Ramatheertham Temple
-
ఏపీ సర్కార్ తరుపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స
-
Nellimarla: రామకోనేరుకు మహర్దశ
నెల్లిమర్ల రూరల్ (విజయనగరం జిల్లా): పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి ఆలయం పక్కనున్న రామకోనేరుకు మహర్దశ కలగనుంది. కోనేరు అభివృద్ధి పనులకు దేవదాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అమృత సరోవర్ కార్యక్రమంలో భాగంగా కోనేరును బాగుచేసేందుకు రూ.1.50 కోట్ల వ్యయంతో దేవదాయశాఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు ఉపాధిహామీ సిబ్బంది రామకోనేరుకు జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. జలవనరుల శాఖ అధికారులు కోనేరుకు కొలతలు వేసి అభివృద్ధి పనులపై అంచనాలు రూపొందించే పనిలో నిమఘ్నమయ్యారు. 12 ఎకరాల్లో రామకోనేరు రామకోనేరు 12 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. రామక్షేత్రానికి విచ్చేసే భక్తులు ముందుగా కోనేరులో పుణ్య స్నానమాచరించిన తరువాత సీతారామస్వామిని, ఉమా సదాశివుడిని దర్శించుకుంటారు. ప్రస్తుతం రామకోనేరులో రెండు పుష్కర ఘాట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాల కోనేరుల అభివృద్ధిలో భాగంగా ఆ శాఖ అధికారులు తాజాగా అమృత సరోవర్ పథకం కింద రామతీర్థం కోనేరును ఎంపిక చేశారు. పనులు పూర్తయితే రామక్షేత్రానికి మరింతి శోభ సాక్షాత్కరించనుంది. కోనేరు అభివృద్ధి ఇలా... రామకోనేరులోకి నీరు వచ్చి పోయేందుకు ఇన్లెట్, ఔట్లెట్ నిర్మాణాలు పూర్తి చేస్తారు. కోనేరు చుట్టూ ఉన్న గట్టును మరింత పటిష్టం చేయనున్నారు. కోనేరులో పూడికతీత పనులు, చుట్టూ రాతి కట్ట నిర్మాణాలు, పడమర వైపు సువిశాలంగా పుష్కర ఘాట్ నిర్మాణం, భక్తుల సౌకర్యార్థం పుష్కరఘాట్ల వద్ద అదనపు షెడ్ల నిర్మాణం, మూడు అడుగుల ఎత్తులో గట్టు, రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు పూర్తిచేస్తారు. వీటితో పాటూ 100 మీటర్ల పోడవు, 5 మీటర్ల వెడల్పుతో కూడిన సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కోనేరు అభివృద్ధి పనులకు సుమారు రూ.3 కోట్లు అవసరమవుతాయని దేవస్థాన ఈఓ ప్రసాదరావు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి పనులకు కొలతలు రామతీర్థం దేవస్థానాన్ని ఇరిగేషన్ జేఈ శ్రీనివాసరావు గురువారం సందర్శించారు. అభివృద్ధి పనులకు ఈఓ ప్రసాదరావుతో కలిసి కోనేరు చుట్టూ కొలతలు వేశారు. పుష్కరిణి గట్టుతో పాటు ఇన్లెట్, ఔట్లెట్ చానళ్లను పరిశీలించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పనులకు సంబంధించి పూర్తి నివేదికను అందజేస్తామని ఆయన తెలిపారు. (క్లిక్: రాజాం టు అమెరికా.. కష్టాలను ఈది సూపర్ సీఈవోగా) -
కొలువుదీరిన కోదండరామయ్య
నెల్లిమర్ల రూరల్: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం నీలాచలం బోడికొండపై సోమవారం కోదండ రాముడు కొలువుదీరాడు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేదమంత్రోచ్ఛారణల మధ్య పండితుల ఈ క్రతువును వైభవంగా జరిపించారు. రామతీర్థం క్షేత్రం యావత్తూ జైశ్రీరామ్ నామస్మరణతో పులకించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంతో ఈ ఆలయం మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంది. రూ.3 కోట్ల నిధులతో పూర్తయిన కోదండ రామస్వామి వారి నూతన రాతి దేవాలయంలో గడిచిన మూడ్రోజులూ తిరుపతి, ద్వారకా తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు నిర్విరామంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను పూర్తిచేశారు. వేకువజామున యాగశాలలో విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కుంభారాధన, దాతాది సామాన్య హోమం, పూర్ణాహుతి, యంత్ర, బింబ స్థాపనలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కోదండ రామస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం మంత్రులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దిగువనున్న ప్రధాన ఆలయంలో సీతారామస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పెనుమత్స సూర్యనారాయణరాజు, ఇ.రఘురాజు, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి చిన వెంకట అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ హరిజవహర్లాల్, కలెక్టర్ సూర్యకుమారి, ప్రత్యేకాధికారి భ్రమరాంబ ఎంపీపీ అంబళ్ల సుధారాణి, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
రామతీర్థం ఆలయ పునఃనిర్మాణం పూర్తి
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణం కేవలం నాలుగు నెలల్లో పూర్తయింది. ఇక్కడి బోడికొండపై పాత ఆలయం ఉన్నచోటే రూ.3 కోట్ల ఖర్చుతో నూతన హంగులతో కొత్త రాతి దేవాలయం పునర్నిర్మాణానికి 2021 డిసెంబరు 22న శంకుస్థాపన జరగగా.. సోమవారం (ఈనెల 25న) పునర్నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది. వైఖానస ఆగమ పండితులు నిర్ణయించిన ముహుర్తం మేరకు సోమవారం ఉ.7.37 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వార్లను పునఃప్రతిష్టించనున్నారు. ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక ఎంపీ చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు అప్పలనాయుడు, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్లాల్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తుపాన్లతో పనులు ఆలస్యం 2020 డిసెంబరు 28వ తేదీ అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగలు కొండపై స్వామి విగ్రహాన్ని తొలగించగా.. అనంతరం అది కొండపైన కోనేరులో బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. విగ్రహాల పునఃప్రతిష్టతో పాటు పురాతన ఆలయం మొత్తాన్ని కూడా పునర్నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. సంఘటన జరిగిన ఐదు రోజుల్లోనే నాటి దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి రూ.3 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. జనవరి 3న మంత్రి ప్రకటన చేయగా.. జనవరి 9కల్లా దేవదాయ శాఖ అనుమతులిచ్చింది. అలాగే, 2021 జనవరి 22 నాటికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ సీతారామలక్ష్మణ నూతన విగ్రహాలు రామతీర్థం చేరాయి. 28న కొండ కింద శ్రీరామాలయంలోని ఏర్పాటుచేసిన బాలాలయంలో ఆ విగ్రహాల చర ప్రతిష్ట జరిగింది. ఇక 2021 ఆగస్టు నాటికే పాత ఆలయాల శిథిలాలను తొలగించి కొత్త ఆలయ పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినప్పటికీ, అప్పట్లో రెండుసార్లు తుపాను రావడం.. గ్రానైట్ రాళ్ల తరలింపునకు అవరోధాలు ఎదురవడంతో డిసెంబర్లో శంకుస్థాపన జరిగింది. ఈలోపు కొండపైకి కొత్తగా త్రీఫేజ్ కరెంటు ఏర్పాటుచేశారు. విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని కొండ దిగువన ఏర్పాటు చేసిన యాగశాల జనరేటర్ వెలుగుల్లో పనులు.. ఇక పాత ఆలయం స్థానంలో గ్రానైట్ రాయితో కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఒక్కొక్కటి మూడేసి టన్నుల బరువు ఉండే గ్రానైట్ రాళ్లను కూడా ఆలయ పునర్నిర్మాణంలో ఉపయోగించారు. 600 మీటర్ల ఎత్తులోని బోడికొండ పైకి గ్రానైట్ రాళ్లను తరలించేందుకు 200 మీటర్ల పొడవున ప్రత్యేక ట్రాక్ను ఏర్పాటుచేయడంతో పాటు 12 టన్నుల బరువుండే రాళ్లను ఎత్తగలిగే భారీ హైడ్రాలిక్ క్రెయిన్లను ఉపయోగించారు. మరోవైపు.. త్వరగా ఆలయ పునర్నిర్మాణం పూర్తిచేసేందుకు జనరేటర్ల సాయంతో రాత్రి వేళల్లో పనులు జరిపారు. కుప్పం, చెన్నై ప్రాంతాల నుంచి వచ్చిన 25 మంది శిల్పులతో పాటు దేవదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఈ పనుల్లో పాల్గొన్నారు. మరిన్ని అదనపు వసతులతో.. ప్రధాన ఆలయ పనులు ఇప్పటికే పూర్తికాగా, ఆలయం వద్ద మరికొన్ని ఆదనపు వసతులు కల్పించనున్నారు. ► గర్భాలయంతో పాటు ఆలయ మండపం, ధ్వజస్తంభం, ప్రాకారం (కాంపౌండ్ వాల్), కొత్తగా యాగశాలనూ నిర్మిస్తున్నారు. వీటిని మరో మూణ్ణెలల్లో పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ► మెట్ల మార్గానికి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేశారు. గతంలో స్వామివారికి సమర్పించే నివేదనను వండడానికి వసతిలేదు. ఇప్పుడు కొత్తగా నివేదనశాలలను ఏర్పాటుచేస్తారు. ► అలాగే, కొండపైన భక్తుల కోసం ప్రత్యేక షెల్టరును ఏర్పాటుచేయడంతోపాటు భక్తుల కోసం మంచినీటి ట్యాంకు, వాష్ రూములు నిర్మించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామి ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా నేను విజయనగరం జిల్లా కలెక్టరుగా ఉన్న సమయంలోనే రామతీర్థం ఆలయంలో ఆ దురదృష్టకర సంఘటన జరిగింది. ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగినప్పుడూ, విగ్రహ ప్రతిష్ట సమయంలో దేవదాయ శాఖ కమిషనర్గా నేనే ఉన్నాను. ఆ స్వామివారే మళ్లీ నాకు దేవదాయ శాఖ కమిషనర్ పోస్టు ఇప్పించి తొందరగా ఆ పనులన్నీ చేయించుకోమని అవకాశం ఇచ్చినట్లుగా భావిస్తున్నాను. – హరిజవహర్లాల్, దేవదాయ శాఖ కమిషనర్ -
అశోక్ గజపతిరాజుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు
విజయనగరం: రామతీర్థం ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్గజపతిరాజుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులను పోలీసులు అందజేశారు. అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు. కాగా,, రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్లో అశోక్ గజపతిరాజు కేసు నమోదైన సంగతి తెలిసిందే. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా తాజాగా అశోక్ గజపతిరాజుకు అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందంటూ 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. -
అశోక్గజపతిరాజుపై కేసు నమోదు
విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్గజపతిరాజుపై కేసు నమోదైంది. బుధవారం రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: బోడికొండపై 'దండు'యాత్ర.. కాగా, రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. -
అశోక్ గజపతిరాజు హుందాగా వ్యవహరించాలి:మంత్రి వెల్లంపల్లి
-
దేవుడి ఆలయాన్ని సర్కస్ కంపెనీ అంటారా..?: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయనగరం: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై ఆలయ ధర్మకర్త అశోక్గజపతిరాజు వీరంగం సృష్టించడంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'అశోక్ గజపతి రాజు హుందాగా వ్యవహరించాలి. ఆలయ ధర్మకర్తగా ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం హేయమైన చర్య. ధర్మకర్త అని చెప్పుకోవడమే తప్ప దేవాలయాన్ని ఏనాడైనా అభివృద్ధి చేశారా?. రాష్ట్ర ప్రభుత్వం రాతి ఆలయాన్ని పటిష్టంగా నిర్మిస్తుంటే సర్కస్ కంపెనీ అని అశోక్ గజపతి అనడంపై చర్యలు తీసుకొవడం జరుగుతుంది. ఏం జరగకపోయినా ఏదో జరిగినట్లు అశోక్గజపతిరాజు రాద్ధాంతం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఆలయ అభివృద్ధి చేయకపోవడం, ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం చూస్తుంటే రాముని విగ్రహం ధ్వంసంలో వీళ్ల పాత్ర ఉందేమోనని అనుమానం కలుగుతోంద'ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: (రామతీర్థం బోడికొండపై అశోక్గజపతిరాజు వీరంగం) -
రామతీర్థం బోడికొండపై అశోక్గజపతిరాజు వీరంగం
సాక్షి, విజయనగరం: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై రూ.3కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయ పునఃనిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దేవస్థాన అధికారులు హాజరయ్యారు. శంకుస్థాపన అనంతరం వించ్ మోటారు సహకారంతో ట్రాక్ మీదుగా శిలా ఖండాలను ఒక్కొక్కటిగా కొండపైకి చేరవేసి ఆలయాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు. మండపంతోపాటు ధ్వజస్తంభం, ఆలయ ప్రాకారం, వంటశాలను నిర్మించనున్నారు. నీటి కొలను సుందరీకరణ, మెట్ల మార్గం ఆధునికీకరిస్తారు. శంకుస్థాపన అనంతరం ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసేందుకు దేవదాయశాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం దిగువున ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో కోదండ రాముడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. కొండపై నిర్మాణం పూర్తయిన వెంటనే విగ్రహాలను నూతన ఆలయంలో పునఃప్రతిష్టిస్తారు. అశోక్గజపతిరాజు వీరంగం రామతీర్థం బోడికొండపై అశోక్ గజపతి రాజు వీరంగం సృష్టించారు. దుండగులు ధ్వంసం చేసిన ఆలయాన్ని ప్రభుత్వం నిర్మించడాన్ని అశోక్ గజపతి రాజు తప్పుబట్టారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరున ఉన్న శిలాఫలకాన్ని తొలగించాలని అశోక్ అధికారులపై చిందులు తొక్కారు. ఆ క్రమంలోనే శంకుస్థాపం బోర్డును సైతం అశోక్గజపతిరాజు పీకిపారేశారు. -
జనవరిలో ‘రామతీర్థం’ ఆలయం ప్రారంభం
