Mobile users
-
మొబైల్ యూజర్లకు ట్రాయ్ హెచ్చరిక
సైబర్ క్రైమ్స్ ప్రస్తుతం భారతదేశంలో ఒక పెద్ద సమస్యగా మారిపోతోంది. ఎప్పటికప్పుడు స్కామర్లు కొత్త అవతారాలెత్తి ప్రజలను మోసం చేస్తున్నారు, డబ్బు దోచేస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో మొబైల్ యూజర్లకు చాలా జాగ్రత్తగా ఉండాలని 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) హెచ్చిరికలు జారీ చేసింది.స్కామర్లు బాధితులను మోసం చేయడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిక్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సదుపాయాలను నిలిపేస్తామని బెదిరిస్తారు. బాధితుడు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని నేరగాళ్లు తప్పుగా పేర్కొంటారు. దీంతో కొందరు భయపడి నేరగాళ్లు చెప్పినట్లు వింటారు, భారీగా డబ్బు కోల్పోతారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.. షేర్ చేసిన ఒక వీడియోలో ఇలాంటి స్కామ్కు సంబంధించిన సంఘటనను చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క మొబైల్ యూజర్ తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని.. సంచార్ సాథీ పోర్టల్ని ఉపయోగించి ఏవైనా అనుమానాస్పద కాల్లను నివేదించాలని ట్రాయ్ కోరింది.భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ప్రభుత్వ డేటా ప్రకారం.. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజిటల్ అరెస్ట్ స్కామ్ కారణంగా బాధితులు సుమారు రూ. 120.3 కోట్లు నష్టపోయినట్లు తెలిసింది. అక్టోబర్ 27న మన్ కీ బాత్ 115వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమాచారాన్ని అందించారు.నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) 2024 మొదటి త్రైమాసికంలో దాదాపు 7.4 లక్షల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు అందుకున్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: చెత్త సంపాదన రూ.2,364 కోట్లు: ప్రశంసించిన మోదీడిజిటల్ అరెస్ట్ స్కామ్లు లేదా సైబర్ నేరగాళ్లు బాధితురాలకు ఫోన్ చేసి అక్రమ వస్తువులు లేదా నిషిద్ధ వస్తువులకు సంబంధించిన నేరంలో మీ ప్రమేయం ఉందని భయపెడతారు. టెక్నాలజీలను ఉపయోగించి వీడియో కాల్స్ ద్వారా నకిలీ కోర్టులను, న్యాయమూర్తులను ఏర్పటు చేస్తారు. అరెస్టు లేదా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండటానికి డబ్బు చెల్లించాలని.. భారీ మొత్తంలో మోసం చేస్తుంటారు. కాబట్టి ఇలా మోసం చేసేవారు మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి బెదిరిస్తే.. తప్పకుండా సంబంధిత పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలి.अचानक से TRAI 📞 ने कि आपका नेटवर्क disconnect करने की बात 🧐🤔 सावधान रहे, ये एक scam है ! आपका अगला कदम ? रिपोर्ट करें चक्षु के साथ https://t.co/6oGJ6NSQal पर#SafeDigitalIndia pic.twitter.com/Zmkwj2Rjzg— DoT India (@DoT_India) November 9, 2024 -
స్క్రీన్కు బానిసవుతున్న బాల్యం
విహాన్ వయసు మూడున్నరేళ్లు. తన తోటి పిల్లలు చురుకుగా ఆడుతూ, కేరింతలు కొడతూ, చిట్టిచిట్టి మాటలతో అలరిస్తుంటే తాను మాత్రం ఏమి పట్టనట్లు దిగాలుగా ఉంటున్నాడు. రోజంతా మొబైల్ చూస్తూ కాలం గడుపుతున్నాడు. మాటలు రావడం లేదని తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకెళితే అసలు విషయం బోధపడింది. చిన్నప్పటి నుంచి తనకు మొబైల్ చూపించడంతో దానికి బానిసయ్యాడని తెలిసింది. టెక్నాలజీ పెరుగుతోందని సంబరపడాలో..అది మన తర్వాతి తరాలకు శాపంగా మారబోతుందని బాధపడలో తెలియని పరిస్థితి నెలకొంది. పుట్టి ఎడాదిన్నర కావస్తున్న చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మొబైలే ప్రపంచమైంది. చిట్టిపొట్టి మాటలు నేర్చుకుంటూ తాత, అమ్మమ్మలూ, నాయనమ్మలతో సంతోషంగా గడపాల్సిన బాల్యం ఎలక్ట్రానిక్ స్క్రీన్లకు బానిసవుతుంది. గతంలో ఇంట్లో పెద్దవారు పిల్లలకు మాటలు, మంచి అలవాట్లు నేర్పుతూ కాలం గడిపేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేయడంతో పిల్లలను పట్టించుకునేవారు లేకుండా పోయారు. వివిధ కారణాల వల్ల తాతలు, అమ్మమ్మ, నాయనమ్మలు పిల్లల వద్ద ఉండలేకపోతున్నారు. దాంతో తెలిసి తెలియక తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల పిల్లలను ఎలక్ట్రానిక్ వస్తువులకు బానిసలుగా మారుస్తున్నారు.పేరెంట్స్ నుంచే పిల్లలకుకేవలం పిల్లల చేతిలోని ఫోనే కాకుండా, తల్లిదండ్రులు వాడే ఫోన్ వల్ల కూడా పిల్లలకు మాటలు రావడం లేదని ఎస్తోనియా దేశంలోని టార్టూ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అద్యయనం ద్వారా తెలిసింది. తల్లిదండ్రులకు ఫోన్ని అతిగా చూసే అలవాటు ఉంటే అది పిల్లలకూ వస్తుందట. వాళ్ల స్క్రీన్టైం సమయం కూడా దాదాపు ఉండటం గమనించారు. రెండు నుంచి నాలుగున్నరేళ్ల వయసులో ఉన్న పిల్లల్ని ఎంపిక చేసుకుని వారి భాషానైపుణ్యాలని పరిశీలించారు. పిల్లలూ, వాళ్ల తల్లిదండ్రులూ రోజులో ఎంత సమయం ఫోన్లో గడుపుతున్నారో చూశారు. స్క్రీన్ టైమ్ అతితక్కువగా ఉన్న తల్లిదండ్రులూ, పిల్లల మధ్య భాషానైపుణ్యాలని పరీక్షించారు. ఈ తరహా పిల్లల్లో భాషానైపుణ్యాలు ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ‘షరతులు తీరిస్తే జాబ్ చేయడానికి సిద్ధం’సమయం గడపాలిమొబైల్ ఫోన్లు చూపించడానికి బదులుగా పిల్లలతో ఎక్కవ సమయం గడిపేందుకు చొరవ చూపాలని శాస్త్రవేత్తలు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. పిల్లలతో కలిసి అవుట్డోర్లో ఆడేందుకు సమయం కేటాయించాలని చెబుతున్నారు. ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి పిల్లలతో గడపాలంటున్నారు. -
Telcos Profits: సగటు యూజర్ నుంచి రూ.157.45
న్యూఢిల్లీ: టెలికం కంపెనీల బ్యాలన్స్ షీట్లు ఆర్థికంగా బలపడుతున్నాయి. ఒక్కో మొబైల్ యూజర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 8 శాతం పెరిగి జూన్తో ముగిసిన త్రైమాసికం చివరికి రూ.157.45కు చేరినట్టు ట్రాయ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మార్చి చివరికి ఇది రూ.153.54గా ఉంది. త్రైమాసికం వారీ పనితీరు సూచిక నివేదికను ట్రాయ్ విడుదల చేసింది. టెలికం రంగం సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) 0.13 శాతం పెరిగి రూ.70,555 కోట్లుగా ఉంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే ఏజీఆర్ 7.51 శాతం పెరగడం గమనార్హం. టెలిఫోన్ చందాదారులు మార్చి చివరికి 1,199.28 మిలియన్లుగా ఉంటే, జూన్ చివరికి 1,205.64 మిలియన్లకు చేరింది. వైర్లైన్ టెలిఫోన్ చందాదారుల సంఖ్య 35.11 మిలియన్లకు పెరిగింది. క్రితం ఏడాది జూన్ నాటి గణాంకాలతో పోల్చి చూస్తే 16% పెరిగింది. నికరంగా జూన్ క్వార్టర్లో వైర్లెస్ చందాదారులు 54 లక్షల మేర పెరిగారు. దీంతో మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య 1,170.53 మిలియన్లకు చేరింది. ఈ ఏడాది మార్చి నాటికి వైర్లెస్ చందాదారులు 1,165.49 మిలియన్లుగా ఉన్నారు. వైర్లైన్ టెలీ సాంద్రత 2.50 శాతంగా ఉంటే, వైర్లెస్ టెలీ సాంద్రత 85.95 శాతానికి చేరింది. పల్లెల్లో పెరిగిన టెలికం వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో టెలీ సాంద్రత మార్చి చివరికి ఉన్న 59.19 శాతం నుంచి జూన్ చివరికి 59.65 శాతానికి పెరిగింది. కానీ, ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో టెలీ డెన్సిటీ (టెలికం సదుపాయం ఉన్నవారు) 133.72 శాతం నుంచి 133.46 శాతానికి తగ్గింది. ఇంటర్నెట్ చందాదారులు 1.59 శాతం పెరిగి 969.60మిలియన్లకు చేరారు. -
రోడ్లపై ‘స్మార్ట్ఫోన్ జాంబీ’లున్నాయి జాగ్రత్త..!
అతి ఎప్పుడూ నష్టమే.. అవసరానికి వాడుకోవాల్సిన వస్తువుని కాలక్షేపానికి వాడుకోవడం మొదలెడితే వ్యసనం కాక మరేమవుతుంది..! అదే జరుగుతోందిప్పుడు. స్మార్ట్ఫోన్ వాడుతున్న ప్రతి ముగ్గురిలోనూ ఇద్దరు దానికి బానిసలైపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ అలవాటు వారి భౌతిక, మానసిక ఆరోగ్యాలను దెబ్బతీస్తోందనీ, పరిస్థితి చాలా తీవ్రంగా ఉందనీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఫోన్, ట్యాబ్లాంటి తెరల వాడకాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకోవాలంటున్నారు. అన్నం తినేటప్పుడు, చదువుకునేటప్పుడు, ఆఖరికి పడుకున్నా చేతిలో ఫోను ఉండాల్సిందే. రోడ్డు మీద నడుస్తున్నా, కారు నడుపుతున్నా మరోపక్క ఫోనూ పనిచేయాల్సిందే. సవ్యసాచిలా రెండు పనులూ ఒకేసారి చేస్తున్నామనుకుంటున్నారు కానీ జరుగుతున్న నష్టాన్ని గుర్తించడం లేదు. తాజాగా రోడ్లపై ఫోన్ వినియోగిస్తున్నవారిని ‘జాంబీ’లుగా అభివర్ణిస్తూ బెంగళూరు పోలీసులు ఏకంగా హోర్డింగ్లు తయారుచేయించారు. ‘స్మార్ట్పోన్ జాంబీలున్నాయి జాగ్రత్త’ అని ఓ సైన్బోర్డ్లో రాశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. This signboard in BLR singlehandedly attacked our entire generation pic.twitter.com/iN2OsuGBE5 — Prakriti (@prakritea17) January 19, 2024 ఈ స్పష్టమైన హెచ్చరికతో ఉన్న సైన్బోర్డ్ డిజిటల్ డిస్ట్రాక్షన్ ప్రభావం ప్రజలపై ఏమేరకు ప్రభావం చూపుతుందో తెలియజేస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ‘ఫోన్లు డౌన్, హెడ్స్ అప్..' అని కామెంట్ చేశారు. ఇదీ చదవండి: ఇదేం ‘సేల్’ బాబోయ్.. అంతా మోసం! ఐఫోన్15 ఆర్డర్ చేస్తే.. కొన్ని సర్వేల ప్రకారం.. వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోను వాడుతున్న సగటు భారతీయుడు రోజుకు 70 సార్లు ఫోను తీసి చూస్తున్నాడట. అంటే గంటకు మూడుసార్లు. తీసిన ప్రతిసారీ మూడు నిమిషాలు చూసినా రోజుకి మూడున్నర గంటలపైనే. ఆన్లైన్లో అపరిచితులతో ప్రైవేటు సంభాషణలు జరిపినట్లు వెల్లడించిన భారతీయ చిన్నారులు ప్రపంచ సగటు కన్నా 11 శాతం ఎక్కువ. పదిహేనేళ్లలోపు పిల్లల్లో స్మార్ట్ఫోన్ వినియోగం ప్రపంచ సరాసరి 76 శాతం కాగా, మనదేశంలో 83. సైబర్ బెదిరింపులూ దుర్భాషలపై తల్లిదండ్రుల ఆందోళన ప్రపంచ సగటు 57 శాతం కాగా భారత సగటు 47. ఇంత తీవ్రమైన అంశాల్నీ పట్టించుకోని నిర్లక్ష్యం ఏ పరిణామాలకు దారితీస్తుందోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు. -
తెలియని వ్యక్తులతో చాటింగ్ చేస్తున్నారా? ఆ మాయలో పడకండి
