Rising
-
ఒత్తిడే శత్రువై.. మృత్యువై..
సాక్షి, హైదరాబాద్: మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య.. అమ్మ తిట్టిందని.. సూసైడ్.. సెల్ఫోన్ కొనివ్వలేదని.. టీచర్ మందలించారని బలవన్మరణం.. ఇలా ప్రతిదానికీ చనిపోవడమే శరణ్యమని భావిస్తున్నారు ప్రస్తుత విద్యార్థులు. ముఖ్యంగా మార్కులు తక్కువ వచ్చాయని, ఎంత చదివినా గుర్తుండట్లేదని.. ఇలా పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల నగరంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒత్తిడిని భరించలేక.. సాధారణంగా పలు కాలేజీల్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం.. ఒంటరితనంతో బాధపడుతుండటం.. వేరే వారితో వెంటనే కలవలేకపోవడం వంటి కారణాలతో ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఇక, హాస్టళ్లలో ఉండే వారికి ఎప్పుడూ చదువు గురించే చెబుతుండటం.. విశ్రాంతి లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు స్టడీ అవర్స్, క్లాసులు, హోంవర్కు.. రాత్రి చాలా ఆలస్యంగా పడుకొని, ఉదయమే నిద్రలేచి మళ్లీ క్లాసులు ఇలా తీవ్ర ఒత్తిడి తెస్తుంటారని, అందుకే విద్యార్థుల్లో తెలియని నైరాశ్యం ఏర్పడుతోందని అంటున్నారు. రోజంతా వేరే వాళ్లు చెప్పింది వినడమే తప్ప తమ సొంత ఆలోచనలు కూడా చేయలేని పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోతుంటారు. మార్కుల గోల.. పోల్చడం సబబేనా? కాలేజీల్లో పెట్టే పరీక్షల వేళ.. మార్కుల విషయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అంతేకాకుండా వేరే వారితో పోల్చడంతో మరింత నిరాశకు లోనై.. తనకు చదువు రాదని, ఎంత చదివినా గుర్తుండదని ఆత్మ న్యూనతా భావంతో బాధపడుతుంటారు. ఆ సమయంలో ఒకవేళ మార్కులు తక్కువ వచ్చాయని ట్యూటర్ కానీ టీచర్ కానీ మందలిస్తే దారుణమైన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉండది. ఇతరులతో పోల్చడం సరికాదు.. తల్లిదండ్రులు, టీచర్లు, మెంటార్లు, బంధువులు కూడా మార్కులు ముఖ్యమని చెబుతుండటం.. అందుకోసం తీవ్రంగా కష్టపడ్డా కూడా మార్కులు రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అయితే మానసిక స్థైర్యం, మైండ్సెట్ అనేది మార్కుల కన్నా ముఖ్యమని ఎవరూ చెప్పరు. పాజిటివిటీ నింపాల్సిన వారు కూడా ఎప్పుడూ తెలియకుండానే ఒత్తిడి తీసుకొచ్చేలా మాట్లాడటం అస్సలు చేయకూడదని మానసిక నిపుణులు చెబుతున్నారు. వేరే వారితో పోల్చడం, తక్కువ చేసి మాట్లాడటం, బ్లేమ్ చేస్తుండటం వల్ల వారిలోని శక్తిసామర్థ్యాలు మరింత తగ్గుతాయి. ప్రేమతో అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయకుండా, కరుకుగా మాట్లాడుతుండటం వల్ల ఆత్మన్యూనత పెరుగుతుంది. గది వాతావరణం గుంపులు గుంపులుగా.. ఎప్పుడూ చదువుకుంటూ ఒకే గదిలో వెలుతురు లేని ప్రాంతాల్లో ఒకే దగ్గర ఉండటంతో మానసికంగా ఇబ్బంది. స్ట్రెస్ వచ్చేలా వాతావరణం.. ప్రశాంతత ఉండకపోవడంతో కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. మెడిటేషన్తో ప్రశాంతత ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు ఉండేలా చూడాలి. ఉదయమే యోగా లేదంటే మెడిటేషన్ చేస్తుండాలి. కనీస శారీరక వ్యాయమం చేసినా కూడా శరీరంతో పాటు మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఇక, సరైన ఆహారం తీసుకోకపోవడంతోనూ మానసిక దృఢత్వంతో ఉండరు. ప్రశాంత వాతావరణం కల్పించాలి విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఉండేలా చూడాలి. ప్రకృతికి దగ్గరగా ఉండేలా చూడాలి. చదువు మాత్రమే కాకుండా వారిలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహించాలి. వారానికోసారి మానసిక ఎదుగుదలకు సంబంధించి.. ఆత్మన్యూనతను తగ్గించేందుకు క్లాసులు పెట్టాలి. సృజనాత్మకత పెంపొందించేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి సారించేలా.. వాటిని సాధించే దిశగా కృషి చేసేలా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. – డాక్టర్ కృష్ణ ప్రసాద్ దేవరకొండ, సైకాలజిస్టు, న్యూరో మైండ్సెట్ కోచ్ -
వేదాంత రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: విభిన్న రంగాల్లో ఉన్న వేదాంత గ్రూప్ రాజస్తాన్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. యూకేలో జరిగిన రైజింగ్ రాజస్తాన్ రోడ్షోలో రాజస్తాన్ సీఎం భజన్ లాల్ శర్మతో వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ భేటీ అయి తాజాగా పెట్టుబడి ప్రతిపాదనలు చేశారు. వేదాంత కంపెనీ అయిన హిందుస్తాన్ జింక్ రూ.30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. జింక్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 1.2 మిలియన్ టన్నుల నుంచి 2 మిలియన్ టన్నులకు, వెండి ఉత్పత్తిని 800 నుంచి 2,000 టన్నులకు చేరుస్తారు. ఒక మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ఫెర్టిలైజర్ ప్లాంటు నెలకొల్పుతారు. రోజుకు 3 లక్షల బ్యారెల్స్కు సామర్థ్యం పెంచేందుకు కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ రూ.35,000 కోట్లు పెట్టుబడి చేయనుంది. 10,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరులను అభివృద్ధి చేసేందుకు సెరెంటికా రెన్యూవబుల్స్ రూ.50,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఉదయ్పూర్ సమీపంలో లాభాపేక్ష లేకుండా ఇండస్ట్రియల్ పార్క్ నెలకొల్పనున్నట్టు వేదాంత గ్రూప్ ప్రకటించింది. తాజా పెట్టుబడులు కార్యరూపం దాలిస్తే కొత్తగా రెండు లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ఇప్పటికే రాజస్తాన్లో వేదాంత గ్రూప్ కంపెనీలు రూ.1.5 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు చేయడం విశేషం. దేశంలో ఉత్పత్తి అవుతున్న ముడి చమురులో కెయిర్న్ వాటా 25% ఉంది. హిందుస్తాన్ జింక్, కెయిర్న్ ప్రధాన కార్యకలాపాలకు రాజస్తాన్ కేంద్రంగా ఉంది. కాగా ఒడిశాలో రూ. 1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ శుక్రవారం తెలిపింది. -
ఆలూ, ఉల్లి ధరలు తీవ్రం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 1.84 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆగస్టులో ఇది 1.31 శాతం కాగా, 2023 సెప్టెంబర్లో అసలు పెరుగుదల లేకపోగా -0.07 శాతం క్షీణించింది. కూరగాయల ధరలు ప్రత్యేకించి ఆలూ, ఉల్లి ధరల తీవ్రత అధికంగా ఉంది. సమీక్షా నెల్లో మూడు ప్రధాన విభాగాలు చూస్తే..ఫుడ్ ఐటమ్స్ టోకు ద్రవ్యోల్బణం 11.53 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 3.11 శాతం కావడం గమనార్హం. ఆగస్టులో కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా -10.01 శాతం తగ్గుదల నమోదయ్యింది. అయితే సమీక్షా నెల సెప్టెంబర్లో ఈ పెరుగుదల రేటు ఏకంగా 48.73 శాతంగా ఉంది. ఆలూ ధరలు 78.13 శాతం పెరిగితే, ఉల్లి ధరలు ఏకంగా 78.82 శాతం ఎగశాయి.ఇంధనం, విద్యుత్ విభాగంలో ధరలు 4.05 శాతం తగ్గాయి. రిటైల్ ధరలూ భారమే..! ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కూడా సెప్టెంబర్లో తీవ్రంగా ఉండడం గమనార్హం. సమీక్షా నెల్లో ఈ స్పీడ్ ఏకంగా 9నెలల గరిష్ట స్థాయిలో 5.49 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 3.65 శాతం. అధిక కూరగాయల ధరలు దీనికి కారణమని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. జాతీయ గణాంకాల కార్యాలయం వివరాల ప్రకారం ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో 9.24 శాతంగా ఉంది. ఆగస్టులో ఈ రేటు 5.66 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే నెల్లో 6.62 శాతం. -
వాగులూ... వంకలూ..