నెల్లిమర్ల రూరల్/విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై శ్రీకోదండ రామాలయాన్ని పునర్నిర్మించి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభిస్తామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం రామతీర్థం, విజయనగరంలలో వేర్వేరుగా ఆయన మీడియాతో మాట్లాడారు. రామతీర్థంలోని బోడికొండపై కోదండరామాలయ నిర్మాణానికి రూ.3కోట్లు కేటాయించామని, టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. కొండపై ఆలయ నిర్మాణానికి అవసరమైన వసతులు సమకూర్చి అనుకున్న సమయానికి ఆలయాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఆగమశాస్త్రం ప్రకారం పండితులు, స్వామీజీల సూచనల మేరకే ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. చిలకలూరిపేట నుంచి పనివారిని రప్పించి పూర్తి రాతి కట్టడంగా ఆలయాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుతో కలిసి ఆలయ నమూనాలను మంత్రి విడుదల చేశారు. దేవాలయాల పరిరక్షణే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపడుతున్నారని విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణలో భాగంగా 65 శాతం ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయిందని తెలిపారు. చంద్రబాబు 40 గుడులు కూల్చితే వాటి అభివృద్ధికి వైఎస్ జగన్ శంకుస్థాపనలు చేశారని పేర్కొన్నారు. చదవండి: ఏపీని తాకిన రుతుపవనాలు -
సిట్ దర్యాప్తు సాగుతోందిగా.. సీబీఐ ఎందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దేవాలయాలపై దాడులకు సంబంధించి సిట్ దర్యాప్తు సాగుతున్నందున ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు అవసరంలేదని హైకోర్టు పేర్కొంది. ఈ దాడులపై సీబీఐ లేదా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లి గ్రామానికి చెందిన లెక్చరర్ కె.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్ను) పరిష్కరించింది. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దేవాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ను) ఏర్పాటు చేశామన్న ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సిట్ దర్యాప్తును కొనసాగనిద్దామని తెలిపింది. సిట్ దర్యాప్తు ముగియకముందే సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం అపరిపక్వమే అవుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుత దశలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, ఈ దశలో న్యాయస్థాన జోక్యం కూడా అవసరం లేదని తేల్చిచెప్పింది. ఒకవేళ సిట్.. దేవాలయాలపై దాడులకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో విఫలమైతే అప్పుడు కోర్టుకు రావచ్చని పిటిషనర్కు మౌఖికంగా తెలిపింది. ఈ దాడుల కేసు దర్యాప్తును సిట్ ఓ తార్కిక ముగింపునకు తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేస్తూ పిల్ను పరిష్కరించింది. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది పీఎస్పీ సురేశ్కుమార్ వాదనలు వినిపిస్తూ ఆలయాలపై తరచు దాడులు జరుగుతున్నాయని, విగ్రహాల ధ్వంసం జరుగుతోందని చెప్పారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం తగులబెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో దేవతామూర్తి విగ్రహం నుంచి తలను వేరుచేశారని, దీనిపై ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిందని చెప్పారు. రథం దగ్ధం కన్నా రామతీర్థం ఘటన తీవ్రమైనదని, అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఆలయాలపై దాడులను తీవ్రంగా పరిగణిస్తోందని, అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పిల్ను పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
రామతీర్థానికి కోదండరాముడు
నెల్లిమర్ల రూరల్: విజయనగరం జిల్లా రామతీర్థానికి తిరుమలలో రూపుదిద్దుకున్న కోదండరాముని విగ్రహాలు శనివారం చేరుకున్నాయి. రామతీర్థంపై ఉన్న కోదండ రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. టీటీడీకి చెందిన ఎస్వీ శిల్ప కళాశాలలో స్వామివారి విగ్రహాలను తయారు చేశారు. దేవదాయ ఆర్జేసీ భ్రమరాంబతో పాటు మరికొందరు అధికారులు శుక్రవారం తిరుపతి వెళ్లి ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో సీతారామలక్ష్మణస్వామి విగ్రహాలను శనివారం రామతీర్థానికి తీసుకువచ్చారు. అర్చకులు విగ్రహాలు తీసుకువచ్చిన వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి స్వామివారి విగ్రహాలను రామతీర్థంలో తిరు వీథి గావించి ఆలయం వద్దకు తీసుకువచ్చారు. విగ్రహాలకు అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం పక్కనే ఉన్న ప్రత్యేక గదిలో భద్రపరిచారు. ఆర్జేసీ భ్రమరాంబ మాట్లాడుతూ..ఈ నెల 28న శాస్త్రోక్తంగా బాలాలయంలో విగ్రహాలను ప్రతిష్టిస్తామని తెలిపారు. నీలాచలంపై కోదండ రామాలయం అభివృద్ధి పనులు పూర్తయ్యాక అక్కడ విగ్రహాలను పునః ప్రతిష్టింపజేస్తామన్నారు. అప్పటివరకు బాలాలయంలోనే స్వామివారికి నిత్యపూజలు కొనసాగుతాయని చెప్పారు. -
రామతీర్థంలో కొలువుకు సీతారాములు సిద్ధం
తిరుపతి ఎడ్యుకేషన్: ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను తయారు చేయాలని విజయనగరం జిల్లా దేవదాయ శాఖ అధికారులు టీటీడీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తిరుపతిలోని టీటీడీ శిలా శిల్ప ఉత్పత్తి కేంద్రంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని విగ్రహాలను శిల్పులు తయారు చేశారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు విగ్రహాలను పీఠంతో కలిపి వేర్వేరుగా కృష్ణశిల రాతితో వీటిని మలిచారు. శుక్రవారం ఈ విగ్రహాలను విజయనగరం జిల్లా దేవదాయ శాఖ అధికారులకు అప్పగించనున్నారు. శిల్పారామం అభివృద్ధికి రూ. 9.50 కోట్లు సాక్షి, అమరావతి: పులివెందులలో ఉన్న శిల్పారామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు గురువారం రూ.9.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 11 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన శిల్పారామం పార్కు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధితో పనులతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించేందుకుగాను నిధులు విడుదల చేసింది. -
రామతీర్థం విగ్రహాలకు తుది మెరుగులు
తిరుపతి ఎడ్యుకేషన్: విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఇటీవల దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ధ్వంసమైన శ్రీరాముని విగ్రహం స్థానంలో నూతనంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని ప్రతిమలను ప్రతిష్టించేందుకు ఆ జిల్లా దేవదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విగ్రహాల తయారీకి ఈ నెల 8న టీటీడీ ఉన్నతాధికారులను దేవదాయ శాఖ అధికారులు సంప్రదించారు. అలిపిరిలోని టీటీడీ శిలా శిల్ప ఉత్పత్తి కేంద్రంలో ఏఈ మహేందర్రెడ్డి పర్యవేక్షణలో స్థపతి మునిశంకర్, మార్కింగ్ స్థపతి మారుతీరావు నేతృత్వంలో శిల్పులు రమేష్, నాగరాజు, సుబ్రమణ్యం ఆచారీ విగ్రహాల తయారీ పనిలో నిమగ్నమయ్యారు. మూలవిరాట్ తయారీకి కంచి నుంచి కృష్ణశిల(బ్లాక్ గ్రానైట్)ను తెప్పించారు. పీఠంతో కలిపి శ్రీరాముని విగ్రహం 3.6 అడుగులు, సీతా, లక్ష్మణుల విగ్రహాలు పీఠంతో కలిపి 3 అడుగులతో మలుస్తున్నారు. గురువారం సాయంత్రానికి ఈ విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకోనున్నాయి. -
కొండ దిగిన కోదండరాముడు
ఒక వైపు వేదపండితుల మంత్రోచ్ఛారణలు... మరోవైపు ప్రాయశ్చిత్త హోమాలు... ఇంకోవైపు పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ సీతా, లక్ష్మణ, ఆంజనేయుని సమేతంగా శ్రీ కోదండరాముడు నీలాచలం నుంచి దిగాడు. ఆగమ పండితులు సంప్రదాయబద్ధంగా హోమాలు జరిపించగా... ఆలయంలోని విగ్రహాలను తొలగించారు. వాటిని దిగువనున్న శ్రీరామస్వామి వారి ప్రధాన ఆలయంలోకి తరలించారు. సాక్షి, విజయనగరం : నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని నీలాచలంపైనున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గల సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో శ్రీరాముడి విగ్రహాన్ని గతనెల 28 వ తేదీ అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలి యని దుండగులు ధ్వంసం చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై సిట్ దర్యాప్తు జరుగుతోంది. అయితే ఆ విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలను పునఃప్రతిష్టించాలని ప్రభుత్వం సంకల్పించింది. దానిలో భాగంగా ప్రస్తుతం ఉన్న విగ్రహాలను తొలగించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఆలయంలోని మండపంలో ఉదయం 7 నుంచి 10గంటల వరకు ఆగమ పండితులు శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం నుంచి విచ్చేసిన ఆగమ పండితులు వంశీకృష్ణ, ఫణిరామ్, రామతీర్థం అర్చకులు కిరణ్కుమార్, పవన్ హోమాలు జరిపించారు. అనంతరం గోమాత తోకకు తాడును కట్టి ఆ తాడు సాయంతో విగ్రహాలను వాటి స్థానాల్లోంచి కదిలించారు. ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలతో పాటు పురాతన లక్ష్మణుడి విగ్రహాన్ని కూడా పక్కకు జరిపారు. అధికారుల పర్యవేక్షణలో తరలింపు శాస్త్ర ప్రకారం కదిలించిన విగ్రహాలను పోలీసులు, సీఐడీ అధికారుల పర్యవేక్షణలో కొండ దిగువనున్న ప్రధాన ఆలయంలోకి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కలి్పండంతో పాటు అత్యంత గోప్యత పాటించారు. ఇతరులెవరినీ పరిసరాల దరిదాపులకు కూడా రానివ్వలేదు. విగ్రహాలకు ఎలాంటి అపవిత్రత అంటకుండా జాగ్రత్త పడ్డారు. దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఈఓ రంగారావు చెప్పారు. ఇదిలా ఉండగా శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో పునఃప్రతిష్టించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో నూతన విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీ నాటికి విగ్రహాల తయారీ ప్రక్రియ పూర్తవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రామతీర్ధం చేరుకున్న తరువాత ఆ విగ్రహాలను ప్రధాన ఆలయంలోని బాలాలయంలో పునఃప్రతిష్టించేందుకు ఆలయ అ«ధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయ ఆధునికీకరణకు సన్నాహాలు కొండపై ఉన్న పురాతన ఆలయాన్ని ఆధునికీకరించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆలయ పునఃనిర్మాణానికి, అభివృద్ధికి రూ.3కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించడంతో జిల్లాలోని శ్రీరాముడి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో పూర్తి రాతికట్టడాలతో పూర్తయ్యే ఆలయ పునరి్నర్మాణంలో భాగంగా, మెట్ల మార్గాన్ని సరిచేయడంతో పాటు కొత్త మెట్లు నిర్మిస్తారు. దేవాలయ పరిసరాలు మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. శాశ్వత నీటి వసతి, కోనేటిని శుభ్రపరచి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు, ప్రాకార నిర్మాణం, హోమశాల, నివేదన శాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు జరగనున్నాయి. -
రేపటి నుంచి విగ్రహాల పునఃప్రతిష్ట సన్నాహక పనులు
సాక్షి, అమరావతి: రామతీర్థం శ్రీరామస్వామి వారి ఆలయంలో విగ్రహాల పునః ప్రతిష్ట సన్నాహక కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విగ్రహ పునఃప్రతిష్టతో పాటే ఆగమ పండితుల సలహాలతో పురాతన ఆలయాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పునః ప్రతిష్టకు ముందు చేపట్టాల్సిన పనులు ప్రారంభించేందుకు దేవదాయ శాఖ అధికారులు సోమవారం ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించనున్నారు. హోమం అనంతరం సంప్రదాయ బద్ధంగా ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బాలాలయంలో ఉంచుతారు. ఆలయంలోని గర్భాలయం పాతకాలపు కట్టడం అయినా ఇప్పటికీ పటిష్టంగా ఉండడంతో గర్భాలయ గోడలను అలానే ఉంచుతూ.. లోపలి భాగాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. గర్భాలయం ముందు భాగాన ఉన్న మండపం, భక్తులు ప్రదక్షిణ చేసే ప్రాకారం వంటి వాటిని కూడా పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలని నిర్ణయించింది. కొండపై ఉన్న ఆలయం వద్ద ఏ పనులు చేపట్టాలన్నా తగిన స్థాయిలో నీటిని అందుబాటులో ఉంచేందుకు యుద్ధప్రాతిపదికన కొండపై నీటి ట్యాంకును కూడా దేవదాయ శాఖ ఏర్పాటు చేయనుంది. కొండపై ఆలయం వద్దకు భక్తులు సులభంగా వచ్చి వెళ్లేందుకు వీలుగా మెట్ల మార్గాన్ని కూడా విస్తరిస్తారు. కొండపై ఆలయాన్ని ఆనుకుని ఉన్న కోనేరును కూడా ఆధునికీకరిస్తారు. ఇదిలా ఉండగా, రామతీర్థం ఆలయంలో పునః ప్రతిష్టించేందుకు శ్రీరాముడి మూలవిరాట్ విగ్రహంతో పాటు సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలను టీటీడీ శిల్పులు ఈ నెల 23 నాటికి సిద్ధం చేస్తారు. ఆయా కార్యక్రమాల పర్యవేక్షణకు దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంబను ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆలయ ఆధునికీకరణపై రేపు మంత్రి సమీక్ష శ్రీరామస్వామి గర్భాలయాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలని ఒకరిద్దరు స్వామీజీలు దేవదాయ శాఖకు సూచన చేసినట్టు తెలిసింది. ఆ సూచనలను ఇతర ఆగమ పండితుల దృష్టికి తీసుకెళ్లే విషయమై దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సోమవారం శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. -
ఈ కులమతాల ముద్రలెందుకు?
నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలం రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఆయన దాదాపు 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రతి పక్ష నేతగా పనిచేశారు. ఇంతటి అనుభవ మున్న వ్యక్తి.. ఏపీలో ప్రస్తుతం సీఐడీ అధిపతిగా ఉన్నవారు ఒక మతానికి చెందిన వ్యక్తి కాబట్టి రామతీర్థం విగ్రహ విధ్వంసం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారని అన్నట్లు 6 జనవరి 2021న మీడియాలో చూశాను. అలాగే హిందువులపై దాడి జరిగితే ఖబడ్దార్ అని కూడా చంద్ర బాబు అన్నారని వార్తలొచ్చాయి. ఆయన అలా అనే బదులు ఏ మతం వారూ మరో మతంవారిపై, వారి మందిరాలపై దాడి చేసినా అది మంచిదికాదు అని చెప్పి ఉండాల్సింది. ఎవరు ఎవ రిపై దాడి చేసినా సహించం అనాల్సింది. అధికారులకు కులాన్ని, మతాన్ని అంటగడితే ఏ అధికారి కూడా చట్టప్రకారం పని చేయలేడు. ఏ అధికారి అయినా విధి నిర్వహణలో అవినీతి, అలక్ష్యానికి పాల్పడినా, లేదా పక్షపాతం చూపినా ఆ అధికారిమీద తప్పకుండా చర్య తీసుకోవాలి. మన సమాజంలో అత్యంత నిజాయితీ పరులు, అత్యంత అవినీతిపరులు అన్ని కులాల్లో, మతాల్లో ఉన్నారు. ఈ రోజు ఒక కులానికి, మతానికి చెందిన వ్యక్తి అధికారంలో ఉండ వచ్చు. రేపు మరో కులానికి, మతా నికి చెందిన వ్యక్తి అధికారంలోకి రావచ్చు. అతడు ఏం చేస్తున్నాడు, పేద ప్రజలకు లాభం చేస్తున్నాడా లేదా? రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతున్నదా లేదా అతడేమైనా అవినీతికి పాల్పడుతున్నాడా? ఎక్కడైనా పక్షపాతం చూపుతు న్నాడా– వాటిని గమనించాలి. పొరపాటు ఉంటే ఖండించాలి. అంతే కానీ, అతని కులాన్ని బట్టి, మతవిశ్వాసాలను బట్టి ఆ వ్యక్తిని అంచనావేయడం చాలా తప్పు. చంద్రబాబు నాయుడి వంటి పరిపాలనా అనుభవం కలిగిన నాయకులు కులభేదాలను ప్రస్తావిస్తూ ఈ విధంగా మాట్లాడితే సమాజం విచ్ఛిన్న మౌతుంది. ప్రజలు అధికారుల పట్ల, న్యాయమూర్తుల పట్ల విశ్వాసం కోల్పోతారు. రాజ్యాంగ వ్యవస్థ మనుగడ పెను ప్రమా దంలో పడుతుంది. కులమత భేదాలు, ఘర్షణలు ఎక్కువై పోతాయి. ఒక చిన్న ఉదాహరణ. మా నాన్నగారు గొప్ప రామభక్తులు. నిరంతరం రామనామం ఆయన పెదాలపై ఉండేది. అమ్మ నిరంతరం పూజలు పునస్కారాలు చేసేది, కానీ ఎంతోమంది ఇతర మతస్తులకు, ఇతర కులాలవారికి మా ఇంట్లో మాతోపాటు భోజనం పెట్టేవారు. ఎంతోమంది పేద విద్యార్థులకు వారు తోడ్పడ్డారు. ఏ రోజూ కుల, మత భేదాలు పాటించలేదు. కాబట్టి నేను అందరిని కోరుతున్నది ఏమిటంటే అధి కారంలో ఉన్నవారికి కులాలకు, మతాలను ఏ పరిస్థితుల్లోనూ ఆపాదించవద్దు. శంకరన్ లాంటి ఐఏఎస్ అధికారి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో శ్రమించారు. ఆదివాసీల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు.అధికారుల్లో, న్యాయమూర్తుల్లో ఏ కులం వారైనా ఉండ వచ్చు. ఒక అధికారి, న్యాయమూర్తి ఫలానా కులం వ్యక్తి కాబట్టి ఒక కేసులో వాది, ప్రతివాది లేదా ముద్దాయి అతని కులంవాడు కాబట్టి ఆ అధికారి లేదా న్యాయమూర్తి న్యాయం చేయడేమో అని అనుమానిస్తే ఇక ఎవరూ దర్యాప్తు చేయలేదు. ఏ కేసును విచా రించలేదు. ఇలా ఐతే ఈ రాజ్యాంగ వ్యవస్థ కూలిపోతుంది. రేపటి రోజు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురుకావచ్చు. చంద్రబాబు ప్రకటన ఆధారంగా ఒక నేరంలో క్రైస్తవులు గానీ ముస్లింలు గానీ ముద్దాయిలుగా ఉంటే ఏ హిందూ అధికారీ వారిని విచారించగూడదని క్రైస్తవులు లేదా ముస్లింలు డిమాండ్ చేయవచ్చు. అలాగే దళితులు ముద్దాయిలుగా ఉంటే వేరే కులం వారు తమను విచారణ చేయకూడదని డిమాండ్ చేయవచ్చు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక దేవాలయంలోని పూజారి ఒక స్త్రీని ఇతరులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడనే వార్త చూశాము. ఇక నేరం చేసిన వ్యక్తి పూజారి (బ్రాహ్మణుడు) కాబట్టి బ్రాహ్మణ కులానికి చెందిన ఏ అధికారి కూడా ఆ పూజారిని విచారించవద్దంటే ఎలా వీలవుతుంది? ఇలా ప్రతీ కేసులో, ప్రతీ విచారణలో విచారణ చేస్తున్న వారిది ఏ మతం, ఏ కులం, ఆ కేసులోని వ్యక్తులది ఏ కులం అని చూడడం మొదలు పెడితే మన సమాజం విచ్ఛిన్నమౌతుంది. కుల, మత ద్వేషాలు పెరుగు తాయి. జస్టిస్ ఒ. చిన్నపరెడ్డి, జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ రంగ నాథ్ మిశ్రా, జస్టిస్ రామస్వామి, జస్టిస్ పి. వెంకటరామిరెడ్డి లాంటి విశిష్ట న్యాయమూర్తులు ఏ రోజైనా కుల మతాల గురించి ఆలోచించారా– ఏనాడైనా వారు విచారణ క్రమంలో పక్షపాతం చూపారా; అన్ని కులాల నుంచి వచ్చిన వారిలో ఎంతో నిజాయితీ, నిబద్ధత కల్గిన అధికారులు, న్యాయమూర్తులు ఉంటారు. బ్రాహ్మణకులంలో పుట్టిన గురజాడ అప్పారావు భర్తలు చనిపోయిన స్త్రీలకు మరో వివాహం చేసుకొనే హక్కు ఉండాలని స్త్రీలకు విద్య కావాలని పోరాడలేదా? అంబేడ్కర్ స్త్రీలకు సమాన ఆస్తిహక్కు ఉండాలని వాదించలేదా?అలాగే బ్రాహ్మణుడైన రామకృష్ణ పరమహంస, కాయస్త కులానికి చెందిన వివేకానందుడిని ప్రథమ శిష్యునిగా చేర్చు కోలేదా? పోతులూరి వీరబ్రహ్మం.. దూదేకుల సిద్ధయ్యను తన ప్రథమ శిష్యుడిగా తీర్చిదిద్దలేదా? షిరిడీసాయి అన్ని కులాల వారిని, మతాలవారిని సమానంగా చూడలేదా? మహాత్ములు ఎవ్వరూ ఏ మతం వారైనా ఏ కులం వారైనా కులమత భేదాలను పాటించలేదు. ఒకవైపు ఎందరో కులాంతర వివాహాలు చేసుకుంటున్న ఈ రోజుల్లో వ్యక్తులందరికీ.. ముఖ్యంగా అధికారులకు కులం అంట గట్టడం విద్వేషాలను పెంచే యత్నంగా భావించాల్సి వస్తుంది. ఇక ముందైనా మన రాజకీయ నాయకులు కాస్త విజ్ఞతతో, ఇంగితజ్ఞానంతో మాట్లాడతారని ఆశిద్దాం. -జస్టిస్ చంద్రకుమార్ వ్యాసకర్త విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 79974 8486 -
ఏ మతం హింసను ప్రేరేపించదు: మత పెద్దలు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చూసి ఓర్వ లేక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన శుక్రవారం విజయవాడలో జరిగిన సర్వమత పెద్దల సమావేశంలో మాట్లాడారు. అధికారం వచ్చిననాటి నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజారంజక పాలనను అడ్డుకోవాలని దుష్టశక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.(చదవండి: 'బీజేపీ జై శ్రీరాం కాకుండా చేసిన అభివృద్ధి చెప్పాలి') ‘‘రాష్ట్రంలో 30 లక్షలమందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.దుర్మార్గపు ఆలోచనలతోనే ఆలయాలపై దాడులు చేస్తున్నారు.సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. జీవో తెచ్చి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసిందని’’ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.(చదవండి: ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ) సర్వమానవ సౌభ్రాతృత్వం మన సందేశం.. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ, ఏ మతం కూడా హింసను ప్రేరేపించదన్నారు. సర్వమానవ సౌభ్రాతృత్వం మన సందేశమని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని.. దేవుని దృష్టిలో అందరూ సమానులేనన్నారు. మానవ శాంతి కోసమే మతం అని మత పెద్దలు పేర్కొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్లో మంచి వాతావరణం నెలకొంది. ఎక్కడా మతపరమైన విద్వేషాలు, మత కల్లోలాలు లేని ఏకైక రాష్ట్రం మనది. అన్ని మతాల వారు కలిసిమెలసి జీవిస్తున్నారు. ఎక్కడా మతపరమైన మెజార్టీ, మైనారిటీ అన్న భావన ప్రజల్లో లేదు. మారుమూల ప్రాంతాల్లోని ఆలయాల్లో ఇటీవల ఆందోళన కలిగిస్తున్న ఘటనలు, విష పూరిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని’’ మత పెద్దలు తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు , విమర్శలు చేయడం తగదన్నారు. -
‘బాబు మత రాజకీయాలు.. పతనం తప్పదు..’
సాక్షి, విజయవాడ: దేవుడితో రాజకీయం చేస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి మరింత పతనం తప్పదని ఏఐసీసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా హెచ్చరించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చారని, అలిపిరిలో దేవుడు ఎలా బుద్ధి చెప్పాడో తెలుసు. ఆయన పాలనలో విజయవాడలో గుళ్లను కూలగొట్టారు. అందుకే ఈ రోజు ఇంత పతనమయ్యారు. అయినా చంద్రబాబుకి బుద్ధి లేకుండా ఇప్పుడు మత రాజకీయాలు మొదలుపెట్టారు. సీఎం జగన్.. దేవాలయాల్లో భద్రత కోసం 20 వేల సీసీ కెమెరాలు పెట్టారు. చంద్రబాబు తన పాలనలో ఇలా ఎందుకు చెయ్యలేదు. అయ్యప్ప మాల వేస్తే మద్యం ఆదాయం తగ్గిపోతుందన్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. (చదవండి: సీఎం జగన్ కీలక నిర్ణయాలు..) ‘‘చంద్రబాబు హయాంలో ఆలయాలను కూల్చి టాయిలెట్లు కట్టారు. డీజీపీ మతం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు.. గతంలో సీపీగా పెట్టలేదా?.ఇప్పడు పనిచేస్తున్న అధికారులంతా చంద్రబాబు హయాంలో ఉన్నవారే కదా?. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను కొత్తగా తెచ్చారా?. చంద్రబాబు చేయని ఆలయాల అభివృద్ధి, నిర్మాణాలను సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారని రోజా అన్నారు.(చదవండి: రహదారుల అభివృద్ధికి 6400 కోట్లు) -
మతాలతో ఆటలా..: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘‘ఎవరూ లేని ప్రదేశాల్లో అర్ధరాత్రి విధ్వంసాలకు పాల్పడుతున్నారు.. సున్నితమైన అంశాలపై మేం ఎప్పుడూ ఆందోళన చేయలేదు.రామతీర్థం ఘటన పథకం ప్రకారమే చేయించారు. ఉన్మాద స్థాయిలో ఉన్నవారే విధ్వంసానికి పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో విజయవాడలో ఆలయాలను కూల్చేశారు. పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్తో 29 మంది చనిపోయారు. సదావర్తి భూముల సంఘటన మర్చిపోయారా?. దేవుడి విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం?’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. (చదవండి: ‘లోకేష్కు ఆ రెండింటికి తేడా తెలియదు’) మతపరమైన అజెండా ఉన్న బీజేపీ కూడా చంద్రబాబులా స్పందించడం లేదు. బీజేపీకి దగ్గరయ్యేందుకే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మతం ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి నీచ రాజకీయాలను సీఎం జగన్ సహించరని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా పనిచేస్తున్నామని, సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. (చదవండి: లోకేష్ మాటలకు బాడీ లాంగ్వేజ్కి సంబంధముందా..?) -
‘లోకేష్కు ఆ రెండింటికి తేడా తెలియదు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరి మడికి, చేపల చెరువుకు తేడా తెలియని వ్యక్తి లోకేష్ అని ఎద్దేవా చేశారు. ‘‘మహానేత వైఎస్సార్, ఆయన తనయుడు సీఎం జగన్ ప్రజలకు శాశ్వతంగా అందించే పథకాలెన్నో తెచ్చారు. పదిహేనేళ్లు పరిపాలించిన చంద్రబాబు.. ప్రజలకు గుర్తుండిపోయే ఒక్క పథకం కూడా తీసుకురాలేదని’’ దుయ్యబట్టారు.(చదవండి: త్వరలోనే అసలు రంగు బయటపడుతుంది’) కుల మతాల మధ్య చిచు పెట్టే ధోరణి నుంచి చంద్రబాబు బయటకురావాలని శ్రీకాంత్రెడ్డి హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీ ద్వారానే అలయాలపై దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. పూజ సమయంలో కూడా చంద్రబాబు చెప్పులు వదిలిపెట్టలేదని ఆయన నిప్పులు చెరిగారు. (చదవండి: పేదవాళ్ల ఉసురు తగులుతుంది: సీఎం జగన్) -
త్వరలోనే అసలు రంగు బయటపడుతుంది’