సోషల్ మీడియా ద్వారా చిన్న చిన్న అట్రాక్షన్స్కు లోనై ‘లవ్’ పేరుతో ట్రాఫికింగ్ బారిన పడుతున్న అమ్మాయిల వ్యథలు ఇటీవల ఎన్నో ఉంటున్నాయి. ఈ సమస్య సమాజంలో ఎలాంటి పరిణామాలను సృష్టిస్తుందో, ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు చెప్పే విషయాలను ‘మనం మాట్లాడుకోవాల్సిందే!’’ మనం మాట్లాడుకోవాల్సిందే! ఆన్లైన్ లవ్ మాయలో పడొద్దు! ‘ప్రియ (పేరుమార్చడమైనది) కనిపించక రెండు రోజులవుతోంది. ఏం జరిగిందో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కంప్లైంట్ ఇచ్చిన ఒక రోజులోనే ప్రియని తీసుకొచ్చి, తల్లిదండ్రులకి అప్పజెప్పారు పోలీసులు. వారు చెప్పిన విషయం విన్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ప్రియ వయసు పదిహేనేళ్లు. పదో తరగతి చదువుతోంది. కరోనా టైమ్లో ఆన్లైన్ క్లాసెస్ కోసం తండ్రి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. ఇప్పటికీ ఆ ఫోన్ తనే వాడుతోంది. మూడు నెలల క్రితం సోషల్ మీడియాలో ఆమెకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరు విక్కీ. ఫ్రెండ్గా ఆమె మంచి చెడులు కనుక్కుంటూ, చాటింగ్ చేస్తూ ఉండేవాడు. మొదట వాయిస్ కాల్స్, ఆ తర్వాత వీడియో కాల్స్ మాట్లాడుతుండేవాడు. అతను చెప్పే ప్రేమ కబుర్లు ప్రియకు బాగా నచ్చాయి. అమ్మానాన్నలు ఎంతసేపూ చదువు చదువు అని అంటుంటారు. కానీ, వాటి గురించి విక్కీ మాట్లాడడు. ఒక్కరోజు విక్కీ చాట్ చేయకపోయినా, ఫోన్లో మాట్లాడకపోయినా ప్రియకు ఊపిరాడనట్లుండేది. విక్కీ ఏం చెప్పినా ప్రియ వెనకాడకపోయేది. రోజు రోజుకూ విక్కీ లేకపోతే తను బతకలేనని అనిపించసాగింది ప్రియకు. దీంతో ఓ రోజు విక్కీ చెప్పిన చోటుకు వెళ్లిపోవాలనుకుంది. దాంతో తల్లికి తెలియకుండా డబ్బులు తీసుకుని చెప్పకుండా వెళ్లిపోయింది. ఎవరికైనా చెబితే పరువు పోతుందనే భయం ఓ వైపు, కూతురు ఏమైందోననే భయం మరోవైపు వారిని కుదిపేసింది. తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్తో.. ప్రియ ముంబైకి చేరుకున్నట్టు కనిపెట్టిన పోలీసులు, ఆమెను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చారు. ఇలాంటి కథనాలు ఇటీవల మనం తరచూ వింటున్నాం. పెద్ద శిక్ష ♦ ఆన్లైన్లోనే కాదు బయట కూడా అమ్మాయిలను ట్రాప్ చేయడానికి చిన్న చిన్న ఆకర్షణ పథకాలను అమలు చేసేవారుంటారు. ♦ మైనర్ అమ్మాయిలు/అబ్బాయిలు పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే కానుకలకు కూడా అట్రాక్ట్ అవుతుంటారు. ♦ అవతలి వారు చెప్పేది నిజం అని నమ్మి, ఇంటిని వదిలి వెళ్లిపోతుంటారు. ♦ ఇంట్లో ప్రేమ దక్కలేదనో, మరో కారణం చేతనో బయటి వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతుంటారు. అలవాట్లు రుగ్మతలు అవుతున్నాయి. రుగ్మతలుగా మారడం వల్లే నేరాలు కూడా భిన్నంగా మారిపోయాయి. ఇంటర్నెట్ వల్ల మంచి ఎంత పెరిగిందో, చెడు అంతకన్నా ఎక్కువ పెరిగింది. కొందరికి ఇదొక ఉపయోగకరమైన అడిక్షన్గా కూడా మారింది. ప్రతిదీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో అందరిలోనూ కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరిగాయి. దేనికోసం మనం ముందుకు వెళుతున్నాం అనే స్పష్టత ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. షార్ట్కట్స్లో సంపాదించాలనే ఆలోచన వల్ల కూడా సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. చూడకూడనివి ఎక్కువ చూడటం వల్ల మనస్తత్వాలు మారుతున్నాయి. ఫోన్ చూడద్దని, ఇంటర్నెట్ చూడద్దని, ఎక్స్పోజర్ తగ్గించుకోమని చెప్పలేం. ఇవన్నీ మన జీవితంలో భాగమైనప్పుడు ఎలా డీల్ చేయాలో తెలుసుకోవడం మాత్రమే ఈ రోజుల్లో కుటుంబాలకు అవసరం. ఈ రోజుల్లో మైనర్లు ఇంటర్నెట్లో ఎక్కువ ఉంటున్నారు. వారిని గమనిస్తూ, మంచి చెడులను చర్చిస్తూ ఉండాలి. ప్రేమ, పెళ్లి పేరుతోనో వెళ్లిపోయారని, వీటిని మిస్సింగ్ కేస్ కింద చూడం. కిడ్నాప్ కింద రిజిస్టర్ చేస్తాం. ట్రేస్ అవగానే రేప్ సెక్షన్స్ యాడ్ చేస్తాం. ఒక్కసారి పోక్సో కేసు కింద నమోదు చేసిన తర్వాత నేరస్తులకు శిక్ష భారీ ఎత్తున పడుతుంది. నాన్బెయిలబుల్ సెక్షన్స్ కింద కేస్ బుక్ అవుతుంది. మైనర్ని తీసుకువెళ్లి, పెళ్లి చేసుకున్నా అది చట్టరీత్యా నేరం. మైనర్ అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరిలో ఎవరు మిస్ అయినా దానిని ట్రాఫికింగ్కు సంబంధించిన సెక్షన్స్ కింద కేస్ రిజిస్టర్ చేస్తాం. రూరల్, అర్బన్ ఏరియాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆన్లైన్ ప్రేమల జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. – సుమతి, ఐపీఎస్, డీఐజీ, ఉమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ ఇదొక వ్యసనం పరిచయం లేని వ్యక్తులు తమ పట్ల చూపే కన్సర్న్ని నిజమైన ప్రేమ అనుకొని భ్రమిస్తుంటారు కొందరు. ఈ మోహం ఆమె/ అతడి ఆరోగ్యం, భవిష్యత్తు సంబంధాలను ప్రభావితం చేస్తుంది. న్యూరలాజికల్ కెమికల్ అయిన ఫినైల్ ఇథైలమైన్ పెరగడం వల్ల ప్రేమభావాలు కలుగుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. మోహానికి గురైన వ్యక్తులు ఆల్కహాల్, డ్రగ్స్ వంటి అలవాట్లకు కూడా లోనవుతుంటారు. వారిలో ఆనందపు స్థాయులను పెంచుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇందుకు సినిమాలు, ఇంటర్నెట్ పోర్న్ సదుపాయాలు కూడా పిల్లల మెదళ్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇదొక వ్యసనం అని చాలామంది గుర్తించరు. ఆన్లైన్ రిలేషన్షిప్స్ తల్లిదండ్రులకు తెలియడం లేదు. పిల్లల ఆన్లైన్ నెట్వర్కింగ్ గురించి తల్లితండ్రులకు, కౌన్సెలింగ్ థెరపీ ద్వారా పిల్లల్లోనూ మంచి మార్పులు తీసుకురావచ్చు. స్కూళ్లు, కాలేజీల్లో కూడా ‘లవ్, రిలేషన్షిప్స్’ డిజిటల్ వాడకం, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే విషయాల పైన అవగాహన తరగతులు తీసుకోవాలి. – డాక్టర్ గిడియన్,డి–అడిక్షన్ థెరపిస్ట్ లివింగ్ సోబర్, హైదరాబాద్ – నిర్మలారెడ్డి -
ఇబ్బంది పెట్టే కాల్స్కు చెక్.. టెలికాం సంస్థలకు ట్రాయ్ కీలక ఆదేశాలు!
అవాంఛిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ల నుంచి యూజర్లకు ఉపశమనం కలిగేలా టెలికాం సంస్థలకు టెలికాం నియంత్రణాధికార సంస్థ (ట్రాయ్) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఫోన్ కాల్స్, మెసేజ్లు యూజర్లకు పంపాలంటే వారి అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం 2 నెలల్లోపు ఓ యూనిఫైడ్ డిజిటల్ వేదికను అభివృద్ధి చేయాలని సూచించింది. ముందుగా అడ్వైర్టెజ్మెంట్ మొబైల్ ఫోన్ కాల్స్ అందుకోవడానికి సబ్స్క్రైబర్లు తమ సంసిద్ధతను తెలియజేయాల్సి ఉంటుంది. సంస్థలు కస్టమర్లను సంప్రదించి వారి అంగీకారం మేరకు వాణిజ్య ప్రకటనలు పంపడం ఆరంభిస్తాయంటూ ఓ ప్రకటనలో ట్రాయ్ వివరించింది. ప్రస్తుతం సంస్థలు ప్రమోషనల్ కాల్స్,మెసేజెస్ పంపుతున్నామని, అందుకు వినియోగదారుల అనుమతి కోరేలా ఎలాంటి వ్యవస్థ లేదు. అందుకే 2 నెలల్లో యూనిఫైడ్ డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని టెలికాం సంస్థలకు స్పష్టం చేసింది. సమ్మతి కోరుతూ పంపే సందేశాలు ‘127’తో మొదలయ్యేలా కామన్ షార్ట్ కోడ్ను వినియోగించాలని ఆయా సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. చదవండి👉 సూపర్, మైండ్ బ్లోయింగ్.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న టిమ్ కుక్! -
రోజుకు 3 గంటలు చూసేస్తున్నారు.. అమేజాన్ సర్వేలో షాకింగ్ విషయాలు
వేసవి సెలవుల్లో పిల్లలు కనీసం 3 గంటలు ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్తో గడుపుతున్నారని దేశంలో 85 శాతం మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్టు ‘అమేజాన్’ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. దీనివల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బ తింటుందని వారు భయపడుతున్నారు. పిల్లల్ని ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో పెట్టాలని వారంతా కోరుకుంటున్నారు. కాకుంటే పిల్లల్ని స్క్రీన్ మీద నుంచి దృష్టి మళ్లించేలా చేయడమే అసలు సమస్య. మన దగ్గర సమయం లేక పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో తెలియక వారి చేతుల్లో పెడుతున్న ఫోన్ ఇవాళ విశ్వరూపం చూపిస్తున్నదని అమేజాన్ సంస్థ తాజాగా కాంటార్ అనే ఏజెన్సీ ద్వారా నిర్వహించిన సర్వే చెబుతోంది. 10 మెట్రో, నాన్ మెట్రో నగరాల్లో 750 మంది తల్లిదండ్రులను సర్వే చేయగా 69 శాతం మంది ఇప్పుడు మొదలైన వేసవి సెలవుల్లో పిల్లలు మూడు గంటలకు మించి ఫోన్గాని కంప్యూటర్ స్క్రీన్గాని చూస్తున్నారని అంగీకరించారు. మొత్తం 85 శాతం మంది తమ పిల్లలు అవసరానికి మించి ఫోన్లు చూస్తున్నారని ఇందుకు తాము చాలా ఆందోళన చెందుతున్నామని తెలియచేశారు. అంతంత సేపు వాళ్లు ఫోన్ చూడటం వల్ల మజ్జుగా ఉండటమే కాదు సోమరులుగా తయారవుతున్నారు. నిద్ర లేమితో బాధపడుతున్నారు అని తెలియచేశారు. ► రెక్కలు కత్తిరించి అయితే ఈ తప్పు పిల్లలదా? వారు నిజంగా ఆడుకోరా? గెంతరా? అల్లరి చేయరా? అంటే చేస్తారు. కాని ఆటస్థలాలు లేకపోవడం, వీధుల్లో ఆడలేకపోవడం, అపార్ట్మెంట్లలో సెల్లార్లు ఉన్నా ఆడటానికి కమిటీలు అంగీకరించకపోవడం, పార్క్లు నామమాత్రంగా ఉండటం... వీటన్నింటి వల్ల రోజువారి జీవితంలో బడి నుంచి వచ్చాక మాత్రమే వారు ఫోన్ చేతిలోకి తీసుకునేవారు. తల్లిదండ్రుల ఉద్యోగాల వల్లో, పని వొత్తిడి వల్లో, పిల్లలతో గడిపే సమయం వారు తమ ఫోన్కు ఇస్తున్నందు వల్లో పిల్లలు ఫోన్ చూస్తున్నా చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. ఇప్పుడు వేసవి సెలవుల్లో వారికి ఆ అలవాటు వ్యసనం స్థాయికి వెళ్లడం, నివారిస్తే అలగడం మనస్తాపం చేస్తుండటంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ► ఇలా చేయాలని ఉంది సర్వేలో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులను ‘మీ పిల్లలు ఈ సెలవుల్లో ఏం చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు’ అనే ప్రశ్నకు ఇంగ్లిష్ నేర్చుకోవడం (50 శాతం), నైతిక విషయాలు సంఘ మర్యాదలు తెలుసుకోవాలి (45 శాతం), కళలు నేర్చుకోవాలి (36 శాతం), ఆడుకోవడం విహారాలు చేయడం (32 శాతం) సమాధానం చెప్పాలి. అందరూ ఆశిస్తున్నది విజ్ఞానం వినోదం కలగలిసి ఉంటే బాగుంటుందని. ‘పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటారు. ఫోన్ చూసే సమయాన్ని తగ్గించి కొత్త విషయాలు నేర్పించడంలో వారిని ఉత్సాహపరచాలని ఉంది అని చాలామంది తల్లిదండ్రులు మాతో అన్నారు’ అని సర్వే చేసిన కాంటార్ ఏజెన్సీ ప్రతినిధి తెలియచేశారు. ► మెల్లగా మళ్లించాలి స్క్రీన్ టైమ్ను తగ్గించాలంటే అది ఒక్కసారిగా బంద్ చేయకుండా మెల్లగా తగ్గించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఫోన్లు రీచార్జ్ చేయకుండా నిరుత్సాహ పరచడం, ఇంట్లో రౌటర్ ఉంటే దానిని తరచూ ఆఫ్ చేస్తూ ఉండటం, ఈ పుస్తకం చదివితే ఫోన్ ఇస్తాను, కాసేపు ఆడుకుంటే ఇస్తాను, ఫ్రెండ్స్ను కలిసి వచ్చాక ఇస్తాను అని వారిని దారి మళ్లించడం, విహారాలకు తీసుకెళ్లడం, ఆడుకునే సమయం– కథలు చదివే సమయం– ఫోన్ సమయం అని టైమ్ విభజించి ఆ టైమ్ పాటించడం... అలా మెల్లగా ఫోన్ టైమ్ను తగ్గించాలి. పిల్లలు ఫోన్ చూడటం వల్ల వారి మానసిక, బౌతిక స్థితుల కంటే వారు చూస్తున్నది ఆరోగ్యకరమైనదో కాదో పరిశీలించే తీరికలో కూడా తల్లిదండ్రులు లేకపోతే అట్టి సర్వేలకు అందనంత తీవ్ర ఆందోళన చెందాల్సిందే. -
మనోళ్లు ‘స్మార్ట్’గా అడిక్ట్!.. ఫోన్, యాప్స్కు బానిసలుగా..
