SC ST Welfare Schemes
-
క్రీమీలేయర్ పేరిట చిచ్చు పెట్టొద్దు: ఖర్గే
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీల్లోని క్రీమీలేయర్కు రిజర్వేషన్లు వర్తింపజేయకూడదన్న ఆలోచనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం చెప్పారు. ఈ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న భాగాన్ని తొలగించాలని, ఇందుకోసం పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. క్రీమీలేయర్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేయొద్దని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీలేయర్ను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు తీర్పులో న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. క్రీమీలేయర్కు రిజర్వేషన్లు నిరాకరించాలని ఆయన సూచించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అస్పృశ్యత ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని మల్లికార్జున ఖర్గే తేలి్చచెప్పారు. రిజర్వేషన్ల అమలు కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విధానానికి ముగింపు పలికేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. -
‘క్రీమీ లేయర్’పై బీజేపీ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ క్రీమీ లేయర్కు రిజర్వేషన్ల ఫలాలు వర్తింపజేయకూడదని, క్రీమీ లేయర్ను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై బీజేపీ ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. వారంతా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాదటిని అమలు చేయొద్దంటూ వినతి పత్రం సమరి్పంచారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎవరికీ నష్టం జరగదని మోదీ హామీ ఇచ్చినట్టు అనంతరం వారు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, సాధికారతకు తాము కట్టుబడి ఉన్నామని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. -
ఎస్సీల ఉపవర్గీకరణపై సుప్రీం జస్టీస్ మిత్తల్ కీలక వ్యాఖ్యలు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది. అత్యంత వెనుకబడిన ఉప కులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ, 341వ ఆర్టికల్లు ఈ ఉప కోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం (ఆగస్ట్1న) చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.ఈ తీర్పును వెలువరించే సమయంలో ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ పంకజ్ మిత్తల్ 51 పేజీల ప్రత్యేక తీర్పులో కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల విధానానికి తాజా పునఃపరిశీలన అవసరమని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల అభ్యున్నతికి కొత్త పద్ధతులు అవసరమని అన్నారు.రాజ్యాంగ పాలనలో కుల వ్యవస్థ లేదని, అణగారిన వర్గాలకు, అణగారిన ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశ్యంతో తీర్పును వెలువరించినట్లు చెప్పారు. దేశం కుల రహిత సమాజంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పైన పేర్కొన్నవర్గాలకు చెందిన వ్యక్తుల ప్రమోషన్, లేదా ఇతర ప్రయోజనాలు, ప్రత్యేకాధికారం వంటివి కులం ప్రాతిపదికన కాకుండా నివాసం స్థితి, ఆర్థిక కారకాలు, జీవన స్థితి,వృత్తి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న సౌకర్యాల ఆధారంగా ప్రమాణాలై ఉండాలని జస్టిస్ పంకజ్ మిత్తల్ తెలిపారు. -
FACT CHECK: బడుగులను ఏవగించుకునే బాబు రామోజీకి గొప్పోడు!
ఇంట్రో... మంచి మనిషికో మాట...మంచి గొడ్డుకో దెబ్బ ...అంటారు...రామోజీ దుర్మార్గపు రాతలపై ఎన్నిసార్లు వాస్తవాల హంటర్ ఝళిపించినా బజారుస్థాయి రాతలతో పత్రికను ఆసాంతం దిగజార్చుకుంటూనే పోతున్నారు...జగన్ ప్రభుత్వ వ్యతిరేకత అనే పూనకంలో కన్నూమిన్నూగాననంతగా తప్పుడు కథనాలను అచ్చేస్తున్నారు...విచక్షణాయుత పాత్రికేయానికి మంగళం పాడేసి దుష్ట పాత్రికేయం అంటే ఎలా ఉంటుందో పాఠకలోకానికి తన రాతల్లో చూపిస్తున్నారు...అన్నీ ఏకపక్ష కథనాలు... పవిత్ర పాత్రికేయ వస్త్రాన్ని తొలగించుకుని అక్షర దిగంబర నృత్యం చేస్తున్నట్లుగా ఉంది రామోజీ తీరు...ఈ కథనాలు ఎవరు చదివినా చదవకపోయినా బాబొక్కడు చదివితే చాలు తన జన్మ ధన్యమైపోతుందన్న మూర్ఖత్వంలో బొంకుల దిబ్బపై కూర్చుని బొంకుడు కథనాలను రాస్తున్నట్లుగా ఉంది...బడుగులను ఏవగించుకున్న బాబు రామోజీ దృష్టిలో గొప్పోడు..అయిదేళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ లకు అన్ని రంగాల్లోనూ అగ్రాసనం వేసిన జగన్ అంటే మంట...మంచి చేసిన జగన్ కన్నా జనాన్ని ముంచే బాబే రామోజీకి ఆదర్శం..ఈ వికృతధోరణిని నిలువెల్లా ఒంటబట్టించుకుని మంగళవారం ’నా..నా...నా..అని బాకా...చేసిందంతా ధోకా’ శీర్షికన జగన్ ప్రభుత్వంపై రాళ్లేస్తూ...ఓ తప్పుడు కథనాన్ని జనంపైకి వదిలారు...రామోజీ బుర్ర తక్కువ రాతలకు వాస్తవాల షాక్ ఇచ్చే సమాధానాలివి...సాక్షి, అమరావతిః చంద్రబాబుకు పదవీ ప్రయోజనం కోసం రామోజీ అబద్ధాల డోలు వాయించడం మానడం లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ధోకా ఇచ్చింది చంద్రబాబేనని తెలిసినా రామోజీ దుర్మార్గ రాతల ధోరణి మాత్రం మారడంలేదు. రాష్ట్రంలో దళిత, గిరిజనులకు విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాలతో వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వడంలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపింది. ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధితో పాటు అనేక విధాలుగా ఆదుకోవడంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్ద మనస్సును చాటుకుంది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలను రద్దు చేశారని, ఉపాధి అవకాశాలను దెబ్బతీశారనే తప్పుడు ప్రచారానికి ఈనాడు బరితెగించింది.పేదల అసైన్డ్ భూములను రాబందులా ఆక్రమించి ఫిలిం సిటీ కోట కట్టుకున్న రామోజీ నీతులు వల్లిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కారు దళితులను భయపెట్టి భూములను కాజేసినా రామోజీ కళ్లప్పగించి చూశారు. వ్యవసాయ భూమి ఉన్న దళితులకు కనీసం మోటారు కనెక్షను అయినా ఇవ్వకపోయినా అది తప్పని ఏ రోజూ బాబుకు బుద్ధి చెప్పలేదు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల పేరుతో బాబు అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టినా, ఎస్సీలకు దక్కాల్సిన కార్లు బినామీల పేరుతో టీడీపీ నేతలు దక్కించుకున్నా, ఈ ఎల్లో మీడియా పెద్దకు అక్షరం రాసేందుకు మనసొప్పలేదు.రామోజీ చేసిన ఆరోపణలు ఎంత నీచమైనవో చెప్పే వాస్తవాలివి... ఆరోపణః కొత్త వైద్య కళాశాలల్లో రిజర్వేషన్ల కోత వాస్తవంః కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కొత్తగా ఎంబీబీఎస్ సీట్లను సీఎం వైఎస్ జగన్ సాధించారు. 2023–24 విద్యా సంవత్సరంలో 5 వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో ఒక్కసారిగా 319 కన్వీనర్ కోటా సీట్లు పెరిగాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే సీట్లు దక్కించుకుని లబ్ధిపొందారు. మీ బాబు అధికారంలో ఉండగా ఏనాడైనా ఈ విధంగా అట్టడుగు వర్గాల పిల్లలకు మెడికల్ సీట్లను తెచ్చిపెట్టి మేలు చేశాడా రామోజీ? ఆరోపణః అవన్నీ సంక్షోభ వసతి గృహాలు వాస్తవంః సంక్షోభంలో వసతి గృహాలు అంటూ ఈనాడు మరో వక్రీకరణకు దిగింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే సోషల్ వెల్ఫేర్ స్కూళ్ల మరమ్మతుల కోసం ఇప్పటికే రూ. 64.33 కోట్లు ఖర్చు చేసింది. 39 సివిల్ వర్కుల కోసం మరో రూ.133.90 కోట్ల మొత్తాన్నీ వెచ్చించింది. ఈ భవనాలన్నీ నిర్వహణలోకి వచ్చాయి. దాదాపు రూ.318 కోట్లతో 177 స్కూళ్లలో నాడు–నేడు పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది, వసతి గృహాలను ఆధునికీకరించి మౌలిక వసతులు కల్పించింది. ఆరోపణః సివిల్స్లో శిక్షణకు విముఖత, పోటీలో నిలవకుండా కుట్ర వాస్తవంః నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ సర్వాంగ సుందరంగా మారుతున్నాయి.పోటీ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ కోచింగ్ ప్రోగ్రామ్లను నిర్వహిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతుల్లో స్టడీ సర్కిళ్లున్నాయి. ఒక్కో స్డడీ సర్కిల్లో ఒక్కో మాదిరిగా సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్ టెస్ట్లకు శిక్షణ ఇస్తున్నారు. గత ప్రభుత్వం విద్యోన్నతి పథకం కింద 9,775 మంది అభ్యర్థులను శిక్షణ కోసం ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు పంపగా , ఒక అభ్యర్థి మాత్రమే ఎంపికైనా రామోజీ ఏరోజూ రాయలేదు. ఆ పథకాన్ని సవరించి సివిల్స్ సర్వీస్ పరీక్షకు ఏపీ స్టడీ సర్కిళ్లలోనే ఇప్పుడు కోచింగ్ ఇస్తున్నారు. ఇటీవలే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. మెయిన్స్కు అర్హత సాధిస్తే రూ.లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించి అందిస్తోంది.పేద పిల్లలు ఉన్నత స్థానాలకు పోటీ పడి ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు అమెరికా వంటి సంపన్నదేశాలకు వెళ్లేందుకు ఊతమిస్తున్న సీఎం వైఎస్ జగన్పై రామోజీ విషం కక్కుతున్నారు. ఆరోపణః విదేశీ విద్యకు కొర్రీలు వాస్తవంః గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యా పథకంలో జరిగిన లోపాలు, అవినీతి, అక్రమాలు విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి లోపాలు, అక్రమాలకు తావులేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తెచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించేలా పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తోంది.అభ్యర్ధులు ఎంచుకోదగ్గ 21 కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్లు, ట్యూషన్ ఫీజు 100 శాతం చెల్లించేలా పథకాన్ని సమర్థంగా మార్చి ప్రభుత్వం అమలు చేస్తోంది. మిగిలిన వర్గాలకు రూ.కోటి లేదా అసలు ట్యూషన్ ఫీజు (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తోంది. ఈ స్థాయిలో విదేశీ విద్య కోసం గత ప్రభుత్వం భరోసా ఇవ్వగలిగిందా? మరి ఈనాడు ఈ పథకంపై పదేపదే ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోందో రామోజీ పక్షపాత బుద్ధిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.. ఆరోపణః స్వయం ఉపాధికి చెల్లు వాస్తవంః ఇస్త్రీ పెట్టె.. కత్తెర ఇచ్చి.. అదే స్వయం ఉపాధి పథకం అని గత టీడీపీ ప్రభుత్వం అర్భాటపు ప్రచారం చేసుకునేది. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను అన్ని విధాలుగా ఆదుకుని వారి జీవన ప్రమాణాలను పెంచేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేష కృషి చేసింది.టీడీపీ హయాంలో స్వయం ఉపాధి పథకం కింద 2,02,414 మందికి రూ.2,726 కోట్లు, ఎస్టీలు 39,906 మందికి రూ.284.8 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా ద్వారా 23,27,682 మంది ఎస్సీలకు రూ.9,697.99 కోట్లు. 4,78,716 మంది ఎస్టీలకు రూ.1,895.37 కోట్ల లబ్ధి చేకూరింది. చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటుకు 6,256 మంది ఎస్సీలకు రూ.346.79 కోట్లు, 1,228 మంది ఎస్టీలకు రూ.65.90 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది.స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక అభ్యున్నతి కోసం పౌర సరఫరాల సంస్థ ద్వారా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.133.67 కోట్లతో ఎస్సీ లబ్ధిదారులకు 2,300, ఎస్టీలకు 701 ఫోర్ వీలర్ మినీ ట్రక్ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ వాహనాలను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డోర్ డెలివరీ కోసం అందించింది.ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా స్వయం ఉపాధి పథకంలో రూ.63.20 కోట్లతో 1,038 యూనిట్లను అమలు చేసింది. ఆరోపణః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదు వాస్తవంః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదని తప్పుడు రాతలు రాసిన ఈనాడు గత ప్రభుత్వం భూమి కొనుగోలు పథకానికి ఎంతమేర భూమి సేకరించిందనే విషయాన్ని రాయలేకపోయింది. దీన్నిబట్టే ఈ పథకాన్ని టీడీపీ ఎత్తేసిందనే సంగతి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.దశాబ్దాల క్రితం భూమి కొనుగోలు కోసం ఎస్సీ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. ఎస్సీల జీవితాల్లో ఇది మైలు రాయిగా నిలిచిపోయింది. 22ఏ జాబితా నుంచి మినహాయింపుతో 14.223 దళిత మహిళలకు 16,213.51 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. అసైన్ భూముల క్రమబద్ధీకరణతో 3,57,805 మందికి 5,37,719 ఎకరాలపై హక్కులు దక్కాయి. అవసరమైనప్పుడు భూములను విక్రయించడానికి ఎస్సీ మహిళా లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం పూర్తి హక్కులను కల్పించింది. ఎస్సీ మహిళా లబ్ధిదారులు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, వైఎస్ఆర్ జలకళ, పంటలబీమా సాయాన్నీ పొందే సౌలభ్యాన్నీ ఏర్పరిచింది.అసైన్డ్ భూముల డీనోటిఫికేషన్ తర్వాత, భూమి యజమానులు తమ భూములపై ఫ్రీహోల్డ్ హక్కులు పొందుతారు. పట్టా భూములతో సమానంగా తమ భూములను విక్రయించుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వాల కంటే అత్యధికంగా ఎస్టీలకు ఏకంగా 2.47 లక్షల ఎకరాలకు పైగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాలకు గత ప్రభుత్వం ఒక్క సెంటు భూమినీ కొనుగోలు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు ’ కార్యక్రమంలో దళితులకు, ఎస్టీలకు బాసటగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 31.19 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇస్తే , అందులో 6,36,732 మంది లబ్ధిదారులు దళిత వర్గాలకు చెందిన అక్క చెల్లెమ్మలే (మొత్తం లబ్ధిదారుల్లో 20.7 శాతం).ఆయా కుటుంబాలకు రూ.10,949 కోట్ల లబ్ధి చేకూర్చింది. వారి కోసం చేస్తున్న 4,18,646 ఇళ్ల నిర్మాణ రూపంలో మరో రూ.10,949 కోట్ల లబ్ధి చేకూరుతోంది. 1,41,496 మంది ఎస్టీ అక్కచెల్లెమ్మలు (మొత్తం లబ్ధిదారుల్లో 6 శాతం) ఉన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంతటి లబ్ధి ఈ వర్గాలకు దక్కడం ఇదే ప్రథమం. ఇంత భారీస్థాయిలో దళితులకు ఏ ప్రభుత్వం అండగా నిలబడలేదు. ఆరోపణః బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్కు గండి వాస్తవంః ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని నిర్వీర్యం చేసినట్టు ఈనాడు మరో వక్రీకరణకూ దిగింది. వాస్తవానికి కనీస ప్రమాణాలు పాటించని స్కూళ్లకూ బెస్ట్ అవైలబుల్ స్కీమును గత బాబు ప్రభుత్వం అమలు చేసింది.ఇప్పుడు ఆ స్కూళ్ల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువులు అందుతున్నాయి. అత్యుత్తమంగా తరగతి గదులను డిజిటలైజ్ చేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నారు. బైలింగ్యువల్ టెక్ట్స్బెక్స్, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు. నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ ఆధునాతనంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే 15 వేల స్కూళ్లలో పనులు జరిగాయి. టోఫెల్ లాంటి కోర్సులనూ ప్రభుత్వం ఈ పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది. పిల్లలంతా బడిలో ఉండాలనే ఏకైక ధ్యేయంతో ఎస్సీ చెందిన 8,84,131 మంది తల్లులకు రూ.15వేల చొప్పున రూ.5,335.70 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం అందించింది.2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి ద్వారా రూ.1,714.76 కోట్లు సమకూర్చింది. జగనన్న వసతి దీవెన ద్వారా 5,06,390 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.834.96 కోట్లు జమ చేసింది. 83,04 మంది ఎస్టీలకు రూ.135.౬౬ కోట్లను జమచేసింది. జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.5,93,926 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.2,409.76 కోట్లను అందించింది. 1,22,495 ఎస్టీ విద్యార్థులకు రూ.383.43 కోట్లను సమకూర్చింది. ఈ పథకాల నిధులన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికీ చోటు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అయ్యాయి. ఆరోపణః కేంద్ర సాయానికి మోకాలడ్డు వాస్తవంః ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరించడంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసింది.ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, సాయాన్ని రాబట్టడంలో గత టీడీపీ ప్రభుత్వానికంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం గణనీయమైన కృషి చేసింది. ఎస్సీ కాంపొనెంట్ అమలులో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చిన జాబితాలో దేశంలోని 20 రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదికలోను స్పష్టం చేసింది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్ ద్వారా మొత్తం 37.64 లక్షల మందికి మేలు జరిగితే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 35.92 లక్షల మందికి లబ్ధి చేకూరడం గొప్ప రికార్డు.ఈ కోవలోనే గిరి బిడ్డలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారినీ సమాదరిస్తోంది. జిల్లాల విభజనతో గిరిజనులకు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం రెండు జిల్లాలను ఏర్పాటు చేయడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు సమస్యలు ఉంటాయి కాబట్టి ఒకే కమిషన్గా ఉన్న దాన్ని వేర్వేరుగా ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి దన్నుగా నిలవడం గొప్ప విషయం. ----- సంక్షేమానికి ఇలా... -టీడీపీ హయాంలో ఎస్సీలు 21,43,853 మందికి రూ..8844 కోట్లు, ఎస్టీలు 9,17,488 మందికి రూ.2,611.3 కోట్లను వెచ్చించింది.-వైఎస్సార్సీపీ ప్రభుత్వం డీబీటీ ద్వారా ఎస్సీలు 1,37,72.539 మందికి రూ.45,412.12 కోట్లు, ఎస్టీలు 37,90,517 మందికి రూ.13,389.21 కోట్ల మొత్తాన్ని నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాలకే జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా 69,91,349 మంది ఎస్సీలకు రూ.23,468.91 కోట్లు, ఎస్టీలు 22,71,105 మందికి రూ.5,963.43 కోట్ల లబ్ధిని ఈ ప్రభుత్వం చేకూర్చింది. ఈ ప్రభుత్వంలోనే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తంగా ఎస్సీలు 2,07,63,888 మందికి రూ.68,881.04 కోట్లు, ఎస్టీలు 60,61,622 మందికి రూ.19,352.64 కోట్ల లబ్ధిని అందించింది. -