సాక్షి, అమరావతి: రామతీర్థం ఘటనపై విచారణలో అసలు రంగు బయటపడుతుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రామతీర్థం ఘటన జరిగిన వెంటనే మేం స్పందించామని, ఆలయ ఛైర్మన్ అశోక్గజపతిరాజు ఎందుకు వెళ్లలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. ‘‘వాటికన్ సిటీకి, అమరావతికి సంబంధం ఏంటి?. చంద్రబాబు అమరేశ్వరుని భూములు కూడా దోచుకున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పవిత్రమైన హిందువైతే విజయవాడలో ఆలయాలను ఎందుకు కూల్చారు?. ఆలయాలను కూల్చినప్పుడు చంద్రబాబుకు హిందువులు గుర్తురాలేదా? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. (చదవండి: పేదవాళ్ల ఉసురు తగులుతుంది: సీఎం జగన్) -
రామతీర్థంలో సెక్షన్ 30 అమలు
సాక్షి, విజయనగరం : రామతీర్థం ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆలయ సమీపంలో సభలు, సమావేశాలకు అనుమతిలేదని డీఎస్పీ సునీల్ తెలిపారు. రామతీర్థంలో సెక్షన్ 30 అమలుచేస్తున్నామని, ఎవరూ చట్టాలను అతిక్రమించవద్దని, చట్టాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విగ్రహం ధ్వంసం దర్యాప్తుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కోవిడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు. రామతీర్థం వైపు ఎవరూ వెళ్లకుండా రాజపులోవ జంక్షన్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మరోవైపు రామతీర్థంలో సీఐడీ విచారణ ప్రారంభమైంది. తొలుత సమాచారం వెలుగులోకి వచ్చిన విధానాన్ని సీఐడీ అధికారులు సేకరిస్తున్నారు. కాగా రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించిన విషయం తెలిసిందే. ఘటనలో కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారని, ఒకట్రెండు రోజుల్లో దోషులను పట్టుకునేలా విచారణ కొనసాగుతోందన్నారు. రామతీర్థం అంశం సున్నితంగా మారిన నేపథ్యంలో బీజేపీ, ఇతర పార్టీలు మంగళవారం తలపెట్టిన ర్యాలీని విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఘటనలపై ఎవరైనా అభిప్రాయం చెప్పవచ్చని, సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని, ఎలాంటి చర్యలకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. -
అన్నింటా విఫలమైన అశోక్ గజపతిరాజు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వేల కోట్లు దానం చేసిన రాజవంశంలో పుట్టినా... రామతీర్ధంలో రాముడి ఆలయానికి కనీసం కరెంటు ఇవ్వలేకపోయారు. తాత ముత్తాతల గొప్ప తనాలు చెప్పుకుంటూ... గుడిలో ఒక సీసీ కెమెరా పెట్టించలేకపోయారు. చరిత్రను దాచేసి నీతిమంతులమని చెప్పుకుంటూ... జనం చేత జేజేలు కొట్టించుకున్నారు. ఇప్పుడు వాస్తవాలు తెలుస్తున్నాయి. దర్పం, ఆర్భాటాలను చూసి మోసపోయిన నగరవాసులు వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. ఆ రాజరిక వారసత్వ రాజకీయానికి చరమగీతం పాడుతున్నారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడించి పరాజితునిగా కూర్చోబెట్టారు. ఇప్పుడు కనీసం తాను అనువంశిక ధర్మకర్తగా ఉన్న గుడిలో రాముడిని కూడా కాపాడుకోలేకపోయారు. ఇదీ టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్గజపతిరాజు పరిస్థితి. అలంకారానికే పదవులు... కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు 1978 నుంచి జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పదవులను అనుభవించారు. ఎన్టీ రామారావు నుంచి, చంద్రబాబు నాయుడు వరకూ టీడీపీలో ప్రతి ఒక్కరూ అశోక్కు పెద్దమనిషి హోదా ఇచ్చి గౌరవించినా... తన పదవీ కాలంలో ప్రజ లకుగానీ, తాను నివశిస్తున్న విజయనగరానికి గానీ ఏమీ చేయలేకపోయారన్న అపప్రథ మూటగట్టుకున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పించే రెండు ప్రధాన జూట్మిల్లులు మూతపడినా పట్టించుకోలేదు. 12వేల కార్మి క కుంటుంబాలు రోడ్డున పడ్డా వదిలేశారు. రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలున్నా ఇక్కడ ఏర్పాటుకు కృషి చేయలేదు. జిల్లాకు కేటాయిస్తామన్న మెడికల్ కళాశాల కోసం స్థలం ఇస్తామని చెప్పి ఆ తర్వాత అదే స్థలాన్ని తమ పార్టీకే చెందిన వ్యక్తికి ధారాదత్తం చేశారు. విజయనగర వాసుల తాగు నీటి సమస్య పరిష్కరించడంలో విఫలమయ్యారు. అభివృద్ధికి అడ్డంపడుతున్నా మౌనమే... 2015 జూలై నెలలో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరం మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా, స్థానిక టీడీపీ పాలకులు తమ పదవులు కాపాడుకునేందుకు ఆ ఉత్తర్వులను అమల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. వారి పదవీకాలం పూర్తయ్యేంత వరకు ఉత్తర్వులను అబియన్స్లో ఉంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పట్టణాభివృద్ధిని అడ్డుకున్నారు. దానిపైనా అశోక్ స్పందించలేదు. పట్టణాభివృద్ధి గురించి ఆలోచించలేదు. (చదవండి: అయ్యో... రామ‘చంద్ర’!) 426 కిలోమీటర్ల చిన్నా, పెద్ద కాలువలున్న నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయలేకపోవడంతో చిన్నపాటి వ ర్షం కురిసినా ప్రధాన జంక్షన్లన్నీ ముంపుబారిన పడు తున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని పూర్తి చేయలేకపోయారు. పైగా తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంస్థ టెండర్ వేస్తే దానిని తన విచక్షణాధికారంతో క్యాన్సిల్ చేయించారు. చివరికి ఎన్నికల ముందు హడావుడిగా విమానాశ్ర యం నిర్మించేస్తున్నామంటూ బిల్డప్పులిచ్చి శంకు స్థాపన చేస్తున్నా దానిని ఆపలేదు. ధర్మకర్తగా విఫలమై... అశోక్ చైర్మన్గా ఉన్న రామతీర్థంలో కోదండ రామస్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనకు ఆయన చేసిన తప్పిదాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. బోడికొండపై ఉన్న ఆలయాన్ని ఇన్నాళ్లూ ఆయన పట్టించుకోలేదు. హుద్హుద్ తుఫాన్కు కూలిన రాతిగోడను కూడా పునరుద్ధరించలేకపోయారు. కనీసం విద్యుత్ సౌకర్యాన్నయినా కల్పించలేదు. సీసీ కెమెరాలు పెట్టించలేదు. అవే ఉంటే రాముడి విగ్రహం శిరస్సు ఖండించిన దోషులు ఈపాటికే సులభంగా దొరికేసేవారు. ఆ అవకాశం లేకుండా చేసినందునే చైర్మన్ పదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను తొలగించింది. ఈ వైఫల్యాలన్నింటినీ తొక్కిపెట్టి, కేవలం రాష్ట్రమంత్రి మాట్లాడిన ఒక పదాన్ని తప్పుబట్టి అనవసర రాద్ధాంతం చేయిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాల వల్ల పోయిన గౌరవం నిలబెట్టుకునేందుకు పార్టీ లోనూ, ప్రజల్లోనూ తన ఉనికి చాటుకునేందుకు కులం కార్డును ఆశ్రయించకతప్పలేదు. పార్టీలోనూ చిన్నచూపే... దశాబ్దాలుగా రాజకీయ ఆశ్రయమిచ్చిన తెలుగుదేశం పార్టీని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదనేది ఇటీవల జరిగిన సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వేరుకుంపట్లు పెట్టుకోవడం ఓ ఉదాహరణ. కేవలం తానూ, తన కుమార్తె, కొందరు అనుచరులే అని గిరిగీసుకున్న ఆయనకు వ్యతిరేకంగా విజయనగరంలో టీడీపీకి రెండో కార్యాలయం ఏర్పాటయ్యింది. దానిని అధిష్టానం దృష్టికి అనుచరుల ద్వారా తీసుకెళ్లినా ఏమీ ఒరగలేదు. సరికదా బోర్డు తీసేసినట్టే తీసి మరలా పెట్టడం కొసమెరుపు. రెండు రోజుల క్రితం చంద్రబాబు జిల్లాకు వచ్చినపుడు తన బంగ్లాకు తీసుకువెళ్లాలని ప్రయత్నించి, అక్కడా విఫలమయ్యారు. రాజకీయ వారసురాలిగా కుమార్తెను ఎమ్మెల్యేగా బరిలోకి దింపి గెలిపించుకోలేక తండ్రిగానూ ఓడిపోయారు. -
రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ
సాక్షి, అమరావతి: రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఇటీవల ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనలపై పోలీస్, దేవదాయ శాఖల అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, ప్రత్యేక కమిషనర్ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో వెలంపల్లి మాట్లాడుతూ.. రామతీర్థం ఘటనలో కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారని, ఒకట్రెండు రోజుల్లో దోషులను పట్టుకునేలా విచారణ కొనసాగుతోందన్నారు. పూర్తి హంగులతో ఆలయం ఆధునికీకరణ ఎటువంటి వసతులు లేని రామతీర్థం ఆలయాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఆలయ డిజైన్లు ప్రాథమికంగా తయారు చేయించామన్నారు. ఒకట్రెండు రోజుల్లో విగ్రహ పునఃప్రతిష్ఠ తేదీలను ఖరారు చేస్తామన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో కూల్చివేసిన ఆలయాలను సైతం తిరిగి నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. ర్యాలీ విరమించుకోవాలని విజ్ఞప్తి రామతీర్థం అంశం సున్నితంగా మారిన నేపథ్యంలో బీజేపీ, ఇతర పార్టీలు మంగళవారం తలపెట్టిన ర్యాలీని విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఘటనలపై ఎవరైనా అభిప్రాయం చెప్పవచ్చని, సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని, ఎలాంటి చర్యలకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అది టీడీపీ కార్మిక సంఘం కట్టుకున్న గుడి విజయవాడ బస్టాండ్లో ఘటన జరిగిన ఆలయం టీడీపీ అనుబంధ కార్మిక సంఘం సభ్యులు కట్టుకున్నదని.. అందులో మట్టి విగ్రహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారని మంత్రి వివరించారు. ఆ ఆలయానికి, దేవదాయ శాఖకు, ప్రభుత్వానికి సంబంధం లేదని.. గుడి భద్రతను పట్టించుకోవాల్సిన టీడీపీ దానిని ఎందుకు పట్టించుకోలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ధ్వంసంపైనా సీఐడీ విచారణకు ఆదేశించామని.. ఆ ఆలయం కూడా టీడీపీ నేత గన్ని కృష్ణ నిర్వహణలో ఉందని అన్నారు. నిందితులకు శిక్షలు పడ్డాయ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేవదాయ శాఖకు సంబంధించి 8 ఆలయాల్లో దుశ్చర్యలు చోటు చేసుకున్నాయని.. వాటిలో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తుల ఆదీనంలో ఉండే వాటితో కలిపి మొత్తం 31 ఆలయాలపై దాడులు జరిగాయని, గుప్త నిధుల కోసం తవ్వకాలు, హుండీ చోరీలు వంటి వాటితో కలిపి పోలీసులు 88 కేసులు నమోదు చేశారని వివరించారు. ఆ కేసుల్లో 159 మందిని అరెస్ట్ చేశారని, వారిలో కొందరికి రెండేళ్ల శిక్ష పడిందని, మరికొందరు రిమాండ్లో ఉన్నారని వివరించారు. ప్రైవేట్ ఆలయాల్లో భద్రతపైనా దృష్టి గడచిన రెండేళ్లలో రాష్ట్రంలోని 31 ఆలయాల్లో వివిధ ఘటనలు చోటు చేసుకున్నట్టు దేవదాయ శాఖ గుర్తించింది. వీటిలో 23 ఆలయాలు ప్రైవేట్ వ్యక్తుల ఆదీనంలో ఉన్నట్టు తేల్చారు. దేవదాయ శాఖ పరిధిలోని 8 ఆలయాల్లో వివిధ ఘటనలు చోటు చేసుకున్నట్టు అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో మారుమూల ఉండే ప్రైవేట్ ఆలయాల భద్రతపై దేవదాయ శాఖ, పోలీసులు శాఖ దృష్టి పెట్టాయి. ప్రైవేట్ ఆలయాల భద్రత విషయంలో ఆలయ నిర్వహక కమిటీలు సమన్వయంతో వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. పోలీసు స్టేషన్ల వారీగా ప్రైవేట్ ఆలయాల నిర్వహకులను పిలిపించి మాట్లాడే ప్రక్రియను పోలీసులు మొదలు పెట్టారు. -
దేవుడు చేసిన మనుషుల్లారా మీపేరేమిటి?