సాక్షి, హైదరాబాద్: దేశంలో స్మార్ట్ ఫోన్లు, మొబైల్ యాప్స్ (అప్లికేషన్స్) వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఫోన్ వినియోగం అడిక్షన్ స్థాయికి చేరుతోంది. 2022 ఏడాదిలో భారత యూజర్లు రోజుకు సగటున ఐదు గంటల పాటు మొబైల్స్తోనే కాలక్షేపం చేశారు. ఆ ఏడాదికాలంలో ఏకంగా 28.8 బిలియన్ల యాప్ డౌన్లోడ్లు చేసి.. ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచారు. 111 బిలియన్ల డౌన్లోడ్లతో చైనా టాప్ ప్లేస్లో నిలిచింది. వివిధ మొబైల్ యాప్స్లో సమయం గడుపుతున్న విషయంలోనూ భారత్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తంగా అందరూ కలిపి గతేడాది మొత్తం 0.74 ట్రిలియన్ గంటలు (74 వేల కోట్ల గంటలు) మొబైల్స్లోనే కాలం గడిపారు. ‘యాప్ ఆనీ (ఇటీవలే డేటా.ఏఐగా పేరు మారింది)’ ఇటీవల విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ద మొబైల్ రిపోర్ట్–2023’ నివేదికలో ఈ ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఆన్లైన్ కొనుగోళ్లలోనూ బిజీగా.. షాపింగ్కు సంబంధించి ఆన్లైన్ కొనుగోళ్లలోనూ భారతీయులు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్లు మొత్తంగా 110 బిలియన్ల గంటలు ఆన్లైన్ కొనుగోళ్లలో గడపగా.. అందులో భారతీయులు గడిపిన సమయం 8.7 బిలియన్లు కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా అధికంగా డౌన్లోడ్ చేసిన పది ఫైనాన్స్ యాప్లలో ఐదు (పేటీఎమ్, గూగుల్పే, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ యోనో యాప్) మన దేశంలోనే ఉన్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో.. 2022లో ఇండియన్ల ఫ్రెండ్షిప్, డేటింగ్ యాప్ల వినియోగం రెండింతలు పెరిగిందని నివేదిక పేర్కొంది. గతేడాది ఈ యాప్స్పై 9.9 మిలియన్ డాలర్ల (2021లో 4.5 మిలియన్ డాలర్లు) మేర ఖర్చు చేసినట్టు అంచనా. కల్పిత రిలేషన్షిప్లు.. మోసాలు.. మొబైల్స్, యాప్స్ వినియోగానికి అలవాటుపడ్డవారు తమకు అంతగా పరిచయం లేనివారి నుంచి కూడా పరోక్ష సాంత్వన కోరుకుంటున్నారు. యాప్స్తో పరిచయమయ్యేవారు నిజ స్వరూపాన్ని దాచి, కల్పిత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే అవకాశాలు ఎక్కువ. అమాయకత్వం నుంచి క్రిమినల్ బిహేవియర్ ఉన్న వారిదాకా తమ పద్ధతుల్లో ఈ యాప్స్ను ఉపయోగించడమో, దుర్వినియోగం చేయడమో జరుగుతోంది. ఈ దుష్ప్రభావాలను గుర్తెరిగి ప్రవర్తించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ నిశాంత్ వేమన, సైకియాట్రిస్ట్, సన్షైన్, చేతన హాస్పిటల్స్ జనంలో బద్ధకం పెరిగిపోతోంది విపరీతంగా మొబైల్, యాప్స్ వినియోగంతో జనంలో బద్ధకం పెరిగిపోతోంది. బంధువులు, స్నే హితులు, సన్నిహితులను కలుసుకునేందుకు కూడా ఉత్సాహం చూ పడం లేదు. ఊబకాయులు, మధుమేహ పీడితులు, ఇతర అనారోగ్యాల బాధితుల సంఖ్య కూడా ఎగబాకుతోంది. ఇది రాబోయే రోజుల్లో భారత్పై తీవ్ర ప్రభావం చూపనుంది. వివిధ యాప్ల వినియోగం విషయంలో ప్రభుత్వపరంగా రెగ్యులేటరీ విధానం ఉండాలి. స్కూళ్లలో ఐదో తరగతి నుంచే ఈ యాప్లపై అవగాహన కల్పించాలి. –సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
భారత్లో 5జీ దూకుడు: కానీ ఎయిర్పోర్ట్స్లో నిలిపివేత!
న్యూఢిల్లీ: భారత్లో 5జీ జోరు మీద ఉండనుంది. 2028 చివరి నాటికి మొత్తం మొబైల్ కనెక్షన్స్లో సగానికంటే ఎక్కువ వాటా 5జీ కైవసం చేసుకోనుందని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ వెల్లడించింది. ‘టెలికం చరిత్రలో అత్యధికంగా 2024లో 4జీ కనెక్షన్స్ 93 కోట్ల స్థాయికి చేరనున్నాయి. ఆ తర్వాత క్రమంగా 4జీ కస్టమర్ల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ఒక్కో స్మార్ట్ఫోన్ ద్వారా డేటా సగటు వినియోగం నెలకు ప్రస్తుతం ఉన్న 25 జీబీ నుంచి 2028 నాటికి 54 జీబీకి పెరగనుంది. 2022 డిసెంబర్ చివరినాటికి 5జీ చందాదార్ల సంఖ్య 3.1 కోట్లను తాకుతుంది. ఆరేళ్లలో ఈ సంఖ్య 69 కోట్లకు చేరుతుంది. 2028 చివరినాటికి మొత్తం మొబైల్ చందాదార్లలో 5జీ కనెక్షన్ల వాటా 53 శాతానికి ఎగుస్తుంది. 4జీ చందాదార్లు 57 కోట్లకు పరిమితం అవుతారు. మొబైల్ వినియోగదార్లలో స్మార్ట్ఫోన్ యూజర్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 77 శాతం నుంచి ఆరేళ్లలో 94 శాతం తాకనుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 2028 నాటికి 5జీ చందాదార్ల సంఖ్య 500 కోట్లకు చేరనుంది. మొత్తం మొబైల్ చందాదార్లు 840 కోట్ల నుంచి 920 కోట్లకు పెరగనున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా 79 శాతం మొబైల్ చందాదార్లు స్మార్ట్ఫోన్లను కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 230 టెలికం కంపెనీలు 5జీ సేవలను ప్రారంభించాయి. 5జీలో 700లకుపైగా స్మార్ట్ఫోన్ మోడళ్లు కొలువుదీరాయి’ అని నివేదిక వివరించింది. (సామాజిక భద్రత, మెటర్నీటీ బెనిఫిట్స్పై ఆర్థిక వేత్తల కీలక లేఖ) ఎయిర్పోర్టుల్లో 5జీ సేవల నిలిపివేత పౌర విమానయాన శాఖ అభ్యర్ధన మేరకు టెలికం శాఖ (డాట్) ఆంక్షలు విధించిన నేపథ్యంలో టెల్కోలు .. హై-ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో ఉండే 5జీ సర్వీసులను విమానాశ్రయాల లోపల, చుట్టుపక్కల నిలిపివేయాల్సి రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏవియేషన్ శాఖ ఇచ్చిన బఫర్, భద్రతా జోన్ల వివరాల ఆధారంగా విమానాశ్రయాల్లో రన్వేకు రెండు చివర్లా 2.1 కిలోమీటర్ల దూరం వరకూ, రన్వే మధ్య గీత నుండి 910 మీటర్ల దూరం వరకూ 3.3-3.6 గిగాహెట్జ్ బ్యాండ్లో 5జీ బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయొద్దని టెల్కోలను డాట్ ఆదేశించింది. (GST డీక్రిమినైజేషన్పై కీలక చర్చ, వారికి భారీ ఊరట!) ఇవి తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఇది తాత్కాలికమేనని, అన్ని విమానాల అల్టీమీటర్ల ప్రమాణాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్దేశించాక సర్వీసులను పునరుద్ధరించవచ్చని సంబంధిత వర్గాలు వివరించాయి. పాట్నా, బెంగళూరు తదితర కొన్ని విమానాశ్రయాల్లో ఇప్పటివరకూ ఎయిర్టెల్ మాత్రమే 5జీ సర్వీసులను అందిస్తోంది. పైలట్లు నిర్దిష్ట ఎత్తులో విమానాలను నడిపేందుకు అల్టీమీటర్ పరికరం ఉపయోగపడుతుంది. దీని సిగ్నల్స్కు 5జీ సిగ్నల్స్ అంతరాయం కలిగించే పరిస్థితిని నివారించే విధంగా తమ 5జీ బేస్ స్టేషన్లను సరిచేసుకోవాలంటూ నవంబర్ 29న టెల్కోలకు డాట్ సూచించింది. ఇదీ చదవండి: ప్రావిడెంట్ ఫండ్:నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే కోటి రూపాయలు -
గుడ్న్యూస్: కొత్త సేవలు వచ్చాయ్.. ఇలా చేస్తే ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్!
టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా మర్పులే వచ్చాయి. దీంతో కస్టమర్ల ఆర్థికపరమైన పనులన్నీ కూడా చిటికెలో అయిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజలంతా డిజిటెల్ చెల్లింపులు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ సేవలకు ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అదీ కాక చెల్లింపులు విషయంలో ఏ చిన్న నెట్వర్క్ సమస్యలు తలెత్తిన ఇబ్బందులు తప్పవన్న విషయం తెలిసిందే. ఈ సమస్యకు ఓ దారి దొరికింది. నెట్వర్క్ లేకపోయినా యూపీఐ లావాదేవీలు.. ఇటీవల నగదు బదిలీల కోసం చాలా వరకు UPI చెల్లింపులపై ఆధారపడుతున్నారు. ఒక్కోసారి ఈ లావాదేవీలు జరుపుతున్న సమయంలో నెట్వర్క్ సమస్యలు వస్తుంటాయి. అయితే నెట్వర్క్తో పనిలేకుండా కేవలం ఆఫ్లైన్ ప్రక్రియతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఇది మనలో చాలా మందికి తెలియదు. భారతదేశంలోని బ్యాంకుల అంతటా యూపీఐ (UPI) సేవలను మరింత మెరుగపరచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) '*99# సేవ'ను ప్రారంభించింది. యూజర్లు చేయాల్సిందల్లా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేయడమే. ఇంటర్నెట్ లేకపోయినా పర్లేదు.. ఇలా చేయండి ► మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయండి. ► తరువాత మీ బ్యాంకు పేరు సెలెక్ట్ చేసుకోవాలి.కొన్ని సందర్భాల్లో ఐఎఫ్ఎస్ కోడ్ అడుగుతుంది. దాని ప్రకారం, కోడ్ను ఎంటర్ చేస్తే సరిపోతుంది. ► ఇది పూర్తికాగానే ఇలా కనిపిస్తుంది.. ►1.Send Money ►2. Request Money ►3. Check Balance ►4. My Profile ►5. Pending Request ►6. Transactions ►7. UPI Pin ► పైన చూపిస్తున్న సేవలలో మీకు ఏది కావాలో అది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు నగదు ఇతరులకు పంపాలనుకుంటున్నారు. డబ్బు పంపేందుకు 1 నంబర్ ఎంటర్ చేయండి. ► ఇప్పుడు మీరు ఏ ఖాతా నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో వివరాలను ఎంచుకోండి. ఇలా.. మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, సేవ్ చేయబడిన లబ్ధిదారుని వివరాలు.. టైప్ చేసి (send) ఎంటర్ చేయండి. ► మీరు మొబైల్ నంబర్ ద్వారా బదిలీని ఎంచుకున్నట్లయితే, రిసీవర్ యూపీఐ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి. ► ఆ తర్వాత మీరు పంపాలనుకుంటున్న మొత్తం నగదు ఎంటర్ చేసి పంపండి. ► ఆపై మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి (send) ఆప్షన్ క్లిక్ చేయడంతో మీ లావాదేవీ ఇంటర్నెట్ లేకుండా పూర్తవుతుంది. చదవండి: అసలే డిజిటలైజేషన్ డేస్.. ఈ ఆదాయాలపై కూడా పన్ను చెల్లించడం ఉత్తమం! -
యూజర్లకు అదిరిపోయే శుభవార్త! అప్పటి వరకు ఫ్రీగా ‘5జీ నెట్వర్క్’ సేవలు!
