్థన్, అద్దంకి సీఐ గుట్కా తయారీ కేంద్రం కేసు విషయంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కేసులో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదు. ఇప్పటికే గోడౌన్ యజమాని హనుమంతరావును అరెస్టు చేశాం. ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేసులో ముందుకు వెళ్తాం. గోడౌన్ యజమాని అరెస్ట్... కోర్టుకు తరలింపు మేదరమెట్ల: కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల గ్రామంలో నిషేధిత ఖైనీ, గుట్కా తయారీ కేంద్రానికి అద్దెకు ఇచ్చిన గోడౌన్ యజమాని పోకూరు హనుమంతరావును శనివారం మేదరమెట్ల పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై బాలకృష్ణ తెలిపారు. శుక్రవారం వెలుగు చూసిన నిషేధిత ఖైనీ, గుట్కా తయారీ కేంద్రం గుట్టు రట్టు అయిన సందర్భంగా గోడాన్ యజమానిపై 420, 468, 174,328,188,466,471,120బీ, 272 మరియు 59 సెక్షన్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నామని ఎస్సై తెలిపారు. -
పిల్లిని చంకలో పెట్టుకుని..ఊరంతా వెతికిన పోలీసులు
టీడీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నాయకులు ఇసుక, మట్టిని కూడా వదలకుండా అక్రమంగా విక్రయించి జేబులు నింపుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు నిషేధిత ఖైనీ తయారీని సైతం వదల్లేదు. వాటిని తయారు చేసే అక్రమార్కులు రాష్ట్రం నలుమూలలకు సరఫరా చేసి అందిన కాడికి దండుకున్నారు. అక్రమార్కులకు టీడీపీ నాయకులు తమ అండదండలు అందించి ఇప్పటికీ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇటీవల వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక నిషేధిత గుట్కాలపై పోలీసులు కన్నెర్ర చేశారు. అన్ని ప్రాంతాల్లోని షాపుల్లో తనిఖీలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా పలువురు వ్యాపారులను కటకటాల వెనక్కి నెట్టారు. చివరకు జిల్లా కేంద్రం ఒంగోలుకు కూతవేటు దూరంలో ఖైనీల తయారీ కేంద్రాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. పోలీసుల తీరు పిల్లిని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్లు ఉంది. సాక్షి, మేదరమెట్ల: పారిశ్రామిక కేంద్రంగా వేలాది మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్న మేదరమెట్ల.. అక్రమ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా కూడా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. నిషేధిత పొగాకు ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మేదరమెట్ల రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకుంటోంది. స్పెషల్ బ్రాంచి పోలీసులు సమాచారం మేరకు మేదరమెట్ల పోలీసులు నిషేధిత ఖైనీ ఉత్పత్తుల తయారీ కేంద్రం గుట్టురట్టు చేశారు. ఈ వ్యవహారం అంతా ఓ టీడీపీ నేత గోడౌన్లో మూడేళ్ల నుంచి గుట్ట చప్పుడు కాకుండా నడుస్తున్నట్లు గుర్తించారు. చివరకు రూ.3 కోట్ల విలువైన ఖనీ తయారీ ముడి సరుకు, యంత్రాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన బలగాని ప్రసాద్ కొరిశపాడు మండలం మేదరమెట్లలోని పోకూరి హనుమంతురావుకు చెందిన మౌనిక పొగాకు గోడౌన్ను రెండేళ్ల కిందట అద్దెకు తీసుకున్నాడు. దాన్ని నిఖిత పొగాకు కంపెనీగా పేరు మార్చుకొని నిషేధిత ఖైనీ తయారు చేసే కేంద్రంగా మార్చాడు. ఖైనీ తయారీకి వినియోగిస్తున్న ముడిసరుకు, యంత్రాలు ఈ క్రమంలో గోడౌన్లో పొగాకు కంపెనీ పేరుతో ముడి సరుకులను తెచ్చి ఖైనీ ప్యాకెట్లు తయారు చేసి రాష్ట్రం నలుమూలలకు విక్రయిస్తున్నారు. స్పెషల్ బ్రాంచి హెడ్కానిస్టేబుల్ జిలానీ సమాచారంతో ఎస్పీ ఆదేశాల మేరకు అద్దంకి సీఐ అశోకవర్థన్, మేదరమెట్ల ఎస్ఐ బాలకృష్ణలు తమ సిబ్బందితో ఖైనీ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించేందుకు వెళ్లారు. అప్పటికే నిర్వాహకుడు కేంద్రాలకు తాళం వేసి పరారైనట్లు తెలుసుకున్నారు. గోడౌన్ షట్టర్ల తాళాలు పగులగొట్టి పరిశీలించగా రూ.3 కోట్ల విలువైన ఖైనీ తయారీకి వినియోగించే ముడు సరుకు, యంత్రాలను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. గోడౌన్ యజమాని పోకూరి హనుమంతురావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పక్కాగా కూపీలాగి ఖైనీ తయారీ కేంద్రాన్ని గుర్తించడంలో సహకరించిన ఎస్బీ హెడ్కానిస్టేబుల్ జిలానీ, సీఐ, ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్బీ డీఎస్పీ శ్రీరాంబాబు, సీఐ శ్రీకాంత్బాబు, దర్శి డీఎస్పీ ప్రభాకర్రావు, ఫుడ్సేఫ్టీ అధికారులు నాగశేషయ్య, సీహెచ్ లక్మీనారాయణ పాల్గొన్నారు. -
మంత్రి అనిల్ కుమార్ మానవతా హృదయం
సాక్షి, ప్రకాశం: కలెక్టర్ల సమావేశంలో పాల్గొనేందుకు అమరావతికి బయలుదేరిన రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ప్రమాదంలో గాయపడిని వారిని రక్షించి మానవత హృదయాన్ని చాటుకున్నారు. నెల్లూరు నుంచి అమరావతికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో ప్రకాశం జిల్లా మెదరమెట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందన్న విషయాన్ని మంత్రి గుర్తించారు. దీంతో వెంటనే కాన్యాయ్ ఆపి.. ప్రమాదంలో గాయపడిని వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. క్షతగాత్రులను ఎలాగైనా బతికించాలనే తాపత్రయంతో వారిని అతి త్వరగా తన కాన్వాయ్లో ఆసుపత్రికి తీసుకెళ్లాలని తన సిబ్బందిని మంత్రి ఆదేశించారు. కానీ అంతకుమందే అక్కడి వారు108కు సమాచారం ఇవ్వడంతో.. ఆ వాహనంలో వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించాలని వారిని ఆదేశించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మానవతా హృదయానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్యవసర పని మీద వెళ్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాన్ని గమనించి.. గాయపడ్డ వారికి మంత్రి చేయూతనిచ్చారు. -
తాగునీటి కోసం ఆందోళన
సాక్షి,మేదరమెట్ల( ప్రకాశం) : వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం ప్రజలు రోడెక్కాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి ఉదాహరణ కొరిశపాడు మండలంలోని అనమనమూరు ముంపు గ్రామంలోని కొంతమందికి బొడ్డువానిపాలెం కొండసమీపంలో పునరావాసం ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉంటున్నారు. గ్రామానికి తాగునీటి సరఫరా చేస్తున్న పైపులైను పది రోజుల క్రితం పగిలిపోవడంతో ఆ కాలనీ ప్రజలు, బొడ్డువానిపాలెం ఎస్సీకాలనీ వారు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేదరమెట్ల నుంచి అద్దంకి వెళ్లే రాష్ట్రీయ రహదారి నాలుగులైన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇదే రోడ్డు పక్కన బొడ్డువానిపాలెం గ్రామానికి తాగునీటి సరఫరా చేసే పైపులైను ఉంది. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా ఇప్పటికే ఐదుసార్లు ఈ పైపులైను మరమ్మతులకు గురైందని, ప్రతిసారి తాము కొంతసొమ్ముతో మరమ్మతులు చేయించుకుంటున్నట్లు కాలనీ వాసులు చెపుతున్నారు. పదిరోజుల కిందట సుమారు 300 అడుగుల మేర తాగునీటి సరఫరాచేసే పైపులైను రోడ్డునిర్మాణంతో పూర్తిగా దెబ్బతింది. విషయం కాంట్రాక్టర్ దృష్టికి తీసుకుపోయారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే మేదరమెట్ల వచ్చిన సమయంలో విన్నవించుకున్నా తమ గోడు పట్టించుకోవలేదని కాలనీ వాసులు వాపోయారు. పనులు అడ్డుకున్న మహిళలు తాగునీటి పైప్లేన్ మరమ్మతుల విషయం ఎవరూ పట్టించుకుకోకపోవడంతో కాలనీకి చెందిన మహిళలు అద్దంకి రోడ్డులో నిర్మాణం చేస్తున్న పనులను బుధవారం మహిళలు అడ్డుకున్నారు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ రెండు, మూడు రోజుల్లో పైపులైను మరమ్మతులు చేయించడం జరుగుతుందని కాలనీవాసులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఇటీవల ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాలనీలోని చేతి పంపులు, బోర్లు పూర్తిగా అడుగంటిపోయాయని, పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల తామే ట్యాంకర్ను ఏర్పాటు చేసుకొని తాగునీటి సరఫరా చేసుకుంటున్నట్లు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బొడ్డువానిపాలెం, అనమనమూరు ముంపు కాలనీకి తాగునీటి సమస్యపై శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని ఆప్రాంత ప్రజానీకం కోరుతున్నారు. -
ఘోర రోడ్డుప్రమాదం : ఐదుగురి మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మేదరమెట్ల జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును టిప్పర్ కొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పాత గుంటూరుకు చెందిన విద్యుత్ శాఖ రిటైర్డు అధికారి మాచర్ల వీరాస్వామి తన మనవరాలు నిత్య(9 నెలలు) పుట్టు వెంట్రుకలు తీయించేందుకు 12 మంది కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెళ్లారు. తిరుమల దర్శనం ముగించుకుని తిరిగి గుంటూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు మరమ్మతులకు గురికావడంతో కారులోని ముగ్గురు కిందికి దిగి ముందుకు తోసేందుకు యత్నిస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ కారుపైకి దూసుకెళ్లింది. దీంతో కిందనున్న ముగ్గురూ త్రుటిలో తప్పించుకున్నారు. కారు డ్రైవర్ సహా అందులోని నలుగురు చిన్నారులు అక్కడికక్కడే చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను కృష్ణ(3), నిత్య(1), చిన్నికృష్ణ(4), వాసవి(4) గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
ఆయిల్ మాఫియా
మేదరమెట్ల: జాతీయ రహదారిపై ఆయిల్ అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అన్ని స్థాయిల్లో అధికారుల అండ చూసుకొని కిరోసిన్, ఇతర ఆయిల్స్ అక్రమ అమ్మకాలు సాగిస్తున్నారు. మొదట్లో మారుమూల ప్రాంతంలో ఎవరూ చూడని ప్రదేశంలో కేవలం కిరోసిన్ మాత్రమే సేకరించి లారీలకు విక్రయించే వారు. ప్రస్తుతం జాతీయ రహదారి పక్కనే యథేచ్ఛగా డిజిల్, సోప్ ఆయిల్, గేర్ ఆయిల్, పామాయిల్, తారు, ఇనుము లారీల నుంచి అక్రమంగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. మద్దిపాడు మండలంలోని మద్దిపాడు నుంచి కొరిశపాడు మండలం గుండ్లాపల్లి, మేదరమెట్ల, కొరిశపాడు, అద్దంకి మండలంలోని వెంకటాపురం, పంగులూరు మండలంలోని రేణంగివరం, కొండమంజులూరు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా అక్రమార్కులు సుమారు 20 కిపైగా అక్రమ ఆయిల్బంకులను ఏర్పాటు చేసి