సాక్షి, నెట్వర్క్: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలకు జలకళ సంతరించుకుంది. ములుగు జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి 14.38 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26 ఫీట్లు కాగా ప్రస్తుతం 19 ఫీట్ల నీటిమట్టం ఉంది.వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో 163 నంబరు జాతీయ రహదారిపైకి గోదావరి వరద చేరడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. చీకుపల్లిలోని బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. ⇒ వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు 30.3 ఫీట్లకు 21.9 అడుగులకు నీటిమట్టం చేరింది. ⇒ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారు మధ్యతరహా చలివాగు ప్రాజెక్టు సామర్థ్యం 18 ఫీట్లు ఉండగా.. ప్రస్తుతం నీటి మట్టం 15.2ఫీట్లకు చేరి నిండుకుండను తలపిస్తోంది. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాన జోరు తగ్గడం లేదు. వర్షాలతో పంటలు నీట మునుగుతున్నాయి. పత్తి చేలల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రాణహితకు భారీగా వరద పోటెత్తడంతో వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద తెలంగాణ–మహారాష్ట్ర మధ్య నడిచే నాటుపడవలను నిలిపివేశారు.వాగులో ఇద్దరు గల్లంతుచెట్టు కొమ్మ పట్టుకొని ఒకరు బయటకు..జాడ తెలియని మరొకరు ఉట్నూర్ రూరల్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఒకరు గల్లంతైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని చోటు చేసుకుంది. బొప్పరికుంట గ్రామానికి చెందిన టేకం రాజు, టేకం లక్ష్మణ్(28) సొంత పనులపై ఉట్నూ ర్కు సాయంత్రం వచ్చారు.పని ముగించుకొని తిరిగి రాత్రి గ్రామానికి కాలినడకన బయలుదేరారు. గంగాపూ ర్ వద్ద వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరు కొట్టుకుపోయారు. రాజు చెట్టు కొమ్మ పట్టుకొని బయటకు వచ్చాడు. లక్ష్మణ్ వాగులో గల్లంతయ్యాడు. రెస్క్యూ టీం సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపునకు అంతరాయం కలిగింది. -
ఎదుగుతున్న గొప్ప శక్తి.. భారత్
న్యూఢిల్లీ: భారత్ ఎదుగుతున్న ‘గొప్ప శక్తి‘గా మారే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు మార్టిన్ వోల్ఫ్ పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ 2050 నాటికి అమెరికాతో సమానమైన పరిమాణాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. పశ్చిమ దేశాలూ ఈ విషయాన్ని గుర్తిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్లో ఆయన రాసిన ఒక ఆరి్టకల్లో ముఖ్యాంశాలు.. ► భారత్ 2050 వరకూ వార్షికంగా 5 శాతం లేదా కొంచెం అటుగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని కొనసాగించగలదని నేను విశ్వసిస్తున్నాను. ► ‘చైనా ప్లస్ వన్‘ (కేవలం చైనాలోనే పెట్టుబడులు కాకుండా మరొక దేశంలో కూడా..) వ్యూహాన్ని అనుసరించే కంపెనీలకు భారతదేశం స్పష్టమైన స్థానం. పోటీ పూర్వక పెద్ద మార్కెట్ను దేశం కలిగి ఉంది. ► ప్రస్తుత భారత్ 1.43 బిలియన్ జనభా సంఖ్య 2050 నాటికి 1.67 బిలియన్లకు చేరుతుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. ► దేశంలో బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. రుణ వృద్ధి భారీగా మెరుగుపడే అవకాశం కనిపిస్తోంది. ► దేశ జనాభా, ఆర్థిక వ్యవస్థ రెండూ రాబోయే దశాబ్దాల్లో వేగంగా వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాము. చైనా తరహాలో కాకుండా భారత్తో పాశ్చాత్య దేశాలకు సన్నిహిత సంబంధాలు ఉండడం సానుకూల పరిణామాలకు దారితీసే అంశం. ► ఒకప్పుడు నిషేధానికి గురయిన నరేంద్ర మోడీ, ఇప్పుడు భారత్లో రాజకీయంగా ఆధిపత్య ప్రధాన మంత్రిగా వాషింగ్టన్లో జో బిడెన్తో ఆలింగనం చేసుకుంటున్నారు. పారిస్లో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో కూడా ఇదే అనుబంధం కొనసాగుతోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా శక్తివంతమైన దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు దీనినిబట్టి అర్థం అవుతోంది. ► 2023 నుంచి 2028 మధ్య భారత్ వార్షిక వృద్ధి సగటును 6 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేయడం మరో విశేషం. ఒక శాతం తగ్గినా 5 శాతం సుస్థిర వృద్ధి కొనసాగుతుంది. ► యువత అధికంగా ఉండడం, శ్రామికశక్తి తగినంత అందుబాటులో ఉండడం, ఆ శ్రామిక శక్తి నాణ్యతను మెరుగుపరిచే సామర్థ్యం, అధిక పొదుపు రేటు, వృద్ధిపై విస్తృత స్థాయి ఆశలు భారత్కు సంబంధించి చెప్పుకోవాల్సిన మరికొన్ని అంశాలు. ► భారత్ విషయంలో 2050 వరకూ సగటు వృద్ధి 5 శాతంగా నమోదయితే, అమెరికా వృద్ధి రేటు 1.4 శాతంగా ఉండే వీలుంది. ► భారత్ జీడీపీలో అధిక భాగం దేశీయ వినియోగం నుంచే సమకూరుతోందని, కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరికొన్ని నెలల పాటు నిదానించినా, దేశీ వినియోగంతో భారత్ బలంగా నిలబడుతుందని ప్రపంచబ్యాక్ అధ్యక్షుడు అజయ్ బంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఎనమిస్ట్ మారి్టన్ వోల్ఫ్ భారత్కు సానుకూలంగా ఇచి్చన ప్రకటన దేశాభివృద్ధికి భరోసాను ఇస్తోంది. మొండిబకాయిలు తగ్గుతుండడం హర్షణీయం: ఎస్అండ్పీ ఇదిలావుండగా, బ్యాంకింగ్ మొండిబకాయిలు తగ్గుతుండడం భారత్ ఎకానమీకి లాభిస్తున్న అంశమని ఎస్అండ్పీ ప్రైమరీ క్రెడిట్ విశ్లేషకులు దీపాలి సేథ్ ఛాబ్రియా పేర్కొన్నారు. ఎకానమీ పురోగతి నేపథయంలో 2025 మార్చి నాటికి బలహీన బకాయిల పరిమాణం మొత్తం రుణాల్లో 3 నుంచి 3.5 శాతం శ్రేణికి పడిపోతాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2024–26 మధ్య భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 నుంచి 7.1 శాతం మేర నమోదుకావచ్చని ఎస్అండ్పీ మిడ్ ఇయర్ గ్లోబల్ బ్యాంక్ అవుట్లుక్ పేర్కొంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కూడా భారత్ కొనసాగుతుందని విశ్లేíÙంచింది. ద్రవ్యోల్బణం సమస్య ఉన్నప్పటికీ, దీనిని దేశం అధిగమించగలదన్న విశ్వాసాన్ని దీపాలి సేథ్ ఛాబ్రియా వ్యక్తం చేశారు. -
గోదావరి ఉధృతి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, ఖమ్మం/తూర్పుగోదావరి: భద్రాచలం వద్ద గోదావరి వరద మధ్యాహ్నం 3.19 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రావొద్దని, అత్యవసర సేవలకు కంట్రోల్ రూము నంబర్లకు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం టౌన్లోకి లీకేజీ వాటర్ పెద్ద ఎత్తున వస్తుంది. దీంతో రామయ్య ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. దీంతో సింగరేణి నుంచి తెప్పించిన హై పవర్ మోటార్ల సహాయంతో నీటిని రివర్స్గా మళ్లీ గోదావరిలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. తూర్పు గోదావరి: ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద తీవ్రత పెరుగుతుంది. కోటిపల్లి స్నాన ఘట్టాలను వరద తాకడంతో కోటిపల్లి-ముక్తేశ్వరం పంటి ప్రయాణాలు నిలిపివేశారు. కోటిపల్లి గోదావరి సమీప గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో నదీపాయ గట్టుకు వరద తాకిడితో తాత్కాలిక గట్టు తెగిపోయింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటి పెదపూడి, బురుగులంక, అరిగెల వారిపాలెం,పెదలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు పడవపైనే ప్రయాణాలు చేస్తున్నారు. మరింత వరద పెరిగితే కోనసీమలోని కనకాయలంక, అయినవిల్లి ఎదురు బిడియం కాజ్వేల పైకి కూడా వరద నీరు చేరనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగి పోర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై వరంగల్తో పాటు పలు గ్రామాల్లోని కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ములుగు జిల్లా టేకులగూడెం వద్ద గోదావరి వరద ఉధృతికి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట మండలం కట్రియాల- ఇల్లంద మద్య జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలడంతో వరంగల్-ఖమ్మం మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆధార్ సిన్హా, రజత్ కుమార్, సునీల్ శర్మ,రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు హాజరయ్యారు. -
చలనం..ఆలోచనల ఫలం.. స్టాండింగ్ డెస్క్లకు పెరుగుతున్న డిమాండ్..