న్యూఢిల్లీ: 5జీ నెట్వర్క్ లాంచ్ దశలో మొబైల్ యూజర్లు సెకనుకు 600 మెగాబిట్ వరకూ స్పీడ్తో సర్వీసులు అందుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక డేటా ప్రాసెసింగ్, యాప్ల యాక్సెస్ చేయడం మొదలైన అంశాల్లో ప్రొఫెషనల్ కంప్యూటర్లకు సరిసమాన స్థాయిలో హ్యాండ్సెట్లు పనిచేస్తాయని పేర్కొన్నాయి. రిలయన్స్ జియో నాలుగు నగరాల్లో (ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసి), భారతి ఎయిర్టెల్ హైదరాబాద్ సహా 8 నగరాల్లో 5జీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సిమ్ మార్చుకోకుండానే 5జీ సేవలను పొందవచ్చని రెండు సంస్థలు వెల్లడించాయి. ’బీటా ట్రయల్’ నిర్వహిస్తున్న జియో సంస్థ సెకనుకు 1 గిగాబిట్ (జీబీపీఎస్) స్పీడుతో అపరిమితమైన 5జీ డేటా అందిస్తామని చెబుతోంది. మొబైల్ స్టేషన్లకు సమీపంలో ఉన్న వారికి ఈ స్థాయి స్పీడ్ లభించవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘నెట్వర్క్ ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి లాంచ్ దశలో 600 ఎంబీపీఎస్ వరకూ స్పీడ్తో 5జీ సేవలు లభించవచ్చు. అయితే, పూర్తి స్థాయిలో సర్వీసులు అందుబాటులోకి తెచ్చాక ఇది 200–300 ఎంబీపీఎస్ శ్రేణిలో ఉండవచ్చు‘ అని ఎరిక్సన్ సంస్థ నెట్వర్క్ సొల్యూషన్స్ హెడ్ థియాసెంగ్ నిగ్ తెలిపారు. గరిష్టంగా 600 ఎంబీపీఎస్ స్పీడుతో 4కే రిజల్యూషన్ గల సినిమాను 3 నిమిషాల్లో, రెండు గంటల నిడివితో 6జీబీ సైజు గల హై డెఫినిషన్ సినిమాను 1 నిమిషం 25 సెకన్లలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పటివరకూ ఉచితంగానే .. కొత్త సర్వీసుల రుచి తెలిసేంత వరకూ, కొన్ని సర్కిల్స్లోనైనా పూర్తి స్థాయిలో నెట్వర్క్ను విస్తరించే దాకా 5జీ సేవలను టెల్కోలు ఉచితంగానే ఆఫర్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ మాజీ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. ఒక సర్కిల్లో సర్వీసులను పూర్తిగా విస్తరించిన తర్వాత టెల్కోలు టారిఫ్లను ప్రకటించవచ్చని, రేట్లు 4జీతో పోలిస్తే కొంత అధికంగానే ఉండవచ్చని ఆయన చెప్పారు. మరోవైపు, 5జీలో హై స్పీడ్ కారణంగా దేశీయంగా వచ్చే ఏడాదిన్నర కాలంలో ప్రతి యూజరు డేటా వినియోగం సగటున రెట్టింపు కాగలదని నోకియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ మాలిక్ తెలిపారు. 5జీ సర్వీసుల టారిఫ్లు దేశాన్ని బట్టి మారుతుంటాయని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో 5జీకి ప్రత్యేకంగా చార్జి చేయడం లేదని కొన్ని దేశాల్లో మాత్రం ప్రీమియం వసూలు చేస్తున్నారని చెప్పారు. భారత్లో పాటించే విధానమనేది వ్యాపార పరిస్థితులను బట్టి ఉంటుందన్నారు. 2024 మార్చి నాటికల్లా దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులో తేవాలని టెల్కోలు భావిస్తున్నాయి. డిజిటల్ సాధికారత.. దేశీయంగా డిజిటల్ సాధికారతను వేగవంతం చేసేందుకు 5జీ ఉపయోగపడగలదని హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సునీల్ రైనా తెలిపారు. అందుబాటు ధరల్లో పరికరాల లభ్యత దీనికి కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. 5జీ విస్తరించే కొద్దీ దేశీయంగా స్మార్ట్ఫోన్లు, ఇతర పరికరాల ధరలూ తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా. లావా ప్రస్తుతం అత్యంత చౌకగా రూ. 10,000కే లావాబ్లేజ్ 5జీ స్మార్ట్ఫోన్ను ప్రవేశపెట్టింది. ఇక 5జీకి సంబంధించి హ్యాండ్సెట్స్ తదితర పరికరాల్లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. హై–స్పీడ్ డేటా వినియోగం వల్ల బ్యాటరీలు త్వరగా డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉన్నందున చాలా మటుకు ఫోన్ కంపెనీలు ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్తో పాటు 5,000 పైగా ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీలతో మొబైల్స్ను ప్రవేశపెడుతున్నాయి. ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం 2027 నాటికి దేశీయంగా మొత్తం సబ్స్క్రిప్షన్స్లో 5జీ వాటా దాదాపు 40 శాతం వరకూ ఉంటుందని అంచనా. చదవండి👉 ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదంట! -
గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా!
సాధారణంగా కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే మనకి మొదట గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. చేతిలో మొబైల్ అందులో గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంటే చాలు ఏ ప్రాంతానికైనా ఈజీగా వెళ్లచ్చు. ఇక్కడి వరకు బాగానే ఉంది కాకపోతే ఇక్కడే ఓ చిక్కు కూడా ఉంది. ఈ యాప్ గమ్యాన్ని చూపించే క్రమంలో ఒక్కో సారి మనం వెళ్లాల్సిన ప్రదేశం పక్కనే ఉన్న చుట్టూ తిరిగేలా చేస్తుంది. దీని వల్ల వాహనదారులు సమయం వృథా కావడంతో పాటు ఇంధనపు ఖర్చు కూడా ఎక్కవగానే అవుతుంది. ఇలాంటి ఘటనలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అందుకే ఈ సమస్యను అధిగమించేలా సరికొత్త ఫీచర్ను గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చింది. ఎకో ఫ్రెండ్లీ రూట్ పేరుతో వినియోగదారుడు వెళ్లాల్సిన గమ్యాన్ని అతి తక్కువ దారులను చూపిస్తూ ఇంధనం అయ్యేలా చూస్తుంది. దీని వల్ల మన సమయం, పెట్రోల్ తద్వారా మన ఖర్చు కూడా ఆదా అవుతుంది. "ఎకో-ఫ్రెండ్లీ రూట్" ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. అమెరికా, కెనడాలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఫీచర్ సుమారు అర మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించినట్లు అంచనా అని గూగుల్ చెప్పింది. ఐరోపా అంతటా 40 దేశాల వరకు ఈ ఫీచర్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలే జర్మనీలో కూడా ఈ ఫీచర్ను ప్రవేశపెట్టింది. చదవండి: జనవరిలో మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందా! -
ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా 2 ప్లాన్లు, వ్యాలిడిటీ పెంచారండోయ్!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపారం లాభాల బాట పట్టలాంటే కస్టమర్లను ఆకట్టుకోవడమే ప్రధాన మార్గమని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ సూత్రాన్ని క్రమం తప్పకుండా అమలు చేస్తూ టెలికాం కంపెనీలు సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా తక్కువ ధరలోనే బెస్ట్ ఆఫర్లు ప్రవేశపెట్టింది ఎయిర్టెల్. సరికొత్త ఆఫర్లు కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూ.519, రూ.779 ప్లాన్ని తీసుకొచ్చింది ఎయిర్టెల్. ఇందులో రూ. 779 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ ఉండగా, రూ. 519 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ ఉంది. ఈ రెండు ప్లాన్లలో కస్టమర్లు అన్లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ(STD), రోమింగ్ కాల్స్తో పాటు రోజుకు 1.5జీబీ 4G డేటా, రోజుకు 100 SMSలను పొందుతారు. అయితే.. ప్రస్తుతం టెలికాం కంపెనీలు 28, 56 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్లు అందిస్తుండగా ఈ ప్లాన్లు పూర్తి క్యాలెండర్ నెల వ్యాలిడిటీని అందిస్తున్నాయి. వీటితో పాటు అపోలో 24/7 సర్కిల్ సబ్స్క్రిప్షన్ను మూడు నెలల పాటు అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. ఫాస్ట్ట్యాగ్ (FASTag)పై రూ.100 క్యాష్ బ్యాక్, ఎయిర్టెల్ థాంక్స్ బెనిఫిట్స్ ఉచిత హలో ట్యూన్లు, వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ లభిస్తాయి. చదవండి: Bajaj CT 125X: బజాజ్ సీటీ 125 ఎక్స్.. బోలెడు ఫీచర్లతో పాటు చార్జింగ్ సాకెట్ కూడా! -
వొడాఫోన్ ఐడియా ఆఫర్ అదిరిపోలా!.. కేవలం రూ.82 రీచార్జ్తో ఓటీటీ సబ్స్క్రిప్షన్!
భారత్లో మొబైల్ యూజర్లు పెరిగే కొద్దీ టెలికాం రంగం వృద్ధి సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా పోటీపడి మరీ కస్టమర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బంఫర్ ఆఫర్ల పేరుతో గతంలో రీచార్జ్ ప్లాన్లతో వస్తే, తాజా పరిస్థితుల దృష్ట్యా ఓటీటీని కూడా ఆఫర్ల జాబితాలో జత చేశారు. ఈ క్రమంలోనే వొడాఫోన్ ఐడియా సరికొత్త ఆఫర్తో తీసుకొచ్చింది. హిందీ పాపులర్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' (KBC 2022)ని చూడడానికి ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. అతి కూడా తక్కువ ధరలోనే! ఆఫర్ అదిరిపోలా! వొడాఫోన్ ఐడియా వినియోగదారులు కేవలం రూ. 82 చెల్లిస్తే నేరుగా మీ స్మార్ట్ఫోన్లో ప్రఖ్యాత కేబీసీ 2022 అన్ని ఎపిసోడ్లను వీక్షించవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఇంకో విషయం ఏంటంటే ఇది డేటా వోచర్ ప్లాన్. రూ.82 ప్లాన్ పని చేయడానికి మీకు బేస్ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం. ఈ ప్లాన్తో కస్టమర్లు 14 రోజుల పాటు 4GB డేటాను పొందుతారు. కానీ సోనీలివ్ సబ్స్క్రిప్షన్ మాత్రం 28 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మొబైల్ సబ్స్క్రిప్షన్ కాబట్టి కేవలం మొబైల్లో మాత్రమే చూడగలరు. మీ టీవీ లేదా ల్యాప్టాప్లో చూసే సౌకర్యం ఉండదు. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత, సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ పాజ్ చేయడం, లేదా డియాక్టివేట్ చేయలేము. అంటే మీరు సోనీలివ్ సబ్స్క్రిప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే, మీరు దాన్ని 28 రోజుల పాటు పొందుతారు. ఈ ప్లాన్తో కేబీసీ 2022 షో మాత్రమే కాదు ఈ ప్లాట్ఫాంలో ప్రసారమయ్యే ఇతర షోలు, సినిమాలను కూడా చూసేయచ్చు. సోనీలివ్ ఒక ఏడాది ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్లో టీవీలో చూసే సౌకర్యం కూడా ఉంది. అదే ఒక సంవత్సరం మొబైల్ ప్లాన్ కోసం అయితే రూ. 599 చెల్లిస్తే సరిపోతుంది. చదవండి: Oppo Launch K9x Smart Tv:ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు! -
ట్రాయ్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో ధన్ ధనా ధన్!
సాక్షి,హైదరాబాద్: టెలికాం రెగ్యులేటరీ సంస్థ (TRAI) విడుదల చేసిన తాజా సబ్స్క్రైబర్ డేటా ప్రకారం, మే 2022 నెలకు గాను రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 3.27 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఇదే నెలలో భారతీ ఎయిర్టెల్ 71,312 మొబైల్ కస్టమర్లను చేర్చుకుంది. మరోవైపు ఇదే సమయంలో వోడాఫోన్ ఐడియా 74,808 మంది సబ్స్క్రైబర్లను కోల్పోగా, ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) 78,423 మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. జాతీయంగా, రిలయన్స్ జియో మే నెలలో 31.11 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను సంపాదించి, భారతీయ టెలికాం మార్కెట్లో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది. ఫలితంగా, దేశవ్యాప్తంగా జియో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 40.87 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 10.27 లక్షల మంది సబ్స్క్రైబర్లను చేర్చుకుంది, దీంతో సంస్థ మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరుకుంది. మరో వైపు, వోడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్ల సంఖ్య ఈ నెలలో 7.59 లక్షలు తగ్గి 25.84 కోట్లకు పడిపోయింది. బీఎస్ఎన్ఎల్( BSNL ) వినియోగదారుల సంఖ్య కూడా దాదాపు 53.62 లక్షలు తగ్గి 11.28 కోట్లకు పడిపోయింది. చదవండి: ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ -
జియోకు జై, వొడాఫోన్ ఐడియాకు బై..బై!
సాక్షి, ముంబై: టెలికం మేజర్ రిలయన్స్ జియో మరోసారి దుమ్ము రేపింది. కొత్త కస్టమర్లను సాధించడంలో జియో తన ఆధిక్యాన్ని నిరూపించుకుని టాప్లో నిలిచింది. మే నెలలో 31 లక్షలమంది మొబైల్ వినియోగదారులను తన ఖాతాలో జమ చేసుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నెలవారీ సబ్స్క్రైబర్ డేటా నేడు (జూలై19) విడుదల చేసింది. రెగ్యులేటరీ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన డేటా ప్రకారం, మేలో 31 లక్షల మంది వైర్లెస్ మొబైల్ వినియోగదారులను సొంతం చేసుకుంది రిలయన్స్ జియో. ఫలితంగా జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరుకుంది. అలాగే సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్టెల్ మే నెలలో 10.27 లక్షల మంది సబ్స్క్రైబర్లను సాధించింది. దీంతో ఎయిర్టెల్ మొబైల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరుకుంది. వొడాఫోన్ ఐడియా 7.59 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో సబ్స్క్రైబర్ బేస్ 25.84 కోట్లకు పడిపోయింది. -
మొబైల్ యూజర్లకు శుభవార్తను అందించిన ట్రాయ్..!
డిజిటల్ చెల్లింపులే లక్ష్యంగా ఫీచర్ ఫోన్లలో యూపీఐ లావాదేవీలను ప్రొత్సహించేందుకుగాను ఆర్బీఐ యూపీఐ123పేను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సేవల్లో భాగంగా..మొబైల్ యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లందరికీ అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (USSD) సందేశాలపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు గురువారం ట్రాయ్ ప్రకటించింది. దీంతో ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఫీచర్ ఫోన్లతో పాటుగా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల కోసం వాడే యూఎస్ఎస్డీ సందేశాలను మొబైల్ యూజర్లు పూర్తి ఉచితంగా పొందవచ్చును. కాగా రెండు సంవత్సరాల తరువాత USSD సేవలకు ఛార్జీల విధింపుపై ట్రాయ్ సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయా టెలికాం ఆపరేటర్లు USSD సందేశాలపై గరిష్టంగా రూ. 1.50 నుంచి 50 పైసల మేర ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. అసలు ఏంటి యూఎస్ఎస్డీ సందేశాలు..! USSD (అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) మెసేజ్లను జీఎస్ఎమ్ సెల్ఫోన్ల సర్వీస్ ప్రొవైడర్ కంప్యూటర్లతో టెక్స్ట్ సందేశాల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ప్రోటోకాల్. అంటే సాధారణంగా మన మొబైల్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి వాడే నంబర్. వివిధ రకాల సర్వీసులకోసం ఆయా టెలికాం సంస్థలు యూఎస్ఎస్డీ నంబర్స్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి. చదవండి: వచ్చేసింది..గూగుల్ పే, ఫోన్ పే యాప్స్కు పోటీగా టాటా పే...! -
స్మార్ట్ఫోన్..ఇండియన్స్ వాడకం మామూలుగా లేదుగా..!