రాత్రీ పగలు యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. వీటిల్లో కిరోసిన్ అమ్మే బంకులు పది, డిజిల్తోపాటు ఇతర ఆయిల్స్ అమ్మే బంకులు పదికిపైగా ఉన్నాయి. ఇవి కాకుండామేదరమెట్ల-నార్కెట్పల్లి రోడ్డులో బొడ్డువానిపాలెం నుంచి సంతమాగులూరు అడ్డరోడ్డు వరకు సుమారు మరో పది బంకులకుపైనే ఈ వ్యాపారం సాగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఒంగోలు, కనిగిరి, ఇంకొల్లు, వినుకొండ, నరసరావుపేట హాకర్ల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేసే కిరోసిన్ ట్యాంకర్లు నేరుగా హైవేపై ఉన్న బంకులకు చేరుతుంది. వాస్తవంగా రేషన్ దుకాణాలకు ప్రతినెలా 25వ తేదీ నుంచి 1వ తేదీలోపు రేషన్ చేరాలి. కానీ అక్రమార్కులు ఈ తేదీలను మినహాయించి మిగిలిన రోజుల్లో రోజు మార్చి రోజు వచ్చే ట్యాంకర్ల నుంచి బంకుల వద్ద నీలికిరోసిన్ను బయటకు తీస్తుంటారు. అలా వచ్చిన ఒక్కో ట్యాంకర్లో 12 వేల లీటర్ల కిరోసిన్ ఉంటుంది. లారీ డ్రైవర్ల కక్కుర్తి... హైవేపై తిరిగే లారీల్లో కొందరు డ్రైవర్లు మామూలు డీజిల్ బంకుల్లో తమ వాహనాలకు ఆయిల్ను కొట్టించకుండా అక్రమార్కుల వద్ద కిరోసిన్ పోయిస్తారు. వీరు లారీలో లీటర్ కిరోసిన్ రూ.46 లెక్క పోయించుకుని తమ వాహన యజమానికి మామూలు డీజిల్ ధర ప్రకారం లెక్క చూపిస్తారు. అందుకుగాను ఒక్కో డ్రైవర్కు లీటర్కు సుమారు రూ.10 మిగులుతాయి. వీరి కక్కుర్తి అక్రమార్కులకు వరమైంది. కిరోసిన్తో నడిచే వాహనాలు త్వరగా బోరుకు వ స్తాయి.. కల్తీలేని డీజిల్తో నడిచే వాహనం జాగ్రత్తగా తిరిగితే రెండు, మూడేళ్ల వరకు బోరుకు రాదు. అదే కిరోసిన్ వాడకం వల్ల ఏడాదికే బోరుకు వచ్చి లారీ మూలనపడుతుంది. దీనివల్ల లారీ యజమానికి నష్టం వాటిల్లుతోంది. అంతేగాక ఈ లారీలు ఎక్కువ మోతాదులో పొగను విడుదల చేయడం వల్ల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. రేషన్ డీలర్ల కుమ్మక్కు ఇలా... హైవేపై ఉన్న అక్రమార్కుల బంకులకు నీలికిరోసిన్ అమ్మడమే ధ్యేయంగా కొందరు డీలర్లు పనిచేస్తున్నారు. కొంతమంది డీలర్లైతే తమ వద్దకు కిరోసిన్ రానివ్వకుండానే ట్యాంకర్లను నేరుగా దళారుల ద్వారా బంకుల వద్దకు అర్ధరాత్రి తరలిస్తుంటారు. ఇందుకుగాను ఒక్కో డీలర్కు లీటర్కు సుమారు రూ.15 నుంచి రూ.25 వరకు మిగులుతాయి. పేదలకు అందాల్సిన కిరోసిన్ను దొడ్డి దారిన అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. గేర్, ఇంజిన్ ఆయిల్... చెన్నైపోర్టు నుంచి హైదరాబాద్, కోల్కత్తా, పూణె తదితర ప్రాంతాలకు వెళ్లే గేర్, ఇంజిన్ ఆయిల్ ట్యాంకర్ల నుంచి ట్యాంకర్ డ్రైవర్లు అక్రమార్కుల స్థావరాల వద్ద బయటకు తీస్తారు. ఒక్కో ట్యాంకర్ నుంచి లీటర్ రూ.53 చొప్పున సుమారు 5 పీపాలు(1100 లీటర్లు) పడతారు. అలా సేకరించిన ఆయిల్ను సమీపంలోని ఆటోమొబైల్ షాపులకు లీటరు రూ.76కు ఇస్తుంటారు. ఆ ట్యాంకర్లు చేరాల్సిన ప్రాంతాల్లోని వారికి మామూళ్లు ఇస్తుండడంతో లోపల ఎన్ని లీటర్లు ఉందో పట్టించుకోరని ట్యాంకర్ల డ్రైవర్లు చెబుతుంటారు. కొందరు అక్రమార్కులు ఇలాంటి ఆయిల్ను లీటరు, అరలీటరు, వందగ్రాములు ఇలాప్యాకింగ్ చేసి మరీ ఆటోమొబైల్ షాపులకు అమ్ముతుంటారు. పామాయిల్... కాకినాడ, వైజాగ్ పోర్టుల నుంచి వచ్చే ముడి పామాయిల్ నెల్లూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో శుద్ధి కేంద్రాలకు వెళ్లే ట్యాంకర్ల నుంచి ఒక్కోదాని నుంచి సుమారు 660 లీటర్లు తీస్తారు. దీనిని ఒక్కో లీటర్ను రూ.42కు