సాక్షి, హైదరాబాద్: స్టాండింగ్ పొజీషన్లో వర్క్ పట్ల ఆసక్తి రాను రాను పెరుగుతోంది. వివిధ ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతున్న నేపథ్యంలో కూర్చోవడం కంటే నిల్చుని పనిచేయడానికే ఉద్యోగులు ప్రాముఖ్యతనిస్తున్నారు. దీంతో స్టాండింగ్ డెస్క్లకు డిమాండ్ క్రమంగా పెరిగిపోతోంది. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండగా కార్పొరేట్ ప్రొఫెషనల్ అన్షుల్కి వెన్నునొప్పి మొదలైంది. క్రమంగా అది అతని ఇతర రోజువారీ కార్యకలాపాలను సైతం ప్రభావితం చేయడం ప్రారంభించింది. దాంతో అన్షుల్ స్నేహితుల సలహా మేరకు స్టాండింగ్ డెస్క్ను ఎంచుకున్నారు. ‘ఇప్పుడు, నా వెన్నునొప్పి తగ్గిపోయింది‘ అని అన్షుల్ చెబుతున్నారు. ఎక్కువ గంటలు కూర్చోవడం స్మోకింగ్తో సమానమైన వ్యసనంగా ఇప్పుడు వైద్యులు పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన కార్పొరేట్ ఉద్యోగులు, ఇతర డెస్క్ జాబ్స్ చేసేవారు నిలబడు...బలపడు అంటున్నారు. వీరికి స్టాండింగ్ డెస్క్లు పరిష్కారంగా మారుతున్నాయి. కూర్చోవడం– నుంచోవడం మధ్య వ్యత్యాసం.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్స్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పరిమితమవుతుంది, ఇది చిత్త వైకల్యం వంటి మెదడు జబ్బుల ప్రమాదానికి దారితీస్తుంది. నిలబడి ఉన్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దానికి అవసరమైన ఆక్సిజన్ ఇతర పోషకాలను అందిస్తుంది. చాలా సేపు కూర్చోవడం వల్ల అలసట, బద్ధకం వస్తాయి. అయితే స్టాండింగ్ శక్తి స్థాయిలను పెంచి చురుకు దనాన్ని ఇస్తుంది. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నునొప్పికి దారి తీస్తుంది. అదే నిలబడి ఉన్న డెస్క్లు నిటారుగా నిలబడటానికి మన కోర్ కండరాలకు మద్దతు అందించడం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయి. ఆధునిక పరిస్థితుల్లో మనం కంప్యూటర్లు, టెలి విజన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ముందు కూర్చొని ఎక్కువ సమయం గడుపుతున్న కొద్దీ, మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తు న్నాయి.ఈ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కో వడానికి ఒక సులభ పరిష్కారం స్టాండింగ్ డెస్క్., వీటినే సిట్–స్టాండ్ డెస్క్లు అని కూడా పిలుస్తారు. కూర్చున్న, నిలబడి ఉన్న భంగిమలకు అనుగుణంగా రోజంతా రెండు రకాల భంగిమలకు మధ్య మారడానికి వీలుగా ఇవి రూపొందాయి. చలనం...ఆలోచనల ఫలం.. నగరానికి చెందిన ప్రోగ్రామర్ అభిషేక్ మాండ్లోయ్ 3 నెలల క్రితం స్టాండింగ్ డెస్క్కి మారారు, దీని కోసం కంపెనీ అతనికి ఫర్నిచర్ అలవెన్స్ మంజూరు చేసింది. ‘‘ఈ మార్పునకు నాకు రూ.27,000 ఖర్చయింది. దీని వల్ల శారీరక ఆరోగ్యమే కాదు అంతకుమించి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. నిలబడి ఉన్నప్పుడు నేను నలువైపులా కదలగలను. అది నేను మరింత వేగంగా ఆలోచించగలిగేలా పనిలో చురుకుతనం పెరిగేలా చేస్తోంది’’అని మాండ్లోయ్ అన్నారు. దీని గురించి ఫిట్నెస్ అగ్రిగేటర్ జింపిక్ సంస్థ వ్యవస్థాపకుడు అమరేష్ ఓజా మాట్లాడుతూ, ‘స్టాండింగ్ డెస్క్ మరింత చురుకుగా పని చేసేలా చేస్తుందనీ తన స్టార్టప్లోని సగం మంది సిబ్బంది ఇప్పటికే స్టాండింగ్ డెస్క్లను కొనుగోలు చేశారని చెప్పారు. అదే క్రమంలో యాపిల్ సంస్థ సైతం తన కొత్త ప్రధాన కార్యాలయం యాపిల్ పార్క్లో పనిచేసే ఉద్యోగులందరికీ స్టాండింగ్ డెస్క్లను ఏర్పాటు చేసిందని సమాచారం. డెస్క్కు డిమాండ్... వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ బలపడడంతో అది స్టాండింగ్ డెస్క్ల డిమాండ్ పెరగడానికి దారితీసింది. ‘కోవిడ్కు ముందుతో పోలిస్తే ఈ డెస్క్ల సేల్స్ ఇప్పుడు రెట్టింపైంది‘ అని ఎర్గో డెస్క్ రిటైల్ స్టోర్ నిర్వాహకులు రాహుల్ మాథుర్ అన్నారు. గత త్రైమాసికం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సొల్యూషన్ల డిమాండ్ 45% కంటే పెరిగి, ఇప్పటికీ స్థిరంగా పెరుగు తోందని ఫర్నిచర్ రెంటల్ పోర్టల్ సిటీ ఫర్నిష్ వ్యవస్థాపకుడు నీరవ్ జైన్ వెల్లడించారు. సరిగ్గా ఉపయోగిస్తేనే.. నగరంలోని ఓ ఆసుపత్రికి చెందిన సర్జన్ డాక్టర్ అరుణ్ మాట్లాడుతూ ‘‘సరైన భంగిమలో ఉపయోగించినప్పుడు స్టాండింగ్ డెస్క్లు మంచి ఫలితాలను అందిస్తాయి’’ అని స్పష్టం చేశారు. అయితే ఒంగిన భంగిమలో లేదా మరేదైనా అపసవ్య భంగిమలో గాని నిలుచుని పనిచేస్తే అది కొత్త సమస్యలకు దారితీస్తుంది, అని ఆయన హెచ్చరిస్తున్నారు. మణికట్టు డెస్క్పై ఫ్లాట్గా ఉన్నప్పుడు మోచేతులు 90–డిగ్రీల కోణంలో ఉండాలని ఆయన సూచిస్తున్నారు. అయితే 30 నిమిషాల కంటే ఎక్కువసేపు ఒకే భంగిమలో నిలబడడం కూడా మంచిది కాదని అటూ ఇటూ చలనం అవసరమని అంటున్నారు. ఇదీ చదవండి: Gita Press: 'దేవాలయం కంటే తక్కువేం కాదు..' గీతా ప్రెస్పై ప్రధాని ప్రసంశలు.. -
రికార్డు దిశగా బంగారం ధర.. ఇవీ కారణాలు..
సాక్షి, విశాఖపట్నం: పసిడి ధర పరుగులు తీస్తోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది. కొన్నాళ్లుగా ధర పెరగడమే తప్ప తగ్గడంలేదు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో నెలన్నర క్రితం డిసెంబర్ 5న 24 కేరెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 ఉంది. ప్రస్తుతం రూ.58,770కు చేరింది. అంటే 45 రోజుల్లో రూ.మూడున్నర వేలు పెరిగింది. ఇక 22 కేరెట్ల పుత్తడి రూ.54,040కి చేరుకుంది. నగల దుకాణాల్లో ఆభరణాలపై తరుగు, మజూరీ పేరిట 10 నుంచి 23 శాతం వరకు కొనుగోలుదారుడి నుంచి అదనంగా వసూలు చేస్తారు. ఈ లెక్కన సగటున 15 శాతం వీటికి చెల్లిస్తే పది గ్రాముల బంగారు నగకు రూ.68 వేలు అవుతోంది. దీనికి జీఎస్టీ అదనం. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బంగారాన్ని తులం (11.66 గ్రాములు) లెక్కల్లో కొనుగోలు చేస్తారు. ఆ లెక్కన చూస్తే తులం ముడి బంగారం ధర రూ.68,625 అవుతుంది. అదే తులం ఆభరణాల ధర రూ.79 వేల వరకు ఉంటుంది. బంగారాన్ని ఆభరణాలకే కాకుండా ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీలోనూ వినియోగిస్తారు. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కూడా ఊపందుకుంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఆరి్థక మాంద్యం కూడా తోడైంది. అంతర్జాతీయంగా డాలర్తో రూపాయి మారకం విలువ తగ్గడం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రభావం, షేర్ మార్కెట్లో అనిశ్చితి వంటివి పసిడి ధర ఎగబాకడానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆల్టైం హై దిశగా.. 2020 ఆగస్టులో 24 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59,300కు చేరుకుంది. పుత్తడి చరిత్రలో అదే ఆల్టైం రికార్డు. ఇప్పుడు మళ్లీ ఆ రికార్డును దాటుకొని సరికొత్త రికార్డు దిశగా బంగారం పరుగులు తీస్తోంది. ప్రస్తుతం ధర పెరుగుతున్న వేగం, అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని వర్తకులు అంచనా వేస్తున్నారు. తగ్గుతున్న కొనుగోళ్లు బంగారం ధర పెరుగుదల ఆభరణాల కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. కొన్నాళ్లుగా పసిడి ధర పెరుగుతుండడం వల్ల అమ్మకాలు పడిపోయాయని ది బెజవాడ జ్యూయలరీ అండ్ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.శ్రీహరి సత్యనారాయణ ‘సాక్షి’తో చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (30 గ్రాములు) ధర 1910 నుంచి 1931 డాలర్లకు పెరిగిందన్నారు. చదవండి: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్లో సగం సీట్లు ఖాళీ ఇది 1870 డాలర్లకు దిగివస్తే బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆర్థిక మాంద్యం, డాలరుతో రూపాయి మారకం విలువ తగ్గడం వంటివి బంగారం ధర పెరగడానికి దోహదపడుతున్నాయని విశాఖ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మారోజు శ్రీనివాసరావు చెప్పారు. పెళ్లిళ్ల సీజను వేళ పెను భారం.. ఈనెల 25 తర్వాత నుంచి పెళ్లిళ్ల సీజను ప్రారంభమవుతుంది. పెళ్లింట బంగారం కొనుగోలు తప్పనిసరి. పేద, మధ్య తరగతి వారు కనీసం 40 – 50 గ్రాములైనా కొనాలి. ఈ స్వల్ప మొత్తానికే రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాలి. ఇలా ఆకాశాన్నంటుతున్న పసిడి ధర తమకు పెనుభారం అవుతుందని మధ్య తరగతి వారు చెబుతున్నారు. -
ఎన్నో ఆలోచనలు రేకెత్తించిన టెడ్–ఎక్స్!