అమరావతి వైపు ముఖం చెల్లక, విశాఖ కూడా వెళ్ళలేక సరాసరి ‘బోడికొండ’ ఆలయానికి తన దండును తరలించాడు చంద్రబాబు నాయుడు. నిరాదరణ పాలైన ఆలయంలో రామ విగ్రహాన్ని కచ్చితో ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆ అవసరం అధికార పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్కన్నా ప్రతిపక్షానికే ఎక్కువ. పేదల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు జరుపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా ‘మోకాళ్లు’ అడ్డుపెట్టజూస్తూ కుప్పగూలిన ‘తెలుగుదేశం’ పార్టీ నాయకుడు తన రాజకీయ పునరావాసం కోసం చేస్తున్న ‘యజ్ఞం’గా ఇది కనపడుతోంది. కానీ చంద్రబాబు ప్రయత్నం ‘దింపుడు కల్లం’ సామెతను గుర్తుతెస్తోంది. ‘వస్తువు ఒకచోట, అనుమానం వేరొక చోట’ అన్నది మన ప్రసిద్ధ సామెతల్లో ఒకటి. అందుకే ‘బోడితలకూ మోకాలికీ ముడి’ ఎలా కుదురుతుందంటారు. బోడికొండ (విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం)పైని కోదండ రామస్వామి దేవళానికీ, అదే ఊరిలోని రామతీర్థం ప్రసిద్ధ దేవాలయానికీ ముడిపెట్టడం ఒక్క రాజకీయులకే చెల్లుబాటైన విద్య. అసలు ఘటన జరిగింది ‘ఉత్తరాంధ్ర అయోధ్య’గా కొందరు పేరుపెట్టుకున్న రామతీర్థం ఆలయంలో కాదని విజ్ఞుల అభిప్రాయం. కొందరి మాన సిక తృప్తికోసం రామతీర్థం ఆలయానికి ‘ఉత్తరాంధ్ర అయోధ్య’ అని నామకరణం చేశారు. కాగా, నాలుగు రకాల పార్టీలు, నాలుగు నాల్క లతో అపారమైన ‘దైవభక్తి’తో ‘బోడికొండ’ గుడిని విస్మరించి, రామ తీర్థం ఆలయం వద్ద యుద్ధభేరీలు మోగించి తలపట్లు పట్టుకోవడం, పరస్పరం ఒక మేరకు గాయపడటం, దాన్నొక సినిమా సీరియల్గా మార్చడానికి ప్రయత్నించడం, కేసులు పెట్టుకోవడం దాకా లాగిం చేశారు. కాగా దీనంతటికీ వాస్తవంగా సంబంధం ఉన్న బోడికొండ పైని ఆలయం మాత్రం వెనక్కి జారుకుంది. సాయంసంధ్యలో ఏనాడూ ధూపదీప నైవేద్యాలు ఎరుగని ‘బోడికొండ’పైని ఆలయంలో రామ విగ్రహాన్ని కచ్చితో ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికి ఉండి ఉంటుందన్నది ఒక యక్షప్రశ్నగా మారింది. ప్రజా సమస్యలను పరిష్కరించకపోవడంలో, ముఖ్యంగా పేద, దళిత వర్గాల ప్రజలు దశాబ్దాల తరబడిగా కునారిల్లి పోవడానికి కారణమైన వర్ణ వ్యవస్థకు, వర్గ దోపిడీ వ్యవస్థకు నాయక స్థానంలో ఉన్న రాజకీయ పక్షాలు, రాజకీయులే కారణం. ఈ వర్ణ, వర్గ వ్యవస్థలో పోలీసులు కూడా ఒక భాగమైనందున ప్రజాబాహుళ్యానికి కలగ నున్న ఇబ్బందుల్ని జాతిపిత గాంధీజీ ఏనాడో దేశ స్వాతంత్య్రం ఆవిష్కరించబోతున్న ఘడియలకు ఐదురోజులు ముందుగానే ఒక హెచ్చరికగా ఇలా అన్నారు: ‘వర్గ, వర్ణవ్యవస్థలో పోలీసుల ప్రవర్తన కూడా కుల, మతాలకు ఆసరాగానే ఉంటుంది. ఈ దుర్మార్గపు పరి ణామం ముందు కూడా కొనసాగే పక్షంలో దేశ భవిష్యత్తు అంధకా రంగా ఉంటుంది. అందువల్ల కుల, మతాలకు అతీతంగా నిష్పాక్షి కంగా పోలీసులు ఆచరణలో వ్యవహరించగలరని ఆశిస్తున్నా. అంతే గాదు, తమ వృత్తిధర్మాన్ని పోలీసులు హుందాగా నిర్వహించి గౌరవ నీయులు కాగలిగి పాలనా యంత్రాంగాన్ని సమర్థవంతమైన శక్తిగా రూపొందించాలి.’ (10–08–1947) అంతేగాదు, కుల, మతాలకు అతీతంగా సకల మత సమ్మేళనంగా హిందువులు, ముస్లింలు తదితర వర్గీయులూ ఉండాలని గాంధీజీ కోరుకున్నారు. నౌఖాలీ (బెంగాల్) పర్యటన సందర్భంగానే గాక, ఆ తరువాత ఆఖరిశ్వాస వరకు హిందూ మతోన్మాది తుపాకీగుండుకు బలి అయ్యే క్షణం దాకా కూడా ఈ సామరస్యాన్ని ఆయన కోరుకున్నారని మరువరాదు. బహుళ జాతులతో, బహుభాషా మైనారిటీలతో, బహుళ మత విశ్వాసాలతో, విభిన్న తెగల సంస్కృతితో కూడుకున్న ఈ అఖండభారతం భవిష్యత్తు అందరూ స్నేహితులుగా, అన్నదమ్ములుగా కలసిమెలసి ఉండటం లోనే భద్రంగా ఉండగలదని ఆశించారు గాంధీజీ. నిజమైన మత విశ్వాసానికి ఓరిమి, సహిష్ణుత ఆభరణం, అలంకారమని; అలాంటి సర్వమత విశ్వాసాల భారతదేశాన్ని నిలువునా చీల్చి రెండు భాగా లుగా విడగొట్టే కంటే, ఆ విషాదకర సన్నివేశాన్ని కళ్లారా చూడకుండా తనను దూరం చేయండని గాంధీ ఘోషించాడు. అలాంటి పరిణామం ఇప్పుడు మరో రూపంలో జరుగుతోంది. అసంఖ్యాక పేద, దళిత వర్గాల ప్రజలు దగ్గర కాకుండా వారిని రకరకాల ప్రలోభాలతో విడగొట్టి తమ దోపిడీని శాశ్వతం చేసుకొనే ప్రయత్నంలో పలు సంపన్న వర్గాలు, పెట్టుబడి వర్గాలు వారికి నాయకత్వం వహిస్తున్న అవినీతిపరులైన రాజకీయపక్షాలు 74 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా చేయని ప్రయత్నం లేదు, అకృత్యమూ లేదు! అందుకే మతాన్ని కాదు, మీ గుండెల్ని ప్రేమాస్పద కేంద్రాలుగా మలచుకొనమన్నాడు మహాత్ముడు. సైలెంట్గా ఉన్న సమాజాల్ని వైలెంట్గా మలచడమే అన్ని మతాలలోని విద్వేషకుల లక్ష్యం. ప్రేమ వివాహాలకు, మతాంతర వివాహ సంబంధాలకు కూడా మతంరంగు పూయడం 2014 తర్వాతనే పాలకుల విధానాలకు పుట్టిన ‘పుండు’! హిందూ ధర్మసూత్రాల ప్రకారం ‘కాషాయం’ పవిత్రమైన రంగు అయినపుడు ఆ ముసుగులో జరిగే దాడులూ, హింసాకాండను ప్రజలు ఎలా సహిస్తారు? ఇలాంటి తంతే పాకిస్తాన్లోని మత దురహంకార ముస్లిం పెద్దలూ నిర్వహించి అశాంతికి కారకులవుతున్నారు. ఈ ప్రజా వ్యతిరేక సమాజ వ్యతిరేక చర్యలన్నీ మతం ముసుగులోనే జరుగు తున్నాయి. పాలకుల ఆశీస్సులతోనే సాగుతున్నాయి. ‘మతం మత్తుమందు’ అని మార్క్స్ మహనీయుడంటే విరుచు కుపడిన వర్గాలు ఆ మత్తుమందులోనే ‘లవ్ జీహాద్ల’ పేరిట మతాం తర (హిందూ–ముస్లిం లేదా కులాంతర) వివాహాలను నిషేధిస్తూ, స్వతంత్ర భారతం 74వ ఏట కూడా సిగ్గులేకుండా చట్టాలు చేస్తు న్నారు. ఆహార నియమాలపై శాస్త్రీయ దృక్ప«థంతో కాకుండా మతం పూతతో నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. ఒక్కమాటలో– వందేళ్ళనాడే మహాకవి గురజాడ అన్నట్టు ‘దేవుడు చేసిన మనుషుల్లారా, మను షులు చేసిన దేవుళ్లారా’ ఇంతకూ మీ పేరేమిటని మనం మరోసారి ప్రశ్నించుకోవలసిన దశ వచ్చింది. ఈ సందర్భంగా ఇటీవలనే ప్రసిద్ధ సాహితీ చరిత్రకారుడు, అకడమిక్ స్కాలర్ అయిన రక్షానంద జలీల్ వ్యంగీకరించి, వర్తమాన నవ భారతంలో ‘హిందూ గులాబీ కన్నా ముస్లిం గులాబీ వాసన వేరుగా ఉంటుంది కాబోలు’ అని ఓ కానరాని చురక వేశాడు. ఎదిగిన ఇద్దరు స్త్రీ పురుషులు మతాంతర లేదా కులాంతర వివాహాలు ఇష్టపడి చేసుకున్నప్పుడు జోక్యం చేసుకొనే అధి కారం ఎవరికీ లేదని హైకోర్టులూ, సుప్రీంకోర్టూ చెప్పినా, సెక్యులర్ రాజ్యాంగ చట్టం నిర్దేశించినా– మతంమత్తు నుంచి పాలక శక్తులు బయటపడలేక సెక్యులర్ వ్యతిరేక చట్టాలు రూపొందిస్తున్నాయి. తినడానికి మెతుకు దొరక్క అల్లాడుతున్న వాడికి మతం అన్నది మనసుకు కొంత ఊరటగా, ఆశాకిరణంగా మార్క్స్ భావించాడేగాని అది ‘ఖుషీ లోక బాంధవుడు సేవించే ఓ గ్లాసు పెగ్గు’ లాంటిదని ఎక్కడా చెప్పలేదు సుమా! పెక్కు ప్రపంచ దేశాలు తిరిగి, పలు మతా లను అధ్యయనం చేసిన భారతీయ మహా పండితుడు, ‘త్రిపీఠికా చార్యుడు’, స్వాతంత్య్ర సమరయోధుడు, ఉత్తర, దక్షిణ భారతంలోని పలువురు మేధావులను ప్రభావితం చేసిన బహు గ్రంథకర్త రాహుల్ సాంకృత్యాయన్ చివరికి ఒక నిశ్చితాభిప్రాయాన్ని ఇలా ప్రకటించాడు: ‘మానవజాతి ప్రగతిపథం వైపు వేసిన ప్రతి అడుగూ రక్త తర్పణంతోనే సాగింది. మానవ రక్తం ఇంతగా ప్రవహించడానికి అన్ని మతాల ధర్మా చార్యులే కారణం, వారే బాధ్యులు. ఏ ఒక్క మతమూ, ఏ ఒక్క మతా చార్యుడూ గర్వించాల్సింది ఏమీలేదు!’ ఈ విషయం తనకు తెలియకపోయినా తెలుసుకోవాలన్న తపన లేని రాజకీయుడు చంద్రబాబు. కాబట్టి సూట్లతోనూ, బూట్లతోనూ గుడిగడపలు తొక్కడం అతడికి అలవాటు. ఒకవేళ ఎక్కడైనా పూజలు నిర్వహించినా అవి దొంగపూజలు కాబట్టే భక్తి అంతా బూట్లమీదనే ఉంటుంది. అమరావతి వైపు ముఖం చెల్లక ప్రయాణాలు చాలించు కుని విశాఖ కూడా వెళ్ళలేక సరాసరి ‘బోడికొండ’పైని ఆలయానికి తన దండును తరలించాడు. నిజానికి పుణ్యక్షేత్రంగా విజయనగర రాజులు నిర్మించిన రామతీర్థానికి, ఘటన జరిగిన బోడికొండపైని ఆలయ విధ్వంస ఘట్టానికి సంబంధం లేదని స్థానికుల అభిప్రాయం. ఆ మేరకు విజయనగర రాజ కుటుంబానికీ, దయ్యాలకొండగా మారి ప్రేమికుల విలాస యాత్రలకు స్థావరంగా మారిన బోడికొండ ఘట నకూ సంబంధం కల్పించాల్సిన అవసరం అధికార పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ కన్నా ప్రతిపక్షానికే ఉంది. పేదల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు జరుపుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా ‘మోకాళ్లు’ అడ్డుపెట్ట జూస్తూ కుప్పగూలిన ‘తెలుగుదేశం’ పార్టీ నాయకుడు తన రాజకీయ పునరా వాసం కోసం చేస్తున్న విఫల ‘యజ్ఞం’గా ఇది కనపడుతోంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రయత్నం ‘దింపుడు కల్లం’ సామెత లాంటిది. పుంగనూరు సంస్థానం కూడా వెనకటికి చిత్తూరు జిల్లా లోనిదే. అది ‘వెర్రిబాగుల సంస్థానం’ అని పేరుపడింది. ఒక్కో ఊరుకి ప్రతి ప్రాంతంలో ఒక అవివేకపు ఖ్యాతి ఉండేదట. ఆశపోతువాడు గోచిపాతలో ముప్పందుం మూట గట్టుకుని పోదామనుకున్నాడట. ఆ బాణీలోనే అమరావతిలో భంగపడి, కాశీకి పోయినా శని తప్పనట్టు రామతీర్థం పేరిట బోడికొండ పోయినా బాబోరికి, అతని వర్గానికి సుఖం, సుద్దాంతం లేకుండా పోయింది. ‘మనిషి చేసిన రాయిరప్పకి మహిమకలదని సాగి మ్రొక్కుతు మనిషి అంటే రాయిరప్పలకన్న కనిష్టంగా చూస్తావేమి బాలా’ అన్న గురజాడే మనకు సదా స్మరణీయుడు. -ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
విగ్రహాల ధ్వంసం: దీని వెనక ఉన్నది టీడీపీనే
సాక్షి, తాడేపల్లి: విగ్రహాల ధ్వంసం వరుస ఘటనల వెనక టీడీపీ వారే ఉన్నారనేది వాస్తవమని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బీజేపీ కూడా టీడీపీ ఆరోపణలను నమ్ముతున్నారని, అందుకే సీబీఐ విచారణ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్కు మంచి పేరు రాకుండా చేయాలని ఇవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా టీటీడీ విషయంలో అనేక ఆరోపణలు చేసిన విషయాలను ప్రస్తావించారు. శ్రీవారిని ఏసుగా మార్చామంటూ, దీపకాంతులను వేరే రకంగా చిత్రీకరించిన ఆరోపణలన్నింటినీ తప్పని నిరూపించామని స్పష్టం చేశారు. అయినా కావాలని ఆరోపణలు చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమన్న చంద్రబాబు ఇవాళ అదే సీబీఐ విచారణ కోరుతున్నారని విమర్శించారు. అందుకే దీని వెనక ఎవరున్నారో, ఇలా చేయడం ఎవరికి అసవరమో ప్రజలు తెలియాలంటే సీబీఐ దర్యాప్తు చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. (చదవండి: కానిస్టేబుల్కు టీటీడీ చైర్మన్ అభినందనలు) చదవండి: (టీడీపీ రెండు ముక్కలైంది..) -
రామతీర్థం ఘటన: డబ్బులు పంచిన టీడీపీ
మనిషికి ఐదేసి వందల రూపాయలు ఇచ్చారు... ఐదేసి వందలు తెచ్చి మీరు మందు తాగుతున్నారా..? తాగకపోతే ఎలాగ..? మీటింగ్కి వెళ్లిన వారందరికీ ఐదేసి వందల రూపాయలు చొప్పున ఇచ్చారా? అవునండి.. మీ ఊరు వాళ్లకిచ్చారా..? మా ఊరు వాళ్లకి కూడా ఇచ్చారు. అందరికీ ఇచ్చారా? ఆ...ఇచ్చారు. ఇవి ఎవరిచ్చారు? కర్రియ్య, చిన్న వచ్చాడా... ఆ వచ్చాడు. ఎక్కడికి వెళ్లి వస్తున్నారు? రామతీర్థానికి.. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : విజయనగరం జిల్లా రామతీర్థంలో చంద్రబాబు వెనుక తిరిగిన జనాల అసలు గుట్టు ఇలా వీడియో రూపంలో బయటపడింది. రామతీర్థంలో రాముడి విగ్రహంపై దాడిని రాజకీయం చేసేందుకు టీడీపీ ఆడిన హైడ్రామాలో మన జిల్లా నేతలు కీలక పాత్ర పోషించారు. ఇక్కడి నుంచి కూడా జనాలను తరలించారు. వాళ్లకి డబ్బులిచ్చి తరలించారనేది తాజాగా వీడియో రూపంలో వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు పర్యటనకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాలను టీడీపీ నేతలు తరలించారు. వారందరికీ ఇలాగే డబ్బులిచ్చి తరలించారనే ఆరోపణలు వచ్చాయి. శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస, ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ, ఆమదాలవలస నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తీసుకెళ్లినట్లు సమాచారం. తమకి రూ.500 ఇచ్చారని, అందుకే రామతీర్థం వచ్చామని, పచ్చ టీ షర్ట్లు ధరించిన వ్యక్తులు చెప్పడం సంచలనమైంది. విగ్రహాల ముసుగులో చేస్తున్న రాజకీయానికి, దేవుడి పేరుతో చేస్తున్న ఆందోళనకు డబ్బులిచ్చి జనాలు తరలించడంపై జనం కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్మాత్మిక స్థలమైన రామతీర్థం బోడికొండపైకి చంద్రబాబు చెప్పులు వేసుకుని వెళ్లడంపై కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. (చదవండి: రామతీర్థం కోదండ రాముని విగ్రహం ధ్వంసం) -
సీఎంకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రతిపక్షాలే చేశాయేమో?