రిజర్వ్డ్ కేటగిరీల ఉప వర్గీకరణ చెల్లుబాటుపై విచారణ నేడు
రిజర్వ్డ్ కేటగిరీల మధ్య ఉప వర్గీకరణ చెల్లుబాటుకు సంబంధించిన పిటిషన్లను నేడు భారత ప్రధాన న్యాయమూర్తి డీ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సుప్రీం కోర్టులో విచారించనుంది. బెంచ్లో న్యాయమూర్తులుగా బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, పంకజ్ మిథాల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ, సందీప్ మెహతా ఉన్నారు. తమిళనాడుకు చెందిన అరుంథతియార్ కమ్యూనిటీ తరపు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, న్యాయవాది జి బాలాజీ సహా దేశవ్యాప్తంగా పలు రిజర్వ్డ్ కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులు ఈ కేసుకు హాజరవుతున్నారు. ఈ ఉప వర్గీకరణ కేసు 2020 నాటిది. జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ గతంలో బలహీనమైన వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి కేంద్ర జాబితాలోని షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగలను రాష్ట్రాలు వారీగా ఉప వర్గీకరించవచ్చని పేర్కొంది. అయితే ఈ బెంచ్ తీసుకున్న అభిప్రాయం 2004లో ఈవీ ఛిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఉంది. ఈ తీర్పు ప్రకారం రాష్ట్రాలు ఏకపక్షంగా షెడ్యూల్డ్ కులాల సభ్యుల తరగతిలో ఒక తరగతిని చేర్చడానికి అనుమతించడం అనేది రాష్ట్రపతి పరిధిలో ఉంటుంది. ఈ కేసులో కోఆర్డినేట్ బెంచ్ల విరుద్ధమైన అభిప్రాయాలను ఈ ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్కు పంపారు. ఈ నేపధ్యంలో విచారణ అనంతరం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలలో ఉప-వర్గీకరణను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర శాసనసభలు సమర్థవంతంగా ఉన్నాయో లేదో అనేది కోర్టు నిర్ణయించనుంది. -
దళితుల సంక్షేమం, సాధికారతపై చర్చకు సిద్ధమా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమానికి, రాజకీయ సాధికారతకు నాలుగేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏం చేస్తున్నదో.., అంతకుముందు చంద్రబాబు సర్కార్ ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని టీడీపీ నేతలకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వేదిక, సమయం మీరే చెప్పండి. మీ ఆరోపణలకు సమాధానం చెప్పడానికి వైఎస్సార్సీపీలో ఉన్న ప్రతి ఒక్క మాదిగ ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు’ అని తేల్చిచెప్పారు. దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారంతా క్షమాపణలు చెప్పి చర్చకు రావాలని సూచించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ దళితులను అవహేళన చేసిన చంద్రబాబుకు డప్పు కొట్టడానికి సిగ్గులేదా అని ఆ పార్టీ నేతలను నిలదీశారు. దళిత మహిళను బూటుకాలితో తొక్కిన అచ్చెన్నాయుడిని చెప్పుతో కొట్టి మాట్లాడాలని హితవు పలి కారు. దళితులను చంద్రబాబు అడగడుగునా అవమానిస్తే.. సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకుంటున్నారని గుర్తు చేశారు. మంత్రి సురేష్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. దళిత ద్రోహులు చంద్రబాబు, టీడీపీ నేతలే అసలు దళిత ద్రోహులు చంద్రబాబు, టీడీపీ నేతలే. ఇప్పటికిప్పుడు కులాల సమావేశాలను చంద్రబాబు నిర్వహించడానికి ప్రధాన కారణం ఎన్నికలే. వాడుకొని వదిలేయడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దళిత ద్రోహులంతా నేడు సీఎం వైఎస్ జగన్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: Instagram Reels: రీల్స్ మోజులో బావిపైకి ఎక్కి... వైఎస్ జగన్ వచ్చాకే డప్పు కళాకారులు, చర్మకారులకు న్యాయం 2019 జనవరి.. అంటే.. ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు నెలకు రూ.1500 చొప్పున డప్పు కళాకారులకు పింఛన్ ఇచ్చారు. అది కూడా 6,600 మందికి మాత్రమే మూడు నెలలే ఇచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పింఛన్ను సీఎం జగన్ రూ.3000కు పెంచారు. 2019–20లో 31 వేల మంది ,2020–21లో 43 వేల మందికి, 2021–22లో 49 వేల మంది, 2022–23లో 56 వేల మందికి పింఛన్ అందిస్తున్నాం. టీడీపీ హయాంలో మూడు నెలల్లో కేవలం రూ.30 కోట్లు ఇస్తే.. మేం ఏటా దాదాపు రూ.150 కోట్లు డప్పు కళాకారులకు పింఛన్గా ఇస్తున్నాం. చర్మకారులకు పింఛన్ను చంద్రబాబు 2018 నవంబర్లో ప్రవేశపెట్టారు. రూ. 1000 చొప్పున 6 వేల మందికి ఇవ్వాలని జీవో నెంబర్ 191 ఇచ్చారు. ఇది కూడా ఎన్నికలకు మూడు నెలలు ముందు అమలు చేసి మూన్నాళ్ల ముచ్చట చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్మకారుల పింఛన్ రూ. 2 వేలు చేశాం. 2019–20లో 21 వేల మందికి, 2020–21లో 31,280 మందికి, 2021–22లో 35 వేల మందికి, 2022–23లో 40 వేల మందికి, 2023–24లో 41 వేల మందికి ఇస్తున్నాం. ప్రస్తుతం చర్మకారులు రూ. 2,750 పింఛన్ పొందుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది కూడా రూ.3 వేలు అవుతుంది. ఇప్పటి వరకు డప్పు కళాకారులకు రూ.600 కోట్లు, చర్మకారులకు రూ. 350 కోట్లు పింఛన్ కోసం ఇచ్చాం. అంటే.. టీడీపీ ఇచ్చిన దానికి మేం పదిరెట్లు ఎక్కువ ఇచ్చాం. దళితులకు రాజకీయ సాధికారత వైఎస్ జగన్తోనే సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మాదిగ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, రాజకీయంగా సాధికారిత కల్పిస్తున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ముగ్గుర్ని ఎస్పీ కమిషన్ మెంబర్లుగా నియమించారు. నాలుగు మున్సిపాలిటీలకు చైర్పర్సన్లుగా మాదిగలకు అవకాశవిుచ్చారు. గుంటూరు జడ్పీ చైర్పర్సన్ పదవి క్రిస్టినాకు ఇచ్చారు. డీసీఎంఎస్ చైర్పర్సన్లుగా మరో ఇద్దరు మాదిగలకు ఇచ్చారు. మరో ఇద్దరు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్లు, డిప్యూటీ మేయర్లు ఇద్దరు, 46 మంది జెడ్పీటీసీలు, 55 మంది ఎంపీపీలు, 13 మంది మున్సిపల్ వైస్ చైర్మన్లు కూడా మాదిగ సామాజిక వర్గం వారే. హెచ్ఆర్సీ సభ్యునిగా అత్యున్నత స్థాయి పదవిలో గొట్టిపోతుల శ్రీనివాసరావును నియమించారు. మంత్రివర్గంలో నాతో పాటు తానేటి వనితను ఎంపిక చేశారు. ఇద్దరు ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, బొమ్మి ఇజ్రాయేల్లను నియామకం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా మాదిగ సామాజికవర్గానికి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం ఇచ్చిన ఘనత జగన్గారిదే. అవకాశం ఉన్న ప్రతి చోటా దళితులకు ఇవ్వాలనే తపన వైఎస్ జగన్ది. దామాషాకు మించి.. దళితులకు వాటా 28 పైచిలుకు సంక్షేమ పథకాల ద్వారా రూ. 2 లక్షల కోట్లకు పైగా నేరుగా పేదల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. వీటిలో దళితుల వాటా పెద్దది. ఎస్సీల్లోని 37 ఉపకులాలు అన్నీ కలిసి మెలిసి అన్నదమ్ముల్లా ఉండాలని అనుకుంటుంటే చంద్రబాబుకి నచ్చడంలేదు. ఆయన మాటలను మాదిగలెవరూ నమ్మరు. ఈ పచ్చ తోడేళ్ల గుంపులో దళితులెవ్వరూ భాగస్వామ్యం కావద్దని మంత్రి సురేష్ చెప్పారు. చదవండి: డిగ్రీ చేస్తే జాక్పాట్.. ఐటీ కంపెనీల క్యూ.. -
సకల శక్తుల సాధన సబ్ప్లాన్
2013లో ‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం’ రూపొందడం వెనుక చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రక్షణ, ఉద్యమ సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా.. సబ్ప్లాన్ అవసరం, దాని అమలు తీరుతెన్నులపై అసెంబ్లీలో మొదట గళం విప్పింది వైఎస్సార్ అనే వాస్తవాన్ని విస్మరించడానికి లేదు. 2001లో ప్రతిపక్ష నాయకులైన వైఎస్సార్ సబ్ ప్లాన్ గురించి ప్రస్తావించడం వల్లనే ఆ అంశం రాజకీయ ఎజెండాలోకి చేరి, చివరికి చట్టం రూపం దాల్చింది. ఇప్పుడీ చట్టం కాలపరిమితి ముగిసే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని; దాన్ని మరో ఇరవై ఎళ్ళు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆర్డినెన్స్ జారీకి చొరవ చూపడం ముదావహం. దళితుల, ఆదివాసుల అభివృద్ధికి... ఈ చట్టం పొడిగింపు ఉపకరిస్తుంది. ‘‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టా నికి 2023 జనవరి 23తో పదేళ్ళ కాలపరిమితి ముగియనున్నందున, ఆ చట్టం లక్ష్యాలు ఇంకా నెరవేరాల్సి ఉన్నందున, ఆ చట్టాన్ని మరో ఇరవై సంవత్సరాలు పొడిగిస్తున్నాం’’ అంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జనవరి 22న ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. శాసన సభ, శాసనమండలి సమావేశాలు ఆ సమయానికి జరగటం లేనందువల్ల ఈ ఆర్డినెన్స్ అవసరమైందని కూడా ఆర్డినెన్స్లో పేర్కొన్నారు. మరికొన్ని అవసరమైన మార్పులను సైతం ఇందులో పేర్కొన్నారు. వీటితో పాటు, చట్టం పేరును ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం’ అనడానికి బదులుగా ‘ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ కాంపోనెంట్, ఎస్టీ కాంపోనెంట్ చట్టం’గా మార్చారు. గతంలో ఉన్న విధంగా బడ్జెట్లో ప్లాన్, నాన్ ప్లాన్ లేనందువల్ల ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్న భాగాన్ని సబ్ప్లాన్కు బదులుగా కాంపోనెంట్గా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితి ముగిసే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, దళిత సంఘాల, సంస్థల అభ్యర్థనలను కూడా పరి గణనలోనికి తీసుకొని చట్టం కాలపరిమితిని మరో ఇరవై సంవత్స రాలు పొడిగించాలని నిర్ణయించినందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అభినందనీయులు. ఈ చట్టం పట్ల, అదే విధంగా రాజ్యాంగం పట్ల ఆయన తన గౌరవాన్ని ఆచరణాత్మకంగా వ్యక్తం చేయడం ప్రశంసనీయం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం– 2013’ రూపొందడం వెనుక చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రక్షణ, ఉద్యమ సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వపరంగా ఎటువంటి నిర్ణయాలు జరగాలన్నా, ప్రగతిశీల చట్టాలు అమలులోకి రావాలన్నా ప్రజల కోర్కెలు, ఉద్యమాలతో పాటు, రాజకీయ పార్టీల, సంస్థల అంగీకారం, రాజ్యాంగపరమైన ఆమోదం తప్పనిసరి. అలాంటి అన్ని రకాల మద్దతులను కూడగట్టిన చట్టాలలో సబ్ప్లాన్ చట్టం ఒకటి. మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు సబ్ప్లాన్ ఉద్యమంతో, చట్టం రూపకల్పనతో పాటు, దాని అమలు విషయంలో భాVýæమున్న వారిలో నేనూ ఒకరిని. సబ్ప్లాన్ అమలు కోసం జరిగిన యత్నాలలో భాగంగా సబ్ప్లాన్ నిధుల దారి మళ్ళింపు, అమలులో లోపాలపై నేను రాసిన వార్తాకథనం 2001 మార్చి 29న ఒక దినపత్రికలో అచ్చయింది. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ వార్తాకథనాన్ని ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో స్వయంగా పేపర్ని చూపించి మరీ ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాన్ని చరిత్ర మరువదు. శాసనసభలో ఆనాడు వైఎస్ ప్రస్తావించడంతో అది రాజకీయ ఎజెండాలోకి చేరింది. సబ్ప్లాన్ అవసరం, దాని అమలు తీరుతెన్నులపై మొదట గళం విప్పింది వైఎస్ఆర్ అనే వాస్తవాన్ని ఎన్నటికీ విస్మరించడానికి లేదు. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ని కలిసి సమర్థంగా సబ్ప్లాన్ అమలుచేయాలని అభ్యర్థించాం. ఒకవైపు ప్రభుత్వంతో ఈ విషయమై సంప్రదిస్తూనే, రెండోవైపు సబ్ప్లాన్ విషయంలో చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలోనే 2007లో సీపీఎం నాయకత్వంలోని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సబ్ప్లాన్ అమలు కోసం అప్పటి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు నేతృత్వంలో అక్టోబర్లో నిరాహార దీక్షలు జరిగాయి. ఆ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ స్పందించి, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలు కోసం నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఆ తర్వాత నోడల్ ఏజెన్సీతో పాటు సబ్ ప్లాన్ చట్టం కోసం విశాలమైన ఉద్యమం జరిగింది. దాదాపు 150కి పైగా సంఘాలతో ఏర్పాటైన ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 2012 మార్చిలో 72 గంటల దీక్ష జరిగింది. ఇందులో కేవీపీఎస్, డీబీఎఫ్, సీడీఎస్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం, దళిత, ఆది వాసీ, సంఘాలతో పాటు సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ ఆర్సీపీ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ పార్టీలు తమ మద్దతును తెలియజేశాయి. వీటన్నింటితో పాటు, అధికార కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యమానికి మద్దతు తెలిపారు. దీనితో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 2012 డిసెంబర్ 2న చట్టం అసెంబ్లీ ఆమోదం పొందింది. గెజిట్లో జనవరి 23 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఉద్యమ ప్రస్థానంలో చాలామంది వ్యక్తులతో పాటు సంస్థలూ పాల్గొన్నాయి. ఆ వివరాలన్నీ ఇక్కడ ప్రస్తావించడం సాధ్యం కాదు. అయితే చట్టం ఏర్పడిన నేపథ్యం అర్థం కావడానికే ఈ ప్రాథమిక విషయాల ప్రస్తావన. సబ్ప్లాన్ అనే ఒక అంశం రూపొందడానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఈరోజు షెడ్యూల్డ్ కులాలుగా పిలువబడుతున్న అంటరాని కులాల సామాజిక, విద్య అభివృద్ధి కోసం ప్రత్యేక పాఠశాలలు, పథకాలు ఉండాలని మొదట మాట్లాడిన సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు ఫూలే. బ్రిటిష్ ప్రభుత్వం 1882లో ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్కు ఆయన ఇచ్చిన విజ్ఞాపనలో అంటరాని కులాలైన మహర్, మాంగ్, మాతంగ్లకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయా లని కోరారు. భారతదేశంలో ఇది మొట్టమొదటి ఆలోచన. ఆ తర్వాత సాహూ మహారాజ్, శాయాజీరావు గైక్వాడ్లు రిజర్వేషన్లు మొదలు పెట్టారు. అనంతర కాలంలో భారతదేశ చిత్రపటం మీదకి వచ్చిన బాబాసాహెబ్ అంబేడ్కర్ 1927లో బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న సమయంలో కౌన్సిల్లో మాట్లాడుతూ, అణగారిన వర్గాలైన అంటరాని కులాల పిల్లల విద్యాభివృద్ధికి ప్రత్యేక హాస్టల్స్ నిర్మించాలని ప్రతిపాదించారు. నేటి మన రెసిడెన్షియల్ పాఠశాలల వ్యవస్థకు అదే పునాది. అలాగే 1932 సెప్టెంబర్ 24న గాంధీ–అంబేడ్కర్ల మధ్య కుదిరిన పూనా ఒడంబడికలోని 9వ అంశంలో అంటరాని కులాల విద్యార్థుల విద్య కోసం ప్రతి రాష్ట్రం, కేంద్రం కళాశాల నిధులను కేటాయించాలని ఉంది. ఇది ఒక రకంగా మొట్టమొదటి బడ్జెట్ ప్రస్తావన. 1944లో బాబాసాహెబ్ అంబేడ్కర్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, విదేశీ విద్య ప్రోత్సాహం, ఉద్యోగాల రిజర్వే షన్లు సాధించారు. వీటన్నింటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 46ను చేర్చి ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ది కోసం సత్వరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే ప్రప్రథమ ప్రధాని నెహ్రూ కాలంలో ఇటువైపు అడుగులు పడలేదు. 1970 తర్వాత అప్పటి ప్రధాని ఆనాటి రాజకీయ, ఉద్యమ ప్రభావాలతో 1974 ఎస్సీ సబ్ప్లాన్ను, 1980లో ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్ను ప్రారంభించారు. 2006లో ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్ను ఎస్సీ సబ్ ప్లాన్గా మార్చారు. అయితే ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి లేవ నెత్తేంత వరకు దీని గురించిన అవగాహన ఎవ్వరికీ లేదనడంలో సందేహం అక్కర్లేదు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చట్టం ఏర్పడిన తర్వాత కర్ణాటకలో, ఉత్తరాఖండ్, రాజస్థాన్లలో ఇటువంటి చట్టాలు అమలులోకి వచ్చాయి. పంజాబ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో.. ఈ ఏడాదితో కాల పరిమితి తీరిన ‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని మరో ఇరవై ఏళ్లు పొడిగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహర్రెడ్డి ఆర్డినెన్స్కు చొరవ చూపారు. దళితుల, ఆదివాసుల అభివృద్ధికి... ప్రత్యేకించి నివాస, మౌలిక సదుపాయాల, విద్యావకాశాల మెరుగు కోసం, ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను చేపట్టడం ద్వారా వారు ప్రగతి సాధించడానికి ఈ చట్టం పొడిగింపు ఉపకరిస్తుంది. ఈ ఉన్నత లక్ష్యసాధనలో మరిన్ని ముందడుగులు పడాలని ఆశిద్దాం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