సాక్షి, హైదరాబాద్: సమాజంలో దివ్యాంగులకూ సమాన అవకాశాలు కల్పించడమెలా? కుక్కలు మనకు నేర్పే పాఠాలు ఏమిటి? మనలాంటి సామాన్యులు తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ఏం చేయాలి? పామాయిల్కూ మనకొస్తున్న జబ్బులకూ సంబంధం ఏమైనా ఉందా? ఇలాంటి పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నానికి ఆదివారం హైదరాబాద్లో జరిగిన టెడ్–ఎక్స్ కార్యక్రమం వేదికగా నిలిచింది. కొత్త ఆలోచనలను పంచుకునే వేదికగా దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన ‘‘టెడ్ టాక్స్’’అనుబంధ కార్యక్రమమే ఈ టెడ్–ఎక్స్! హైదరాబాద్లోనూ చాలా ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా తాజాగా ఆదివారం 14 మంది వక్తలతో ఇది సందడిగా జరిగింది. ‘రైజింగ్’అన్న ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక సవాళ్లను అధిగమించి.. విజయం సాధించిన వారు తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకున్నారు. ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ సాబూ సిరిల్, భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా పనిచేసిన హైదరాబాదీ ఆర్.శ్రీధర్, ఓ ప్రమాదంలో రెండు కాళ్లూ.. ఒక చెయ్యి కోల్పోయినా స్థైర్యం కోల్పోకుండా ఫిట్నెస్ ట్రెయినర్గా ఎదిగిన టింకేశ్ కౌశిక్ వంటి వారు ఈ కార్యక్రమంలో తాము పడ్డ కష్టాలు.. వాటిని ఎదుర్కొన్న తీరును వివరించారు. అంతేకాదు.. కుక్కలతో కార్పొరేట్ ఉద్యోగులకు పాఠాలు నేర్పించే శిరీన్ మర్చంట్, కేదార్నాథ్ ఆలయం వద్ద ప్లాస్టిక్ చెత్త సమస్యను పరిహరించేందుకు వినూత్నమైన ఆలోచనతో ఓ ప్రయోగం చేసి సత్ఫలితం సాధించిన ‘రీసైకిల్’వ్యవస్థాపకుడు అభయ్ దేశ్పాండే, చక్రాల కుర్చీలకు పరిమితమైన దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై స్క్వాడ్రన్ లీడర్ అభయ్ ప్రతాప్ సింగ్లు కూడా ప్రసంగించి ఆయా అంశాల్లో తాము చేసిన పనులను వివరించారు. చౌక పామాయిల్ వాడకం వల్ల మన ఆరోగ్యానికి కలుగుతున్న హాని.. పర్యావరణానికి జరుగుతున్న నష్టం వంటి అంశాలపై మాట్లాడిన న్యూయార్క్ జర్నలిస్ట్ జోసిలీన్ సి జుకర్మాన్ ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
క్రెడిట్ కార్డ్ వాడకం మామూలుగా లేదుగా, తెగ కొనేస్తున్నారు!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రతికూల ప్రభావాలు క్రమంగా తగ్గుముఖం పట్టి .. ఆర్థిక కార్యకలాపాలు, వినియోగం నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. క్రెడిట్ కార్డు, యూపీఐ చెల్లింపుల ధోరణులే ఇందుకు నిదర్శనమని నిపుణులు, మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ నెలవారీ గణాంకాల ప్రకారం ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) లావాదేవీలు ఈ ఏడాది ఏప్రిల్లో రూ. 9.83 లక్షల కోట్లుగా ఉండగా ఆగస్టులో రూ. 10.73 లక్షల కోట్లకు చేరాయి. అలాగే పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టెర్మినల్ ద్వారా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు ఏప్రిల్లో రూ. 29,988 కోట్లుగా ఉండగా ఆగస్టు నాటికి రూ. 32,383 కోట్లకు చేరాయి. ఈ-కామర్స్ ప్లాట్ఫాంలలో క్రెడిట్ కార్డుల వినియోగం రూ. 51,375 కోట్ల నుంచి రూ. 55,264 కోట్లకు చేరింది. 2017-2022 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో క్రెడిట్ కార్డులపై బకాయిలు వార్షిక ప్రాతిపదికన 16 శాతం మేర పెరిగినట్లు ఎస్బీఐ కార్డ్ ఎండీ రామ్మోహన్ రావు అమర తెలిపారు. ‘క్రెడిట్ కార్డులను ఉపయోగించడం పెరిగే కొద్దీ వాటితో ఖర్చు చేయడం కూడా పెరిగింది. గత కొద్ది నెలలుగా సగటున నెలకు క్రెడిట్ కార్డులపై చేసే వ్యయాలు రూ. 1 లక్ష కోట్లు దాటుతోంది. భారీ వినియోగ ధోరణులను ఇది సూచిస్తోంది. పండుగ సీజన్ రానుండటంతో ఇది మరింత పెరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఊతం.. డిజిటల్ లావాదేవీలు ఇటు విలువపరంగా అటు అమ్మకాలపరంగా పెరుగుతుండటం ఎకానమీకి మేలు చేకూర్చే అంశమని పేనియర్బై ఎండీ ఆనంద్ కుమార్ బజాజ్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ పేమెంట్లకు సంబంధించి వివిధ విధానాల విషయంలో భయాలను పక్కనపెట్టి ప్రజలు అలవాటు పడుతుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం, ఆదాయాలు, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతుండటం, ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగు పడుతుండటం వంటి అంశాలు ఆన్లైన్ చెల్లింపుల వృద్ధికి దోహదపడుతున్నాయని బజాజ్ చెప్పారు. మరింతమంది వర్తకులు డిజిటల్ పేమెంట్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండటం మరో సానుకూలాంశమని వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వారు కూడా యూపీఐని ధీమాగా వినియోగిస్తుండటంతో ప్రస్తుత పండుగ సీజన్లో ఈ విధానంలో చెల్లింపులు మరింతగా పెరిగే అవకాశం ఉందని సర్వత్రా టెక్నాలజీస్ ఎండీ మందర్ అగాషే చెప్పారు. మరోవైపు, డెబిట్ కార్డులు కాకుండా క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులు పెరుగు తుండటానికి రెండు పార్శా్వలు ఉండవచ్చని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ (ఎకనమిక్ అడ్వైజరీ సర్వీసెస్) రణేన్ బెనర్జీ తెలిపారు. కుటుంబాలు నిజంగానే మరింతగా ఖర్చు చేస్తూ ఉండటం ఒక కోణం కాగా, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా రుణాలపై ఆధారపడుతుండటం మరో కోణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
వాహన అమ్మకాల జోరు: టాప్ గేర్లో విడిభాగాల పరిశ్రమ
న్యూఢిల్లీ:వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరం కూడా రెండంకెల శాతం స్థాయిలో వృద్ధి సాధించ వచ్చని అంచనా వేస్తోంది. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ ఈ విషయం తెలిపారు. ‘సంకేతాలన్నీ అదే దిశలో (రెండంకెల స్థాయి వృద్ధి) కనిపిస్తున్నాయి. డిమాండ్ బాగుంది. తయారీ కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నాయి. మహమ్మారి, లాకవుట్లు, అంతర్జాతీయంగా మందగమనం నెలకొనడం వంటి మన చేతుల్లో లేని సవాళ్లు తలెత్తితే తప్ప సరైన దిశలోనే పరిశ్రమ సాగుతోంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఏసీఎంఏ ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ టర్నోవరు 2020-21తో పోలిస్తే 23 శాతం పెరిగి రూ. 4.2 లక్షల కోట్లకు చేరింది. డిమాండ్ పుంజుకోవడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు కొంత తగ్గడం వంటి అంశాల కారణంగా ప్యాసింజర్ వాహనాల తయారీ 20 శాతం, వాణిజ్య వాహనాల ఉత్పత్తి 30 శాతం పెరిగాయి. ఆటో విడిభాగాల ఎగుమతులు 43 శాతం పెరిగి రూ. 1.41 లక్షల కోట్లకు, దిగుమతులు 33 శాతం పెరిగి రూ. 1.36 లక్షల కోట్లకు చేరాయి. ఏసీఎంఏలో 850 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. సంఘటిత పరిశ్రమ టర్నోవరులో వీటి వాటా 90 శాతం పైగా ఉంటుంది. కొత్త వాహనాల ఊతం.. కొత్తగా ప్రవేశపెడుతున్న వాహనాల మోడల్స్ .. ఈ పండుగ సీజన్లో అమ్మకాలకు ఊతంగా నిలవగలవని కపూర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ఆశావహంగా ఉండటం ఈ ఆర్థిక సంవత్సరమూ కొనసాగవచ్చని, 2022–23లో పరిశ్రమ ఆరోగ్యకరమైన పనితీరు కనపర్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే, బీమా వ్యయాలు .. ఇంధనం ధరలు .. రవాణా ఖర్చులు భారీగా పెరిగిపోవడం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గడం వంటి అంశాలు పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం ఈ అంశాలపై సత్వరం దృష్టి సారించాలని కపూర్ కోరారు. అమ్మకాల పరిమాణం రీత్యా పరిశ్రమ కరోనా పూర్వ స్థాయికి తిరిగి చేరుకుందని చెప్పారు. కొత్త ప్లాట్ఫాంలు ఆవిష్కరణ, ద్విచక్ర వాహనాలు.. వాణిజ్య వాహనాల అమ్మకాలు పుంజుకుంటే తదుపరి దశ వృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. స్థానికీకరణపై ఆటో పరిశ్రమ మరింతగా దృష్టి పెడుతుండటం, ప్రభుత్వం ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముల్లాంటివి భారత్ను హై–ఎండ్ ఆటో–విడిభాగాలకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ కేంద్రంగా మార్చగలవని కపూర్ తెలిపారు. ఎలక్ట్రిక్ దిశగా పరిశ్రమ టూవీలర్లు, త్రీవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పుంజుకుంటున్న కొద్దీ విడిభాగాల పరిశ్రమ కూడా గణనీయంగా మార్పులకు లోనవుతోందని కపూర్ పేర్కొన్నారు. ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో దేశీయంగా విడిభాగాల తయారీ సంస్థలు వృద్ధి చెందడానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో వాహనాల తయారీ సంస్థలకు (ఓఈఎం) ఎలక్ట్రిక్ విడిభాగాల సరఫరా చూస్తే.. మొత్తం దేశీయ మార్కెట్లో చేసిన విక్రయాల్లో కేవలం ఒక్క శాతంగానే (రూ. 3,520 కోట్లు) ఉన్నట్లు కపూర్ వివరించారు. ఈ విభాగంలో అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక పెట్టుబడులు పెట్టడం తిరిగి మొదలైతే.. ఈ రంగంలో నియామకాలు కూడా పెరుగుతాయని కపూర్ చెప్పారు. -
అఫర్డబుల్ హౌస్ లోన్స్ .. వారికి కష్ట కాలమే!
ముంబై: అందుబాటు ధరల్లోని (అఫర్డబుల్) ఇళ్లకు గృహ రుణాలను అందించే కంపెనీలపై పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిర్మాణరంగ వ్యయాలు పెరిగి పోతాయని పేర్కొంది. ఇది అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించేందుకు దారితీస్తుందని విశ్లేషణ వ్యక్తం చేసింది. రూ.25 లక్షలు, అంతకంటే దిగువ బడ్జెట్ ఇళ్లను అఫర్డబుల్గా చెబుతారు. ఆర్థిక అనిశ్చితుల ప్రభావం ఈ విభాగంపై ఎక్కువగా ఉండదని లోగడ నిరూపితమైందంటూ.. గడిచిన దశాబ్ద కాలంలో ఈ విభాగం వేగంగా పురోగతి సాధించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. గత ఐదేళ్ల కాలంలో చూస్తే హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్లో వృద్ధిని.. అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి అధిగమించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ విభాగంలో తొలుత కొంత జోరు కనిపించినప్పుటికీ అదిప్పుడు సాధారణ స్థాయికి దిగొచ్చిందని పేర్కొంది. ‘‘అధిక ద్రవ్యోల్బణం కారణంగా రుణ గ్రహీతల వద్ద నగదు ప్రవాహం తగ్గిపోతుంది. నిర్మాణ వ్యయాలు పెరగడం వల్ల ప్రాపర్టీ ధరలు పెరగడమే కాకుండా, కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులు తగ్గుతాయి. ప్రభుత్వం అత్యవసర రుణ హామీ పథకాన్ని నిలిపివేయడం అనే సవాలును ఈ విభాగం ఎదుర్కొంటోంది’’ అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. ఈ చర్యతో బ్యాంకులు సైతం వెంటనే పలు రుణాల రేట్లను సవరించేశాయి. ప్రస్తుత రెపో రేటు కరోనా ముందున్న రేటు కంటే పావు శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో హౌసింగ్ ఫైనాన్స్ (గృహ రుణాలు) మార్కెట్ 13 శాతం వృద్ధిని చూపిస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. పెరగనున్న భారం ‘‘ఒక శాతం మేర వడ్డీ రేట్లు పెరిగితే రుణాల ఈఎంఐ 6.1-6.4 శాతం మేర పెరుగుతుంది. అందుబాటు ధరల ఇళ్ల రుణ గ్రహీతలపై ఈ పెరుగుదల 5.3 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక వివరించింది. వడ్డీ రేట్ల సైకిల్ ఇలానే ముందుకు సాగితే 2 శాతం మేర రేటు పెరగడం వల్ల ఈఎంఐపై పడే భారం 10.8-13 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ‘‘ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి పెంచడం ద్వారా (ఈఎంఐ పెంచకుండా) రుణ దాతలు ఆ ప్రభావాన్ని అధిగమించగలరు. కొత్త కస్టమర్లకు మాత్రం పెరిగిన రేట్ల మేర ఈఎంఐ అధికమవుతుంది. ఇది ఇల్లు కొనుగోలు సెంటిమెంట్ను మధ్య కాలానికి ప్రతికూలంగా మార్చేయవచ్చు’’అని ఈ నివేదిక వివరించింది. నిర్మాణంలో వాడే సిమెంట్, స్టీల్, కాంక్రీట్ సహా ఎన్నో ముడిసరుకు ధరల గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. కార్మికులకు చెల్లింపులు కూడా పెరిగిన విషయాన్ని పేర్కొంది. నిర్మాణ వ్యయం 20-25 శాతం మేర పెరిగేందుకు ఈ అంశాలు దారితీశాయని తెలిపింది. పెరిగిన ధరల ప్రభావాన్ని నిర్మాణదారులు పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేయలేవని పేర్కొంటూ.. మధ్య కాలానికి ప్రాపర్టీ ధరలపై ఇవి ప్రతిఫలిస్తాయని అంచనా వేసింది. -
AP: మళ్లీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం మళ్లీ క్రమంగా పెరుగుతోంది. అసని తుపాను ప్రభావంతో తగ్గిన డిమాండ్.. మళ్లీ పెరుగుతోంది. విద్యుత్ డిమాండ్ గత నెలతో పోల్చితే ప్రస్తుతం భారీగా తగ్గింది. ఏప్రిల్లో అత్యధికంగా రోజుకు 235 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వరకూ చేరిన వినియోగం కొద్ది రోజుల క్రితం అసని తుఫాను ప్రభావం వల్ల తగ్గుముఖం పట్టింది. చదవండి: ఏది నిజం: ఐదేళ్ల లూటీ ఆగిందనా మంట.. రామోజీ? వాతావరణం చల్లబడటంతో ఈ నెల 11వ తేదీన 151.43 మిలియన్ యూనిట్లకు తగ్గింది. దీంతో వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు పూర్తి స్థాయిలో విద్యుత్ అందిస్తూనే, పరిశ్రమలపై ఉన్న ఆంక్షలను దాదాపు ఎత్తేశారు. కానీ అంతలోనే పెరగడం మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 172.86 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది. కొనుగోలుకు రూ.2,687.81 కోట్లు ఖర్చు దేశవ్యాప్తంగా ఏర్పడ్డ బొగ్గు సంక్షోభం కారణంగా ఏర్పడ్డ విద్యుత్ కొరతకు ఏప్రిల్ నెల ప్రారంభంలో రాష్ట్రంలో అత్యధిక డిమాండ్ తోడైంది. ఫలితంగా కొద్ది రోజులు వినియోగదారులు విద్యుత్ కోతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. వెంటనే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించింది. పరిశ్రమల విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించింది. గృహాలు, వ్యవసాయానికి ఆటంకం లేకుండా సరఫరా చేసింది. ఇందుకోసం మొదట్లో బహిరంగ మార్కెట్లో రోజుకు సుమారు రూ.70 కోట్లు, ఆ తరువాత రోజుకి రూ.40 కోట్లు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేసింది. మార్చి నుంచి ఇప్పటివరకూ బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకే రూ.2,687.81 కోట్లు వెచ్చించింది. ఫలితంగా నేటికీ ఉత్తరప్రదేశ్లో రోజుకు 1.34 ఎంయూ, బీహార్లో 1.44 ఎంయూ, జార్ఖండ్లో 2.03 ఎంయూ, రాజస్థాన్లో 0.65 ఎంయూ కొరత ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. అందుబాటులో 208.63 మిలియన్ యూనిట్లు రాష్ట్రంలోని వివిధ కేంద్రాల నుంచి జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి డిమాండ్ కంటే ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం (ఈ నెల 13న) ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాల నుంచి 78.45 ఎంయూ, ప్రైవేటు థర్మల్ కేంద్రాల నుంచి 10.75 ఎంయూ, సెంట్రల్ గ్యాస్ స్టేషన్లు నుంచి 39.62 ఎంయూ, హైడ్రో స్టేషన్ల నుంచి 5.48 ఎంయూ, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ (ఐపీపీ) నుంచి 8.74 ఎంయూ, పవన విద్యుత్ 27.85 ఎంయూ, సౌర విద్యుత్ 17.65 ఎంయూ సమకూరుతోంది. 20.09 ఎంయూ బయటి నుంచి కొన్నారు. మొత్తం 208.63 ఎంయూ అందుబాటులో ఉంది. ప్రస్తుత వినియోగం 172.86 ఎంయూ మాత్రమే ఉంది. దీంతో ఒప్పందాల మేరకు సుమారు 35 ఎంయూను ఇతరులకు విక్రయించారు. మళ్లీ విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో మరికొద్ది రోజులు జాగ్రత్త అవసరమని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. -
అసలే భారంగా ధరలు..ఇప్పుడు మరింత పైపైకి..!