కరోనా కారణంగా స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోయింది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సెల్ ఫోన్ను విపరీతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సెల్భూతం యువతను పట్టిపీడిస్తోంది. చేతిలో పెద్ద అణుబాంబుగా తయారైంది. అవసరం లేకపోయినా సెల్ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడటం..గంటల తరబడి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో చాటింగ్స్ చేయడం...రాత్రంతా ఫోన్ను పక్కన పెట్టుకుని యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారు. దీంతో ఎక్కువ సేపు మొబైల్తో పాటు యాప్స్ను వినియోగిస్తున్న ప్రపంచ దేశాల సరసన భారత్ చేరింది. ఇటీవల మొబైల్ రీసెర్చ్ సంస్థ 'అన్నీ యాప్' (Annie app)ఇంటర్నెట్లో ప్రపంచ దేశాల ప్రజలతో పాటు భారతీయులు ఎంత సేపు యాప్స్పై గడుపుతున్నారనే అంశంపై స్టడీ చేసింది. ఈ స్టడీలో భారతీయులు యాప్స్లలో ప్రతీరోజూ 4.8గంటలు గడిపేస్తున్నట్లు తేలింది. ఏఏ దేశాలున్నాయి సంస్థ అన్నీ యాప్ నిర్వహించిన స్టడీలో..యాప్స్ ఎక్కువ వినియోగిస్తున్న దేశాల్లో ఇండోనేషియా(5.5గంటలు), బ్రెజిల్ (5.4గంటలు),సౌత్ కొరియా(5.0గంటలు), ఇండియన్స్ (4.8గంటలు) తొలి స్థానాల్లో ఉండగా.. జపాన్, కెనడా,యూఎస్,రష్యా,టర్కీ, యూకే దేశాల్లో ఉన్నాయి. ఏ యాప్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు వరల్డ్ వైడ్గా ఎక్కువగా టిక్ టాక్ను వినియోగిస్తున్నట్లు తేలింది. ఒక్క సెప్టెంబర్ నెలలో వన్ బిలియన్ మంది యూజర్లు టిక్ టాక్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. టిక్ టాక్ తర్వాత వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, జూమ్ యాప్స్ వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి జూన్ వరకు పై యాప్స్ను వినియోగించగా.. జులై నుంచి ఎక్కువ మంది సోషల్ మీడియాలో గడుపుతున్నట్లు తేలింది. సెల్ ఫోన్లు మోగుతున్నాయి... టీవీలు మూగబోతున్నాయి ఇక సర్వేలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే దశాబ్ధం క్రితం ప్రజలు ప్రతిరోజు 3 గంటల పాటు టీవీలకు అతుక్కుపోతుంటే ఇప్పుడు ఆ సమయం తగ్గి 2.5గంటలకు చేరింది. ఇక ఫోన్ యూజర్ల కోసం ఊబర్, ఓలా,స్విగ్గీ,జొమోటా, అర్బన్ కంపెనీలు రీజీనల్ కంటెంట్తో అట్రాక్ట్ చేస్తున్నాయి. అర్బన్ ఏరియాల్లో సైతం ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం తప్పని సరైంది. మహమ్మారి కారణంగా టెక్నాలజీ వినియోగం పెరిగిరింది. ముఖ్యంగా లాక్ డౌన్ అమెజాన్, నెట్ఫ్లిక్స్,హాట్స్టార్ లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫాంల అవసరం ఎలా ఉందో తెలిసొచ్చింది. దీంతో యాప్స్ వినియోగం భారీగా పెరిగిపోతున్నట్లు అన్నీ యాప్ అభిప్రాయం వ్యక్తం చేసింది. లెక్కలు ఏం చెబుతున్నాయి స్టాటిస్టా లెక్కల ప్రకారం.. 2020లో మనదేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 749 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. అందులో 744మిలియన్ల మంది ఇంటర్నెట్ను సెల్ఫోన్ నుంచి వినియోగిస్తున్నారు. 2040 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 1.5 బిలియన్లకు చేరనున్నట్లు స్టాటిస్టా తన రిపోర్ట్లో వెల్లడించింది. -
మొబైల్ కనెక్షన్ మార్పు సులభతరం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ యూజర్లు .. పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ–పెయిడ్కు, ప్రీ–పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కు మారడాన్ని సులభతరం చేసే దిశగా టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సిమ్ మార్చక్కర్లేకుండా వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధృవీకరణ ద్వారా ఈ ప్రక్రియ జరిగేలా టెలికం శాఖకు (డాట్) ప్రతిపాదించింది. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆధారాలు (పీవోసీ) ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్లకు డాట్ సూచించింది. పీవోసీని బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు డాట్ ఏడీజీ సురేశ్ కుమార్ మే 21న జారీ చేసిన నోట్లో పేర్కొన్నారు. టెల్కోల ప్రతిపాదన ప్రకారం.. కనెక్షన్ను మార్చుకోదల్చుకున్న వారు తమ సర్వీస్ ప్రొవైడర్కు ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్, వెబ్సైట్, అధీకృత యాప్ ద్వారా అభ్యర్ధన పంపాల్సి ఉంటుంది. దీన్ని ఆమోదిస్తూ .. టెలికం సంస్థ ఒక ప్రత్యేక ఐడీ, ఓటీపీని మొబైల్ యూజరుకు పంపిస్తుంది. ఈ ఓటీపీ 10 నిమిషాల దాకా చెల్లుబాటు అవుతుంది. ఓటీపీని ధృవీకరిస్తే.. కనెక్షన్ మార్పునకు యూజరు సమ్మతించినట్లుగా టెలికం సంస్థ పరిగణిస్తుంది. ఏ తేదీ, సమయం నుంచి మార్పు అమల్లోకి వస్తుందనేది సమాచారం అందజేస్తుంది. ఇలా కనెక్షన్ స్వరూపం మారే క్రమంలో గరిష్టంగా అరగంట పాటు మాత్రమే సర్వీసుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని డీవోటీ తన నోట్లో పేర్కొంది. -
అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్’ ముప్పు
సాక్షి, హైదరాబాద్: ‘మీ పార్శిల్ త్వరలోనే మీకు చేరనుంది. దాని స్టేటస్ తెలియాలంటే ఈ లింకును క్లిక్ చేయండి’ అంటూ ప్రముఖ కొరియర్ సంస్థ పేరుతో మీ ఫోన్కు సందేశం వచ్చిందనుకోండి. నిజంగా పార్శిల్ రావాల్సిన వాళ్లు ఎప్పుడు వస్తోందో తెలుసుకోవడానికి.. ఆర్డర్లు ఇవ్వని వాళ్లు పార్శిల్ ఏంటనే ఉత్సుకతతో లింకును ఓపెన్ చేస్తారు. సైబర్ నేరగాళ్లు సరిగ్గా దీన్నే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన ’ఫ్లూబోట్’ మాల్వేర్ను ఆండ్రాయిడ్ ఫోన్ల పైకి వదులుతున్నారు. ఇప్పటికే లండన్, స్పెయిన్, జర్మనీ, పోలాండ్లో అనేక మంది దీని బారినపడ్డారని, భారత్కూ ఈ ముప్పు పొంచి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై లండన్కు చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (ఎన్సీఎస్సీ) అలర్ట్ జారీ చేసింది. ఆన్లైన్కు డిమాండ్ పెరగడంతో.. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో అనేక మంది నేరుగా షాపింగ్ చేయడానికి వెనుకాడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఆన్లైన్ షాపింగ్ కు డిమాండ్ పెరిగింది. దేశీయ వెబ్ సైట్లు, యాప్లతో పాటు విదేశాలకు చెందిన వాటిల్లోనూ ఖరీదు చేస్తున్నారు. కరోనా ప్రభావంతో అనేక అంతర్జాతీయ విమానాలు, కంటైనర్లను తీసుకొచ్చే కార్గో లైనర్లు రద్దయ్యాయి. ఈ కారణంగా అంతర్జాతీయ డెలివరీలు ఆలస్యమవుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన సైబర్ నేరగాళ్లు కొరియర్ సంస్థల పేరుతో డెలివరీ ట్రాకింగ్ అంటూ ఫ్లూబోట్ మాల్వేర్ను పంపిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఆ సందేశంలో వచ్చిన లింకును క్లిక్ చేసిన మరుక్షణం ఆ మాల్వేర్ ఫోన్లో నిక్షిప్తమైపోతుంది. ఈ మెసేజీలను సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ సర్వర్ల ద్వారా బల్క్ విధానంలో పంపిస్తారు. ఫలితంగా వాళ్లు ఎక్కడ నుంచి పంపారు.. ఎక్కడ ఉన్నారనేది తెలుసుకోవడం సాధ్యపడదు. అన్ని పాస్వర్డ్స్ వారి అధీనంలోకి.. ఇటీవల ఇంటర్నెట్ బ్యాంకింగ్, యాప్ ఆధారిత బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్.. ఇలా ప్రతి ఒక్కటీ ఫోన్ ఆధారంగానే సాగుతున్నాయి. ఈ-మెయిల్, ట్విట్టర్ తదితర సోషల్మీడియాలను మొబైల్ లోనే వాడుతున్నారు. ప్రతి స్మార్ట్ ఫోన్కు పిన్, పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్, ఫేషియల్ విధానాల్లో లాక్లు ఉంటున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లో నిక్షిప్తమై ఉండే ఫ్లూబోట్ వైరస్ ఈ పాస్వర్డ్స్ను సంగ్రహిస్తుంది. ఆ డేటా మొత్తాన్ని మాల్వేర్ ప్రయోగించిన సైబర్ నేరగాడికి అందిస్తుంది. దీన్ని దుండగులు దుర్వినియోగం చేస్తుండటంతో వ్యక్తిగత డేటాతో పాటు ఆర్థికంగానూ నష్టపోవాల్సి వస్తోంది. ఒకసారి ఫోన్లోకి ప్రవేశించిన ఫ్లూబోట్ అంత తేలిగ్గా పోదని, ఇది ఫోన్లో నిక్షిప్తమైనట్లు గుర్తించడం కూడా కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆండ్రాయిడ్ ఫోన్ను ఫార్మాట్ చేస్తేనే వైరస్ తొలుగుతుంది. అపరిచిత లింకులు క్లిక్ చేయొద్దు.. వివిధ రకాలైన వైరస్లు, మాల్వేర్స్ను సైబర్ నేరగాళ్లు లింకులు, ఆకర్షణీయమైన ఫొటోల రూపంలో పంపిస్తారు. ఆయా వ్యక్తుల అభిరుచులు, అవసరాలకు తగ్గట్టు, ఉత్సుకత కలిగించేలా తయారు చేసిన సందేశాలు, ఫొటోల లింకుల్లో మాల్వేర్ను నిక్షిప్తం చేస్తారు. సైబర్ నేరగాళ్లు కొన్ని రకాలైన వైరస్లను ఫోన్లను హ్యాక్ చేసి లబ్ధి పొందడానికి వినియోగిస్తారు. మరికొన్నింటిని తమ ఉనికి చాటుకోవడానికి, ఏజెన్సీలకు సవాళ్లు విసరడానికి, వినియోగదారుల ఫోన్లు క్రాష్ చేయడానికి ప్రయోగిస్తారు. వీటిలో ఏ తరహా మాల్వేర్తో అయినా సాధారణ ప్రజలకు ఇబ్బందులే వస్తాయి. ఈ నేపథ్యంలో అపరిచిత నంబర్లు, సందేశాలతో వచ్చే లింకులను క్లిక్ చేయకుండా డిలీట్ చేయడం ఉత్తమం. - సైబర్ క్రైం నిపుణులు -
మొబైల్ యూజర్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో సూపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్ ప్రైమ్వీడియో తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రపంచంలోనే తొలిసారిగా మొబైల్-ఓన్లీ ప్లాన్ను ప్రకటించింది. ప్రైమ్ వీడియో కంటెంట్ కోసం 89 రూపాయల ప్లాన్నుంచి ప్రారంభయ్యేలా ప్లాన్లను తీసుకొచ్చింది. ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్స్ మధ్య పోటీ తీవ్ర మవుతున్న నేపథ్యంలో ఈ కొత్త స్ట్రాటజీతో యూజర్లను ఆకర్షించనుంది. ముఖ్యంగా . ఓటీటీ ప్రత్యర్థి , టాప్ ప్లేస్లో ఉన్న నెట్ఫ్లిక్స్కు ఎదుర్కొనేలా సరికొత్త వ్యూహాలతో దూసుకొస్తోంది. నెట్ఫ్లిక్స్ తన మొబైల్ ప్లాన్ను నెలకు రూ. 199 ధరతో విడుదల చేసిన తర్వాత వీటిని లాంచ్ చేయడం గమనార్హం. ఎయిర్టెల్ భాగస్వామ్యంతోఈ కొత్త ప్లాన్ను అమెజాన్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ప్రీపెయిడ్ ఎయిర్టెల్ వినియోగదారులకు తొలి 30 రోజులు ఉచితంగా ట్రయల్ చేయవచ్చు. ఆ తర్వాత 28 రోజులకు రూ.89 వసూలు చేస్తారు. ప్రైమ్ వీడియో సేవలు మొబైల్లోఅందుబాటులోఉంటాయి. అలాగే ఇదే ప్లాన్లో 6 జీబీ డేటా కూడా వస్తుంది ఎస్డీ (స్టాండర్డ్ డెఫినిషన్) క్వాలిటీ స్ట్రీమింగ్ అందిస్తుంది.అయితే ఈ మొబైల్ ఓన్లీ ప్లాన్లపై కేవలం ఒక్క యూజర్ మాత్రమే ప్రైమ్ వీడియోను యాక్సెస్ చేయవచ్చు. రూ.89ప్లాన్: వాలిడిటీ 28రోజులు, 6 జీబీ డేటా రూ.299 ప్లాన్ : 28రోజుల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్లో ప్రైమ్ వీడియోతోపాటు అన్లిమిటెడ్ కాల్స్.. రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. మొబైల్ డేటా సేవలకుఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ప్లాన్స్ తీసుకొచ్చామని అమెజాన్ ప్రైమ్ వీడియో వరల్డ్వైడ్ వైస్ ప్రెసిడెంట్ జే మెరైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ద్వారా ప్రత్యేకమైన, అసలైన కంటెంట్తో ప్రతి భారతీయుడిని అలరించనున్నామని తెలిపారు. కాగా ప్రైమ్ వీడియో సాంప్రదాయ ప్లాన్ నెలకు రూ.129, సంవత్సరానికి రూ.999గా ఉన్న విషయం తెలిసిందే. -
పిల్లలు మొబైల్ వదలడం లేదు..!