కొంటారు. ఈ ఆయిల్ను స్థానిక వ్యాపారులకు రూ.56కు అమ్ముతారు. అలా కొన్న ఆయిల్ను వీరు మామూలు ఆయిల్లో కల్తీ చేసి మార్కెట్ ధరకు ప్రజలకు విక్రయిస్తారు. తారును కూడా ఇలానే సేకరించి హైవేపై ఉన్న తారు ప్లాంట్లకు విక్రయిస్తారు. అలాగే స్థానికంగా ఉన్న చిన్నచిన్న రోడ్డు కాంట్రాక్టర్లకు సరఫరా చేస్తుంటారు. దీనిని పీపాల లెక్కన కొంటారు. ఒక్కో దాన్ని రూ.6500కు కొని తారు ప్లాంట్లకు రూ.9 వేల లెక్కన విక్రయిస్తారు. ఇనుము.. పొడవాటి ట్రాలీల ద్వారా రవాణా చేసే ట్రాలీల డ్రైవర్లు ట్రాలీలోని బారు ఇనుప చువ్వల ఒక్కో కట్ట నుంచి ఒకటి, రెండు చువ్వలు బయటకు లాగి అక్రమార్కులకు అమ్ముతారు. అలా సేకరించిన చువ్వలను స్థానిక ఇనుము వ్యాపారులకు అమ్ముతారు. మామూళ్లు మామూలే.. ఈ అక్రమ వ్యాపారాన్ని వదిలేసినందుకుగాను ఒక్కో కిరోసిన్ బంకు నుంచి నెలకు రూ.4 వేలు చొప్పున అటు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఇస్తున్నట్లు సమాచారం. ఇవి కాకుండా ఇతరులకు కూడా సుమారు రూ.3 వేల చొప్పున ఇస్తుంటారు. ప్రతి నెలా సుమారు రూ.3 కోట్ల వ్యాపారం... హైవేపై ఉన్న అక్రమ బంకుల వారందరూ కలిపి నెలకు సుమారు రూ.3 కోట్లకుపైనే వ్యాపారం చేస్తున్నారు. హైవేపై నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు సైతం తిరుగుతున్నా ఎవరూ ఏమీ పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో అక్రమవ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. వ్యాపారంలోకి దిగితే చాలు లక్షాధికారే... ఈ అక్రమ వ్యాపారంలోకి ఒకరిని చూసి మరొకరు ఆకర్షితులవుతున్నారు. ఏమీ పనిలేని వారు ఇలాంటి వ్యాపారంలోకి దిగి అతితక్కువ కాలంలోనే లక్షాధికారులు అవుతుండటం చూసి యువత సైతం ఈ అక్రమ వ్యాపారంలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నా దృష్టికి రాలేదు పి.వి.సాంబశివరావు, తహశీల్దార్ కిరోసిన్ అక్రమ వ్యాపారం గురించి నా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అక్రమంగా కిరోసిన్ వ్యాపారం చేసేవారిపై చర్యలు తీసుకుంటాం. నీలి కిరోసిన్ను డీజిల్గా మార్పు... నీలి కిరోసిన్ను డీజిల్గా మార్చినందు వల్ల ఒక్కో లీటర్కు అదనంగా మరో రూ.10 వస్తాయి. ఇలా మార్చినందున ఒక్కో లీటర్కు రూపాయి వరకు ఖర్చవుతుంది. నీలి కిరోసిన్ 220 లీటర్ల డ్రమ్ముకు ఒక కేజీ కెమికల్ పౌడర్, వంద గ్రాముల వైట్ యాసిడ్, ఒకలీటర్ గేర్ఆయిల్ను కలిపితే కిరోసిన్...డీజిల్ రంగులోకి మారుతుంది. దీనిని మార్కెట్లో ఉన్న డీజిల్ ధర కంటే రూ.3 తక్కువకు విక్రయిస్తుంటారు. కల్తీ డీజిల్ను తాళ్లూరు, గంగవరం వంటి మారుమూల పల్లెల్లోకి రాత్రిపూట తరలిస్తుంటారు. అక్కడ మామూలు బంకుల వాళ్లు ఈ డీజిల్ను మార్కెట్లో దొరికే ధర కంటే లీటర్కు ఒకటి నుంచి మూడు రూపాయలకు అదనంగా అమ్ముతారు. నీలి కిరోసిన్ రవాణా... అద్దంకి నియోజకవర్గంలోని సుమారు 196 రేషన్ దుకాణాల నుంచి అక్రమార్కులు కిరోసిన్ సేకరిస్తారు. ఈ మొత్తం దుకాణాలకు ప్రతినెలా 8,300 లీటర్ల కిరోసిన్ చేరుతుంది. ఇందులో రేషన్కార్డుదారులకు చేరేది కేవలం 2,500 లీటర్లు మాత్రమే. మిగతా మొత్తాన్ని హైవేపై ఉన్న కిరోసిన్ మాఫియాకు తరలిస్తారు. రేషన్డీలర్కు ఒక్కో లీటరు రూ.15 పడుతుండగా, వీరి వద్ద నుంచి దళారులు ఒక్కో లీటర్ను రూ.30ల చొప్పున కొనుగోలు చేస్తారు. ఇలా కొన్న కిరోసిన్ను హైవేపై ఉన్న అక్రమార్కులు ఒక్కో లీటర్ రూ.46 చొప్పున లారీలకు అమ్ముతుంటారు. -
పెళ్లయిన 50 రోజులకే..