న్యూఢిల్లీ: టోకు ధరలు ఆందోళనకరంగా తయారయ్యాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో ఏకంగా 14.55 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే టోకు బాస్కెట్లోని వస్తువుల ధర 14.55 శాతం పెరిగిందన్నమాట. గడచిన నాలుగు నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. క్రూడ్, ఇతర కమోడిటీల ధరల తీవ్రత తాజా గణాంకాలపై ప్రతిబింబిస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో సరఫరాల చైన్కు తీవ్ర విఘాతం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనితో అసలే భారంగా ఉన్న టోకు ధరల తీవ్రత మరింత పెరిగింది. 2021 మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 7.80 శాతంగా ఉంది. 2021 ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం మొత్తం 12 నెలల్లో టోకు ధరలు రెండంకెలపైన కొనసాగడం గమనార్హం. కొన్ని ముఖ్యాంశాలు... ► ఫిబ్రవరిలో ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 8.19 శాతం ఉంటే, మార్చిలో 8.06 శాతానికి తగ్గింది. కూరగాయల ధరల స్పీడ్ కూడా నెలల వారీగా 26.93 శాతం నుంచి 19.88 శాతానికి దిగివచ్చింది. అయితే ఈ స్థాయి ధరలు కూడా సామాన్యుడిని బెంబేలెత్తిస్తాయి. ► మొత్తం సూచీలో దాదాపు 60% వాటా ఉన్న తయారీ రంగంలో టోకు ద్రవ్యోల్బణం 9.84% నుం చి (ఫిబ్రవరి) నుంచి 10.71 శాతానికి ఎగసింది. ► 20 శాతం వాటా ఉన్న ఫ్యూయల్ అండ్ పవర్ బాస్కెట్లో ద్రవ్యోల్బణం నెల వారీగా 31.50 శాతం నుంచి 34.52 శాతానికి ఎగసింది. ఒక్క క్రూడ్ పెట్రోలియంలో ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 55.17 శాతం ఉంటే మార్చిలో 83.56 శాతంగా నమోదయ్యింది. రేటు పెంపు అవకాశం... ద్రవ్యోల్బణం తీవ్రత కొనసాగితే, జూన్లో జరిగే ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన ద్రవ్య విధానాన్ని అవలంబించే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను పావుశాతం పెంచే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్థిక విశ్లేషణా సంస్థ ఎకోర్యాప్, రేటింగ్ సంస్థ ఇక్రా అంచనావేస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచుతూ, వృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ ఎంపీసీ రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2–6 శాతం శ్రేణిలో ద్రవ్యోల్బణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐని కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. -
Economy: ఎకానమీలో వెలుగు రేఖలు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ఆర్థిక మూలాలు పటిష్టతను ప్రతిబింబిస్తూ తాజా గణాంకాలు విడుదలయ్యాయి. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సానుకూల రీతిలో 11.9 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఆగస్టులో ఐఐపీ సూచీ 117.2 వద్ద ఉంటే, 2021 ఆగస్టులో 131.1 పాయింట్లకు ఎగసింది. వెరసి వృద్ధి 11.9 శాతమన్నమాట. ఇదిలాఉండగా, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 4.35 శాతంగా నమోదయ్యింది. పారిశ్రామిక ఉత్పత్తి తీరిదీ.. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన పారిశ్రామిక వృద్ధి గణాం కాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగం ఆగస్టు 2021లో 9.7 శాతం వృద్ధిని (2020 ఇదే నెల ఉత్పత్తితో పోల్చి) నమోదుచేసుకుంది. ► మైనింగ్: ఉత్పత్తి 23.6 శాతం ఎగసింది. ► విద్యుత్: ఉత్పత్తి విషయంలో వృద్ధి రేటు 16%. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సంకేతమైన క్యాపిటల్ గూడ్స్ విభాగం 19.9 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే నెలల్లో క్షీణత 14.4 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజరేటర్లకు సంబంధించిన ఈ విభాగంలో 8% వృద్ధి నమోదయితే, గత ఏడాది ఇదే కాలంలో ఈ విభాగంలో 10.2% క్షీణత నెలకొంది. ► కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్: ఎఫ్ఎంసీజీ రంగానికి సంబంధించి ఈ విభాగంలో 3 శాతం క్షీణత 5.2 శాతం వృద్ధిలోకి మారింది. ► ఎనిమిది మౌలిక రంగాలు: మొత్తం సూచీలో దాదాపు 40 శాతం వాటా కలిగిన ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఆగస్టులో 11.6 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. బొగ్గు, సహయ వాయువు రంగాల ఉత్పత్తిలో 20.6 శాతం పురోగతి నమోదయ్యింది. సిమెంట్ రంగం 36.3% పురోగమించగా, స్టీల్ విషయంలో ఈ వృద్ధి శాతం 5.1 శాతంగా ఉంది. పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి 9.1 శాతం పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి 15.3 శాతం ఎగసింది. క్రూడ్ ఆయిల్ (మైనస్ 2.3 శాతం), ఎరువుల (మైనస్ 3.1 శాతం) పరిశ్రమలు మాత్రం ఇంకా వృద్ధి నమోదుకాకపోగా, క్షీణతను ఎదుర్కొన్నాయి. ఐదు నెలల్లో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్–ఆగస్టు) ఐదు నెలల కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 28.6 శాతం. గత ఏడాది ఇదే కాలంలో 28.6 శాతం క్షీణత నమెదయ్యింది. కోవిడ్ సవాళ్లతో ఒడిదుడుకుల బాట మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. కీలక గణాంకాలను పరిశీలిస్తే... బేస్ కూడా కారణమే! తాజా సానుకూల గణాంకాలకు బేస్ కూడా కారణం కావడం గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 ఆగస్టు నెలను తీసుకుంటే కరోనా కష్టాలతో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా 7.1 శాతం క్షీణతను (2019 ఇదే కాలం ఉత్పత్తితో పోల్చి) నమోదుచేసుకుంది. ఇక ఎనిమిది పరిశ్రమల గ్రూప్ కూడా 2020 ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా 6.9 శాతం క్షీణతను ఎదుర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఎనిమిది రంగాల పురోగతి 19.3 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కరోనా కష్టాలతో ఈ గ్రూప్ వృద్ధి లేకపోగా 17.3% క్షీనత నమోదయ్యింది. 5 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం ఇక సెప్టెంబర్లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ప్రభుత్వం ఇస్తున్న నిర్దేశాలకు అనుగుణంగా 4.35 శాతంగా నమోదయ్యింది. గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి (2021 ఏప్రిల్లో 4.23 శాతం). కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు తగ్గాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతం. అయితే, గత ఏడాది సెప్టెంబర్లో 7.27 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెలలో ధరల స్పీడ్ విషయానికి వస్తే... ఆహార ద్రవ్యోల్బణం 0.68 శాతంగా ఉంది. ఆగస్టులో ఈ రేటు 3.11 శాతం. ఒక్క కూరగాయల బాస్కెట్ 22.47 శాతం పడిపోయింది. ఆగస్టులో ఈ తగ్గుదల 11.68 శాతం. ఇంధనం, లైట్ విభాగంలో మాత్రం రిటైల్ ద్రవ్యోల్బణం 12.95 శాతం (ఆగస్టు) 13.63 శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక పటిష్టతకు రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలని కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరళరత వడ్డీరేట్ల విధానానికి సీపీఐ ఈ స్థాయిలో కొనసాగడం కీలకం.. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందన్న భరోసాతో వృద్ధే లక్ష్యంగా గడచిన ఎనిమిది ద్వైమాసిక సమావేశాల్లో ఆర్బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు – ప్రస్తుతం 4 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగలు 5.7 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలను ఈ నెల మొదట్లో ఆర్బీఐ 5.3 శా>తానికి కుదించింది. 2021–22 రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1%, 4.5%, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2% నమోదవుతుందని భావిస్తోంది. -
రెండు ప్రమాదాలతో సతమతవుతున్న కేరళ
-
ఉల్లి.. లొల్లి...!