తిరుమల: రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవాలయాల పరిరక్షణకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సినీ హీరో సుమన్ కోరారు. ఆదివారం తిరుమలలోని ఓ అతిథిగృహంలో ఆయన మాట్లాడుతూ రామతీర్థం ఘటనలో విగ్రహాలను ఎవరు ధ్వంసం చేశారో నిర్ధారణకు రాకుండా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందలు వేయడం తగదన్నారు. ముఖ్యమంత్రికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రతిపక్ష నాయకులే విగ్రహాలు ధ్వంసం చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా నిందితులను గుర్తించడకుండా ఒకరిమీద మరొకరు నిందలు వేసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారు దేవుని చేతిలో తప్పకుండా శిక్షను అనుభవిస్తారని చెప్పారు. సీసీ కెమెరాలతో ఆలయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది: మంత్రి చెల్లుబోయిన రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసే అవకాశం లేకపోవడంతో టీడీపీ నాయకులు దైవ నిందలకు పాల్పడుతున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దైవ అపచారాల్లో కుట్రకోణముందన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం కేసులో నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
రామతీర్థం ఆలయాన్ని పరిశీలించిన మంత్రులు
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం చేరుకుని, కోదండ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. విగ్రహ ధ్వంసం ఘటన గురించి అధికారులు, అర్చకుల దగ్గర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ.. రామతీర్థం ఘటన బాధాకరమని, దీన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు హయాంలో ఆలయాలను కూల్చినప్పుడు దేవుడు గుర్తు లేడు, కానీ ఇప్పుడు బాబుకు దేవుడు గుర్తొచ్చాడని విమర్శించారు. చంద్రబాబు ఆలయాలను కూల్చిన వ్యక్తి.. బాబు.. దేవాలయ ఆస్తులను తన బినామీలకు దారాదత్తం చేశారని చురకలు అంటించారు. మతాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహించారు. అసలు బాబుకు దేవుడంటే నమ్మకముందా? అని సూటిగా ప్రశ్నించారు. ఆలయాలను కూల్చిన వ్యక్తి సాంప్రదాయాల గురించి మాట్లాడతారా? అని మండిపడ్డారు. బాబు పాపాలు చేశారు కాబట్టే వెంకటేశ్వర స్వామి ఓడించాడని వ్యాఖ్యానించారు. ఇక రామ తీర్థం ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లంపల్లి తెలిపారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, ఈ ఘటన వెనక ఉన్నవారికి శిక్ష తప్పదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. దోషులను శిక్షించాలి అంతకు ముందు విశాకు వెళ్లిన వెల్లంపల్లి అక్కడ విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వామి సరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలిశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ.. దేవాలయాల్లో దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఉపేక్షిస్తే దేవాదాయ శాఖ ప్రతిష్ట దిగజారుతుందన్నారు. రామతీర్థం ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరారు. నివేదిక సమర్పణకు కమిటీకి కాలపరిమితి విధించాలని సూచించారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. రామతీర్ఠంలో అసలు ఏం జరిగిందంటే... రామతీర్థం ప్రధానాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో నీలాచలం కొండ మీద శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో ఈ నెల 28 అర్ధరాత్రి కొందరు దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ద్వంసం చేశారు. సాధారణంగా రోజూ అక్కడకు పూజారి ఉదయం 8 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12కు వెనక్కి వచ్చేస్తారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఉండరు. దీన్ని అదనుగా తీసుకున్న దుండగులు ఖండించిన శిరస్సును సీతమ్మ కొలనులో పడేశారు. (చదవండి: రాముడి విగ్రహ ధ్వంసం 'దేశం' మూకల పనే?) చైర్మన్ పదవి నుంచి అశోక గజపతి తొలగింపు రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసం ఘటనకు వ్యవస్థాపక ధర్మకర్త హోదాలో రామతీర్థం ఆలయ చైర్మనుగా కొనసాగుతున్న కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి రాజు నిర్లక్ష్యం కూడా కారణమని దేవదాయ శాఖ పేర్కొంది. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా, కనీసం ఆ ఆలయాన్ని ఆయన సందర్శించలేదు. సరికదా.. దానిపై సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. దీనికితోడు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, తూర్పు గోదావరి జిల్లా మందపల్లిలోని మందేశ్వరస్వామి ఆలయం చైర్మన్ పదవుల నుంచి కూడా అశోక గజపతిరాజును తొలగించారు. (చదవండి: అయ్యో... రామ‘చంద్ర’!) -
కుట్రకోణంపై కన్ను
సాక్షి, అమరావతి: ► విజయనగరం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీకి గత నెల 30న సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తారనగా దానికి ఒక్కరోజు ముందే రామతీర్థం ఘటన వెలుగులోకి వచ్చింది. అది కూడా 29న సదరు ఆలయంలో సీసీ కెమెరాను ఏర్పాటుచేస్తారనగా 28వ తేదీ రాత్రే రాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ► అలాగే, రామతీర్థం వివాదాన్ని విపక్షాలు రాజేసిన మరుక్షణమే కర్నూలు జిల్లా కోసిగి మండలం సజ్జలగూడెం వద్ద పొలాల్లోని ఆంజనేయస్వామి ఆలయంపైనున్న విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అప్రమత్తమైన కర్నూలు జి ల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తే అసలు విగ్రహ ధ్వంసమే జరగలేదని తేలింది. ఇదే విషయాన్ని స్వయంగా ప్రకటించిన ఎస్పీ.. తప్పుడు ప్రచారాలు చేసి భక్తుల మనోభావా లతో చెలగాటమాడితే శిక్ష తప్పదని శనివారం హెచ్చరించారు. రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలను గమనిస్తే ఆలయాల మాటున అలజడులు సృష్టించే కుట్ర బట్టబయలవుతోంది. పథకం ప్రకారమే దేవాలయాల్లో ఘటనలు జరుగుతున్నట్లు సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రజలూ ఇదే అనుమానాన్ని వ్యక్తంచేస్తున్నారు. దీంతో రామతీర్థం ఘటన ద్వారా మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి విధ్వంసం చేసే కుట్ర కోణంపైన పోలీసులు దృష్టిసారించారు. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అశోకగజపతిరాజు చైర్మన్గా ఉన్న ఈ రామతీర్థం ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలిని పరిశీలించారు. డీఐజీ కేఎల్ రంగారావు పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు నిఘా పెంచారు. మరోవైపు.. రాష్ట్రంలోని దేవాలయాలు, చర్చిలు, మసీదుల లెక్కలు తేల్చి వాటి వద్ద నిర్వాహకులే అప్రమత్తంగా మెలిగేలా పోలీసులు చర్యలు చేపట్టడమే కాక గత కొంతకాలంగా ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి చంద్రబాబు హయాంలో విజయవాడలో అనేక ఆలయాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆయన పాలనలో ఆలయాల్లో నేరాలకూ లెక్కలేదు. తప్పుడు ప్రచారాల వెనుక వాస్తవాలివే.. మరోవైపు.. రామతీర్థం ఘటన నేపథ్యంలో డీజీపీ కార్యాలయం స్పందించింది. ఇటీవల దేవాలయలపై జరిగిన తప్పుడు ప్రచారాల వెనుక ఉన్న వాస్తవాలను శనివారం విడుదలను చేసింది. అవి.. ► కృష్ణా జిల్లా గుడివాడ గంగానమ్మ గుడి హుండీ చోరీకి మత రంగు పులిమి విపక్షాలు ఆందోళనలు చేశాయి. వాస్తవానికి మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులు డబ్బులు కోసం హుండీ పగలగొట్టారని దర్యాప్తులో నిగ్గుతేల్చిన పోలీసులు ఆ తర్వాత వారిని అరెస్టుచేశారు. ► కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కాలభైరవ ఆలయంలో విగ్రహాలు చోరీ అవుతున్నాయంటూ జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. వాస్తవానికి రాజశేఖర్ అనే వ్యక్తి సంతానం కోసమే విగ్రహ భాగం చోరీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ► అలాగే, శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల సరస్వతీదేవి విగ్రహ విధ్వంసంపై అన్యమతాల వారే చేశారంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. వాస్తవానికి సరస్వతీదేవీ విగ్రహాన్ని ఎవరూ విధ్వంసం చేయలేదని గుర్తించి ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. ఆలయాల విషయంలో పోలీస్ శాఖ చర్యలివీ.. ► రాష్ట్రంలో 57,493 మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్ చేసి మ్యాపింగ్ చేశారు. వేలాది సీసీ కెమెరాలు అమర్చారు. ► ఇప్పటివరకు ఆలయాల్లో చోటుచేసుకున్న విద్రోహ ఘటనలకు సంబంధించి మొత్తం 236 మంది అరెస్టయ్యారు. ► దేవాయాల్లో నేరాలు, అలజడులు, విధ్వంసాలు చేసే అలవాటున్న 1,196 మందిని బైండోవర్ చేయడంతోపాటు హిస్టరీ షీట్లు తెరిచి వారి కదిలికలపై నిఘా ఉంచారు. ► రాష్ట్రంలోని అన్ని ఆలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పోలీసులు అగ్నిమాపక జాగ్రత్తలు, భద్రతా పరమైన చర్యలు చేపట్టారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు : డీజీపీ వాస్తవాలను నిర్ధారించుకోకుండా మతాలను రెచ్చగొట్టి వివాదాలు సృష్టించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం సరికాదు. రాష్ట్రంలో ఏ ప్రార్థనా మందిరం వద్ద అయినా చిన్నపాటి ఘటన జరిగినా బాధ్యులను గుర్తిస్తున్నాం. ఇదే సమయంలో మతపరమైన అంశాలను వివాదం చేసి ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించే శక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. అంతర్వేది రథం దగ్థం ఘటన అనంతరం రాష్ట్రంలో అనేక చర్యలు చేపట్టాం. అంతర్వేది ఘటనకు ముందు 49 కేసుల్లో 87 మందిని, ఆ తర్వాత 78 కేసుల్లో 149 మందిని అరెస్టుచేశాం. ఇప్పటివరకు అన్ని మతాల ఆలయాలు, సంస్థలకు సంబంధించి 57,493 ప్రాంతాలకు జియో ట్యాగింగ్ చేశాం. 11,295 ప్రాంతాల్లో 37,673 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాం. – డీజీపీ గౌతం సవాంగ్ -
రాముడి విగ్రహ ధ్వంసం 'దేశం' మూకల పనే?
సాక్షి, అమరావతి/విజయనగరం టౌన్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం, కోదండరామస్వామి అలయంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటన వెనక తెలుగుదేశం పార్టీ కుట్ర స్పష్టంగా బయటపడింది. మహిళలకు ఇళ్ల పట్టాలిస్తూ ముఖ్యమంత్రి జగన్ అనితర సాధ్యమైన రీతిలో ముందుకెళుతుండటంతో విజయనగరంలోని ఆయన బహిరంగ సభను అడ్డుకోవాలన్న కుట్రతోనే మొదట దీనికి తెగబడినట్లు తెలియవస్తోంది. రకరకాల కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు... 20 మందికిపైగా వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అందులో టీడీపీ కుట్ర కోణం స్పష్టంగా బయటపడినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న చంద్రబాబు... తమ పాత్ర బయటపడుతుందన్న భయంతో రెండు రోజులుగా అక్కడ జనాన్ని పోగేస్తూ వచ్చారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి భారీగా జనాన్ని సమీకరించి ఆలయం దగ్గర రచ్చ చేయాలని, తద్వారా తమ పాత్ర బయటపడకుండా చేసి రాజకీయ లబ్ధి పొందాలని భావించారు. ఇందులో భాగంగానే... అప్పటికే అక్కడికి చేరుకున్న 2,500 మందికి పైగా జనంతో శనివారం ‘షో’ చేయబోయారు. కానీ ఈ విషయం తెలుసుకుని అప్పటికే అక్కడకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వీరిని అడ్డుకోవటంతో బాబు ఆటలు సాగలేదు. అనంతరం పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేసి.. ఇదంతా టీడీపీ నేతలు ఒక పన్నాగం ప్రకారం చేసిందేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అసలు ఏం జరిగిందంటే... రామతీర్థం ప్రధానాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో నీలాచలం కొండ మీద శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో ఈ నెల 28 అర్ధరాత్రి కొందరు దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ద్వంసం చేశారు. సాధారణంగా రోజూ అక్కడకు పూజారి ఉదయం 8 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12కు వెనక్కి వచ్చేస్తారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఉండరు. దీన్ని అదనుగా తీసుకున్న దుండగులు ఖండించిన శిరస్సును సీతమ్మ కొలనులో పడేశారు. ఈ దుశ్చర్యను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, విజయనగరం ఎస్పీ రాజకుమారి పర్యవేక్షణలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వారు దర్యాప్తు చేస్తుండగా... స్థానిక టీడీపీ నేతలు కొందరు హడావుడి చేసి, కోనేరులో వెదికినట్లుగా వెదికి, అందులోంచి తల భాగాన్ని బయటకు తీయటం వారి అనుమానాల్ని మరింత పెంచింది. అనంతరం ఈ శిరస్సు భాగాన్ని వెనుక నుంచి కోసినట్లు పోలీసులు గుర్తించారు. ఆధారాల కోసం మళ్ళీ నీలాచలం కొండపైన పరిశీలించారు. మాగ్నెట్లతో కోనేరులో సెర్చ్ చెయ్యగా యాక్సా బ్లేడు దొరికింది. వారు పగులగొట్టిన తాళం కూడా ఆలయం బయట పోలీసులకు దొరికింది. నిజానికి డిసెంబరు 25న కొండపైకి కరెంటొచ్చింది. 29న సిసి కెమెరాలు ఏర్పాటు చేయటానికి అంతా సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసి తెల్లారక ముందే విగ్రహాన్ని ద్వంసం చేశారంటే అదంతా పక్కా సమాచారంతోనే జరిగి ఉంటుందనేది పోలీసుల భావన. పైగా 30న గుంకలాంలో 12,301 మందికి ఇళ్లపట్టాలివ్వటానికి సీఎం వైఎస్ జగన్ వస్తున్న నేపథ్యంలో ఇది జరగటాన్ని బట్టి... ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతో పక్కా పథకం ప్రకారమే చేశారన్నది వారి దర్యాప్తులో ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. అనుమానితుల కోసం టీడీపీ యాగీ... విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో రామతీర్థం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ ఉపసర్పంచ్, మాజీ వార్డు మెంబర్, మరికొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారున్నారు. మొత్తం 21 మందికి పైగా పోలీసుల అదుపులో ఉన్నారు. ఇది తెలుసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హుటాహుటిన రామతీర్థం పర్యటనకు రావటం... రాక ముందే 3 రోజులుగా జనాన్ని పోగేయటం ఇక్కడ గమనార్హం. దీన్నిబట్టి తమ వారి పాత్ర ఏమాత్రం లేదని జనాన్ని నమ్మించడానికే ఈ అక్కర్లేని రాద్దాంతానికి ప్రయత్నించారన్నది తెలియకమానదు. కాగా పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ నేతలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపడేయాలని, అందుకోసం ఎలాంటి ఉద్యమానికైనా వెనుకాడవద్దని ఈ సందర్భంగా తమ పార్టీ వారికి చంద్రబాబు సూచించటం గమనార్హం. దీంతోపాటు పోలీసులు విచారణ కోసం పిలిచి 24 గంటలు కూడా గడవకముందే అనుమానితుడైన టీడీపీ నేత భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్లు సమాచారం. ఇదంతా టీడీపీ పెద్దలు దగ్గరుండి చేయించడం విశేషం. జరిగింది ముమ్మాటికీ కుట్రేనని, దానివెనుక టీడీపీ వారున్నారని... అయితే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించాకగానీ ఈ విషయాన్ని నిర్థారించలేమని పోలీసులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా అలజడుల సృష్టికే.. రాష్ట్రంలో వరుసగా ఆలయాలలో ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దేవదాయ శాఖ ఆ«దీనంలోని అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దాదాపు అన్ని ఆలయాల్లో ఈ ఏర్పాటు ప్రక్రియ పూర్తికావొచి్చంది. 20 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో... శ్రీరాముని విగ్రహం ధ్వంసం జరిగిన రామతీర్థం ఆలయానికి విద్యుత్ సౌకర్యం లేకపోతే.. అక్కడ కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి కొండపైకి ప్రభుత్వం కొత్త విద్యుత్ లైన్లు వేసింది. ఒక్క రోజులో కెమెరాలు ఏర్పాటు చేస్తారనగా ఈ దుర్ఘటన జరగటం గమనార్హం. ఈ ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్గా ఇప్పటిదాకా టీడీపీ నేత, మాజీ మంత్రి అశోక గజపతిరాజు కొనసాగుతుండగా... ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీరాంనగర్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం జరిగిన వరసిద్ధి విఘ్నేశ్వరస్వామి ఆలయం కూడా దేవాదాయ శాఖ ఆదీనంలో లేని ఒక ప్రైవేట్ ఆలయం. ఇది టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ అజమాయిషీలో ఉండటం గమనార్హం. చైర్మన్ పదవి నుంచి అశోక గజపతి తొలగింపు రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసం ఘటనకు వ్యవస్థాపక ధర్మకర్త హోదాలో రామతీర్థం ఆలయ చైర్మనుగా కొనసాగుతున్న కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి రాజు నిర్లక్ష్యం కూడా కారణమని దేవదాయ శాఖ పేర్కొంది. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా, కనీసం ఆ ఆలయాన్ని ఆయన సందర్శించలేదు. సరికదా.. దానిపై సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. దీనికితోడు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, తూర్పు గోదావరి జిల్లా మందపల్లిలోని మందేశ్వరస్వామి ఆలయం చైర్మన్ పదవుల నుంచి కూడా అశోక గజపతిరాజును తొలగించారు. -
చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలి..