సాక్షి, అమరావతి: కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో తప్పనిసరైన ఆన్లైన్ తరగతులతో పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు మరింతగా అతుక్కుపోతున్నారు. వీరు ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లతోనే గడిపే సమయం రెట్టింపుకావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లోని 5 – 15 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులతో ‘ఓఎల్ఎక్స్ ఇండియా’ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. (ఆటలను మింగేసిన కరోనా..) ఆ సర్వేలోని ప్రధాన అంశాలు.. ► తమ పిల్లలు విపరీతంగా ల్యాప్టాప్, మొబైల్లకు అతుక్కుపోతున్నారని 84 శాతం మంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ► రోజుకు కనీసం 5 గంటలసేపు తమ పిల్లలు ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లతో ఉంటున్నారని 54 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. ► పిల్లలకు అనవసరమైన, విద్యా సంబంధంకాని విషయాలు, అందుబాటులోకి వస్తున్నాయని 57 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. తమకు తెలియకుండానే ఆ సమాచారానికి ఆకర్షితులైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ► అయినప్పటికీ, 57 శాతం మంది తల్లిదండ్రులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. తమ పిల్లలకు ఎలాంటి అనవసరమైన, ప్రమాదకరమైన విషయాలు అందుబాటులో ఉండకుండా చేసేందుకు ఉన్న ఆప్షన్లను వాడుకోవడం లేదు. ► టీనేజీ పిల్లల తల్లిదండ్రుల్లో 50 శాతం మంది తమ పిల్లల ఆన్లైన్ చదువులు, బ్రౌజింగ్ మీద ఎలాంటి నియంత్రణ చూపడం లేదు. ► ప్రమాదకరమైన సైట్లు అందుబాటులో లేకుండా జాగ్రత్తలు పాటించడం లేదు. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు పిల్లలున్న తల్లిదండ్రుల్లో 50 శాతం మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. (లాక్డౌన్ ఎఫెక్ట్: పీసీలకు పెరిగిన గిరాకీ) -
యాప్ల దునియా.. మేడిన్ ఇండియా
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్ యూజర్లలో దేశభక్తి ఉప్పొంగుతోంది. స్వదేశీ యాప్లకు విశేష ఆదరణ లభిస్తోంది. గల్వాన్లో భారత సైన్యంపై చైనా దాడి అనంతరం దేశ రక్షణ దృష్ట్యా 59 చైనా యాప్లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. యువతను, పెద్దలను ఉర్రూతలూగించిన చైనా యాప్ టిక్టాక్తోపాటు మరో 58 యాప్లను నిషేధించడంతో ప్రత్యామ్నాయ యాప్ల కోసం అన్వేషణ పెరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా స్వదేశీ యాప్లను గుర్తించి డౌన్లోడ్ చేసుకుంటున్న యూజర్ల సంఖ్య ప్రతిరోజూ గణనీయంగా పెరుగుతోంది. అంతా మేడిన్ ఇండియా.. ► టిక్టాక్, ఉయ్ చాట్, హెల్లో వంటి చైనా మొబైల్ అప్లికేషన్లకు ప్రత్యామ్నాయంగా మన దేశానికి చెందిన చింగారి, ట్రెల్, మోజ్, జోష్ వంటి యాప్లను డౌన్లోడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ► స్వదేశీ యాప్లకు మేడిన్ ఇండియా అనే ట్యాగ్లైన్ ఉండటంతో వాటిని గుర్తించడం సులభంగా ఉంటోంది. ► ‘చింగారి మేడిన్ ఇండియా’ యాప్లో వీడియో, ఆడియో, షేరింగ్ వంటి ఆప్షన్లు ఉండటంతో ప్రజాదరణ పొందుతోంది. ► బెంగళూరుకు చెందిన బిస్వాత్మా నాయక్, మిస్టర్ సిద్ధార్థ్ గౌతమ్ అనే ప్రోగ్రామర్లు ఈ స్వదేశీ యాప్ను అభివృద్ధి చేశారు. ► టిక్టాక్ ఉన్న రోజుల్లో పాత చింగారి యాప్నకు పెద్దగా ఆదరణ లభించలేదు. ► వీడియో బ్లర్ అవుతోందని, సరిగా షేర్ కావడం లేదనే సాంకేతిక సమస్యలను యూజర్లు ఏకరువు పెట్టేవారు. ► ఇప్పుడు సాంకేతిక సమస్యలు అధిగమించడంతో చింగారి యాప్నకు క్రేజ్ పెరిగింది. ► వీడియో, ఆడియో, ఫొటో వంటి వాటితో షేరింగ్ ఆప్షన్లు గల స్వదేశీ యాప్లు ఇప్పుడు మన దేశంలో సత్తా చాటుతున్నాయి. ► చింగారి, ట్రెల్, మోజ్ వంటి స్వదేశీ యాప్లు కోటికి పైగా డౌన్ లోడ్స్ మైలు రాయిని దాటి రికార్డు సృష్టిస్తున్నాయి. ► ఇదే తరహాలో ‘జోష్’ యాప్ 50 లక్షల మందికి పైగా యూజర్లు డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తుండటం విశేషం. -
నెట్టింట్లో జనం
దేశ ప్రజలను కరోనా ఇళ్లకే పరిమితం చేసింది. లాక్డౌన్ కొత్త విషయాలను అనుభవంలోకి తెచ్చింది. ఇంటర్నెట్ ప్రధానస్రవంతిలో భాగమైంది. నీల్సన్, బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బీఏఆర్సీ)విడుదల చేసిన డేటాని బట్టి గత నెల రోజులుగా నగరాల్లో ఇంటర్నెట్ వాడుతోన్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగి 54 శాతానికి చేరింది. ఇంకా చెప్పాలంటే నగరాల్లో నివసించే ప్రతి ఇద్దరిలో ఒకరు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నట్టు అధ్యయనం వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగిస్తోన్న వారు 32 శాతానికి పెరిగారు. ఇంటర్నెట్ వినియోగం జాతీయ సగటు 40 శాతంగా ఉంది. ఇంటర్నెట్ వినియోగానికి స్మార్ట్ ఫోన్లనే సాధనంగా ఉపయోగిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభించక ముందు రోజుకి మూడు గంటల 22 నిమిషాలపాటు స్మార్ట్ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ వినియోగించేవారు. అయితే కరోనా లాక్డౌన్ కాలంలో రోజుకి నాలుగు గంటలపాటు స్మార్ట్ఫోన్లపైనే సమయాన్ని వెచ్చిస్తున్నట్టు అధ్యయనం పేర్కొంది. చాటింగ్, సోషల్ నెట్వర్కింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్లకోసం ప్రధానంగా మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. -
లాక్డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట
సాక్షి, ముంబై: దేశంలో కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ మొబైల్ వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త ఇది. ముఖ్యంగా ఆన్లైన్లో రీచార్జ్ చేసుకోలేని తమ వినియోగదారులను దృష్టిలో వుంచుకుని ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఇకపై తమ దగ్గర ఉన్న ఏటీఎంలో రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. టెలికాం దిగ్గజం జియో బాటలో నడిచిన ఎయిర్టెల్, వొడాఫోన్ కూడా తమ కస్టమర్లకు ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతోపాటు ఎయిర్టెల్ వినియోగదారులు ఎంపిక చేసిన కొన్ని కిరాణా, ఫార్మసీ దుకాణాల్లో కూడా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎయిర్టెల్ ఒక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్టెల్ వినియోగారులు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ల ఏటీఎంల వద్ద రీఛార్జ్ చేసుకోవచ్చు. వొడాఫోన్ ఐడియా కస్టమర్లు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బిఐ, యాక్సిస్, సిటీ బ్యాంక్, డీసీబీ, ఐడీబీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల ఏటీఎంలలో మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఇరు సంస్థలు ఈ బ్యాంకులతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. వినియోగదారులు ఈ బ్యాంకుల ఏటీఎంలలో దేన్నైనా సందర్శించి వారి రీఛార్జిని పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఎయిర్టెల్ వినియోగదారులు బిగ్ బజార్స్ , అపోలో ఫార్మసీలకు కూడా వెళ్లి వారి మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏటీఎం రీచార్జ్ ఎలా చేసుకోవాలంటే.. ► కార్డును ఏటీఎంలలో ఇన్సెర్ట్ చేయాలి. ► ఏటీఎం మెషీన్ తెరపై కనిపించే మొబైల్ కంపెనీని ఎంచుకోవాలి. ► రీఛార్జ్ చేయదలిచిన మొబైల్ నంబర్ను నమోదు చేయాలి. ► రీఛార్జ్ చేసుకునే మొత్తాన్ని నమోదు చేయాలి. తరువాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి. ఈ వివరాలన్నీ నమోదు చేసిన తరువాత ఎంటర్ చేస్తే రీఛార్జ్ పూర్తయిందని నిర్ధారిస్తూ సందేశం వస్తుంది. రీచార్జ్ చేసుకున్న అమౌంట్ మీ బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ అవుతుంది. అలాగే మీ నెట్వర్క్ ఆపరేటర్ నుండి కూడా మెసేజ్ వస్తుంది. ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకోలేని వ్యక్తులకు మాత్రమే ఏటీఎం రీఛార్జ్ సాధ్యమవుతుంది. దీంతోపాటు వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు ఎస్ఎంఎస్ రీఛార్జ్ సౌకర్యం కూడా అందుబాటులో వుంది. ముఖ్యంగా ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు మాత్రమే ఎస్ఎంఎస్ రీఛార్జ్ ద్వారా చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ రీచార్జ్ ఎలా అంటే మీ నంబర్ నుండి ఐడియా/వొడాఫోన్ నంబరు టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, రీచార్జ్ సొమ్ము టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, ఐసీఐసీఐ, లేదా యాక్సిస్ బ్యాంక్ ఖాతా చివరి ఆరు అంకెలను నమోదు చేసి 9717000002 లేదా 5676782కు ఎస్ఎంఎస్ పంపితే రీచార్జ్ పూర్తవుతుంది. కాగా కరోనా వైరస్ కారణంగా ఇబ్బందుల నేపథ్యంలో జియో కూడా హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బిఐ, యాక్సిస్ , సిటీ బ్యాంక్, డీసీబీ, ఐడీబీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల ఏటీఎంలద్వారా మొబైల్ రీచార్జ్ సౌకర్యాన్ని కల్పించింది. అలాగే వినియోగదారుల వోడాఫోన్, ఎయిర్టెల్ తమ వినియోగదారుల ప్రస్తుత ప్లాన్ల వాలిడిటీని ఏప్రిల్ 17వరకు పెంచాయి. తక్కువ ఆదాయ వినియోగదారుల ఖాతాలను రూ.10తో జమ చేశాయి. మరోవైపు రిలయన్స్ జియో కూడా ఏప్రిల్ 17 వరకు 100 కాల్స్ , 100 ఉచిత ఎస్ఎంఎస్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. -
తు‘ఫోను’
సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేని కార్తీక్ ఇంట్లో వారితో మాట్లాడటం తగ్గించేశాడు. అందరూ ఉన్నా ముభావంగా వ్యవహరించడం, వణకడం, స్థిరత్వం లేనిచూపులు, నిలకడ లేని ప్రవర్తన చూసి కుటుంబ సభ్యులు కలత చెందారు. అతనిలో వస్తున్న మార్పుతో నిపుణులను సంప్రదించగా నోమోఫోబియాతో బాధ పడుతున్నాడని తేల్చారు. సకాలంలో గుర్తించి కొద్దిపాటి కౌన్సెలింగ్తో అతని సమస్యను పోగొట్టారు. హైదరాబాద్లో జరిగిన ఈ సంఘటన మాదిరిగానే ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు నమోదౌతున్నాయి. నిత్యం ఫోన్లో ఆటలు, చాటింగ్ చేయడం, ఫేస్బుక్ వినియోగం, వాట్సాప్ ద్వారా మెసేజ్లు రాత్రి పగలు చేయడం నోమో ఫోబియాకు గురౌతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ ఫోబియా బారిన పడటానికి ప్రధాన కారణం యువత చదువుతున్నా, పడుకున్నా, తింటున్నా, బస్టాప్లో నిల్చున్నా, ఆఫీసులో ఉన్నా, సినిమా హాలుకు వెళ్లినా, బ్యాంక్కు వెళ్లినా, కళాశాలకు వెళ్లినా వెంట సెల్ఫోన్లు పట్టుకుని అదే పనిగా వాటిని వాడడమేనని సర్వేలు చెబుతున్నాయి. మొబైల్ వాడకం ఒక వ్యసనం ఫోన్ లేకపోతే ఏర్పడే భయాన్నే నోమో ఫోబియాగా చెబుతుంటారు. నో మొబైల్ ఫోన్ నోబియా అనే పదం నుంచి సంక్షిప్తంగా దీనికి నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సెల్ఫోన్లు వాడుతున్న దేశంగా భారత్ అవతరిస్తోంది. ఈ క్రమంలో ఈ రుగ్మతకు గురవుతున్న అత్యధిక బాధితుల సరసన కూడా చేరబోతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేకమంది యువత ఫోన్ లేకుండా ఉండలేని స్థితికి చేరుతున్నారు. దీని తర్వాత దశ నోమోఫోబియానే అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 66 శాతం మంది మధ్య పెద్ద వయస్కులు దీన్ని ఎదుర్కొంటున్నారు. నోమోఫోబియా లక్షణాలు ► మొబైల్ఫోన్, కంప్యూటర్ వంటి పరికరాలు అందుబాటులో లేకపోయినా, సిగ్నల్స్ సరిగ్గా అందకపోయినా ఆందోళనకు గురవుతారు. ► కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ముఖాముఖి కలిసేందుకు మానసిక సంసిద్ధత గణనీయంగా తగ్గిపోతుంది. ► ఒంటరితనం, కుంగుబాటుతో బాధపడతారు. ► బయటికి వెళ్లాల్సి వస్తే చార్జర్, పవర్బ్యాంక్, అదనపు