రామోజీ .. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
తాడేపల్లి: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను ప్రభుత్వం పొడిగించడం శుభ పరిణామమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. అదే సమయంలో సబ్ ప్లాన్పై ఈనాడు బొజ్జ రాక్షసుడు అసత్యాలు రాస్తున్నాడని రామోజీరావును ఉద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు జూపూడి. సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు రామోజీకి లేదని, చంద్రబాబు హయాంలో దళితులకు ఏం చేశారో రామోజీ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు హయాంలో సబ్ ప్లాన్ నిధులను కూడా ఖర్చు చేయలేదుని, చంద్రబాబు అరాచకాలను రామోజీ ఎందుకు ప్రశ్నించలేదని జూపూడి నిలదీశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై రామోజీ చర్చకు సిద్ధమా అని జూపూడి చాలెంజ్ చేశారు. ఎస్సీ సబ్ప్లాన్పై కేంద్ర గణాంకాల్లో ఏపీకి తొలిస్థానం దక్కిందనే విషయం గ్రహాంచాలని యెల్లో మీడియాకు చురకలంటించారు. -
ప్రతి జిల్లాకు 4 స్టడీ సర్కిళ్లు.. కేసీఆర్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్–1 వంటి కేంద్ర, రాష్ట్ర సర్వీసుల ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చేందుకు ‘ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని కోరారు. నాలుగు వర్గాలకు నాలుగు ఆల్ ఇండియా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం ప్రగతిభవన్లో బడుగు, బలహీనవర్గాలకు విద్యా, ఉపాధి సంబంధిత అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా వర్గాల విద్యార్థినీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యనందించడం, పోటీ పరీక్షలకు శిక్షణనివ్వడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించడం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అందుబాటులో జాతీయ స్థాయి నోటిఫికేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగం, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో విడుదలయ్యే ఉద్యోగాల నోటిఫికేషన్లను స్టడీ సర్కిళ్లలో అందుబాటులో ఉంచాలని, అందుకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. చదువుకు తగ్గ ఉద్యోగ, ఉపాధి సమాచారాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించే కేంద్రాలుగా స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలన్నారు. అద్భుతమైన భూమికను పోషించాలి ‘స్టడీ సర్కిళ్లు క్యాంపస్ రిక్రూట్మెంట్ కేంద్రాలుగా మారాలి. ఎంప్లాయ్మెంట్ అవెన్యూలుగా వాటిని తీర్చిదిద్దాలి. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అందివచ్చే ఉద్యోగాలను అందిపుచ్చుకునే విధంగా యువతను తీర్చిదిద్దాలి. ఒక ప్రతిభావంతమైన స్టడీ సర్కిల్ ఎలా ఉండాలో విధివిధానాలను అధికారులు రూపొందించాలి. ఇందుకు సమర్ధవంతులైన అధికారులను నియమించాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండస్ట్రీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సులను పూర్తి చేసుకున్న తెలంగాణ యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధిని కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సర్కిళ్లు పోషించాలి. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేట్ రంగాలలో కూడా ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా మారాలి. శిక్షణ పొందుతున్న అర్హులైన అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో భోజన వసతులు ఏర్పాటు చేయాలి. ప్రతి స్టడీ సర్కిల్లో కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను కల్పించాలి. ఆయా జిల్లాల్లో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అనుసరించి ప్రవేశాలు కల్పించే దిశగా విధివిధానాలు రూపొందించాలి. విద్యార్థులకు కల్పించినట్టుగానే విద్యార్థినులకు కూడా ప్రత్యేక వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి’ అని సీఎం ఆదేశించారు. అన్ని గురుకులాల్లో ఇంటర్మీడియెట్ పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలతో పాటు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో సైతం ఇంటర్మీడియెట్ విద్యను, కోర్సులను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక విద్యనుంచి ఉన్నతవిద్య వరకు పునాది వేస్తున్నట్టే, విద్యార్థి దశలో కీలకమైన మలుపుగా భావించే ఇంటర్మీడియెట్ విద్య వరకు కూడా ప్రభుత్వమే పునాది వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉన్నతాధికారిని నియమించాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులు ఎంతమంది? పదో తరగతి అనంతరం వారు ఎంచుకుంటున్న మార్గాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను అందించాలని కోరారు. గురుకులాల్లో ఆధునిక కోర్సులు రాష్ట్రంలో ప్రస్తుతమున్న గురుకుల డిగ్రీ కళాశాలలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17కు పెంచి మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, మొత్తంగా జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో బీసీ వర్గాల జనాభా అధికంగా ఉందని, వారి జనాభా దామాషా ప్రకారం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పెంచాలన్నారు. సాంప్రదాయ కోర్సులను కాకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగావకాశాలను కల్పించే ఆధునిక డిగ్రీ కోర్సులను రూపొందించాలని సూచించారు. అలాగే ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 జిల్లాల్లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. -
నవరత్నాలతో ప్రతీ ఎస్సీ కుటుంబానికి లబ్ధి.. అసెంబ్లీలో మంత్రి విశ్వరూప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతీ ఎస్సీ కుటుంబానికి నవ రత్నాల ద్వారా లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి అద్భుతమైన పథకం. ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. చదవండి: తమాషా చేస్తున్నావా?.. డ్యూటీ అంటే లెక్కలేదా? వైఎస్సార్ చేయూత ద్వారా ఐదేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. 5 లక్షల మంది లబ్ధిదారులకు వైఎస్సార్ చేయూతతో లబ్ధి చేకూరుతుంది. ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో 1070 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. దాదాపు లక్ష మంది ఎస్సీ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత ‘వెలుగు’
సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేవే. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా లాంటి అనేక ప్రజారంజక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ కుటుబాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వారి ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపింది. లబ్దిదారుల కళ్లలో ఆనందం జిల్లాలో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు నిరుపేదలే. నెలకు రూ.200 లోపు విద్యుత్ వినియోగించే ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. ఉచితంగా విద్యుత్ అందిస్తుండడంతో ఆయా కుటుంబాలు ఎంతగానో ఆనందిస్తున్నాయి. గతంలో ఆయా కుటుంబాల్లో చాలామందికి విద్యుత్ సౌకర్యం ఉండేదికాదు. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి లేకపోవడంతో విద్యుత్ కనెక్షన్ పెట్టుకునేవారు కాదు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుండడంతో ఆ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 85,090 జిల్లాలో ఎస్సీ, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 85,090 ఉన్నాయి. వాటిలో ఎస్సీ విద్యుత్ కనెక్షన్లు 48,635, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 36,455 ఉన్నాయి. ఏప్రిల్ నెల నుంచి జూలై నెల వరకు ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్కు సంబంధించి విద్యుత్శాఖకు ప్రభుత్వం రూ.6.11 కోట్లు సబ్సిడీ కింద చెల్లించింది. చదవండి :మహిళల జీవితాల్లో ‘వైఎస్సార్ చేయూత’ వెలుగులు -
‘ఆత్మగౌరవంతో బతకాలనుకున్న వాళ్లు మద్దతు తెలపండి’
సాక్షి, హైదరాబాద్: దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఉప ఎన్నిక జరుగనున్న హుజురాబాద్కు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ వర్తింపజేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలన్నీ విజయవంతం అవుతున్నాయన్న ఆయన... ఆత్మగౌరవంతో బతకాలనుకునే ప్రతీ ఒక్కరు తమకు మద్దతు తెలపాలని కోరారు. ‘‘స్వపరిపాలన- ఆత్మగౌవరంతో బతకాలని, వనరులు అందరికీ అందాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ఏ లక్ష్యాల కోసం రాష్ట్రం ఏర్పాటు చేశారో అవి నెరవేరడం లేదు. తెలంగాణలో అత్యంత వెనకబడిన వర్గాలను తలెత్తుకునేలా చేయాలి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఏడేళ్లుగా కేసీఆర్ సర్కారు ఖర్చు పెట్టడం లేదు. నిధులు ఖర్చు కాకపోతే.. క్యారీపార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. కానీ, అది కూడా జరగడం లేదు. దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడానికి కాంగ్రెస్ నాంది పలికింది’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. చదవండి: కష్టపడండి... ఇంటికొచ్చి బీఫారం ఇస్తా -
ఎస్సీ, ఎస్టీలకు ఎలక్ట్రిక్ వాహనాలు
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘టి ప్రైడ్’పథకం కింద ఎలక్ట్రిక్ కార్లను సబ్సిడీ ధరలపై ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం కింద తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 500 మంది ఎస్సీ, ఎస్టీ యువతకు ఈ వాహనాలను అందజేసి, ఆ తర్వాత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ యువతకు ఎలక్ట్రిక్ కార్లపై సబ్సిడీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఇటీవల రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో)ను ప్రభుత్వం ఆదేశించింది. టీఎస్ ప్రైడ్ మార్గదర్శకాల ప్రకారం.. పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు చేపట్టే ఎస్సీ, ఎస్టీ యువతకు 35 శాతం సబ్సిడీని అందజేస్తారు. అయితే కార్లపై 60 శాతం వరకు సబ్సిడీ ఇచ్చేలా టీఎస్ రెడ్కో మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. ‘ఎలక్ట్రిక్ వాహన పాలసీ’లో భాగంగా రాష్ట్రంలో కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు వంద శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్డు టాక్స్ల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అవసరాలకు ఎలక్ట్రిక్ వాహనాలు.. ప్రస్తుతం సర్కార్ యంత్రాంగం వాడుతున్న పెట్రోలు, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను దశల వారీగా ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇంధన పొదుపు, పునరుద్ధరణీయ ఇంధన వనరుల ప్రాజెక్టులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ బాధ్యతను టీఎస్ రెడ్కోకు అప్పగించింది. ఈ మేరకు ముంబైకి చెందిన మెజెంటా అనే ఈవీ సొల్యూషన్స్ సంస్థతో టీఎస్ రెడ్కో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెట్టడంతో పాటు చార్జింగ్, ఇతర వసతులను కూడా మెజంటా కల్పించనుంది. తద్వారా రవాణాపై వెచ్చిస్తున్న మొత్తం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. 600 ఈవీ చార్జింగ్ స్టేషన్లు... తెలంగాణ ఎలక్ట్రిక్ వాహన పాలసీలో భాగంగా పెరగనున్న వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వచ్చే మూడేళ్లలో 600 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఏటా 200 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు టీఎస్ రెడ్కోను నోడల్ ఏజెన్సీగా నియమించింది. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించాల్సిందిగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, విద్యుత్ పంపిణీ సంస్థలు, ఆర్టీసీ, రైల్వే, ఎయిర్పోర్టు అథారిటీకి టీఎస్ రెడ్కో గత నెలలో లేఖలు రాసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 70 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్) పథకం రెండో దశ కింద కేంద్ర పరిశ్రమల శాఖ రాష్ట్రంలో మరో 138 ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రతిపాదించింది. వీటిలో 118 హైదారాబాద్లో, కరీంనగర్, వరంగల్ పట్టణాల్లో పదేసి చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా, రాష్ట్రంలో 2016లో 25 ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా, ప్రస్తుతం 10 వేలకు చేరాయి. -
ఇక నుంచి వారు పారిశ్రామికులు
-
ఇది దేవుడిచ్చిన వరం
దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది నా అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా. స్టాంప్ డ్యూటీ రద్దు.. విద్యుత్ చార్జీల్లో, రుణాలపై వడ్డీలో, భూ కేటాయింపుల్లో, స్టేట్ జీఎస్టీలో రాయితీ ఇస్తున్నాం. క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంటింగ్ రిజిస్ట్రేషన్ రాయితీ వంటి అనేక ప్రోత్సాహకాలు ఈ కొత్త విధానంలో తీసుకొచ్చాం. వీటన్నింటి వల్ల ఎస్సీ, ఎస్టీలు ఎవ్వరికీ తీసిపోని విధంగా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు. –సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలని, ఎవ్వరికీ తీసిపోని విధంగా పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పూర్తి ప్రోత్సాహం ఇచ్చేందుకు 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం రూపొందించామని చెప్పారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన ‘జగనన్న–వైఎస్సార్ బడుగు వికాసం’ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే.. ఏం చేయాలి? ఎవరిని కలవాలి? వంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా కోటి రూపాయల వరకు ప్రోత్సాహక మొత్తం (ఇన్సెంటివ్) ఇస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకు వస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ సెల్స్ (సదుపాయాల కల్పన) కూడా ఏర్పాటు చేశామని, వారిలో నైపుణ్యం పెంచేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు రూపొందించామని వివరించారు. ఏపీఐఐసీ భూ కేటాయింపుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు కచ్చితంగా ఇవ్వాలని నిర్ణయించామని, ఇది ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఊతం ఇస్తుందన్నారు. ఈ చొరవ వల్ల ఎస్సీ, ఎస్టీల నుంచి కొత్త పారిశ్రామిక వేత్తలు తయారు కావాలని పిలుపునిచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. నవరత్నాలతో ఆదుకుంటున్నాం – పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలతో పాటు, అగ్రవర్ణాల్లోని పేదలందరికీ మంచి జరగాలని, వారి కాళ్ల మీద వారు నిలబడాలని, వారి జీవితాలు సంపూర్ణంగా మార్చాలన్న ఉద్దేశంతో అడుగులు వేశాం. – పేదలకు అమ్మ ఒడి పథకం తీసుకున్నా, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పెన్షన్ల పెంపు.. ఇలా ఏ పథకం తీసుకున్నా పేదలకు పెద్దపీట వేస్తున్నాం. 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. – గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో దాదాపు 82 శాతం ఉద్యోగాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు దక్కాయి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పులపాలు కాకుండా చూస్తున్నాం. వారి కాళ్ల మీద వారు నిలబడాలని.. – నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు.. అర్హులైతే చాలు, వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డు, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశాం. – చేయూత, ఆసరా తదితర పథకాల ద్వారా పేదలు పారిశ్రామికంగా వారి కాళ్ల మీద వారు నిలబడాలనే దిశలో ఊతమిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. మార్కెటింగ్లో ఇబ్బందులు పడకూడదని అమూల్, పీ అండ్జీ, రిలయన్స్, హిందుస్తాన్ లీవర్, ఐటీసీ వంటి పెద్ద పెద్ద సంస్థలను తీసుకు వచ్చాం. – నేటి విద్యార్థులు భావితరంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశ పెడుతున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చే ‘నాడు–నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో పేదల స్థితిగతులను పూర్తిగా మార్చాలని పలు కార్యక్రమాలు చేపట్టాం. అందరికీ మంచి జరగాలని, మరింత మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. – ఈ కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్రెడ్డి, పి.విశ్వరూప్, బాలినేని శ్రీనివాసరెడ్డి, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కె రోజా, ఎంపీలు నందిగం సురేష్, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేరుగు నాగార్జున, టీజేఆర్ సుధాకర్బాబు, కొండేటి చిట్టిబాబు, తలారి వెంకట్రావు, జొన్నలగడ్డ పద్మావతి, అలజంగి జోగారావు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవెన్, ఆ శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యం, పలువురు సీనియర్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం 2020–23 లో కీలక అంశాలు – 2020లో రీస్టార్ట్ ఒన్ కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.278 కోట్లను ఇన్సెంటివ్ రూపంలో ప్రభుత్వం చెల్లించింది. గతంలో ఏటా సగటున ఎస్సీలకు రూ.53 కోట్లు, ఎస్టీలకు రూ.15 కోట్లు మాత్రమే ఇచ్చేవారు. – ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు భూములు కేటాయిస్తారు. 25 శాతం చెల్లిస్తే భూములను అప్పగిస్తారు. మిగిలిన 75 శాతాన్ని 8 శాతం నామమాత్రపు వడ్డీతో 8 ఏళ్లలో చెల్లించవచ్చు. – 100 శాతం స్టాంపు డ్యూటీని, ట్రాన్స్ఫర్ డ్యూటీని రీయింబర్స్ చేస్తారు. భూముల లీజు, షెడ్డు, భవనాలు, తనఖా తదితరాలపై 100 శాతం స్టాంపు డ్యూటీని రీయింబర్స్ చేస్తారు. – ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ పార్కుల్లో ఎంఎస్ఈల కోసం భూములను 50 శాతం రిబేటుపై (రూ.20 లక్షల వరకు) ఇస్తారు. – ల్యాండ్ కన్వెర్షన్ చార్జీల్లో 25 శాతం వరకు, గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఎంఎస్ఈలకు రిబేటు ఇస్తారు. – ఉత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి తదుపరి 5 ఏళ్ల వరకు వాడుకున్న కరెంట్లో యూనిట్కు రూ.1.50 రీయింబర్స్ చేస్తారు. – ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 45 శాతం వరకు, గరిష్టంగా కోటి రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ లభిస్తుంది. – సర్వీసులు, రవాణా రంగాల్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 45 శాతం వరకు, గరిష్టంగా రూ.75 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ లభిస్తుంది. – ఉత్పత్తి ప్రారంభించిన ఎంఎస్ఈలకు ఐదేళ్లపాటు 3 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. నెట్ ఎస్జీఎస్టీలో 100 శాతం రీయింబర్స్ లభిస్తుంది. మధ్యతరహా పరిశ్రమలకు 75 శాతం, భారీ పరిశ్రమలకు 50 శాతం రీయింబర్స్మెంట్ అందుతుంది. – క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంట్ రిజిస్ట్రేషన్లకు అయ్యే ఖర్చులో ఎంఎస్ఈలకు రూ.3 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది. కొత్తగా మైక్రో యూనిట్లు ఏర్పాటు చేయదలచుకునే వారికి సీడ్ కేపిటల్ అసిస్టెన్స్ కింద మెషినరీ ఖర్చులో 25 శాతం అందుతుంది. -
‘ఏ ఒక్కరి నమ్మకాన్ని సీఎం జగన్ వమ్ము చేయరు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం ప్రారంభించడం ఆనందదాయకమని వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. ఈ అవకాశాన్ని దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎం కావడం దళితుల అదృష్టమని అన్నారు. ఆయన లాంటి ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశించిన మార్పును సీఎం జగన్ ఆచరిస్తున్నారని ప్రశంసించారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా ఉండకూడదని, పెద్ద పారిశ్రామిక వేత్తలగా చూడాలని సీఎం అనడం తమకు చాలా గర్వంగా ఉందన్నారు. చదవండి: రైతులకు శుభవార్త: రూ. 113.11 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ‘ఎస్సీ, ఎస్టీల ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం జగనన్న వైఎస్సార్ బడుగు వికాసానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోకూడదనే ఈ నిర్ణయం. ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. ఈ రోజు మేము ధైర్యంగా ప్రరిశ్రమల స్థాపనలో ముందుకువెళతాము. స్కిల్ డెవలప్మెంట్తో ఎన్నో సౌకర్యాలు దీనిలో ఉన్నాయి. మొత్తం రాయతీలతో, ఇండస్ట్రీయల్ పార్క్లో మాకు ప్రత్యేక కేటాయింపులు చేయడం శుభపరిణామం. అందుకే మేమంతా ముఖ్యమంత్రిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాజకీయ వ్యవస్థలో జగన్ ఆలోచన ఓ కలికితురాయి. రాజకీయాల్లో దళితులను దూరంగా పెట్టిన వారు ఇప్పుడు మళ్లీ వారిని మోసం చేసేందుకు వస్తున్నారు. సాయం చేయడం చేతకాని వారు సంక్షేమ పథకాలు దళితులకు అందకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు.’ అని మ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. చదవండి: ఏపీ: మద్యం ప్రియులకు మరో షాక్ పండుగ రోజు సీఎం వైఎస్ జగన్ దళితులకు నిజంగా ఓ వరం ఇచ్చారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపపారు. అదే విధంగా ‘ఇదొక శుభపరిణామం. ఈ పాలసీని చూస్తే దళితులకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో ఎస్సీ, ఎస్టీల ఇంసెంటివ్లు బకాయిలు పెట్టిన ఘనత చంద్రబాబుది. ఆ 1100 కోట్ల బకాయిలను చెల్లించిన ఘనత జగన్ది. జగన్ వల్ల మా బతుకులు మారతాయని భావించిన వారి నమ్మకం నిజమైంది. ఏ ఒక్కరి నమ్మకాన్ని సీఎం జగన్ వమ్ము కానివ్వరు.’ అని పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. -
జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసానికి సీఎం జగన్ శ్రీకారం
-
ఇది నా అదృష్టం.. దేవుడిచ్చిన వరం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోయిందని, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వారిని ప్రోత్సహించేవిధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6శాతం మేర ఇండస్ట్రియల్ పార్కుల్లో భూములు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. పరిశ్రమ పెట్టాలనుకున్న వారు.. ఎలా ముందుకు వెళ్లాలి? ఎవరిని కలవాలి? అన్న అంశాలపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’’ పేరిట రూపొందించిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్, తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. (చదవండి: పోలవరానికి నిధులు రాబట్టండి) ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించామని హర్షం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, రాష్ట్రంలో ఎప్పుడూ , ఎక్కడా జరగని విధంగా రూ. 1 కోటి రూపాయిల ఇన్సెంటివ్లు ఇస్తున్నాం. వారిలో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్, ఫెసిలిటేషన్కార్యక్రమాలను చేపడుతున్నాం. స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్.. పేటెంట్ రుసుముల్లో రాయితీలు... ఇలా ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు లభిస్తున్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మంచి జరగాలి. వారి కాళ్లమీద వారు నిలబడాలనే ఉద్దేశంతో వారి జీవితాలను మార్చాలనే నవరత్నాలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టాం. సచివాలయాల్లో కూడా 82శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ అమలుచేస్తున్నాం. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, కుల,మత, వర్గ, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికీ పథకాలు అందించేందుకు గ్రామ, వార్డు, వాలంటీర్ల వ్యవస్థను చేపట్టాం. ఆసరా, చేయూత లాంటి పథకాలను ప్రవేశపెట్టాం. (చదవండి: బీసీ కార్పొరేషన్లతో సామాజిక విప్లవం) అదే విధంగా మార్కెటింగ్లో ఇబ్బందులు పడకూడదని అమూల్ను, పీ అండ్జీని, రిలయన్స్లాంటి సంస్థలను తీసుకువచ్చాం. అంతేగాక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో పేదల స్థితిగతులను పూర్తిగా మార్చాలని ఈ కార్యక్రమాలు చేపట్టాం. అందరికీ మంచి జరగాలని, అలాగే మరింత మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి భారీగా నిధులు
-
పక్కదారి పట్టిన సంక్షేమం
‘చట్టం ఎంత గొప్పదైనా అమలు చేసేవాడు చెడ్డవాడయితే చెడ్డ ఫలితాలు వస్తాయి. చట్టం ఎంత చెడ్డదయినా అమలు చేసేవాడు మంచివాడయితే మంచి ఫలితాలు వస్తాయి’ అని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారు. దీనిలో మొదటి వాక్యానికి సరిపోయేలా చంద్రబాబు ఐదేళ్లపాటు ఈ రాష్ట్రాన్ని పాలించాడని ప్రజలు అంటున్నారు. దళిత గిరిజన సంక్షేమంను కనీసం పట్టించుకోకపోవడం వల్ల వారి అభివృద్ధి నిలిచిపోయింది. సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను దళిత, గిరిజనుల అభివృద్ధికి ఖర్చు చేయకుండా ఇతర పనులకు పాలకులు పక్కదారి పట్టించారన్న విమర్శలు ఆ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా శాఖలవారీగా నిధులు వినియోగం గురించి సమాచారం కూడా అందుబాటులో లేకుండా ప్రభుత్వం చేసిందని ఆరోపణలున్నాయి. ఎస్సీ, ఎస్టీ కాలనీల పర్యవేక్షణ కోసం రూ. 300 కోట్లు ఖర్చు పెట్టాలని ఆదేశాలున్నా వాటిని ఖర్చు పెట్టకుండా ఖర్చు చేశామని లెక్కలు చెప్పిన దుస్థితి ఉందని విమర్శిస్తున్నారు. సబ్ప్లాన్ ఉద్దేశ్యమిదీ... అందరికీ సమాన అభివృద్ధి జరగాలనే ఉద్దేశ్యంతో 1974–75 సంవత్సరంలో పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఎస్టీల కోసం గిరిజన ఉప ప్రణాళికను ఏర్పాటు చేశారు. 1979–80లో ఆరో పంచవర్ష ప్రణాళికలో ఎస్సీల కోసం స్పెషల్ కంపోనెంట్ ప్లాన్ ఏర్పాటు చేశారు. జనాభా ప్రాతిపదికన 16.2 శాతం ఉన్న ఎస్సీలు, 8.2 శాతం ఉన్న ఎస్టీలు మొత్తంగా కలసి బడ్జెట్లో కూడా 24.4 శాతం బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించారు. నిధులు దారి మళ్లకుండా 2013 జనవరి 24వ తేదీన షెడ్యూల్డ్ కాస్టు సబ్ప్లాన్ అండ్ ట్రైబల్ సబ్ప్లాన్ ప్లానింగ్ ఆలోకేషన్, అండ్ యుటిలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ యాక్టును ప్రవేశపెట్టారు. ఈ నిధులు పక్కదారి పట్టకుండా ఖర్చు చేయాలని, నిధులు ఖర్చు కాకపోతే తరువాత ఆర్థిక సంవత్సరానికి వాడుకునే సౌలభ్యాన్ని తీసుకువచ్చారు. శాసన సభ సాక్షిగా చేసిన ఈ చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. నిధులన్నీ పక్కదారే... ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం దళిత గిరిజనులను చిన్నచూపు చూసింది. సబ్ప్లాన్ నిధులను సంబంధం లేని పథకాలకు కేటాయించారు. రాజధాని నిర్మాణం కోసం, స్టేడియంల నిర్మాణాలు అంటూ ఆయా శాఖలకు మళ్లించారు. ఇక ప్రకృతి విపత్తులకు కూడా ఈ నిధులను కేటాయించారు. ఈ నిధులతో ప్యాసింజరు ఆటోలు ఇవ్వాల్సి ఉన్నా చెత్త తొలగించే ఆటోలు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. భూములకు సంబంధించిన కొనుగోలు–పంపిణీ జరగలేదు. ప్రభుత్వం చేశామని చెప్తున్నా వాటికి సంబం«ధించిన వివరాల సమాచారం మాత్రం లేని పరిస్థితి. ఇక కృష్ణా, గోదావరి పుష్కరాలకు కూడా ఇవే నిధులు వాడారని, ప్రస్తుతం పసుపు–కుంకుమ పథకానికి కూడా ఈ నిధులనే ఉపయోగిస్తున్న పరిస్థితులు ఈ ప్రభుత్వంలో నెలకొన్నాయి. ప్రభుత్వంపై మండి పడుతున్న దళిత, గిరిజనులు తమకు కేటాయించిన నిధులను తమకు ఖర్చు చేయకుండా.. పక్కదారి పట్టించడం పట్ల దళిత గిరిజనులు మండిపడుతున్నారు. కనీసం 30 శాతం నిధులు కూడా ఖర్చు పెట్టని పరిస్థితి ఈ ఐదేళ్ల కాలంలో జరిగిందన్నారు. దళిత గిరిజన సంక్షేమం అంటే చంద్రబాబుకి చిన్నచూపు అని అందుకే తమ నిధులు తమకు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శిస్తున్నారు. దళిత గిరిజన సంక్షేమం అనేది లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో దళిత గిరిజనులు దగ్గాపడ్డారని వాపోతున్నారు. ► ఎస్టీలకు సంబంధించి జనాభా 27,40,133 ఉన్నారు. కేటాయింపులు ఇలా... సంవత్సరం నిధుల కేటాయింపులు 2014–15 1500.26 కోట్లు 2015–16 1904.48కోట్లు 2016–17 3099.96 కోట్లు 2017–18 3528.75 కోట్లు 2018–19 4176.60 కోట్లు మొత్తం 14,210.05 కోట్లు ఎస్సీలకు సంబంధించిన వివరాలు ఇవీ... ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాలు, 676 మండలాలున్నాయి. ఇందులో 84,45,399 మంది ఎస్సీలు ఉన్నారు. వీరికి సంబంధించి నిధులు కేటాయింపు ఇలా జరిగింది. సంవత్సరం నిధుల కేటాయింపులు 2014–15 4574.47 కోట్లు 2015–16 5880.62 కోట్లు 2016–17 8724.25 కోట్లు 2017–18 9847.13 కోట్లు 2018–19 11,228.10 కోట్లు మొత్తం 40,254.57 కోట్లు నిధుల పక్కదారి ఇలా సంవత్సరం ఎస్సీ, ఎస్టీ ప్లాన్ నిధులు ఖర్చుపెట్టిన నిధులు శాతం పక్కదారి 2014–15 రూ. 6074 కోట్లు రూ. 1518 కోట్లు సుమారు 25 శాతం రూ. 4556 కోట్లు 2015 – 16 రూ. 7784 కోట్లు రూ. 1556 కోట్లు 20 శాతం రూ. 6228 కోట్లు 2016–17 రూ.11823 కోట్లు రూ. 2354 కోట్లు 20 శాతం రూ. 9429 కోట్లు 2017–18 రూ. 13375 కోట్లు రూ. 3343 కోట్లు 25 శాతం రూ. 10032 కోట్లు 2017–19 రూ. 15404 కోట్లు రూ. 3080 కోట్లు 20 శాతం రూ. 12324 కోట్లు దళిత సంక్షేమంపై చిన్నచూపు ఈ ప్రభుత్వం దళిత సంక్షేమంపై చిన్న చూపు చూసింది. నిధులను పక్కదారి పట్టించింది. కనీసం 25 నుంచి 30 శాతం నిధులను మాత్రమే వినియోగించడం భాదాకరం. ఈ ప్రభుత్వం పైచర్యలు తీసుకోవాలి. - రామస్వామి, రీసెర్చ్ స్కాలర్ చట్టబద్ధత చేసినా పక్కదారి నిధుల వినియోగంపై చట్టబద్ధత కల్పించినా ప్రభుత్వాలు నిధులు పక్కదారి పట్టించడం దారుణం. ఈ ప్రభుత్వ హయాంలో గిరిజన దళిత సంక్షేమం మరుగున పడింది. - శ్రీమన్నారాయణ, న్యాయశాఖ స్కాలర్ -
వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్ను..