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలను తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమపాలన చేస్తుంటే.. చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.(చదవండి: ‘రామతీర్థం ఘటనలో చంద్రబాబు హస్తం’) ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారన్నారు. రామతీర్థం ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. అంతర్వేది ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రథం నిర్మాణం చేపట్టి పూర్తి చేసిందన్నారు. ‘‘రాష్ట్రంలో పండగ వాతావరణాన్ని భగ్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. లోకేష్ మాటలకు రాష్ట్రంలో విలువలేదని’’ ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు.(చదవండి: పప్పునాయుడు సవాల్కు మేం రెడీ..) -
‘రామతీర్థం ఘటనలో చంద్రబాబు హస్తం’
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి దేవుడి పట్ల భయం, భక్తి లేదని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవాలయాలపై దాడులు చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. ‘‘బూట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిన దుర్మార్గుడు ఆయన. చంద్రబాబును ఓడిపోయేలా చేసింది వెంకటేశ్వరస్వామియే.(చదవండి: ‘రామతీర్థం’ చైర్మన్ పదవి నుంచి గజపతిరాజు తొలగింపు) చంద్రబాబు రామతీర్థం వెళ్లి అమరావతి గురించి మాట్లాడుతున్నారు. ఘటనపై రామతీర్ధం ఛైర్మన్ అశోక్గజపతిరాజు ఎందుకు స్పందించలేదు?. రామతీర్ధం ఘటనలో చంద్రబాబు హస్తం ఉంది. దేవుడు ఆస్తులను చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టారు. ప్రత్యక్ష ఎన్నికల్ల ఓడిపోయి దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన వ్యక్తి లోకేష్. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం. త్వరలోనే ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం ఖాయం. చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష పడే రోజు దగ్గర్లోనే ఉందని’’ మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.(చదవండి: పప్పునాయుడు సవాల్కు మేం రెడీ..) అసాంఘిక శక్తులను నియంత్రించాలి: స్వరూపానందేంద్ర సరస్వతి శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శనివారం.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో మాట్లాడారు. అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వ ప్రతిష్టతోపాటు హిందువుల మనోభావాలను దెబ్బతీసే కుట్రలను నిరోధించాలన్నారు. ఆలయాల భద్రత విషయంలో కిందిస్థాయి ఉద్యోగులను సైతం అప్రమత్తం చేయాలని కోరారు. దేవాలయాలపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్న సంకేతాలు భక్తులకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. -
పప్పునాయుడు సవాల్కు మేం రెడీ..
సాక్షి, విజయనగరం: రామతీర్థం కొండపై జరిగిన దుశ్చర్యకు చంద్రబాబు, లోకేష్, అశోక్గజపతిరాజే కారణమని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. లోకేష్ విసిరిన సవాల్కు సిద్ధమన్న ఆయన.. తేదీ, సమయం చెప్తే సింహాద్రి అప్పన్న సన్నిధికి వస్తామని తెలిపారు. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని, విజయవాడలో ఆలయాలను తొలగించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. (చదవండి: విజయసాయిరెడ్డి కాన్వాయ్పై టీడీపీ శ్రేణుల దాడి) ఆలయాల్లో తాంత్రిక పూజలు, క్షుద్రపూజలు కూడా చంద్రబాబు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాక.. సదావర్తి భూములను అమ్మిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు దేవుడి పట్ల భయం, భక్తి లేవన్నారు. ఓట్ల కోసం తప్ప.. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం చంద్రబాబుకు రాదన్న ఆయన.. ప్రజల సొమ్మును ఎలా దోచుకోవాలన్నదే చంద్రబాబు దురాలోచనని మండిపడ్డారు.(చదవండి:అయ్యో... రామ‘చంద్ర’!) ‘‘చంద్రబాబు, కుట్రలు కవల పిల్లలు. సొంత మామ, తమ్ముడు, బావమరుదులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తప్పు చేసిన వారిని ఆ భగవంతుడు శిక్షిస్తాడు. రామతీర్థం ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. -
విజయసాయిరెడ్డి కాన్వాయ్పై టీడీపీ శ్రేణుల దాడి
సాక్షి, విజయనగరం: రామతీర్థంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాన్వాయ్పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక తమను అడ్డుకున్న పోలీసులపై సైతం టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. కాగా జిల్లాలోని రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో ఈ నెల 28 అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించి కొలనులో పడేసిన విషయం విదితమే. ఈ దుశ్చర్యపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. దేవదాయశాఖ ఆర్జేసీ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించింది.(చదవండి: చిల్లర రాజకీయాల కోసమే రామతీర్థానికి చంద్రబాబు) ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ఘటన జరిగిన ప్రాంతాన్ని, కొండ పక్కన ఉన్న కొలను ప్రాంతాన్ని పరిశీలించారు. ఆలయ అర్చకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా.. కొండ కింద ప్రాంతంలో రామ నామస్మరణతో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోందంటూ మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కొండకిందకు వచ్చి కారులో వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. మరోవైపు... కొండపైకి చంద్రబాబు నాయుడు, చినరాజప్పలతోపాటు తమను కూడా అనుమతించాలని టీడీపీ నాయకులు ఘర్షణకు దిగారు. బీజేపీ నేతలు ఇదే తరహాలో వ్యవహరించాయి. దీంతో రామతీర్థంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, బీజేపీ కార్యకర్తల తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చిల్లర రాజకీయాల కోసమే రామతీర్థానికి చంద్రబాబు
సాక్షి, విజయవాడ: రామతీర్ధం ఘటన ప్రతిపక్షాల కుట్ర అని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు ముందు రోజే టీడీపీ ఈ కుట్ర చేసిందని, పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని, బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామతీర్ధ ఆలయాన్ని తామే అభివృద్ధి చేశామన్న మంత్రి బొత్స.. ఈ ఘటన జరిగిన వెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ‘‘విషయం తెలిసిన వెంటనే మా ఎంపీ, ఎమ్మెల్యే రామతీర్ధం వెళ్లారు. మరి టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు రామతీర్ధం ఎందుకు వెళ్లలేదు? చంద్రబాబు చిల్లర రాజకీయాల కోసం రామతీర్ధం వెళ్తున్నారు. సీఎం పర్యటనకు ముందు రోజు ఉద్దేశపూర్వకంగానే టీడీపీ కుట్ర చేసింది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల నుంచి దృష్టి మరల్చేందుకే చేయడానికే చంద్రబాబు కుట్రలు రచించారు. ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తాం. రామతీర్ధంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రామతీర్థం చేరుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి రాముల వారి కోవెలలో జరిగన ఘటనను పరిశీలించేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ పెనుమత్స సురేశ్ తదితరులు బోడికొండ చేరుకున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో రామాలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పెనుమత్స సురేశ్ మాట్లాడుతూ.. ‘‘ రామతీర్ధం ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోంది. ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రామతీర్ధం ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోంది’’ అని పేర్కొన్నారు. కఠిన చర్యలు తప్పవు: దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి చంద్రబాబు హడావుడిగా రామతీర్ధానికి ఎందుకు వెళ్లారని దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ‘‘బాబు హయాంలో దేవాలయాలపై దాడులు జరిగినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రామతీర్థం వెళ్లారు. అక్కడి రాముడి ఆలయాన్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. ఇప్పుడు కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు. శిబిరం ఏర్పాటు చేసిన శిబిరం ఇదిలా ఉండగా.. రామతీర్ధంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. టీడీపీ శిబిరానికి పోటీగా దీనిని నిర్వహిస్తున్నారు. కాగా ఘటనను పరిశీలించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు రామతీర్థం చేరుకుంటున్నాయి. టీడీపీ సానుభూతిపరులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని నినాదాలు చేస్తూ.. ప్రతిపక్ష పార్టీ తీరును ఖండిస్తున్నారు. -
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించం: ఎస్పీ
సాక్షి, విజయనగరం: రామతీర్ధం ఘటనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించమని ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు. విచారణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించిన విషయం విదితమే. ఈ దుశ్చర్యపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం.. డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. దేవదాయశాఖ ఆర్జేసీ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసు బృందాలు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ రాజకుమారి మాట్లాడుతూ.. ‘‘29న రామతీర్ధంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఆ ముందు రోజు అంటే 28న విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మందిని విచారిస్తున్నాం. రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. ఇక రాజకీయ నాయకుల పర్యటనల నేపథ్యంలో రామతీర్ధం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.(చదవండి: అయ్యో... రామ‘చంద్ర’!) -
అయ్యో... రామ‘చంద్ర’!
దేవుడంటే భయం లేదు. పాప భీతి అసలే లేదు. రావణాసురుడి పదితలలను కూల్చిన రాముడి విగ్రహం తలనే ఏకంగా నరికేశారు. భక్తుల మనోభావాలతో ఆటలాడుకునేందుకు యత్నించారు. దీనికి చారిత్రక నేపథ్యం కలిగిన రామతీర్థంలోని బోడికొండను వేదికగా చేసుకున్నారు. దానిని రాజకీయ లబ్ధికోసం ఆయుధంగా మలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా... పోలీసు ఉన్నతాధికారులపైనా... తుదకు స్వామీజీలపైనా వారు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు వెగటు పుట్టిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో డిసెంబర్ 28వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులెవరో శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించారు. దానిని కాస్తా సీతమ్మవారి కొలనులో పడేసి పోయా రు. 29వ తేదీ ఉదయం 7.30గంటలకు ఆలయ పూజారి ఎప్పటిలానే స్వామివారికి నిత్య కైంకర్యాల కోసం వెళ్లారు. ఆలయం తలుపులు తెలిచి ఉండటం చూసి కంగారు పడి లోపలికి వెళ్లకుండానే గర్భగుడి పైపు చూడగా శ్రీరాముడి విగ్రహం మొండెం మాత్రమే కనిపించింది. వెంటనే ప్రధాన ఆలయంలోని పూజారులకు విషయం తెలియజేశారు. ఉదయం 7.30 గంటల సమయంలోనే దుర్ఘటనను గుర్తించిన పూజారులు 10.30 గంటల వరకూ గుట్టుగా ఉంచారు. పూజారుల్లోనే కొందరు ఎట్టకేలకు సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారు. ప్రజలకు విషయం తెలిసిన తరువాత గానీ వారు పోలీసులను ఆశ్రయించలేదు. సాధారణంగా ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే ఈ కొండపై పూజారులుంటారు. ఆ తరువాత సందర్శకులు కొండపైకి వెళ్లినా గుడి బయటి నుంచే దర్శనం చేసుకుంటారు. నిఘా లేదని నమ్మకంతోనే... రాత్రయితే అక్కడ ఎలాంటి నిఘా ఉండదు. అందుకే దుండగులు ఆ సమయాన్ని ఎంచుకున్నారు. కొండపైకి వారు వెళ్లినపుడు సెల్ఫోన్ కూడా తమ వెంట తీసుకెళ్లకుండా జాగ్ర త్త పడ్డారు. సెల్ఫోన్ తీసుకువెళ్లి ఉంటే ఆ సమయంలో ఏ నెట్ వర్క్ టవర్ నుంచి సిగ్నల్స్ వచ్చాయో కనిపెట్టడం పోలీసులకు సులభమవుతుంది. ఖండించిన శిరస్సును దేవాల యం నుంచి వెలుపలికి తెచ్చి సీతమ్మకొలనులో పడేయడం చూస్తే విషయం పెద్దది చేయాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. కేవలం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను పాడుచేయాలని, పట్టా పంపిణీ కార్యక్రమం నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని, హిందుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమనీ జనాన్ని నమ్మించేందుకు ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం బోడికొండ ఘటనపై దర్యాప్తును సీరియస్గా తీసుకున్న రా ష్ట్ర ప్రభుత్వం డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. దేవదాయశాఖ ఆర్జేసీ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించింది. ఆలయానికి విద్యుత్ సౌకర్యం వచ్చిందని, సీసీ కెమెరాలు పెడుతున్నారని తెలుసుకుని మరీ దుండగులు ముందుగానే తమ కుట్రను అమలు చేస్తున్నారన్న అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ఆరా తీస్తున్నారు. గైడ్లమని చెప్పుకుని తిరిగే ఇద్దరు యువకులను ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు. మరో ఇద్దరు టీడీపీ గ్రామస్థాయి నాయకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలయాల పరిరక్షణకు సర్కారు చర్యలు ఈ సంఘటనపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 571 ఆలయాలు ఉన్నాయి. దేవదాయశాఖ ఆధీనంలో సుమారు 10 వేల ఎకరాల భూములున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో ధూపదీప నైవేద్యాలకు 57 ఆలయాలకు మాత్రమే నిధులందేవి. అర్చకులెవరికీ కనీస వేతనాలు ఇచ్చేవారు కాదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అర్చక వెల్ఫేర్ ఫండ్ నుంచి ధూపదీప నైవేద్యాల కోసం సుమారు 250 మంది పూజారులకు నెలకు రూ.5వేలు నుంచి రూ.10వేల వరకూ ఇస్తూ ఆలయాలకు మళ్లీ జీవం పోస్తున్నారు. కరోనా సమయంలోనూ పూజారులకు రూ.5 వేలు చొప్పున సాయం అందించారు. అధికారంలోకి రాగానే ఆలయాల్లో దీపం వెలిగించారు. అర్చ కుల ఆకలి తీర్చి ఆదుకున్నారు. దేవాలయాల భద్రత కోసం ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రామతీర్ధంలోనూ అడుగడుగునా సీసీ కెమెరాలు పెట్టి, కొండపైన ఒకటి రెండు రోజుల్లో అమర్చడానికి సిద్ధం చేశారు. రాజకీయ లబ్ధికోసం ఆందోళనలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలు ప్రజల్లో టీడీపీపై ఏహ్య భావాన్ని కలిగిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ అధికారులపైనా టీడీపీ నేతలు నోరుపారేసుకుంటున్నారు. స్వామీజీలు, హిందూ ధర్మ సంస్థలపైనా దుర్భాషలాడుతున్న ఆ పార్టీ నేతల్లో దేవుడిపై భక్తి కంటే రాజకీయ స్వలాభమే ఎక్కువగా కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దుర్ఘటన జరిగిన రోజే టీడీపీ ముఖ్య నేతలు జిల్లాలో వాలిపోయారు. మరునాడు మరోనేత వచ్చి పిచ్చివాడిలా అందరినీ తిట్టేసి వెళ్లిపోయారు. ఇప్పడు ఏకంగా టీడీపీ జాతీయాధ్యక్షుడైన చంద్రబాబు నాయుడే దిగుతున్నారు. ముందే అనుకున్నట్లుగా, చాలా వేగంగా స్పందిస్తున్న తీరు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎన్నికల తరువాత ఏనాడూ జిల్లా ప్రజల బాగోగులు చూడని, ఒక్కసారి కూడా జిల్లాలో అడుగుపెట్టని చంద్రబాబు శనివారం రామతీర్థంలో పర్యటించి మరో డ్రామాకు తెరతీస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం ఆందోళన చేస్తున్న బీజేపీ నేత కూడా గతంలో టీడీపీలోనే ఉండేవారు. ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ నిరసన తెలుపుతుండటం, జిల్లా బీజేపీ నేతలెవరూ నాయకత్వం వహించకుండా కేవలం శిబిరాన్ని సందర్శించడానికే పరిమితమవ్వడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక ప్రతిపక్షానికి చెందిన ‘పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్’ హస్తం ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. దర్యాప్తునకు అవరోధం జరిగిన సంఘటనను నాయకులుతమ రాజకీయ లబ్ధికే వాడుకుంటూ దర్యాప్తునకు అవరోధంగా మారుతున్నారని పోలీసులే అంటున్నారు. టీడీపీకి చెందిన కొందరి కుట్ర ఇందులో ఉన్నట్టు తాము ఇప్పటికే నిర్ధారణకు వచ్చామని, బలమైన సాక్ష్యాలను సేకరించి త్వరలోనే నిందితులను బయటపెడతామని చెబుతున్నారు. కొండపై గల కోదండరామ స్వామి దేవాలయాన్ని జిల్లా ఎస్పీ సంఘటన జరిగిన రోజునే గాకుండా శుక్రవారం కూడా వెళ్లి, నేరం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆందోళనలవల్ల అడుగుపడట్లేదు బోడికొండ సంఘటనపై రాజకీయ పార్టీల లబ్ధికోసం ధర్నాలు చేస్తుండటం వల్ల దర్యాప్తునకు విఘాతం కలుగుతోంది. గత ప్రభుత్వంలో కూడా రోడ్ల విస్తరణ సందర్భంలో అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ఇటువంటి సున్నిత అంశాలపై ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం వల్ల దర్యాప్తునకు ఇబ్బందిగా ఉంది. ధర్నాలు, నిరసనల బందోబస్తుకే విలువైన సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ చర్యను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించింది. సంఘటనపై సమగ్రమైన దర్యాప్తు ఇప్పటికే చేపట్టింది. ఛేదించేందుకు అయిదు ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. – బి.రాజకుమారి, జిల్లా ఎస్పీ -
‘విగ్రహం ధ్వంసం వెనుక చంద్రబాబు పాత్ర’
సాక్షి, విశాఖపట్నం : పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం ఆలయంలోని కోదండ రాముడి విగ్రహం ధ్వంసం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. రామతీర్థంలోని రాముని విగ్రహం ధ్వంసం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. అందులో చంద్రబాబు నాయుడు పాత్ర ఖచ్చితంగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ నాయకులు ఈ కుట్ర పన్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు కాగా విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండరామాలయంపై దుండగుల దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అర్ధరాత్రి ఆలయంలో ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అయితే శ్రీరాముని విగ్రహానికి సంబంధించిన శిరస్సు భాగాన్ని ఆలయంలోని రామకొలనులో గుర్తించారు. అనంతరం జై శ్రీరాం నినాదాల మధ్య శిరస్సును ఆలయానికి చేర్చారు. చినజీయర్ స్వామి ఆశ్రమం ప్రతినిథులతో శిరస్సు పునఃప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శ్రీరాముడి విగ్రహ ధ్వంసంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
రామతీర్థం కోదండ రాముని విగ్రహం ధ్వంసం
సాక్షి, నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో గుర్తు తెలియని దుండగులు బోడికొండపై ఉన్న కోదండ రామస్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. దేవస్థాన అర్చకుడు ప్రసాద్ ఎప్పటిలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు మంగళవారం ఉదయం పైకి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించి తోటి సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సిబ్బంది వచ్చి ఆలయ పరిసర ప్రాంతాలను గాలించారు. జిల్లా ఎస్పీ రాజకుమారి విగ్రహాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరో కావాలనే విగ్రహాలను ధ్వంసం చేసినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. (చదవండి: వేటకెళ్తూ దారితప్పి.. బంగ్లాదేశ్ జలాల్లోకి) సమాచారం తెలుసుకున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు వెంటనే ఆలయాన్ని సందర్శించారు. ఎంపీ బెల్లాన మాట్లాడుతూ కోదండ రాముని విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి జిల్లాకు వస్తున్నారని ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని కొంతమంది కావాలనే ఈ ఘటనకు పాల్ఫడ్డారని మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా రాముడి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా యధావిధిగా ప్రతిష్టింపజేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేని రాజకీయ ఉన్మాదులు, అరాచక శక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. జరిగిన సంఘటనపై దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించి ఎస్పీ రాజకుమారితో మాట్లాడారు. దేవదాయ శాఖ ఆర్జేసీ డి.భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు. -
రాముడు నడయాడిన ‘రామతీర్థం’
త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ తూర్పు తీరాన వెళుతుండగా శివ పూజకు వేళ కావడంతో ఓ ప్రాంతానికి చేరుకుని అక్కడే శివ సైకత లింగాన్ని ప్రతిష్టించి కొలిచారని, అదే నేడు రామతీర్థంగా విరాజిల్లుతోందని పురాణ ప్రతీతి. శ్రీరాముడు నడయాడిన తీరంగా.. రామతీర్థం ప్రసిద్ధికెక్కింది. రాముడు నడయాడిన తీరంలో బ్రహ్మోత్సవాల వేళ సముద్ర స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతిష్టించిన స్పటిక లింగాన్ని గుర్తించిన పల్లవరాజులు 14వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. సాక్షి, రామతీర్థం(నెల్లూరు) : కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయం. ఈ ఆలయం రామతీర్థం గ్రామంలో సముద్రతీరాన ఉన్నది. సముద్ర తీరాన సూర్యోదయ సమయంలో శ్రీరామచంద్రుడు, సైకతం (ఇసుక)తో శివలింగాన్ని చేసి, శివార్చన చేసిన పవిత్రస్థలి ఇది. ఆంధ్రరాష్ట్ర రామేశ్వరంగా, దక్షిణ కాశీగా విలసిల్లుతున్న పవిత్ర శివక్షేత్రం. రాముడు శివార్చన చేసిన ఈ ప్రదేశంలో భక్తులు సముద్రస్నానం ఆచరించి, స్వామి వారికి మొక్కుకుంటే, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. యుగాలు మారినా తరగని భక్తితో స్వామివారి దర్శనానికి భారీగా తరలి రావడం విశేషం. రాముడు సేవించిన తీర్థం కావడంతో ‘రామతీర్థం’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దర్శనం చేసుకుంటే, శివకేశవులను ఒకేసారి దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రాచీనకాలం నుంచి దివ్యక్షేత్రంగా వెలుగొందుచూ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ అమావాస్య నాడు సముద్ర స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవరాజులు స్వామి వారికి దేవాలయం నిర్మించారని ఇక్కడ చారిత్రిక ఆధారాలు ఉన్నవి. 18వ శతాబ్దంలో స్థానికుడైన కోటంరెడ్డి శేషాద్రిరెడ్డికి స్వామివారు స్వప్న దర్శనంతో ప్రేరణ పొంది ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోన్న కామాక్షి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమై సుమారు 10 రోజుల పాటు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే స్వామి వారి వివిధ అలంకరణలకు రామతీర్థం పరిసర ప్రాంతాల భక్తులు ఉభయకర్తలుగా వ్యవహరించడం ఆనవాయితీ. నేటికి ఇదే ఆచారంగా కోనసాగడం విశేషం. బ్రహ్మోత్సవాలు సందర్భంగా వరవడిన భక్తులకు సంతానం కలుగుతుందని భక్తులకు అపార నమ్మకం. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు పలు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవ వివరాలు అతి పురాతనమైన శైవక్షేత్రం రామతీర్థంలోని కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 23వ తేదీ ఆదివారం అంకురార్పణతో ప్రారంభమవుతాయి, 24వ తేదీ ధ్వజారోహణ, 25న చిలక వాహనం, 26న హంస వాహనం, 27న పులి వాహనం, 28న రావణసేవ, 29న నందిసేవ, 30న రథోత్సవం, జూలై 1న స్వామి వారికి కల్యాణం, 2న ముఖ్య ఘట్టం తీర్థవాది (సముద్రస్నానం), అదే రోజు రాత్రికి తెప్పోత్సవం, అశ్వ వాహనం, 3వ తేదీన ధ్వజావరోహణ, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే రథోత్సవం, స్వామి వారి కల్యాణం, తీర్థవాది ఘట్టాలకు స్వామి వారిని తరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. తీర్థవాదికి సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఆలయ అధికారు మౌలిక వసతులను కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఎలా చేరుకోవాలంటే.. ఉత్సవాలు సందర్భంగా జిల్లా కేంద్రం నెల్లూరు నుంచి విడవలూరు మండలం రామతీర్థం గ్రామానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. నెల్లూరు నుంచి దాదాపు 30 కిలో మీటర్లు ఉంటుంది. అల్లూరు, పద్మనాభసత్రం నుంచి కూడా ప్రైవేట్ వాహనాలు నిత్యం రామతీర్థం వరకు నడుస్తుంటాయి. కావలి నుంచి కూడా నేరుగా రామతీర్థానికి బస్సు సౌకర్యం ఉంది. -
రామతీర్థం శివరాత్రి వేడుకల్లో అపశృతి
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై శివరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసకుంది. శివరాత్రి వేడుకలకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు రామతీర్థం కొండపై నుంచి జారిపడి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను విజయనగరం జిల్లా దాసన్నపేటకు చెందిన సాయిరాం, కుమార్లుగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అయ్యో... రామా!
♦ రామతీర్థం దేవస్థానం అభివృద్ధిపై శీతకన్ను ♦ అమలుకు నోచుకోని సర్కారు హామీలు ♦ వచ్చిన నిధుల వినియోగంపైనా నిర్లక్ష్యం ♦ పాలకమండలి లేక పర్యవేక్షణ కరువు ♦ అనాథలా వదిలేసిన పాలకులు ♦ దేవస్థానానికి వచ్చే సరకులపైనా పరిశీలన కరువు రామతీర్థం... ఉత్తరాంధ్ర భద్రాద్రిగా వినుతికెక్కింది. భక్తుల విశ్వాసాన్ని చూరగొంటోంది. కానీ పాలకుల కరుణకు నోచుకోలేకపోతోంది. రాష్ట్ర విభజనానంతరం భద్రాచలం తెలంగాణకు వెళ్లిపోగా... సర్కారు పరంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడే జరపాలని నిర్ణయించినా... చివరి దశలో ఒంటిమిట్టకే ఆ అవకాశం దక్కింది. ఇక్కడా సర్కారు ఆధ్వర్యంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నా... అభివృద్ధి విషయంలో పట్టించుకోకపోవడం... పాలకమండలి ఏర్పాటులో కొనసాగుతున్న జాప్యంతో ఆలయాన్ని అనాథలా వదిలేశారన్న భావన వ్యక్తమవుతోంది. నెల్లిమర్ల రూరల్: ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే రామతీర్థానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఏడాదికి దాదాపు రూ. రెండు కోట్లకు పైగానే ఆలయానికి ఆదాయం వస్తుంది. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రా భద్రాద్రిగా చరిత్రకు ఎక్కాల్సిన సమయంలో వివిధ కారణాలతో ఒంటిమిట్టకు ఆ అవకాశం వెళ్లిపోయింది. అయినప్పటికీ ఒంటిమిట్ట రామాలయం మాదిరిగా రామతీర్థంలోనూ అధికారికంగా శ్రీరామనవమి వేడుకలను మూడేళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. అమలుకాని హామీలు... మొదటిసారి శ్రీరామనవమి వేడుకలకు విచ్చేసిన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు రూ. కోటి 70లక్షలతో దేవస్థానం అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ కేవలం రూ. 50లక్షలు మాత్రమే కేటా యించారు. వీటితో రాజగోపురం, శాండ్బ్లాస్టింగ్, పుష్కరఘాట్ల అభివృద్ధి, తదితర పనులు చేపడుతున్నారు. అయితే అవీ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వల్ల అరకొరగానే ముగించేస్తున్నారు. దీనికి తోడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, స్థానిక సిబ్బంది అడ్డగోలు నిర్ణయాలతో క్షేత్ర అభివృద్ధి జరగడం లేదంటూ స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది మద్య భేదాభిప్రాయాలు రామతీర్థం దేవస్థానంలో పని చేస్తున్న సిబ్బంది మధ్య సయోధ్య కానరావడంలేదు. ఒకరిపై ఒకరికి పడకపోవడం... ఇక్కడ జరిగే విషయాలపై పరస్పరం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది. దీనిపై అధికారులు కూడా సీరియస్గా వ్యవహరించకపోవడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే వారి బాగోగులు చూసే వారే కరువయ్యారు. ఇక్కడ సిబ్బంది, అధికారుల వైఖరి కారణంగానే దాతలు కూడా ముందుకు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. విధి నిర్వహణలో అలసత్వం, ఆలయ అభివృద్ధికి అధికారగణంలో చిత్తశుద్ధి కరువైంది. మారిన పరిస్థితులను బట్టి పాలక మండలి కూడా ఇప్పటికీ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చేవి నాసిరకం సరుకులే రామతీర్థానికి నిత్యాన్నదానం, ప్రసాదాల తయారీ, స్వామివారి భోగం తదితర వాటికి వస్తున్న సరుకులు చాలావరకూ నాసిరకంగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. సరఫరా చేస్తున్న పప్పు దినుసులు కొద్ది కాలంలోనే పురుగులు పడుతుండడంతో అక్కడి సిబ్బంది తరచూ వాటిని ఎండలో ఆరబెడుతున్నారు. టెండరు ఖరారు చేసుకున్నప్పుడు సంబంధిత వ్యాపారి చూపించిన శాంపిల్స్కు ప్రస్తుతం సరఫరా చేస్తున్న సరుకులకు చాలా తేడా కనిపిస్తోందని ఆలయ వర్గాల వారే చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా... ఆ వ్యాపారిని హెచ్చరించిన పాపాన పోలేదు. ఈ ఉదంతం బయటకు పొక్కడంతో దేవస్థానంలో పని చేస్తున్న సిబ్బంది మొత్తం మేల్కొని ఉన్న సరుకులను బాగు చేసినట్లు, పాడైపోయిన సరుకులను కూడా మార్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాలపై ఆలయ సిబ్బందిలో సమన్వయలోపమే కారణంగా స్పష్టమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతున్న రామక్షేత్రం అభివృద్ధికి పాటు పడాలని ఉన్నతాధికారులు కూడా నిత్యం పర్యవేక్షణ జరపాలని భక్తులు కోరుతున్నారు.