ఉల్లి చేసిన మేలు తల్లి చేయదనేది నానుడు. ఉల్లి గొప్పతనాన్ని కవులు ఎంతగానో పొగడారు. దీనివెనుక ఉల్లి ఆవశ్యకత అంత. ఉల్లి లేనిది వంటకాలు రుచి తగలడం కష్టమే. దాదాపు అన్ని రకాల కూరలు, ఇతర వంటల్లో ఉల్లి వినియోగించాల్సిందే. కాబట్టే ఉల్లికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే పంట సరిపడినంత ఉన్నంత కాలం ఇబ్బంది ఉండదు. సరుకు దొరకడంతో పాటు ధరలు స్వల్పంగా మాత్రమే పెరుగుదల, తగ్గుదల ఉంటాయి. అయితే సరుకు కొరత ఏమాత్రం తక్కువగా ఉన్న ధరలు అమాంతంగా పెరిగిపోవడం ఖాయం. ప్రస్తుతం అదే జరిగింది. విజయనగరం గంటస్తంభం: ఏటా ఏదో ఒక సమయంలో ఉల్లి ధరలు లొల్లి సృష్టించడం ఆనవాయితీగా మారిపోయింది. ఈ ఏడాది ప్రస్తుత మార్కెట్లో ఉల్లి ధరలు మళ్లీ అమాంతం పెరిగి కొనుగోలుదారులను కంటనీరు పెట్టిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో సగానికి పైగా ధర పెరిగింది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు కృత్రిమ డిమాండ్ సృష్టించి మరింత ధర పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా ఉల్లి ధరలు దసరా, అమ్మవారి పండగ నాటికి ఎంతకు చేరుతాయోనని కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెరిగిన ఉల్లి ధర.. ఉల్లి ధర నెల రోజుల్లో వంతుకు వంతు పెరిగింది. సెప్టెంబరు ఒకటో తేదీ నాటికి తెలుపు(పెద్ద) ఉల్లి బహిరంగ మార్కెట్లో కేజీ రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.40కు పెరిగింది. కనీసం నాలుగైదు రూపాయిలు తేడా ఉండే రైతు బజారులో కూడా బుధవారం రూ.35 ఉంది. ఇక జిల్లాలో అంతగా వినియోగించని కర్నూలు ఉల్లి ధర కూడా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కేజీ రూ.35 ఉంటే రైతుబజారులో రూ.32 ఉంది. దీని ధర కూడా 20రోజుల్లో వంతుకు వంతు పెరగడం విశేషం. సరుకు కొరత కారణం.. ఉల్లి ధరలు భారీగా పెరగడానికి సరుకు కొరత కారణం. జిల్లాకు మహారాష్ట్ర నుంచి సరుకు వస్తుంది. కర్నూలు నుంచి కొంత సరుకు వస్తుంది. అక్కడ ప్రస్తుతం సరుకు తక్కువగా ఉంది. వర్షాలు పడుతుండడంతో పంట తీసే పరిస్థితి లేక కొరత ఏర్పడింది. ఫలితంగా ఇక్కడ వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. మళ్లీ అక్కడ సరుకు ఎక్కువగా దొరికే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరుగుతాయని ప్రచారం.. ఇదిలా ఉండగా వ్యాపారులు ధరలు మరింత పెరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. సాధారణంగా ఉల్లి ధర కాస్తా పెరిగినపుడు వ్యాపారులు మరింత డిమాండ్ సృష్టించడం జిల్లాలో పరిపాటి. సరుకు రావడం లేదని, తక్కువ సరుకు ఉందని చెప్పి రోజురోజుకు ధర పెంచుతూ వెళ్తారు. వాస్తవానికి ఉల్లి కుళ్లిపోయే సరుకు కావున కొనుగోలు ఆపేస్తే ధర తగ్గుతుంది. కానీ రోజువారీ అవసరాలకు ఉల్లి తప్పనిసరి కావడంతో జనాలు కొనుగోలు చేయకతప్పని పరిస్థితి. దీంతో చిల్లర వర్తకులు వద్ద హోల్సేల్ వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతుంటారు. ఈ భారం చివరికి వినియోగదారులపైనే పడుతుంది. ప్రస్తుతం ఉన్న సరుకు కొరత, డిమాండ్ను అడ్డం పెట్టుకునే ధరలు పెరుగుతాయని ముందే ప్రచారం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు మానసికంగా సిద్ధమై పెంచినా కొంటారని వ్యాపారులు ఆలోచన. ఇదిలా ఉండగా ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెప్పడంతో వినియోగదారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఉన్న ధరతో సర్దుకుంటున్నామని, మరింత పెరిగితే ఇబ్బందేనని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ డిమాండ్ రాకుండా అధికారులు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది. సరుకు లేకే... ఉల్లి ధర రోజుకు రూపాయి, రెండు పెరుగుతోంది. మహరాష్ట్రలో జనవరి, ఫిబ్రవరిలో పండే సరుకు చివరి దశకు చేరడంతో దొరకడం లేదు. ఈ సీజన్లో కర్నూలు నుంచి ఉల్లి వస్తుంది. కానీ వర్షాలు వల్ల రాకపోవడంతో కొరత ఉంది. దీంతో ధర పెరుగుతుంది. – ఎస్.వి.వి.లక్ష్మీనారాయణ, వ్యాపారి దృష్టి పెడతాం... ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. సరుకు తక్కువగా రావడం వల్ల అక్కడే పెరగడం వల్ల ఇక్కడ మార్కెట్లో పెరగక తప్పదు. ఇప్పటివరకు కృత్రిమ కొరత, డిమాండ్ వ్యాపారులు సృష్టిస్తున్నట్లు సమాచారం లేదు. కానీ మున్ముందు ధర పెరిగే అవకాశం ఉన్నందున సరుకు లభ్యతపై దృష్టి పెడతాం. – శ్యామ్కుమార్, ఏడీ మార్కెట్ శాఖ -
సూరీడి వాత.. విద్యుత్ కోత
కొవ్వూరు : సూరీడు చిర్రెత్తిస్తున్నాడు. జిల్లాలో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో సోమవారం అత్యధిక ఉష్ణోగ్రత 44 డిగ్రీలు నమోదైంది. వేడి గాలులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. దీనికి విద్యుత్ కోతలు తోడయ్యాయి. జిల్లా అవసరాల మేరకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో లోటును భర్తీ చేసుకోవడానికి రోజుకో ప్రాంతంలో కోత విధిస్తున్నారు. రానున్న రోజుల్లో వినియోగం మరింత పెరగనుండగా.. విద్యుత్ కోతల సమస్య మరింత తీవ్రం కానుంది. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 820 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతోంది. ట్రాన్స్కో నెట్వర్క్ సమస్య కారణంగా 30 నుంచి 40 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడుతోంది. దీంతో కొన్ని ప్రాంతాలకు సరఫరాలో కోత విధిస్తున్నారు. కామవరపుకోట మండలం ఆడమిల్లిలో 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే జిల్లాకు 230 మెగావాట్ల విద్యుత్ అందే అవకాశం ఉంది. సూర్యాపేట నుంచి అందే ఒకలైన్కు మాత్రమే కనెక్షన్ ఇవ్వడంతో ఈ సబ్ స్టేషన్ నుంచి 70 నుంచి 80 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుతోంది. విశాఖలోని హిందూజా ప్లాంట్నుంచి మరో లైన్ ఈ సబ్స్టేషన్కు రావాల్సి ఉంది. ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. సరఫరాలో నష్టాలతో కొన్ని ప్రాంతాల్లో లో ఓల్టేజీ సమస్య తలెత్తుతోంది. దీంతో అధికారులు కొన్ని ప్రాంతాల్లో కోతలు విధిస్తున్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ కోతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నారు. -
పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: గత 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా, కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు కాగా.. రాత్రి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో పగటి ఉష్ణోగ్రత 3 డిగ్రీలు ఎక్కువగా 33 డిగ్రీలు కాగా.. రాత్రి ఉష్ణోగ్రత 3 డిగ్రీలు తక్కువగా 16 డిగ్రీలు నమోదైంది. మహబూబ్నగర్లో పగటి ఉష్ణోగ్రత 2 డిగ్రీలు ఎక్కువగా 34 డిగ్రీలు.. రాత్రి ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తక్కువగా 17 డిగ్రీలు నమోదైంది. నల్లగొండలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ చొప్పున తక్కువగా నమోదయ్యాయి. రామగుండంలో రాత్రి ఉష్ణోగ్రత 2 డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీలు... పగటి ఉష్ణోగ్రత 31 డిగ్రీలు నమోదైంది. -
‘బుక్’ అయినట్టే!