సాక్షి, జగ్గంపేట/గోకవరం/కిర్లంపూడి/గండేపల్లి: టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒరిగిందేమీ లేదు. ఎన్నికలు సమీపించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి 27న రాజమహేంద్రవరంలో జయహో బీసీ సదస్సు నిర్వహించి ఓట్ల కోసం బీసీల్లోని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తాయితాలు ప్రకటించారు. అయితే వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీలపై తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో వివిధ వర్గాలను కలుసుకున్న ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ఆలోచన చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకువస్తామని చెప్పారు. అలాగే నామినేషన్ పనుల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 31 బీసీ కులాలు కేంద్ర పరిధిలోని ఓబీసీ జాబితాలో చేర్చడానికి కృషి చేస్తామన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50 శాతం కొలవులకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉపాధి అవకాశాలు మెరుగు నామినేటడ్ పదవుల్లో, కాంట్రాక్టు పనులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. జగనన్న హామీ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మాకు మంచి అవకాశాలు లభిస్తాయి. – చింతల అనిల్, గోకవరం టీడీపీలో ఎస్సీలకు గుర్తింపు లేదు టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు తగిన గుర్తింపు లేదు. ఎస్సీల అభివృద్ధి, సంక్షేమాన్ని ముఖ్యమంత్రి పూర్తిగా విస్మరించారు. జగనన్న సీఎం అయితేనే ఎస్సీలకు గౌరవం, ప్రాధాన్యం లభిస్తుంది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టుల్లో రిజర్వేషన్ కల్పించడం అభినందనీయం. – మందపాటి సతీష్, గోకవరం జగన్ హామీతో బీసీల అభివృద్ధి జగన్ హామీతో బీసీలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతారు. ప్రైవేటు కాంట్రాక్టు పనులు, ఔట్ సోర్సింగ్ పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా నామినేటడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం ద్వారా రాజకీయ ఎదుగుదలకు ఎంతో ఉపయోకరంగా ఉంటుంది. దీంతో బీసీల్లో జీవనశైలి మెరుగుపడుతుంది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో జగన్కు ఓటు వేసి గెలిపిస్తాం. – కాజులూరి లక్ష్మీనారాయణ, కిర్లంపూడి బీసీల అభివృద్ధి ప్రైవేటు, కాంట్రాక్టు పనులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. బీసీల్లో ఉపాధి అవకాశాలు పెరిగి మెరుగైన జీవనం గడపవచ్చు. మా గురించి ఆలోచించే వైఎస్ జగన్కు ఓటు వేసి గెలిపిస్తాం. – తుమ్మల చిన్నబ్బు, గోకవరం తూర్పుకాపు సంఘం అధ్యక్షుడు సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించారు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను టీడీపీ ప్రభుత్వంలో దారి మళ్లించారు. నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు ప్రభుత్వం మళ్లించడంతో చాలా నిధులు దుర్వినియోగమయ్యాయి. సబ్ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు జగన్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. – యనమల పాము, జగపతినగరం జీవనం మెరుగుపడుతుంది ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టు పనుల్లో బీసీలకు అవకాశం కల్పించడంతో మా జీవనం మెరుగుపడుతుంది. ఆర్థిక ఎదుగుదలకు అవకాశం ఏర్పడుతుంది. జగన్మోహన్రెడ్డి మాట మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. రాబోయే ఎన్నికల్లో ఆయనకే మా మద్దతు. – చిట్టిమాని సత్యనారాయణ, జగ్గంపేట జగన్తోనే న్యాయం 50 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత ఏర్పడితేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తారని హామీ ఇచ్చారు. దీంతో ఎస్సీ, బీసీ కులాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – మూరా పెదవీర్రాజు, కిర్లంపూడి -
చంద్రబాబు దళిత వ్యతిరేకి
-
క్షణక్షణం.. భయం భయం
వారంతా నిరుపేదలు. షెడ్యూల్డు క్యాస్ట్ (ఎస్సీ), షెడ్యూల్డు తెగలు (ఎస్టీ)కు చెందిన వారు. ఇదివరకటి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించింది. అప్పటి నుంచి వీరు విద్యుత్ను వినియోగించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఎవరైతే ఉచితంగా కరెంటు పొందుతున్నారో.. వారందరూ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని గుర్తించి అనంతపురం విద్యుత్ చౌర్య నిరోధక పోలీసులు నోటీసులు జారీ చేశారు. అధికారులు జరిమానాగా విధించిన కాంపౌండ్ ఫీజు, అసెస్మెంట్ మొత్తాన్ని చెల్లించాలని, లేకపోతే నాన్బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని అందులో పేర్కొన్నారు. అనంతపురం, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ చౌర్యం కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. మొత్తం 1,841 మందిపై నాన్బెయిలబుల్ కేసుల నమోదుకు నోటీసులు జారీ చేశారు. రూ.14.27 లక్షల రికవరీ కోసం విద్యుత్ చౌర్య నిరోధక పోలీసులు ఎస్సీ, ఎస్టీ కాలనీలకు వెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల వారిపైన 4,167 విద్యుత్ చౌర్యం కేసులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. నోటీసులు అందుకున్న వారు అరెస్టుల భయంతో వణికిపోతున్నారు. కొందరైతే ఊళ్లు వదిలి ఎక్కడో తలదాచుకుంటున్నారు. మరికొందరైతే పోలీసులకు పట్టుబడి బతిమలాడుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని నోటీసులు అందుకున్న వారు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీలను అన్ని విధాలా ఆదుకుంటామని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని ఇచ్చిన హామీలన్నీ ఉత్తివేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తక్షణమే నోటీసులు ఉపసంహరించుకుని, కేసులు ఎత్తివేసి.. తమకు ఉచిత విద్యుత్ అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు. టీడీపీ వచ్చాకే కష్టాలు టీడీపీ ప్రభుత్వం వచ్చాకే కరెంటు కేసులు పెడుతున్నారు. పోలీసులను ఇళ్లకు పంపి భయపెడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా బిల్లు కట్టించుకోలేదు. కనీసం అధికారులు వచ్చి ఒత్తిడి చేసిందీ లేదు. ఆయన హయాంలో హాయిగా నిద్రపోయాం. ఇప్పుడు రికవరీ, కేసులు పేరిట పోలీసులు చేస్తున్న హడావుడితో క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నాం. – సుజాతాబాయి, పాలవాయి తండా, కళ్యాణదుర్గం మండలం ఎస్సీ, ఎస్టీలను ఇబ్బందులు పెట్టొద్దు చంద్రబాబు ప్రభుత్వానికి ఎస్సీలు, ఎస్టీలంటే చిన్నచూపు. విద్యుత్ చౌర్యం కేసుల పేరుతో ఇళ్లకు వెళ్లి పోలీసుల ద్వారా భయపెడుతోంది. ఎస్సీ, ఎస్టీలతో ఓట్లు వేయించుకుని.. సంక్షేమానికి పాటుపడతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు కేసుల పేరుతో ఇబ్బందులు పెట్టడం బాధాకరం. టీడీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బనాయించిన విద్యుత్ చౌర్యం కేసులు ఎత్తేసి, విధించిన రుసుం రద్దు చేయాలి. లేకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.– తిప్పేస్వామి నాయక్, జీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసులతో కంటిమీద కునుకు లేదు కరెంటు దొంగతనంగా వాడుకుంటున్నామంటూ ఎనిమిది నెలల కిందట మాపై కేసు నమోదు చేశారు. తొమ్మిది నూటా నలభై రూపాయలు కట్టించుకున్నారు. పోలీసులకు మళ్లా సపరేటుగా రూ.500 కట్టాను. వైఎస్సార్ ఉన్నప్పుడు ఏనాడూ ఇలాంటి కేసులు పెట్టలేదు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చాక మాపై కేసులు పెట్టి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.– వసంతమ్మ,, ఎస్సీ, తూముకుంట ఉచిత విద్యుత్ అమలులో విఫలం ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ‘దీన్ దయాళ్’ పథకం ప్రవేశపెట్టింది. రూ.125 చెల్లిస్తే విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు అయితే వంద యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. 125 యూనిట్ల వరకు వినియోగిస్తే.. అదనంగా కాల్చిన 25 యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. 126 యూనిట్లకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బృహత్తర పథకం గురించి ప్రచారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించి.. వారికి వర్తింపజేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఇప్పుడు వారినే విద్యుత్ చౌర్యం కింద నేరస్తులను చేస్తోంది. కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో బుధవారం విద్యుత్ చౌర్య నిరోధక పోలీసులు రికవరీ కోసం వెళ్లారు. పోలీసుల పక్కన కనిపిస్తున్న మహిళ టీడీపీ కార్యకర్త తిమ్మరాజు భార్య సుశీలమ్మ. వీరికి కూడా విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేసి పోలీసులు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. -
‘దళిత్’ రణనినాదంపై ఆంక్షలా?