మేదరమెట్ల : ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని మేదరమెట్ల మార్కెట్ యార్డు వెనుక వైపు బజారులో సోమవారం జరిగింది. మృతురాలి మామే హత్య చేసి కోడలు ఉరేసుకున్నట్లు చిత్రీకరించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలేనికి చెందిన ధనలక్ష్మిని మేదరమెట్లకు చెందిన వల్లెపు అనిల్కు ఇచ్చి నెలా 20 రోజుల క్రితం వివాహం చేశారు. భర్త, అత్తమామలతో కలిసి ధనలక్ష్మి నివాసం ఉంటోంది. వారం నుంచి పక్కనే ఉన్న మరో ఇంట్లో కొత్త దంపతులు ఉంటున్నారు. ధనలక్ష్మి బేల్దారి పనికి వెళ్తోంది. కోడలిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించిన మామ విఫలమై హత్య చేసి ఉరేసుకున్నట్లు చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వల్లెపు రామయ్య, శేషమ్మల మూడో కుమారుడు అనిల్కు గతంలో రెండు వివాహాలు జరిగాయి. ధనలక్ష్మితో మూడో పెళ్లి. గతంలో అనిల్ ఇద్దరి భార్యలను కూడా మామ రామయ్య లైంగికంగా వేధించినట్లు స్థానికులు తెలిపారు. ధనలక్ష్మి ఉరేసుకున్న ఆనవాళ్లు అక్కడ కనిపించడం లేదు. ఎవరూ రాకుండానే ఆమెను కిందకు దించి మామ, అత్త, భర్త పరారయ్యారు. స్థానికులు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ధనలక్ష్మి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. బంధువుల సమాచారంతో మేదరమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తహశీల్దార్ పీవీ సాంబశివరావు, ఎస్సై రాజమోహన్రావులు శవపంచనామా నిర్వహించారు. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ ప్రతాప్కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
మహిళా టెకీ ప్రాణాలు తీసిన లాంగ్ డ్రైవ్
(ఒంగోలు నుంచి సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాస్) లాంగ్ డ్రైవ్ సరదా మహిళా ఇంజినీర్ ప్రాణాలు తీసింది. స్నేహితులతో కలిసి సరదాగా బైక్ పై లాంగ్ డ్రైవ్కు బయల్దేరిన ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. శనివారం ఉదయం ప్రకాశం జిల్లాలో కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద ఓ లారీ వెనుక నుంచి బైక్ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే తమిళనాడు సేలంకు చెందిన విష్ణుప్రియ ...చెన్నైలో ఓ సాప్ట్వేర్ కంపెనీలో పని చేస్తోంది. వీకెండ్ సందర్భంగా ఆమె... తన స్నేహితులతో కలిసి మూడు బైక్ల్లో చెన్నై నుంచి హైదరాబాద్కు బయల్దేరింది. మేదరమెట్ల సమీపంలో వారి బైక్ను లారీ ఢీకొనటంతో వెనక కూర్చున్న విష్ణుప్రియ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ప్రకాశం జిల్లా మేదరమెట్లలో స్వల్ప భూకంపం
ప్రకాశం జిల్లా మేదరమెట్లలో బుధవారం ఉదయం 10.45 గంటల సమయంలో భూమి కంపించింది. ఉరుములు, పిడుగులు పడటంతో పాటు ఒకేసారి భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని టేబుళ్లు, కుర్చీలు కూడా కదిలినట్లు అనిపించడంతో ఇళ్లలోని వారు భయపడ్డారు. అప్పటికే పిల్లలు స్కూళ్లకు వెళ్లిపోవడంతో కొంతవరకు ముప్పు తప్పింది. రెండు విడతలుగా రెండేసి సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఆనుకుని అల్పపీడనం కూడా ఉండటంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీగా ఉరుములు, పిడుగులు పడటంతో పాటు భూకంపం కూడా రావడంతో ప్రకాశం జిల్లా వాసులు భయపడుతున్నారు.