► ప్రైవేటు స్కూళ్లలో భారీగా పెరగనున్న పాఠ్యపుస్తకాల ధరలు ► వచ్చే విద్యా సంవత్సరం 13 శాతం మేర పెరగనున్న రేట్లు ► పబ్లిషర్లకు పచ్చజెండా ఊపిన సర్కారు ► ప్రభుత్వ సిలబస్ పుస్తకాలకు రూ.500 లోపే.. ► అదే ప్రైవేటు సిలబస్ పుస్తకాలకు రూ.3 వేల పైనే.. ► 30 లక్షల కుటుంబాలపై పడనున్న భారం ► ప్రైవేటు స్కూళ్లలో ఇక యాజమాన్యాలు చెప్పిందే సిలబస్ సాక్షి, హైదరాబాద్ ప్రైవేటు స్కూళ్లలో ఫీజులే కాదు.. పుస్తకాలూ మోతెక్కిపోతున్నాయి! రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల్ని చదివిస్తున్న దాదాపు 30 లక్షల కుటుంబాలపై పాఠ్యపుస్తకాల భారం పడబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం (2017–18)లో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే 15 లక్షల మంది విద్యార్థుల పుస్తకాల ధరలు ప్రస్తుత విద్యా సంవత్సరం (2016–17) ధరల కంటే 13 శాతం పెరగనున్నాయి. ఈ మేరకు పుస్తకాల ధరలు పెంచుకునేందుకు పబ్లిషర్లకు విద్యాశాఖ ఓకే చెప్పింది. పేపరు ధరలు పెరిగినందున బుక్కుల రేట్లు పెంచేందుకు అంగీకరించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రైవేటులో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే మరో 15 లక్షల మంది విద్యార్థులపై మరింత భారం పడబోతోంది. ఈ 13 శాతం భారంతోపాటు ప్రైవేటు పబ్లిషర్లు అదనంగా నిర్ణయించే ధరలను కూడా మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ నిర్దేశిత సిలబస్ కాకుండా.. ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించి పంపిణీ చేసే పుస్తకాలను అమలు చేయడం వల్ల వాటికి తల్లిదండ్రులు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అలాకాకుండా ప్రైవేటు స్కూళ్లలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రభుత్వ నిర్దేశిత సిలబస్తో కూడిన పాఠ్య పుస్తకాలను అమలు చేస్తే ఒక్కో పుస్తకాల సెట్కు సగటున రూ.220లోపు ఖర్చు కానుంది. నోట్బుక్లతో కలుపుకొని రూ.500 వరకు అవుతోంది. ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను అమలు చేస్తే ఒక్కో విద్యార్థి పుస్తకాలు, నోట్బుక్లకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. సాధారణ ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రాథమిక తరగతుల పుస్తకాలు, నోట్బుక్లకు రూ.3 వేలపైనే వెచ్చించాల్సి పరిస్థితి నెలకొంది. ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ నిర్దేశిత సిలబస్ను తప్పకుండా అమలు చేయాలన్న నిబంధన విషయంలో మౌనంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి సర్కారు వచ్చినట్లు తెలిసింది. ప్రైవేటు పబ్లిషర్లు, పాఠశాలల యాజమాన్యాలు కలిసి ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తేవడం వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆ పట్టుదల ఏమైంది? 2016–17 విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రైవేటు పాఠశాలలు కచ్చితంగా ప్రభుత్వ నిర్దేశిత పుస్తకాలను వినియోగించాలని విద్యాశాఖ జూన్లో ఆదేశాలు జారీ చేసింది. అయితే విద్యా సంవత్సరం మొదలయ్యాక ఎలా ఈ ఆదేశాలను అమలు చేస్తామని యాజమాన్యాలు ప్రశ్నించాయి. తాము బోధిస్తున్న çప్రైవేటు పుస్తకాల స్థాయిలో ప్రభుత్వ పుస్తకాలు లేవని, విద్యార్థులు అప్పటికే పుస్తకాలను కొనుగోలు చేశారంటూ కోర్టును ఆశ్రయించాయి. న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. తీర్పు నవంబర్లో రావడంతో విద్యాశాఖ మిన్నకుండి పోయింది. 2016లో చూపిన పట్టుదలను విద్యాశాఖ ఇప్పుడు చూపడం లేదు. పైగా ఈసారి ముందస్తుగానే పుస్తకాలను ముద్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రారంభమైంది. అయినా ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను తప్పకుండా వినియోగించాలన్న ఉత్తర్వులను జారీ చేయలేదు. పైగా ప్రైవేటు యాజమాన్యాలు అడిగితేనే వారికి తమ పుస్తకాలను ఇస్తామని విద్యాశాఖ చెబుతోంది. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే విద్యాశాఖ మిన్నకుండిపోయినట్లు కొంతమంది అధికారులు పేర్కొంటున్నారు. నిజంగా అంత స్థాయి లేదా? నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాశాఖ నిర్దేశిత సిలబస్ పుస్తకాలనే వినియోగించాలి. కానీ ప్రైవేటు యాజమాన్యాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. పబ్లిషర్లు ఇచ్చే కమీషన్ల కోసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రైవేటు పుస్తకాలను వినియోగిస్తున్నాయి. మరింత లాభం కోసం తమ పాఠశాలల్లోనే విక్రయిస్తున్నాయి. పైగా ప్రభుత్వ సిలబస్ కంటే ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాల స్థాయి మెరుగ్గా ఉందని చెబుతున్నాయి. గతేడాది ఇదే వాదనను తెరపైకి తెచ్చాయి. ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాల స్థాయికి అనుగుణంగా ప్రభుత్వ నిర్దేశిత పుస్తకాలను మెరుగుపరిస్తే అమలు చేసేందుకు తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నాయి. మరి నిజంగానే ౖప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలు మెరుగ్గా ఉన్నాయా? ఉంటే వాటి స్థాయికి ప్రభుత్వ పుస్తకాలను ఎందుకు డెవలప్ చేయడం లేదనన్నది ప్రధాన ప్రశ్న. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆ స్థాయి విద్యను అందించేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్న వాదన ఉంది. అయితే ఇందులో మెరుగైన బోధన, పుస్తకాల స్థాయి కంటే వ్యాపార ప్రయోజనాల కోసమే ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా విద్యాశాఖకు, ప్రభుత్వానికి తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
మళ్లీ మెరిసిన పసిడి!
న్యూయార్క్/ముంబై: కొన్ని వారాలుగా మసకబారుతున్న బంగారం ధర మళ్లీ శుక్రవారం మెరిసింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడింగ్లో కడపటి సమాచారం అందే సరికి క్రితం ముగింపుతో పోల్చితే.. 25 డాలర్ల లాభంతో 1,086 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. కడపటి సమాచారం అందేసరికి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ధర 10 గ్రాములకు క్రితంతో పోల్చితే దాదాపు రూ.500 లాభంతో రూ. 25,725 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా కేజీకి భారీగా రూ. 825 ఎగసి రూ.35,125 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే... శనివారం స్పాట్ మార్కెట్లో ధర పెరిగే అవకాశం ఉంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బెంచ్మార్క్ డిపాజిట్ రేటును తగ్గించిన నేపథ్యంలో డాలర్పై యూరో బలపడ్డం తాజా పసిడి జోరుకు కారణం. దేశీయ మార్కెట్లో లాభం... ఇదిలావుండగా, ప్రధాన ముంబై బులియన్ స్పాట్ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర మూడున్నర నెలల కనిష్ట స్థాయి నుంచి పెరి గింది. 99.9 ప్యూరిటీ ధర క్రితంతో పోల్చితే రూ.225 ఎగసి రూ. 25,290కి చేరింది. 99.5 ప్యూరిటీ ధర కూడా ఇంతే మొత్తం పెరిగి రూ. 25,140కి చేరింది. ఇక వెండి కేజీ ధర రూ.290 ఎగసి రూ.34,600 పలికింది. -
బెంబేలెత్తిస్తున్న పెట్రోల్,డీజిల్ ధరలు
-
రైజింగ్లో ఐశ్వర్యరాజేశ్
నటి ఐశ్వర్య రాజేశ్ ఇప్పుడు మంచి రైజింగ్లో ఉన్నారు. కథానాయిక పాత్రలయితేనే నటిస్తాను అని మడి కట్టుకు కూర్చోకుండా నటనకు అవకాశం ఉన్న ఏ పాత్రనయినా చాలెంజ్గా తీసుకుని నటిస్తున్న ఐశ్వర్యరాజేశ్కిప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఒక పక్క హీరోయిన్గానూ, మరో పక్క ముఖ్య పాత్రల్లోనూ ఎడాపెడా నటించేస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను చిత్రాలకు పైగా ఉన్నాయి. రమ్మి, పన్నయారుం పద్మియుం తదితర చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఐశ్వర్యరాజేశ్ శీనురామసామి దర్శకత్వంలో నటించిన ఇదం పొరుళ్ ఏవల్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఒక కుట్రముదండనై, దీపావళి చిత్రాలతో పాటు నటి కుష్భూ తన అవ్ని సినీమాక్స్ పతాకంపై నిర్మిస్తున్న హలో నాన్ పెయ్పేసుగిరేన్, రెడ్జెయింట్ మూవీస్ పతాకంపై ఎండ్రెండ్రుం పున్నగై చిత్రం ఫేమ్ అహ్మదు దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా అరుళ్నిధి హీరోగా ఈరం చిత్రం ఫేమ్ అరివళగన్ దర్శకత్వం వహిస్తున్న ఆరదు సినమ్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. వీటితో పాటు మరో రెండు కొత్త చిత్రాలను అంగీకరించినట్లు ఐశ్వర్యరాజేశ్ తెలిపారు. జాలీయ అవార్డును గెలిసుకున్న కాక్క ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్న ఐశ్వర్య రాజేశ్ కథలో పాముఖ్యత ఉన్న ఎలాంటి పాత్రనయినా పోషించడానికి సిద్ధం అంటున్నారు.