ఈ దేశంలో వ్యక్తుల, లేదా సంస్థల పేర్లు సైతం పాలకుల ఆంక్షల సంకెళ్ళ మధ్య బందీ అవుతోన్న నిర్బంధ పరిస్థితులు మన కళ్ళెదుటే తాండవిస్తున్నాయి. నిజానికి ‘దళిత్’ అనే పదం ఏ ఒక్కరికీ నష్టం కలిగించే అంశం కాదు. లేదా ఎవరినీ కించపరిచేది అంతకన్నా కాదు. ఎవరైనా ఆ పదం వాడదలుచుకోకపోతే అది వారి ఇష్టం. దానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే అది తమ రణనినాదం అనుకుంటున్నారో అటువంటి వారిమీద ఆంక్షలు విధించడం ఫాసిస్ట్ చర్య తప్ప మరొకటి కాదు. అంటరాని కులాలు ఒక్కటిగా ఉండడం, ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడటం అధికారంలో ఉన్న శక్తులు సహించలేకపోతున్నాయి. నీ విశాలాకాశంలోని సూర్యచంద్రులని నాకి మ్మని అడగలేదు/ విస్తరిం చిన నీ ఆస్తులూ, నీ భూములూ నేనడగనేలేదు/ నీవు కట్టుకున్న విలాసవంతమైన భవనాలూ, ఆకాశ హార్మ్యాలూ నాకక్కర్లేదు/ నీ ఉత్సవాలనూ, పండుగ లనూ, నీ దేవుళ్ళని కూడా నేనేనాడూ ఆశించలేదు/ నీ కులాలూ, నీ జాతులూ నాకక్కర్లేదు సుమా!/ కనీసం నీ తల్లులూ, నీ చెల్లెళ్ళూ, నీ కూతుళ్ళనీ కన్నెత్తిసైతం చూడలేదు/నేనడిగిందొక్కటే.. నేను కోరుకున్నదీ అదొ క్కటే నా హక్కులు../అదే నన్ను నన్నుగా, ఒక మని షిగా చూసే నా జన్మహక్కునే నేనడుగుతున్నాను... మరాఠీ దళిత కవుల సంకలనం ‘పాయిజన్ బ్రెడ్’ లోని పంక్తులివి. దళిత పాంథర్స్ ఉద్యమ చైతన్య స్ఫూర్తి ఆధిపత్యంపై గురిపెట్టిన అక్షరశూలాలివి. సరిగ్గా నాలుగు దశాబ్దాల కిందట శతాబ్దాల అణచి వేతపై ధిక్కారాన్ని ప్రకటించిన ఒకే ఒక్క పదం ‘దళిత్’. కాలిధూళికన్నా హీనంగా చూడబడ్డ ఓ సమూహాన్ని సమీకరించి పెనుఉప్పెనై ఎగిసిపడేలా చేసిందీ ఆ పదమే. 1972లో ముంబాయిలో కొందరు దళిత యువకులు సంయుక్తంగా ‘దళిత్ పాంథర్స్’ అనే ఒక సంస్థను ఏర్పర్చుకున్నారు. ఆ తదుపరి సంవత్సరం 1973 ఆగస్టు 15వ తేదీన దాదాపు 200 మందికి పైగా యువకులు నల్లజెండాలు ఎగురవేసి నిరసన ప్రకటన చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సరిగ్గా 26 ఏళ్ళ తరువాత బూటకపు స్వాతంత్య్రం తమకు ఒరగబెట్టిందేమీలేదని భారత వినీలాకాశంలో నల్లజెండాలు ఎగురవేసారు. అనంతరం ‘దళిత్ పాంథర్స్’ ఉద్యమం మహారాష్ట్ర మొత్తం విస్తరించింది. ఎందరో దళిత కవులనూ, రచయిత లనూ సృష్టించింది. ఆ తరువాత అంటరాని కులాల సమీకరణకూ, సంఘటిత పోరాటానికీ ‘దళిత్’ అనే పదం ఓ ప్రతిఘటనా సంకేతంగా మారింది. అనం తర కాలంలో ఆ పదమే సమానత్వ శక్తిగా అవతరిం చింది. దేశవ్యాప్తంగా ‘దళిత్ పాంథర్స్’ సంస్థ కూడా శాఖోపశాఖలుగా విస్తరించింది. వేయికిపైగా కులా లుగా విభజనకు గురైన అంటరాని వారిని ఏకం చేసింది. దేశం నలుమూలల నుంచి ఎవరు ఎక్కడ కలిసినా అంటరాని కులాల గుర్తింపు దళిత్ అనే మూడక్షరాల్లో సంపూర్ణంగా ఒదిగిపోయింది. మొట్టమొదటిగా దళిత్ అనే పదాన్ని వివక్షల నేపథ్యంలో జ్యోతీబా ఫూలే ఉపయోగించినట్టు పరి శోధకులు చెప్తున్నారు. కానీ సంఘం నిర్మాణానికి ఈ పేరును మొట్టమొదట వాడిన స్థలం హైదరాబాద్ కావడం విశేషం. 1947 జూలై 20 వతేదీన ‘దళిత్ జాతీయ సంఘ్’ పేరుతో ఒక సంఘాన్ని హైదరా బాద్లో ఏర్పాటు చేశారు. అప్పటి వరకు విడివడి ఉన్న ‘ఆదిహిందూ ఇండిపెండెంట్ లీగ్’, ‘అరుంధ తీయ మహాసభ’, ‘డిప్రెస్డ్ క్లాసెస్ కాంగ్రెస్’, ‘ఇండి పెండెంట్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్’, ‘హరిజన్ అసోసియేషన్’లు కలిసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘాల ప్రతినిధులందరూ హైదరాబాద్ స్వాతంత్య్ర సమరయోధుడు స్వామి రామానంద తీర్థ ఇంట్లో సమావేశమై హైదరాబాద్ దళిత నాయకుడు అరిగె రామస్వామి కన్వీనర్గా 15 మందితో ఒక కమిటీని కూడా ఏర్పర్చుకున్నారు. ఈ సంఘం ఏర్పాటు ఆనాటి అంటరాని కులాల సంఘ టితత్వానికి ఒక చిరునామాగా మారింది. సరిగ్గా ఇదేరకమైన ఐక్యత మహారాష్ట్రలోని దళిత యువకులకు అవసరమైంది. బాబాసాహెబ్ అంబేడ్కర్ మరణానంతరం ఏర్పడిన ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’ దళితుల పక్షాన నిలబడి పోరాటం చేయకపోవడం మాత్రమే కాకుండా అస్తి త్వాన్ని సైతం కోల్పోయి ముక్కలు చెక్కలై దళితుల్లో నిరాశానిస్పృహలను నింపింది. అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటరాని కులాలను నిర్ల క్ష్యం చేయడంతోపాటు ఇటీవలి కాలంలో దళితులపై గ్రామాల్లో పట్టణాల్లో జరుగుతున్న దాడులను ఏమాత్రం అరికట్టలేకపోయింది. దీంతో మరొక ఉద్యమ అవసరాన్ని దళిత యువతరం గుర్తించింది. ఒకవైపు దేశంలోని దళితుల జీవన పరిస్థితులు ఈ సంఘం ఆవిర్భావానికి ఒక కారణం అయితే, 1960 ప్రాంతంలో అమెరికాలో పెల్లుబికిన పౌరహక్కుల ఉద్యమం నేపథ్యంలో వచ్చిన ‘బ్లాక్ పాంథర్స్ పార్టీ’ ఇక్కడి ‘దళిత్ పాంథర్స్’ ఉద్యమానికి తక్షణ ప్రేర ణగా నిలిచింది. ఒకరకంగా మహారాష్ట్రలోని ‘దళిత్ పాంథర్స్’ ఉద్యమ తరహాలోనే అనేక ప్రాంతాల్లో అనేక రూపాల్లో దళితుల్లో నిరసనజ్వాలలు పెల్లుబి కాయి. దేశంలో కూడా ఆనాడు వివిధ ప్రాంతాల్లో నక్సలైటు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఈ ఉద్య మానికి ఆనాటి దళితుల్లో, ఆదివాసీల్లో ఉన్న అసం తృప్తే ప్రధాన కారణం. అదే కాలంలో 1960, 70 దశకాల్లో వచ్చిన మహత్తర ఉద్యమాల్లో ‘దళిత్ పాంథర్స్ ఉద్యమం’ కూడా దళితుల చైతన్యస్థా యిలో అనూహ్యమైన మార్పులు తెచ్చింది. గత కొంతకాలంగా ‘దళిత్’ అనే పదంమీద నిషేధం విధించడానికి కొంతమంది కారణాలను వెతుకుతున్నారు. ఇటీవల నాగ్పూర్ హైకోర్ట్ బెంచ్లో ఒక దళితుడి చేతనే ‘దళిత్’ అనే పదాన్ని వాడుకలో నుంచి తీసివేయాలంటూ పిటిషన్ వేయిం చారు. అంతటితో ఆగకుండా ‘దళిత్’ అనే పదాన్ని ప్రసార మాధ్యమాల్లో వాడకూడదనే ఉచిత సల హాను కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ ఆదే శాల రూపంలో జారీ చేసింది. ఇది యాదృచ్ఛికమైన చర్యకాదు. ఈ పదానికున్న శక్తిని నిరోధించే లక్ష్యంతో కావాలనే దీని వాడకాన్ని అడ్డుకునే కుట్ర చేసారు. దేశంలోకి బ్రిటిష్ వారు రాకముందు ప్రజ లంతా కులాల పేరుతోనే ఉనికిలో ఉన్నారు. అంట రాని కులాలు కూడా వందల సంఖ్యలో విభజనకు గురై వివిధ పేర్లతో వాడుకలో ఉన్నాయి. 1911 జనాభా లెక్కల్లో ‘డిప్రెస్డ్ క్లాసెస్’గా తొలిసారిగా ఒకచోటికి చేర్చారు. ఆ తరువాత 1935 భారత చట్టం ఏర్పడిన తరువాత వాటిని ‘షెడ్యూల్డ్ కాస్ట్’గా మార్చారు. ఇప్పటికీ అదే పేరు రాజ్యాంగంలోనూ, ఇతర అధికారిక కార్యకలాపాల్లో కొనసాగుతూ వస్తోంది. ఇక్కడ ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక్కడే ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. భారత స్వాతంత్య్రోద్యమ నాయకుడు గాంధీ కూడా అంటరాని కులాలకు ఒక పేరు పెట్టారు. అదే ‘హరిజన్’. ఆ పేరుని అంబేడ్కర్తో సహా అనేక మంది వ్యతిరేకించారు. 1970 తరువాత వచ్చిన దళిత చైతన్యం ఆ పేరును అధికార కార్య కలాపాల్లో వాడకూడదని డిమాండ్ చేసింది. దానితో ప్రభుత్వాలు తలొగ్గి హరిజన్ అనే పేరుని తొలగిస్తూ తీర్మానం చేయాల్సి వచ్చింది. ఇంతటితో హరిజన్ పద వాడకం చట్ట విరుద్ధంగా మారింది. ‘హరిజన్’ అంటే అవ్వ అయ్య లేని బిడ్డ అని అర్థం. తల్లి దండ్రులు లేకుండా దేవుడికి పుట్టినవాడని అర్థం. ఈ హరిజన్ అనే పేరుని అంటరాని కులాల వారికి ఇత రులు పెట్టారు. కానీ ‘దళిత్’ అనే పదం తమకు తాముగా, తమ ఆత్మగౌరవ పతాకగా, తమ అస్తి త్వానికి సంకేతంగా, తిరుగుబాటు నినాదంగా దళి తులు పెట్టుకున్నారు. భారత స్వాతంత్రోద్యమంలో ‘షాహీద్’ భగత్ సింగ్ ఇచ్చిన ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదం లాగా ‘దళిత్’ అనే పదానికి వీరంతా భయకంపితు లవుతున్నారనడానికి ఇదొక ఉదాహరణ. దళితో ద్యమ ఉప్పెనలో తమ ఉనికి ఎక్కడ కొట్టుకుపో తుందోనని బెంబేలెత్తి పోతున్నారు. అందువల్లనే ‘దళిత్’ అనే పదాన్ని ముందుగా అధికారిక కార్యకలా పాల్లో ఆ తర్వాత ప్రసార మాధ్యమాల్లో వాడకూడ దని ఆజ్ఞలు జారీ చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ అప్ర జాస్వామికం. ఈ దేశంలో వ్యక్తుల, లేదా సంస్థల పేర్లు సైతం పాలకుల ఆంక్షల సంకెళ్ళ మధ్య బందీ అవుతోన్న నిర్బంధ పరిస్థితులు మన కళ్ళెదుటే తాండవిస్తున్నాయి. నిజానికి ‘దళిత్’ అనే పదం ఏ ఒక్కరికీ నష్టం కలిగించే అంశం కాదు. లేదా ఎవరినీ కించపరిచేది అంతకన్నా కాదు. ఎవరైనా ఆ పదం వాడదలుచుకోకపోతే అది వారి ఇష్టం. దానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎవ రైతే అది తమ రణనినాదం అనుకుంటున్నారో అటు వంటి వారిమీద ఆంక్షలు విధించడం ఫాసిస్ట్ చర్య తప్ప మరొకటి కాదు. నిజానికి ‘దళిత్’ అనే పదం 1241 అంటరాని కులాలను ఒక్కతాటిపైకి తెచ్చిన బలీయమైన ఐక్య నినాదం. అంటరాని కులాలు ఒక్కటిగా ఉండడం ఆ శక్తి ప్రభుత్వానికీ ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడటం అధికారంలో ఉన్న శక్తులు సహించలేకపోతున్నాయి. కేరళ నుంచి కాశ్మీర్ వరకు మణిపూర్ నుంచి గుజరాత్ వరకు అంటరాని కులా లను సమైక్యపరిచే అంతులేని శక్తి కేవలం ఆ ఒక్క దళిత పదానికే ఉంది. ఇటీవల ఎస్సీ ఎస్టీ అత్యాచా రాల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశా లకు వ్యతిరేకంగా అంటరాని కులాలన్నింటినీ ఐక్యం చేసింది కేవలం దళిత పదమే. ఈ ఐక్యతాశక్తి దేశం లోని మరే సామాజిక వర్గానికీ లేదు. అందువల్ల ఈ ఐక్యతా నినాదాన్ని దెబ్బగొట్టే ప్రయత్నంలో భాగం గానే ‘దళిత్’ అనే పదంపై ప్రత్యక్ష, పరోక్ష నిషేధా లను విధిస్తున్నారు. అయితే, ఈ నిషేధాలకు దళిత శక్తి తలొగ్గే అవకాశం లేదు. దళితులు నడచివచ్చిన గత చరిత్రంతా రక్తసిక్తమే. ఎన్నో దాడులు, దమన కాండలు, అన్యాయాలూ, అణచివేతలూ అమానుషా లకు తిరుగుబాటుగా, ప్రతిఘటనగా వచ్చిందే దళిత నినాదం. భారతదేశంలోని వివక్షనూ, అణచివేతనూ, ఇలాంటివే కుట్రలనూ తూర్పారబట్టి, ఆధిపత్య భావ జాలాన్ని జల్లెడ బట్టి ఒక విముక్తి సిద్ధాంతాన్ని అంబే డ్కర్ దళితులకు అందించాడు. అందుకే దళితులు ఒంటరి కాదు. దళితులకు అందివచ్చిన పోరాట పతాకం జైభీం. అంబేడ్కర్ పేరుతో మారుమోగే ఈ నినాదం దేశంలోని దళితులందరినీ ఒక్కటి చేసింది. దళిత అస్తిత్వం, అంబేడ్కర్ తాత్విక సిద్ధాంతం, జైభీం నినాదం కోటానుకోట్ల దళిత ప్రజల హృద యాలనుంచి వేరు చేయడం అసాధ్యం అన్న సత్యాన్ని పాలకులు గ్రహించాలి. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
రిజర్వేషన్లపై మంత్రి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : రిజర్వేషన్లపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్లుగా ఎస్సీ, ఎస్టీ ఎవరున్న పెత్తనమంతా నాయకులదే అని రిజర్వేషన్లను కించపరిచే విధంగా మాట్లాడారు. గడువు ముగిసిన సర్పంచ్లతో బుధవారం విశాఖపట్నంలో ఆయన సమావేశమై మాట్లాడారు. పంచాయతీలో రిజర్వేషన్ల అమలు మామూలు విషయమే అని అన్నారు. మంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడం ఏంటని స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎస్సీ, ఎస్టీలను కించపరిచే విధంగా మాట్లాడడం టీడీపీ ప్రభుత్వానికి ఇదేం తొలిసారి కాదు. గతంలో సీఎం చంద్రబాబు ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నేటితో గ్రామపంచాయతీ సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
రోడ్డెక్కిన నాయీబ్రాహ్మణులు
చీమకుర్తి రూరల్(ప్రకాశం): సన్నాయి, డోలు వాయిద్యాలతో తమ సమస్యలను పరిష్కరించాలంటూ నాయీబ్రాహ్మణులు మంగళవారం సంతనూతలపాడు పట్టణంలో రోడ్డెక్కారు. జిల్లా అధ్యక్షుడు మిరియాల రాఘవ ఆధ్వర్యంలో చెన్నకేశవస్వామి గుడిదగ్గర నుంచి మెయిన్రోడ్డు మీదుగా వాయిద్య కళాకారులందరూ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మిరియాల రాఘవ మాట్లాడుతూ హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో తల నీలాలపై వచ్చే ఆదాయంలో సగభాగం నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ఖర్చుపెట్టాలని, కేశఖండనలో పనిచేసే క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులపై తరచూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నాయీబ్రాహ్మణులకు కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా తమ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరంటే ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా లేకపోవడం తమ దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నియోజకవర్గం నూతన కమిటీని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు కరేటి నరసింహరావు, బూసరపల్లి శ్రీనివాసరావు, గుంటూరు ఆంజనేయులు, గోనుగుంట నరేష్, మద్దులూరి ప్రసాద్, ఏడుకొండలు పాల్గొన్నారు. -
మోదీ, బాబులకు పాలించే హక్కులేదు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ) : కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న మోదీ, చంద్రబాబులు ప్రజ లకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ పాలన సాగిస్తున్నారని ప్రజా గాయకుడు గద్దర్ మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలో ఆంధ్రప్రదేశ్ మహాసభ పిలుపుమేరకు దళిత ప్రజల మానవ హక్కుల మహాసభను సోమవారం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో కె.రఘునాథరావు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ కూడలి నుంచి వైఎస్సార్ కూడలి వరకు ర్యాలీగా వెళ్లారు. దీనికి పోలీసులు మధ్యలో ఆటంకం కలిగించడంతో స్వల్ప తగాదా జరిగింది. గద్దర్ కలుగజేసుకుని తగాదాను సద్దుమణిగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రజా గాయకుడు గద్దర్ తనదైన పాటలతో ఊర్రూతలూగించారు. కార్పొరేట్ల కోసమే పాలన.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 40 కోట్ల మంది దళితులు ఉన్నారని వారి ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని ఉన్నత వర్గాల వారు తొ క్కేయడం సరికాదన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో దళితుల కోసం ఎన్నో చ ట్టాలను పొందుపరిచారని వాటన్నింటినీ కార్పొరేట్లు, ప్రభుత్వానికి అనుకూలంగా న్యాయవాదులు నిర్వీర్యం చేస్తున్నారన్నారు. పూర్వం నుంచి కులాల, మతాల, వృత్తుల వారీగా పనిచేస్తూ బతుకులు నెట్టుకొస్తున్న వారంతా అట్టడుగున ఉండిపోయారని తెలిపారు. సమాజంలో క్రైస్తవులు, ముస్లింలు, దళితుల మీద, సామాజిక వ్య వస్థ మీద ఈ నాటికీ అగ్రకులస్తులు పెత్తనం చలాయిస్తున్నారని తెలిపారు. అంబేడ్కర్ పుట్టిన జాతిని, రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం తగదన్నారు. దోపిడీ వర్గాల వారికి తగిన శిక్షలు పడాలని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నియమాలు పాటించకుండా న్యా యమూర్తులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టంపై ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీంకోర్టు తీర్పు దళితులకు తీరని లోటన్నారు. అత్యాచార చట్ట వ్యతిరేక తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు తెలి యజేస్తే పోలీసులు దాడి చేయించి 11మందిని చంపేయడం దారుణమన్నారు. మరణానికి కారకులపై నేటికీ శిక్ష వేయకుండా తాత్సారం చేస్తున్నారని అన్నారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచార చట్టాన్ని సవరించకుండా ముందు ఉన్నట్లుగానే చేయాలం టే దళిత కులానికి చెందిన ఎంపీలంతా రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్వీర్యం చేస్తూ అగ్రకులందారులు రిజర్వేషన్లను సైతం ఎత్తుకుపోతున్నారని ఆరోపించారు. ధమాసా పాలనను తీసుకొచ్చేందుకు వామపక్షాలు నిర్ణయం సరికా దని దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఎన్నికల పెట్టుబడిదారీ వ్యవస్థను అంతమొందించిన నాడే సమాజంలో ప్రతి ఒక్క నిరుపేదకు న్యాయం జరుగుతుందన్నారు. హిందువులు రా మాయణం, క్రైస్తవులు బైబిల్, ముస్లింలు ఖురాన్ చదివినట్లుగానే సమాజంలో ప్రతి ఒక్క దళిత యువకుడు రాజ్యాంగాన్ని చదవాలని కోరారు. అప్పుడే అంబేడ్కర్ ఆశయ సాధన నెరవేరుతుం దన్నారు. ఈ సందర్భంగా గద్దర్ ఆధ్వర్యంలో నిచ్చెనమెట్లు అనే నాటికను ప్రదర్శించి అన్ని వర్గాల ప్రజల సాధకబాదకాలను తెలియజేశా రు. దళిత మహాసభ బెంజిమెన్ మాట్లాడుతూ దే శంలో, రాష్ట్రంలో దళితులపై దాడులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని అందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చే యడం సరికాదన్నారు. దళితులకు న్యాయం చేసిననాడే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి విలువ ఇచ్చినట్లు అవుతుందన్నారు. రాష్ట్రంలో చుం డూరు, గరగపర్రు, లక్ష్మింపేటలో జరిగిన సంఘటనలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఝాన్సీ, ఉపాధ్యక్షులు టి.అచ్చారావు, జిల్లా ప్రధానకార్యదర్శి తాండ్ర అరుణ, దళిత కూలీ రైతు సంఘం, విశాఖపట్నం ప్రధానకార్యదర్శి వై.ఎస్ ప్రసాద్, దళిత నాయుకులు ఏ.కామేశ్వరరావు, జి.కృష్ణ, ఎస్.రాజేష్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. -
దాడులు చేస్తే బుద్ధిచెబుతాం
కల్వకుర్తి టౌన్ : అగ్రకుల నాయకులు బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల నాయకులపై దాడి చేస్తే బుద్ధి చెబుతామని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అన్నారు. వారుచేసే వ్యాపారంలో తగినంత ఓర్పు, సహనం ఉంటేనే చేయాలని, లేదంటే మానుకోవాలని చెప్పారు. బీసీ సంఘాలు, కులసంఘాల, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆదివారం కల్వకుర్తిలోని పాలమూరు చౌరస్తాలో దాదాపు మూడు గంటలకు పైగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తరంజన్దాస్ మాట్లాడారు. దాడి చేయడమే కాకుండా, తమకు న్యాయం చేయాలని పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేయటం దారుణమని అన్నారు. అమరావతి బార్ యజమానులు మండలంలోని తిమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను వెంబండించి కొట్టడం దారు ణమని బీసీ సంఘాల నాయకులు అన్నారు. వెల్దండ మండలం వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. దెబ్బలుతిన్న వారిని ప రామర్శించకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పూనుకుంటాం అమరావతి బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు సమయంలో అదే ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని, అయినా వినకుండా ఏర్పాటు చేశారని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఓ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ భాగస్వామిగా ఉంటూ, తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు. కల్వకుర్తి ఘటనను రాష్ట్రవ్యాప్త ఆందోళనగా మార్చుతామని బీసీ నాయకులు పేర్కొన్నారు. ఈ ఘటన విషయంలో డీఎస్పీ చొరవ అభినందించదగినదని అన్నారు. కానీ డీఎస్పీని స్థానిక ప్రజాప్రతినిధి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఆయన దురహంకారానికి నిదర్శనమని అన్నారు. డీఎస్పీతో సమావేశం పోలీసుల సూచనలతో ధర్నా విరమించిన బీసీ సంఘాల నాయకులతో కల్వకుర్తి డీఎస్పీ ఎల్సీ నాయక్, నాగర్కర్నూల్ డీఎస్పీ లక్ష్మీనారాయణ సమావేశం నిర్వహించారు. పట్టణాన్ని ప్రశాంత వాతావరణంలో ఉంచుదామని, దానికి అందరూ సహకరించాలని కోరారు. ముగ్గురు యువకులపై 20మందికి పైగా దాడిచేశారని, వారందరినీ అరెస్టు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. డీఎస్పీలు మాట్లాడుతూ వారిని కూడా పట్టుకుంటామని చెప్పారు. ధర్నా కార్యక్రమంలో బీసీ సబ్ప్లాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లె గోపాల్, బీఎల్ఎఫ్ పార్లమెంట్ సమన్వయకర్త ప్రొఫెసర్ వెంకటదాసు, ఓబీసీ నేత పైళ్ల ఆశయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బాలాజీ సింగ్, బీసీ నాయకులు బాలస్వామి గౌడ్, జంగయ్య, కేవీపీఎస్ నాయకులు, వడ్డెర కుల సంఘ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్పై ఆకస్మిక ప్రేమ!