డివైజ్లను వెంట తీసుకెళ్లాలనుకుంటారు. ► చెమటలు రావడం, వణుకుడు, ఆందోళన, తమను తామే కొట్టుకోవడం వంటివి కనిపిస్తాయి. ఇలా బయట పడొచ్చు సకాలంలో ఈ లక్షణాలను పసిగట్టి తగిన మానసిక చికిత్స ఇప్పిస్తే సమస్యను పరిష్కరించుకొనే అవకాశం ఉంది. గ్రూప్ డిస్కషన్, నెలలో ఒకరోజు సెల్ఫోన్, కంప్యూటర్, ట్యాబ్, వంటివాటికి దూరంగా ఉండటం, నిద్ర పోవడానికి ముందు వీటిని కనీసం పదిహేను అడుగుల దూరంలో ఉంచడం చేయాలి. ఫోన్ పక్కనే ఉంటే నిద్రా భంగమే. కుటుంబసభ్యులు, స్నేహితులు వీరితో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల సాధారణ పరిస్థితులు సృష్టించవచ్చన్నదే నిపుణులు చెప్పేమాట. ఇటీవల ప్రధాన పట్టణాల్లో రెండు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. స్నేహితులు, బంధువులతో ఫోన్లో కాకుండా నేరుగా కలిసి మాట్లాడటం వల్ల మానవ సంబంధాలు మెరుగుపడతాయి. సెల్ఫోన్, కంప్యూటర్లతో చేయాల్సిన పనులకు ఒక నిర్ణీత సమయం పెట్టుకోవడం వంటివి చేయొచ్చు. ఎవరికి వారే స్వీయ నియంత్రణ అవసరం. మరిన్ని ప్రత్యామ్నాయాలు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో సెల్ఫోన్లను నిషేధించింది. దీనిని పాఠశాలలు, కళాశాలలకే పరిమితం చేయకుండా విశ్వవిద్యాలయాలకు వర్తింపజేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన రాష్ట్రంలో కూడా ఈ విధానం అమలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ప్రైవేటు కార్యాలయాల్లోని యువతకు సెల్ఫోన్, కంప్యూటర్, ట్యాబ్లు తప్పని సరి. అక్కడే విధులు నిర్వర్తించడానికి రెండురోజులు వారాంతపు సెలవులున్నా, ఎక్కువ మంది వాటి ద్వారా ఆయా రోజుల్లో కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. ఈ పనులకంటూ కచ్చితమైన ఒక సమయం పెట్టుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. బానిసలౌతున్న యువత మొబైల్ ఫోన్లకు యువత బానిసలవుతున్నారని అంతర్జాతీయ సంస్థల సర్వేలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్లో ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే తీవ్రరూపం దాలుస్తోంది. ప్రస్తుతం 23 శాతం యువత నోమోఫోబియాకు గురవుతున్నారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాల తర్వాత ప్రస్తుతం విశాఖపట్నంలో ఎక్కువగా ఈ కేసులు నమోదౌతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఈ కేసుల లక్షణాలు యువతలో కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. యువత, విద్యార్థులు రోజలో కనీసం 31 పర్యాయాలు సెల్ఫోన్ చూసుకుంటున్నారు. సుమారు 3 గంటల పాటు సెల్ఫోన్తోనే గడుపుతున్నారని తేలింది. పదేపదే ఈ రకమైన కాలక్షేపం వల్ల మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెబుతున్నారు. నోమోఫోబియా బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సమస్య నుంచి దూరం చేయవచ్చు. ఆలోచనల్లో మార్పులు తీసుకురావడం, టాక్ థెరపీ, విశ్రాంతి వంటి పద్ధతుల ద్వారా సమస్యను పరిష్కరించొచ్చు. నెట్ వర్క్ను పరిమితంగా వినియోగించుకొనేలా మార్గనిర్ధేశం చేస్తాం. ఫోన్కు దూరమైతే నోమో ఫోబియా దూరమౌతుంది. – శ్రీహరి, మానసిక నిపుణుడు విపరీత వినియోగంతో ఫోబియా సెల్ ఫోన్ను విశ్రాంతి లేకుండా అదే పనిగా వినియోగించడం వల్ల యువత అనేక రగ్మతలకు గురౌతోంది. అలాంటి కేసులు తరచూ వస్తున్నాయి. తలనొప్పి, నరాలు పట్టేయడం, స్థిరత్వం లేని మాటలు ఆడటం వంటి కేసులు వస్తున్నాయి. అన్నం తిన్నా, పడుకోవడానికి వెళ్లినా, చివరికి బాత్రూంకు వెళ్లినా సెల్ఫోన్ పట్టుకుని వెళ్లే కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రాథమిక స్థాయిలో గుర్తించిన ఇలాంటి కేసులను కౌన్సెలింగ్ కోసం రిఫర్ చేస్తున్నాం. – డాక్టర్ నాగభూషణ్రావు, సూపరింటెండెంట్, పార్వతీపురం ఏరియా ఆసుపత్రి -
ఇక ఒక్కొక్కరికి 18 మొబైల్ కనెక్షన్లు!
న్యూఢిల్లీ: మొబైల్ యూజర్లు సర్వీస్ ప్రొవైడర్ను మార్చినప్పుడు, కొత్త కనెక్షన్ను తీసుకున్నప్పుడు కొత్తగా సిమ్ను తీసుకోవాల్సిన పని తప్పనుంది. టెలికం విభాగం (డాట్) తాజాగా కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఇందులో సింగిల్, మల్టీపుల్ కాన్ఫిగరేషన్స్తో ఇ–సిమ్ వినియోగానికి అనుమతినిచ్చింది. అలాగే మొబైల్ కనెక్షన్ల పరిమితిని కూడా పెంచింది. ఎం2ఎం/ఐఓటీలో ఆధునిక సాంకేతిక అవసరాలను తీర్చడానికి ఇ–సిమ్ (ఎంబెడెడ్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్) వినియోగానికి అనుమతినిస్తున్నట్లు డాట్ తెలిపింది. ఇ–సిమ్ను డివైజ్లలో ఇన్స్టాల్ చేసుకోవాలి. సర్వీస్ మార్చినప్పుడు, కొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు ఇందులో సర్వీస్ ప్రొవైడర్ల వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. కారులో ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు, కారు దొంగతనానికి గురైనప్పుడు, రిమోట్ కంట్రోల్ తదితర వాటికి సంబంధించి వెహికల్ నుంచి మొబైల్కు వచ్చే అలర్ట్స్ వంటి మెషీన్–టు–మెషీన్ (ఎం2ఎం) కమ్యూనికేషన్స్లో వినియోగించే సిమ్లకు కూడా నిబంధనలు విడుదల చేసింది. ఎం2ఎం కమ్యూనికేషన్స్కు వినియోగించే సిమ్లకు 13 అంకెలు ఉంటాయని డాట్ గతంలోనే తెలియజేసింది. ఎం2ఎం కమ్యూనికేషన్స్కు ఎక్కువ సిమ్ కార్డులు అవసరమౌతాయి. అందువల్ల డాట్ ఒక్కొక్కరికి మొబైల్ కనెక్షన్ల(సిమ్ కార్డులు) పరిమితిని 18కి పెంచింది (ప్రస్తుత పరిమితి 9). వీటిలో సాధారణ మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్స్ కోసం 9 సిమ్లను, మరో 9 సిమ్లను ఎం2ఎం కమ్యూనికేషన్ సేవలకు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ డివైస్లో ఎం2ఎం సిమ్ను ప్రి–ఇన్స్టాల్ చేయవలసి వస్తే, అప్పుడు సబ్స్క్రైబర్ వెరిఫికేషన్ను డివైజ్ తయారీ సంస్థలే పూర్తి చేయాలని డాట్ తెలిపింది. ఇక ఇ–సిమ్లో మొబైల్ నెంబర్ పోర్ట్బిలిటీ కోసం ఓవర్ ద ఎయిర్ సబ్స్క్రిప్షన్ అప్డేట్ ఫెసిలిటీ కల్పించింది. ఇ–సిమ్పై సర్వీసులు అందించే టెలికం ఆపరేటర్లు వాటిపై తగిన పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థలు యాపిల్ వాచ్ సిరీస్–3 విక్రయాలను ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత డాట్ ఈ మార్గదర్శకాలను జారీ చేయడం గమనార్హం. ఈ వాచ్లలో ఇ–సిమ్ ఉంటుంది. యూజర్లు వీటిని మొబైల్లోని సిమ్తో కనెక్ట్ చేసుకోవాలి. తద్వారా ఫోన్లోని సర్వీస్ ప్రొవైడర్ సేవలను పొందొచ్చు. -
మొబైల్ యూజర్లకు డబుల్ షాక్
కోల్ కత్తా : దేశమంతా ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి జీఎస్టీ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీ రేట్లను నిర్ణయించేసింది. బంగారంపై రేట్లపై మాత్రమే ఇక తుది నిర్ణయం రావాల్సి ఉంది. జీఎస్టీ అమలుతో ప్రతి యూజర్ చేతిలో ఒక నిత్యావసర వస్తువుగా మారిన మొబైల్ ఫోన్ల ధరలు కాకపుట్టనున్నాయట. ఒక్క మొబైల్ హ్యాండ్ సెట్లు మాత్రమేకాక, మొబైల్ ఫోన్ బిల్స్ కు మోత మోగనున్నాయని తెలుస్తోంది. దీంతో మొబైల్ యూజర్లకు డబుల్ షాకేనని ఆందోళన వ్యక్తమవుతోంది. మొబైల్ ఇండస్ట్రీని 12 శాతం, టెలికాం సేవలను 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రేట్లతో వినియోగత్వం, పెట్టుబడులు తగ్గిపోతాయని మొబైల్ ఫోన్ ఇండస్ట్రి ఆందోళన వ్యక్తంచేస్తోంది. యూజర్లు ఇక తమ నెలవారీ 1000 రూపాయల మొబైల్ బిల్లుకు అదనంగా 30 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న టెలికాం సర్వీసుల పన్ను రేట్లు 15 శాతం నుంచి 18 శాతానికి పెరుగడంతో ఈ మేరకు మొబైల్ ఫోన్ బిల్లులు భారీగా ఎగియనున్నట్టు తెలిసింది. అదేవిధంగా ప్రీపెయిడ్ యూజర్ల ఎఫెక్టివ్ టాక్ టైమ్ కూడా తగ్గిపోనుందట. జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మొబైల్ ఫోన్లు 4-5 శాతం ఖరీదుగా మారతాయని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. స్థానికంగా తయారుచేసే డివైజ్ లు కూడా మరింత ఖరీదైనవిగా మారునున్నాయట. జనవరి నుంచి మార్చి కాలంలో భారత్ లో 59 మిలియన్ల మొబైల్ ఫోన్లు అమ్ముడుపోయాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ లో తెలిసింది. 18 శాతం పన్నుపై టెలికాం ఇండస్ట్రి ఇప్పటికే పెదవి విరిచేసింది. ఇక మొబైల్ ఇండస్ట్రి నుంచి కూడా ఇదే రకమైన అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని భారత్లో విక్రయించే ఫోన్ల సుంకం 17 శాతం నుంచి 27 శాతంగా ఉంది. ఇప్పుడది 12 శాతానికి తగ్గింది. దీనివల్ల దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. దిగుమతులు పెరగడంతో, స్థానిక మొబైల్ ఫోన్లకు భారీగా డిమాండ్ పడిపోనుందని తెలుస్తోంది. -
జియో సిమ్కు పూజలు
భట్టిప్రోలు: రిలయన్స్ జియో సిమ్ ఆఫర్ గడువు నేటితో ముగియనుండటంతో వినియోగదారులు ఆఫర్ గడువును పొడిగించాలని కోరుతూ జియో సిమ్కు పూజలు నిర్వహించారు. ఆరు నెలల కిందట ప్రారంభమైన జియో సిమ్ సేవలు వినియోగదారులు ఉచితంగా అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది పర్వ దినాన గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన వినియోగదారుడు మాచర్ల వీరేంద్ర జియో సిమ్కు పండ్లు, పూలు పెట్టి పూజలు నిర్వహించాడు. -
ప్రస్తుత మొబైల్ కస్టమర్లకూ ఆధార్ ధ్రువీకరణ
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులు అందిరికీ ఆధార్ ఈ–కేవైసీ ధ్రువీకరణ తప్పనిసరి కానుంది. కంపెనీలు ఈ–కేవైసీ విధానంలో వేలి ముద్రల ఆధారంగా ఆధార్ వివరాలు తీసుకుని కొత్త సిమ్లను యాక్టివేట్ చేస్తున్నాయి. ఇది ప్రస్తుత మొబైల్ కస్టమర్లకు కూడా అమలు కానుంది. అన్ని లైసెన్స్డ్ కంపెనీలు ప్రస్తుత మొబైల్ చందదాదారుల నుంచి ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానంలో ధ్రువీకరణ తీసుకోవాలంటూ టెలికం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. చందాదారుల వివరాలను తిరిగి ధ్రువీకరించే విషయమై సుంప్రీకోర్టు ఆదేశాల గురించి కస్టమర్లకు ఎస్ఎంఎస్లు ద్వారా తెలియజేయాలని, పత్రికలు, టీవీ చానళ్లలో ప్రకటనలు ఇవ్వాలని కోరింది. దీనికి సంబంధించిన వివరాలను తమ వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచాలని సూచించింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 100 కోట్ల మంది మొబైల్ కస్టమర్లకు ఈకేవైసీ ధ్రువీకరణ అమలు చేసే విషయమై చర్చించేందుకు తాము ఈ వారంలోనే సమావేశం అవనున్నట్టు సెల్యులర్ ఆపరేటర్ల సంఘం (సీవోఏఐ) తెలిపింది. దీనికి తాము మద్దతుగా నిలబడతామని, అయితే ఈ ప్రక్రియకు రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ చెప్పారు. ఈ–కేవైసీ కంటే ముందు ప్రస్తుత యూజర్లకు కంపెనీలు వెరిఫికేషన్ కోడ్ను పంపిస్తాయి. ఈ సిమ్ వినియోగదారుడి వద్ద అందుబాటులో ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకుంటాయి. ఆ తర్వాత ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియను చేపడతాయి. -
ఫిబ్రవరిలో 22.7 లక్షల మంది కొత్త మొబైల్ వినియోగదారులు
న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో 22.7 లక్షల మంది కొత్తగా మొబైల్ వినియోగదారులయ్యారని సీఓఏఐ తెలిపింది. దీంతో మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 81.74 కోట్లకు పెరిగిందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీఓఏఐ) తెలిపింది. రిలయన్స్ జియో వినియోగదారుల వివరాలను వెల్లడించలేదు. గణాంకాల ప్రకారం... భారతీ ఎయిర్టెల్కు 12.5 లక్షల మంది కొత్త మొబైల్ వినియోగదారులు లభించారు. గత నెలలో అత్యధిక కొత్త మొబైల్ వినియోగదారులను సాధించిన కంపెనీ ఇదే. ఐడియాకు 12.1 లక్షల మంది, వొడాఫోన్కు 7.9 లక్షల మంది చొప్పున కొత్త యూజర్లు జతయ్యారు. -
స్పామ్ కాల్స్ బెడద ఎవరికి ఎక్కువో తెలుసా..?
అహ్మదాబాద్ : ఈ కాలంలో మొబైల్ వాడే ప్రతి యూజర్ కు అవసరం లేని కాల్స్ వస్తుంటాయి. అది పరిచయం లేని వ్యక్తుల నుంచి కాని, వ్యాపార ప్రకటన దారుల నుంచి కాని, మార్కెటింగ్ సంస్థలు కాని చేస్తుంటాయి. దేశమంతటా వైర్ లెస్ టెలి-సాంద్రత పెరిగినప్పటి నుంచీ ఈ అవసరం లేని కాల్స్(స్పామ్ కాల్స్) బెడద ఎక్కువైంది. గుజరాత్ లో ఈ స్పామ్ కాల్స్ సంఖ్య మరీ అధికమైందట. నెలకు 400లక్షలకు పైగా స్పామ్ కాల్స్ గుజరాత్ వినియోగదారులను బాధిస్తున్నాయని వెల్లడైంది. వారానికి 101లక్షల స్పామ్ కాల్స్ బెడదతో గుజరాతీయులు విసుగుచెందుతున్నారని తెలుస్తోంది. ఈ కాల్స్ కేవలం యూజర్లకు విసుగు తెప్పించడమే కాకుండా, ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఆ పనికి ఆటంకం కూడా ఎక్కువగా కల్గిస్తుంటాయి. ట్రూకాలర్ డేటా ప్రకారం భారత మొబైల్ వినియోగదారులు నెలకు 3000 లక్షల స్పామ్ కాల్స్ ను పొందుతున్నారని వెల్లడైంది. భారత్ లో టాప్ నగరాలుగా ఉన్న ఢిల్లీకి 52 స్పామ్ కాల్స్ ను పొందుతూ మొదటిస్థానంలో నిలుస్తుండగా.. ముంబాయి 520లక్షల స్పామ్ కాల్స్ బెడదతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లు స్పామర్ల జాబితాలో తర్వాతి స్థానాల్లో టార్గెట్ గా ఉన్నాయని వెల్లడైంది. ఈ రెండు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ 450 లక్షల స్పామ్ కాల్స్, గుజరాత్ 400లక్షల స్పామ్ కాల్స్ ను పొందుతున్నాయని డేటాలో తెలిసింది. మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్తాన్ రాష్ట్రాలకు కూడా వీటి బెడద ఎక్కువగానే ఉందంట. స్పామ్ కాల్ అంటే.... స్పామ్ కాల్ అనేది ఇదో రకమైన మెసేజింగ్ వ్యవస్థ. మొబైల్ ఫోన్ల ద్వారా సమాచారం అందించే కమ్యూనికేషన్ సర్వీసు. 2000 సంవత్సరం నుంచి ఇండియాలో మొబైల్ ఫోన్ల వాడకం పెరిగింది. దీంతో యూజర్లకు అవసరం లేని కాల్స్, వాణిజ్య ప్రకటన ఫోన్లు పెరిగాయి. -
కాల్ డ్రాప్ అయితే టెల్కోలు పరిహారం ఇవ్వాల్సిందే
- ట్రాయ్కి మొబైల్ యూజర్ల వినతి - పరిహార ప్రతిపాదనను వ్యతిరేకించిన టెలికం కంపెనీలు న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ అయితే టెల్కోలు పరిహారం చెల్లించే అంశంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదించిన చర్చాపత్రంపై ఇటు మొబైల్ యూజర్లు, అటు పరిశ్రమ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాల్ డ్రాప్ అయిన పక్షంలో టెలికం కంపెనీలు రెట్టింపు పరిహారం చెల్లించాలని మొబైల్ యూజర్లు డిమాండ్ చేశారు. టెల్కోల నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల పలు సందర్భాల్లో కాల్స్కి అంతరాయం కలుగుతోందని, ఇలాంటప్పుడు సదరు కాల్స్కి కూడా డబ్బు వసూలు చేయడమనేది వేధింపు కిందికి వస్తుందంటూ కొందరు యూజర్లు వ్యాఖ్యానించారు. కాల్ డ్రాప్తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా సరిగ్గా ఉండటం లేదంటూ వందల కొద్దీ ఫిర్యాదులు ట్రాయ్కి అందాయి. యూజరు నష్టపోయిన దానికి పరిహారంగా ఆ మేర వ్యవధికి సరిపడేలా ఉచిత టాక్టైమ్ ఇచ్చేలా చూడాలని, యూనినార్.. రిలయన్స్ వంటివి ఇటువంటి విధానం అమలు చేస్తున్నాయని మొబైల్ సబ్స్క్రయిబర్స్ పేర్కొన్నారు. మరోవైపు, అయిదు సెకన్ల లోగా గానీ ఆ తర్వాత గానీ కాల్ డ్రాప్ అయితే.. చార్జీని మొత్తానికే వసూలు చేయకూడదన్న ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నట్లు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీఓఏఐ), అసోసియేషన్ ఆఫ్ యూనిఫైడ్ టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ (ఏయూఎస్పీఐ) ట్రాయ్కి తెలిపాయి. ఎటువంటి అంతరాయం లేకుండా కాల్ కొనసాగినంత వ్యవధికి చార్జీలు ఉండాల్సిందేనని పేర్కొన్నాయి. ఇక కాల్ డ్రాప్ వ్యవహారంలో పరిహారం చెల్లించడం వల్ల సమస్య పరిష్కారం కాదని సీవోఏఐ పేర్కొంది. స్పెక్ట్రం కొరత, నెట్వర్క్ల ఏర్పాటుకు సైట్ల కొరత సమస్యలు అలాగే ఉంటాయని వివరించింది. -
బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.10 ఫ్రీ టాక్టైం
ఆక్సిజన్ సర్వీసెస్ ఇండియా ఆఫర్ యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆక్సిజన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దేశంలోని ప్రతి వ్యక్తి మొబైల్కు రూ. 10 ఉచిత టాక్టైమ్ అందిస్తోంది. బుధవారం నుంచి ఈనెల 24 వరకు ఇది వర్తిస్తుందని ఆ సంస్థ చైర్మన్ ప్రమోద్ సస్రేనా పేర్కొన్నారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ కార్యాలయంలో బుధవారం ఈ సౌకర్యాన్ని చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్క భక్తుడూ గోవిందనామ స్మరణ చేయాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించామన్నారు. మొబై ల్ వినియోగదారులు ఫోన్లో గోవింద అనే పదాన్ని టైప్ చేసి తర్వాత స్పేస్ ఇచ్చి ఆపరేటర్ పేరును టైప్ చేసి 9963900600కి ఎస్ఎంఎస్ చేస్తే వెంటనే రూ.10 రీచార్జ్ లభిస్తుందన్నారు. ఉదాహరణకు ఎయిర్టెల్ వినియోగదారులు GOVINDA AIRTEL అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలని కోరారు. -
భారత్లోనే మొబైల్ యూజర్ల జోరు..
న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్లోనే మొబైల్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (క్యూ1) భారత్లో మొబైల్ వినియోగదారులు కొత్తగా 2.6 కోట్లు పెరిగారని టెలికం ఉపకరణాల తయారీ సంస్థ ఎరిక్సన్ తెలిపింది. ఈ త్రైమాసికంలో అంతర్జాతీయ మొబైల్ వినియోగదారుల సంఖ్య కొత్తగా 10.8 కోట్లు పెరిగి 720 కోట్లకు చేరిందని పేర్కొంది. మొబైల్ వినియోగదారుల సంఖ్య భారత్లోనే (2.6 కోట్లు) అధికంగా పెరుగుతోందని వివరించింది. దీని తర్వాతి స్థానాల్లో చైనా (80 లక్షలు), మయన్మార్ (50 లక్షలు), ఇండోనేసియా (40 లక్షలు), జపాన్ (40 లక్షలు) ఉన్నాయి. క్యూ1లో జరిగిన మొత్తం మొబైల్ హ్యాండ్సెట్స్ విక్రయాల్లో 75 శాతం స్మార్ట్ఫోన్లే ఉన్నాయని పేర్కొంది. 2020 నాటికి స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్న వారు 610 కోట్ల మంది ఉంటారని.. అలాగే స్మార్ట్ఫోన్ డాటా వినియోగం 10 రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. 4జీ స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్న వారు 60 కోట్ల మంది ఉంటారని తెలిపింది. -
2020 నాటికి మొబైల్ యూజర్లు @ 460 కోట్లు
దుబాయ్: రానున్న ఐదేళ్లలో మొబైల్ వినియోగదారుల సంఖ్య మరో 100 కోట్లు పెరగనుంది. మొబైల్ ఆపరేటర్ల సంఘమైన గ్రూప్ స్పెషల్ మొబైల్ అసోసియేషన్ (జీఎస్ఎంఏ) నివేదిక ‘ద మొబైల్ ఎకానమీ-2015’ ప్రకారం, గతేడాది చివరకు 360 కోట్లుగా ఉన్న మొబైల్ వినియోగదారుల సంఖ్య ఏడాదికి 4 శాతం వృద్ధితో 2020 నాటికి 460 కోట్లకు చేరనుంది. ‘దశాబ్దకాలం క్రితం ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే మొబైల్ను వినియోగించేవారు. ఇప్పుడు మేము 50 శాతం మైలురాయిని (ప్రపంచవ్యాప్తంగా 50 శాతానికిపైగా జనాభా మొబైళ్లను వినియోగిస్తున్నారు) అధిగమించాం. రానున్న ఐదేళ్లలో మొబైల్ వినియోగదారుల సంఖ్య మరో 100 కోట్లు పెరుగుతుంది’ అని జీఎస్ఎంఏ డెరైక్టర్ అన్నె బౌవెర త్ అన్నారు. అంతర్జాతీయంగా గతేడాది 710 కోట్లుగా ఉన్న సిమ్ కనెక్షన్ల సంఖ్య 2020 నాటికి 900 కోట్లకు చేరనుంది. గతేడాది మొబైల్ పరిశ్రమ ప్రపంచ ఆర్థిక రంగానికి 3 ట్రిలియన్ డాలర్లను సమకూర్చింది. ఇది ప్రపంచ జీడీపీలో 3.8 శాతానికి సమానం. 2020 నాటికి ఈ మొత్తం 3.9 ట్రిలియన్ డాలర్లకు చేరనుంది. ఇది ప్రపంచ జీడీపీలో 4.2 శాతానికి సమానం. -
ట్రింగ్ ట్రింగ్ @ 90.45 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది అక్టోబర్లో స్వల్పంగా పెరిగిందని నియంత్రణ సంస్థ ట్రాయ్ శుక్రవారం తెలిపింది. ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.., ఈ ఏడాది సెప్టెంబర్లో 89.98 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది అక్టోబర్లో 90.45 కోట్లకు పెరిగింది. వెర్లైస్ వినియోగదారుల సంఖ్య 87 కోట్ల నుంచి 0.56 శాతం వృద్ధితో 87,54 కోట్లకు పెరిగింది. మొత్తం మొబైల్ యూజర్లలో 85% మంది యాక్టివ్ యూజర్లు. పట్టణ ప్రాంత వెర్లైస్ వినియోగదారుల వాటా 59.75 శాతం నుంచి 59.65 శాతానికి తగ్గింది. మరోవైపు గ్రామీణ ప్రాంత వెర్లైస్ వినియోగదారుల వాటా మాత్రం 40.25 శాతం నుంచి 40.35 శాతానికి పెరిగింది. సెప్టెంబర్లో 73.01గా ఉన్న టెలీడెన్సిటీ అక్టోబర్లో 73.32 శాతానికి పెరిగింది. అక్టోబర్ చివరినాటికి దేశంలో 1.49 కోట్ల మంది బ్రాడ్బాండ్ వినియోగదారులున్నారు. అక్టోబర్లో నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్పీ) కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 23 లక్షలు. దీంతో ఇప్పటివరకూ ఎంఎన్పీ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 10.48 కోట్లకు పెరిగింది. కొత్త వినియోగదారులు అక్టోబర్లో ఎయిర్టెల్(14.88 లక్షలు)కే అధికంగా లభించారు. తర్వాత స్థానాల్లో వొడాఫోన్(11.51 లక్షలు), ఐడియా(11.49 లక్షలు) ఉన్నాయి ఎంటీఎన్ఎల్ 1.55 లక్షలు, టాటా టెలీ 96,500 మంది వినియోగదారులను కోల్పోయాయి.