తమ అవసరాలు తొందర చేస్తున్నందున.. అంబేడ్కర్ పైన, ఆయన ‘మార్గం’పైన ఇప్పుడు మోదీ ఆలస్యంగానైనా అంత ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. కానీ అదే అంబేడ్కర్ ప్రధాన సంధాన కర్తగా, నిర్మాతగా రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చాలన్న తలంపు బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో ప్రజలు తెలుసుకోగోరుతున్నారు. ఒకవైపున ప్రగతిశీల ఉద్యమకారులను, హేతువాదుల్ని డజన్ల కొలదీ హతమారుస్తూ, మరోవైపు సెక్యులర్ వ్యవస్థా రక్షకునిగా వర్ధిల్లిన అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. ‘‘ఇంతవరకూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు ఏ ప్రభుత్వమూ ఇవ్వని గౌర వాన్ని మా బీజేపీ ప్రభుత్వం కల్పించింది. అంబేడ్కర్ చూపిన మార్గంలోనే నా ప్రభుత్వం నడుస్తోంది. దేశంలోని మిగతా పార్టీలన్నీ ఆ దారిలోనే నడవాలి’’ 1989 నాటి షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాల, దాడుల నిరోధక చట్టాన్ని 2016లో బీజేపీ–ఆరెస్సెస్ పరివార్ ప్రభుత్వం సవరించిన అనంతరం బీజేపీ ప్రభుత్వ కోరికపై సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన రూలింగ్ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బాధిత వర్గాలు తీవ్ర ఆందోళన జరిపాయి. పర్యవసానంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆగమేఘాలపై ఈ ప్రకటన చేశారు (3.4.2018). ‘‘కుల వ్యవస్థ రక్షణ చట్టానికి, వివక్షారహిత సెక్యులర్ రక్షణ చట్టానికీ మధ్య ఘర్షణలో కుల (కమ్యూనల్) రక్షణ చట్టం విజయం పొందడమంటే భారతదేశ పతనానికి మార్గం ఏర్పడినట్టే’’ డాక్టర్ అంబేడ్కర్ 1948 ఏప్రిల్ 18న ఢిల్లీలో లా యూనియన్ వార్షికోత్సవ ప్రసంగం ‘అంబేడ్కర్ స్పీక్స్’ వాల్యూం–2, పే: 364. ఉన్నట్టుండి అదాటున ఉలుకుపాటుతో నిద్ర మేల్కొనడం సాధారణ వ్యక్తులకు కాకుండా రాజకీయ పాలకులకు సహజమా? ప్రధాని మోదీ అకస్మా త్తుగా భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన ‘అంబేడ్కర్ మార్గం’ గురించి ఓ ‘కలలాగా’ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చి ప్రస్తావించినట్టు? ఇది ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే, జాతీయోద్యమ కాలంలోగానీ, దేశ స్వాతంత్య్ర సముపార్జన దశలోగానీ, ఆ తరువాతగానీ ఆరెస్సెస్–బీజేపీ పరివార్ వర్గానికి కనీస స్ఫురణకుగానీ, ప్రస్తావనకుగానీ రాని ‘అంబేడ్కర్ మార్గం’ ఇప్పుడెలా బీజేపీ నాయకత్వానికి గుర్తుకొచ్చింది? ‘అవకాశవాదం’ అనేది రాజకీయులకు ఉన్న అనేక మార్గాలలో ఒకటి కాబట్టి, కళ్లముందు దోబూచులాడుతున్న ఎన్నికల ఘడియలలో దేశ జనాభాలో అధిక శాతంలో ఉన్న తాడిత, పీడిత ఇత్యాది దళిత ప్రజా బాహుళ్యం ఓట్లు గుర్తుకు వచ్చిన ప్పుడల్లా ‘అంబేడ్కర్ మార్గం’ గుర్తుకొస్తోంది, నవ భారత నిర్మాణానికి దృఢమైన అసలు పునాది ఏదో అంబేడ్కర్కు తెలుసు. వివిధ జాతుల, భాషా మైనారిటీల, మతాల, విభిన్న సంస్కృతులతో తులతూగే సుందర భవి ష్యత్తును నిర్మించుకోవలసిన భారత దేశంలో చెక్కు చెదరని సమైక్యతా భార తాన్ని సుసాధ్యం చేసుకోవాలంటే ఏం చేయాలో ఒక దార్శనికునిగా అంబే డ్కర్ సూచించిన అసలు ‘మార్గం’ ఏమిటి? హైందవ సమాజం స్తంభించింది అక్కడే ‘‘దేశ భవిష్యత్తు దైవ నిర్ణయమని మనువు, యాజ్ఞ్యవల్క్య ఏనాడు బోధించి శాసించడం మొదలుపెట్టారో, నాటి నుంచి హైందవ సమాజం తనను తాను మరమ్మతు చేసుకోలేకపోయింది. కనుకనే హిందూ సమాజంలో పాతుకు పోయిన సాంఘికపరమైన అడ్డుగోడలను, దడులను మడులనూ బదాబ దలు చేయనంతవరకు మన సమాజ ప్రగతికి మార్గం లేదు. ఈ విషయంలో చొరవ చేయవలసింది ప్రత్యేక మెజారిటీగా ఉన్న హిందూ సమాజమే. ఇతర సామాజిక వర్గాలు (కమ్యూనిటీస్) ప్రత్యేక ఉనికితో నివసిస్తూ జీవనం గడు పుతున్నప్పుడు వారిని పట్టించుకోనట్టు వ్యవహరించే హైందవ సమాజానిదే పూర్తి తప్పిదం అవుతుంది. కనుక ఆచరణలో ప్రయోజనం కల్పించని ఉబుసు పోని నిష్ప్రయోజనకరమైన తాత్కాలిక పథకాలవల్ల లాభం లేదు’’ అన్నారు అంబేడ్కర్ (అంబేడ్కర్ స్పీక్స్: వాల్యూం–2, పే. 344). అంతేకాదు, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల తదితర అసంఖ్యాక అణగారిన వర్గాల ప్రజల న్యాయమైన డిమాండ్లను బేషరతుగా అంగీకరించడానికి అటు కాంగ్రెస్గానీ, ఇటు హిందూ మహాసభీయులు (ఆరెస్సెస్ ఒర లోని) సిద్ధ పడితే ఆ పార్టీలతో చేతులు కలపడానికి సిద్ధమన్నారు అంబేడ్కర్. అయితే అందుకు ఆయనొక సూటి ప్రశ్నను ఆనాడే సంధించారు: ‘‘ఇంతకూ ఈ రెండుపార్టీలు (కాంగ్రెస్/హిందూ మహాసభ) షెడ్యూల్డ్ కులాలకు మిత్రులో, శత్రువులో తేల్చుకోవాలి’’ అన్నారు అంబేడ్కర్. మతోద్రేక ఉద్యమాలే దేశభక్తా? అంటే, ఇప్పుడు ఆరెస్సెస్–బీజేపీ అభ్యర్థి అయిన ప్రధాని మోదీ చెబుతున్న ‘అంబేడ్కర్ మార్గం’ ఇదే అయితే, అంబేడ్కర్ హిందూ సమాజంపైన ఎక్కు పెట్టిన ప్రశ్నలకు కూడా సూటిగా సమాధానం చెప్పగలగాలి. ఈ అనుమానం ఎందుకు తలెత్తుతోందంటే– ‘అంబేడ్కర్ మార్గం’ ఏదో కూలంకషంగా వివరిం చకుండా ఎన్నికల నినాదంలో భాగంగా భావించి కూర్చుంటే దేశ ప్రజా బాహుళ్యాన్ని మరోసారి మోసగించడమే అవుతుంది. ఈ అనుమానానికి అసలు కారణం– ఆరెస్సెస్ పరివారం స్వాతంత్య్ర సమరానికి దూరం కావడం, సావర్కార్గానీ, గోల్వాల్కర్గానీ జాతీయ స్వాతంత్య్రోద్యమంతోకన్నా మతో ద్రేక ఉద్యమాలతో మమేకం కావడమే ‘దేశభక్తి’గా భావించారు. భిన్న మతస్తు లతో ఆప్యాయంగా కౌగలింతలు కూడా వారి దృష్టిలో నిషిద్ధమయ్యాయి. భారతదేశంలోని ఇతర మతస్తులకు (విదేశీయులుగానీ, స్థిర నివాసులుగానీ) పౌర హక్కులు సహితం ఉండడానికి వీల్లేదని గోల్వాల్కర్ శాసించారు. హిందూ–ముస్లిం ఐక్యత అవసరాన్ని ప్రబోధించిన జాతిపిత గాంధీజీ దేశీయ ఉన్మాదుల చేతుల్లో హత్యకు గురయ్యారు. జాతీయోద్యమ నాయ కులు, ప్రజలు నిరసించిన సొంత ఇంటి ఉన్మాదులే దీనికి కారణం. ‘గాంధీజీ హత్య’ కారణాలను తిరిగి విచారించాలన్న ఉన్మాదుల పిటిషన్ను సుప్రీం కోర్టు ఇటీవలనే కొట్టి పారేసింది. ఈ పరిణామం 2014 ఎన్నికల ఫలితాల పర్యవసానంగానే ప్రజలు గుర్తించారు. అంతేగాదు, తమ అవసరాలు తొందర చేస్తున్నందున.. అంబేడ్కర్ పైన, ఆయన ‘మార్గం’పైన అంత ప్రేమాభిమానాలు ఇప్పుడు మోదీ ఆలస్యంగానైనా కురిపిస్తున్నప్పుడు– అదే అంబేడ్కర్ ప్రధాన సంధాన కర్తగా, నిర్మాతగా రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చాలన్న తలంపు బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో ప్రజలు తెలు సుకోగోరుతున్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడే రాజ్యాంగం నుంచి, దానిలో భాగమైన ప్రియాంబుల్ నుంచి ‘సెక్యులర్’ ‘సోషలిస్టు’ పదాలను తొలగించాలన్న ప్రయత్నం విఫలం కాగా, తాజాగా మోదీ పాలన రాజ్యాం గాన్ని ‘హిందుత్వ’ వేర్పాటువాద ధోరణులకు అనుకూలంగా అధికారం ముగిసేలోగా మార్చేయాలని సంకల్పించినట్టుంది. అందుకు ఒక ‘ముసుగు’ కావాలి. ఆ ముసుగును ఎవరికో కాదు, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్కే తొడిగి, ఆయని ‘మార్గం’ ఏదో స్పష్టంగా వివరించకుండానే ప్రజా బాహుళ్యాన్ని మోసగించడానికి బీజేపీ వెనుకాడదు. ఒకవైపున పౌర సమాజాన్ని ప్రగతిశీల ఉద్యమకారులను, హేతువాదుల్ని డజన్ల కొలదీ హతమారుస్తూ, ఇంకోవైపునుంచి సెక్యులర్ వ్యవస్థా రక్షకునిగా వర్ధిల్లిన అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. సెక్యులర్, ప్రజా స్వామిక వ్యవస్థ కోసం నిలబడి, కేంద్ర కేబినెట్లో న్యాయ శాఖామంత్రిగా పనిచేసిన అంబేడ్కర్ తన లక్ష్యం నెరవేరగల అవకాశం ఈ ధనికవర్గ వ్యవస్థలో పూజ్యమని నమ్మి పదవికి రాజీనామా చేయవలసి వచ్చిందని మరవరాదు. ఇందుకు నిదర్శనం ఈ రోజుకీ, ‘అంబేడ్కర్ మార్గం’ గురించి ఎన్నికల ప్రచార పథంగా వల్లిస్తున్న బీజేపీ పాలకుల నినాదమే. ఇందుకు తాజా ఉదాహరణ–షెడ్యూల్డ్ కులాలపై అత్యాచారాల, దాడుల నిరోధక చట్టాన్ని (1989) నీరుకారుస్తూ 2015లో మోదీ ప్రభుత్వం తెచ్చిన సవరణల ప్రకారమే, కేంద్ర ప్రభుత్వ రివ్యూ పిటిషన్ను అనుసరించే తాను తాజా రూలింగ్ ఇచ్చానని సుప్రీం బహిరంగ పర్చడంతో మోదీ ప్రస్తావిస్తున్న ‘అంబేడ్కర్ మార్గం’లో చిత్తశుద్ధి కాస్తా దేశానికి వెల్లడైపోయింది. ఏడు దశాబ్దాలకూ తగ్గని కులపీడన అందుకనే అంబేడ్కర్ ‘ఏ మతాన్నైనా వారసత్వ సంపదగా అందిపుచ్చు కొనకూడదు, ప్రతి ఒక్కరూ హేతువు ఆధారంగానే పరిశీలించుకోవాల’నీ దాన్ని తండ్రి నుంచి కొడుక్కి సంక్రమించే వస్తువులుగానో లేదా ముచ్చట గొలిపే కబుర్లుగానో భావించరాద’నీ కోరారు. అయినా సరే 70 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ‘కులంగాడు’ భారతీయ సమాజాన్ని దారు ణంగా ఏలుతూనే ఉన్నాడు. ఈ పరిస్థితి కాంగ్రెస్ హయాంలోనూ, బీజేపీ పాలనలోనూ నర్మగర్భంగానూ, బాహాటంగానూ అమలులోనే ఉంది. అందుకే మన అగ్రకుల వ్యవస్థలో ‘2వేల ఏళ్లుగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలూ (దళిత వర్గాలు) బాధలు అనుభవిస్తూనే ఉన్నాయని’ చెబుతూ అంబేడ్కర్ తన ఆవేదనను ఆనాడే అక్షరబద్ధం చేశారు. అయినా ఈ రోజుకీ కాంగ్రెస్ పాలనలోకన్నా, బీజేపీ పాలనలోనే షెడ్యూల్డ్ కులాలపైన, పౌరులపైన దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయని మరవరాదు. పరిపాలనా శాఖల్లో ‘దళిత’ పదాన్ని వాడొ ద్దని నిషేధం విధిస్తూ, షెడ్యూల్డ్ కులాలు అని మాత్రమే వాడాలని సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ (15.3.2018) తాఖీదు విడుదల చేసింది. కానీ, ‘దళిత’ పదాన్ని వాడొద్దన్నంత మాత్రాన ఆ తాడిత, పీడిత అసంఖ్యాక ప్రజా బాహుళ్యానికి ప్రత్యేకించి ఒరిగేదేమీ లేదు, ‘షెడ్యూల్డ్ కులాలన్నంత మాత్రాన వారికి వచ్చి పడేది ఉండదు. వారికి ఉద్దేశించామని చెబుతున్న ఎన్ని పథకాలకు ఆచరణలో ‘గౌరవం’ లభించింది? వాటి ఆస రాగా ఎందరు అజ్ఞాత శక్తులు నాయకుల ముసుగులో ‘ఆమ్యామ్యా’లకు పడ గెత్తలేదు? అసలింతవరకూ, అస్పృశ్యతా రద్దు చట్టం వచ్చి పేరుకు ‘అస్పృ శ్యత’ అన్న పదం వైదొలగినా, నిషేధం ఉన్నా ఆ పదం చాటున నర్మగర్భంగా జరిగే దారుణాలు తగ్గలేదు. విద్యా, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన సాధికార పబ్లిక్ సంస్థలన్నీ బీజేపీ పాలకుల ప్రత్యక్ష, పరోక్ష మార్గాల ద్వారా అవాంఛనీయమైన మార్పులకు ‘హిందుత్వ’ సిద్ధాంత జోక్యానికి క్రమక్ర మంగా గురవుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ– డార్విన్ పరిణామ వాద నిరూపిత సిద్ధాంతానికి, విశ్వరూపంపై, వివిధ గ్రహరాశిలో జరుగు తున్న పరిణామాలను వివరించిన స్టీఫెన్ హాకింగ్ సిద్ధాంతాలకు ఆధారం అంతా వేదాలనుంచి ‘కొట్టిన కాపీ’ అని నిరూపించడానికి బీజేపీ కేంద్రమం త్రులే సాహసించి తృప్తి చెందడం. ఈ బాపతు ‘హిందూత్వ’ సరుకునే శ్రీశ్రీ ‘‘నవీన విశ్వ విద్యాలయాల్లో పురాణ కవిత్వం’’ వినిపించడంలాంటిద న్నాడు. విజ్ఞాన సాగరాన్ని మధించిన వారికి ‘క్షీర సాగరం’ తమలోనే దాగి ఉంటుంది గానీ కాకమ్మ కథలలో నిక్షిప్తమై ఉండదు గాక ఉండదు. ఆ రహస్యం తెలిసిన వాడు కాబట్టే, దేవులపల్లివారు ‘‘నాలోనే కలదు క్షీర సాగ రము’’ అనగలిగాడు. రాజకీయంగా కూడా అదీ– అంబేడ్కర్ మార్గం అంటే! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఐదంచెల పర్యవేక్షణలో ‘ఎస్డీఎఫ్’
ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి మార్గదర్శకాలు విడుదల సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఎస్టీ, ఎస్టీ అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్ల) మార్గదర్శకాలు విడుదల య్యాయి. దాదాపు ఆర్నెళ్ల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కంటే కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... పక్కా పర్యవేక్షణకు మార్గదర్శకాలిచ్చింది. ప్రత్యేక అభివృద్ధి నిధి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కొత్తగా ఐదంచెల విధానాన్ని తీసుకొచ్చింది. నిధుల వినియోగంలో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి చేరే క్రమంలో పర్యవేక్షణ, నిర్వహణ, నిఘాకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసింది. ఎస్సీ/ఎస్టీ ఎస్డీఎఫ్ల అమలులో ప్రధానంగా రాష్ట్ర కౌన్సిల్ కీలకపాత్ర పోషించనుంది. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరి స్తారు. ఇందులో కేబినెట్ మంత్రులు, ఎంపిక చేసిన ఎస్సీ/ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి ఎస్సీ అభివృద్ధి/ గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మెంబర్ కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో నోడల్ ఏజెన్సీలు...: ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ల అమలులో రాష్ట్ర స్థాయిలో రెండు నోడల్ ఏజెన్సీలతో కమిటీలుంటాయి. ఆయా శాఖల మంత్రులు ఈ నోడల్ కమిటీలకు చైర్మన్లుగా.., మెంబర్ కన్వీనర్లుగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వ్యవహరిస్తారు. ఇందులో వివిధ శాఖలకు చెందిన 14 మంది ముఖ్య కార్యదర్శులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల కమిషనర్లు, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సంబంధిత కార్యదర్శులు సభ్యులుగా, ఉంటారు. వీటితో పాటు రాష్ట్ర స్థాయి కమిటీలుంటాయి. వీటికి ప్రభుత్వం నియమించే ఎస్సీ/ఎస్టీ నామినేటెడ్ వ్యక్తులు చైర్మన్లుగా, ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మెంబర్ కన్వీనర్గా ఉంటారు. ఆర్థిక శాఖ కార్యదర్శి, మరో నామినేటెడ్ పర్సన్, సంబంధిత శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో...: ప్రత్యేక అభివృద్ధి నిధి పర్యవేక్షణ కమిటీలకు కలెక్టర్ చైర్మన్గా, ఎస్సీ,/ఎస్టీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఐటీడీఏ పరిధిలో ప్రాజెక్టు అధికారులు, నాన్ ఐటీడీఏ పరిధిలో జేసీ, డీటీడబ్ల్యూఓ, డీఎస్డీవోలు మెంబర్ కన్వీనర్లుగా, మరో 15శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో నిఘా కమిటీలకు ఎస్సీ/ఎస్టీ వ్యక్తులను చైర్మన్లుగా ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీటికి జిల్లా కలెక్టర్ కన్వీనర్గా, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి, గిరిజన సంక్షేమాధికారి, సంబంధిత అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు ఏటా కనీసం రెండు సార్లు సమావేశమై పరిస్థితిని సమీక్షించాలి. ప్రత్యేక అభివృద్ధి నిధి ద్వారా చేపట్టే కార్యక్రమాలు, నిధుల వినియోగం, పనుల నాణ్యత తదితర అంశాలపై పరిశీలించాలి. కమిటీల నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. -
పదోన్నతులు వెంటనే చేపట్టాలి
► ఎస్సీ, ఎస్టీ ఉఫాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న జన్నారం(ఖానాపూర్): ఉమ్మడి సర్వీసు రూల్స్కు రాష్ట్రపతి ఆమోద ముద్రవేయడంతో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు మార్గం సుగమం అయిందని ఎస్సీ, ఎస్టీ ఉఫాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎంఈవో, డిప్యూటీఈవో, డైట్, బీఈడీ, జూనియర్ లెక్చరర్ పోస్టులను, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో అమలవుతున్న మూల్యంకన విధానాన్ని తనిఖీకి శాశ్వత ప్రతిపాదినక అకాడమిక్ మానిటరింగ్ బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రాజలింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్య రాజన్న, జిల్లా కార్యదర్శి రమేశ్, మండల అధ్యక్షుడు తుంగూరి గోపాల్, ప్రధాన కార్యదర్శి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
భూ పంపిణీయే లక్ష్యం
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కొణì జర్ల: తన ఐదేళ్ల పదవి కాలంలో అర్హులైన పేద దళితులందరికీ భూమి పంపిణీ చేయాలన్నదే లక్ష్యమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఎస్సీలకు 3 ఎకరాల భూమి ప్రతిఫల యాత్రలో భాగంగా మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గతంలో భూ పంపిణీలో లబ్ధిపొందిన గుబ్బగుర్తి పంచాయతీ దళితులతో చర్చించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.395 కోట్లు ఖర్చు పెట్టి 10 వేల ఎకరాల భూమి పంపిణీ చేసిందని, మరో 10 వేల ఎకరాలు సిద్ధమవుతోందని చెప్పారు. కొణిజర్ల మండలంలోనే రూ.4.46 కోట్లతో 22 మంది లబ్ధిదారులకు 65 ఎకరాల భూమి పంపిణీ జరిగిందన్నారు. ఖమ్మం, వరంగల్, అదిలాబాద్ జిల్లాలలో 1(70) యాక్ట్, గోదావరి డెల్టా ప్రాంతం అధికంగా ఉండటం వల్ల భూమి దొరకడం లేదన్నారు. విదేశాల్లో ఉన్న వారు, భూస్వాములు భూమిని అమ్మడానికి ముందుకు రావాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్కు రూ.1000 కోట్ల నిధులు కేటాయిస్తే అందులో రూ.800 కోట్లను భూ పంపిణీకే కేటాయించినట్లు వివరించారు. అనంతరం వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్లాల్, అధికారులు, ఉద్యోగులు పిడమర్తి రవిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ వడ్లమూడి ఉమారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ శర్మ, తహసీల్దార్ జి.శ్రీలత, ఎంపీడీఓ పి.శ్రీనివాసరావు, ఆర్ఐ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
రుణ ం..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో బ్యాంకు లింకేజీ రుణం కావాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి తోడు.. ఏదైనా పూచీకత్తు పెట్టుకుని బ్యాంకులు ఇచ్చే రుణం తీసుకుని స్వయం ఉపాధి చేపడదామని భావించే వారికి ఆ రుణం అందని ద్రాక్షగానే మారుతోంది. ఆరుగాలం శ్రమించే అన్నదాతల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న చేనేత కార్మికులకు రుణం తీసుకోవడం గగన ంగా మారిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అసలు లక్ష్యంగా పెట్టుకున్న దానికి, మంజూరుచ్చిన, గ్రౌండింగ్ చేసిన దానికి, సబ్సిడీ లబ్ధిదారుడి ఖాతాలో జమ చేసేదానికి పొంతన లేకుండా పోతోంది. వేల సంఖ్యలో లబ్ధిదారులను లక్ష్యంగా పెట్టుకుంటుంటే లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో నగదు జమయ్యే వారి సంఖ్య పదులు దాటడం లేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఇచ్చే రుణ సదుపాయం 2013-14 సంవత్సరంలో జిల్లా మొత్తం మీద కేవలం ఒక్కరికంటే ఒక్కరికే వచ్చిందంటేనే రుణ పరపతి ప్రక్రియ జిల్లాలో ఎంత అధ్వానంగా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు అనేక కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా రాష్ట్రస్థాయిలో ఖరారు కావాల్సిన మార్గదర్శకాలు (యాక్షన్ప్లాన్) ఆలస్యంగా రావడం, వచ్చిన తర్వాత వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ముఖ్యంగా బ్యాంకర్లు రుణం మంజూరు చేయడంలో విధిస్తున్న కొర్రీలు లబ్ధిదారులకు కష్టాలనే మిగులుస్తున్నాయి. రైతులకే రుణాలివ్వలేదు ముఖ్యంగా జిల్లాలో బ్యాంకుల ద్వారా రైతులకివ్వాల్సిన రుణాలు కూడా సక్రమంగా అందలేదు. జిల్లా రుణకమిటీ (డీసీసీ) లెక్కల ప్రకారం 2014-2015 ఖరీఫ్లో రైతులకు అందిన రుణాలు కేవలం 66 శాతమే. అంటే జిల్లాలో రుణాలు అవసరమున్న 100 రూపాయల్లో బ్యాంకులు రుణాలిచ్చింది 64 రూపాయలే. మిగిలిన 36 రూపాయల కోసం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చిందన్న మాట. గత ఖరీఫ్లో మొత్తం రూ.1226 కోట్ల రుణాలను రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇచ్చింది మాత్రం 816 కోట్లే. ఇక, రబీలో లక్ష్యంగా పెట్టుకున్న దానికన్నా 2రెట్లు అధికంగా రుణాలిచ్చామని లెక్కల్లో చూపిస్తున్నా... అందులో సగం రెన్యువల్ రుణాలేనని అధికారులే అంటున్నారు. ఇక, వ్యవసాయ టెర్మ్ రుణాలయితే 41.55 శాతమే రైతులకు చేరాయి. ఈ ఏడాది మొత్తం 460 కోట్ల రూపాయలను రుణలక్ష్యంగా పెట్టకోగా, అందులో రుణాలిచ్చింది 191 కోట్లే. వ్యవసాయ అనుబంధ రుణాలు కూడా 50శాతం తక్కువగానే లక్ష్యాన్ని చేరాయి. మొత్తం 123 కోట్ల రూపాయలను వ్యవసాయ అనుబంధ రంగాల రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో ఇచ్చి రూ.60 కోట్లలోపే. చిన్నతరహా పరిశ్రమల కోసం ఇచ్చే రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలు కూడా ఈ ఏడాది 70శాతం మించలేదని లెక్కలు చెపుతున్నాయి. బ్యాంకర్లు చూపించే లెక్కల్లో ఒక్క విద్యా రుణాలను మాత్రమే లక్ష్యం కంటే ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో 46 కోట్ల రూపాయలను విద్యార్థుల చదువుల నిమిత్తం రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. రూ.58 కోట్లు ఇచ్చారు. అదొక్కటి మినహా ఏ రంగంలోనూ లక్ష్యానికి దరిదాపుల్లో కూడా రుణాలివ్వకపోవడం గమనార్హం. స్వయం ఉపాధి.. సట్టుబండలేనా? ఇక, స్వయం ఉపాధి విషయానికి వస్తే... జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రుణ సౌకర్యం అందించే ప్రక్రియ అభాసుపాలవుతోందనే చెప్పాలి. లబ్ధిదారుల ఎంపిక నుంచి రుణం మంజూరు వరకు అడుగడుగునా నిర్లక్ష్యం, ఉదాసీనత కనిపిస్తున్నాయి. అసలు ఇంతవరకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది బీసీ నిరుద్యోగులకు ఇచ్చే రుణాల లక్ష్యాన్ని కూడా నిర్ధారించుకోలేదంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, గత ఏడాది అయితే మొత్తం 556 మందికి రూ.20 కోట్ల వరకు రుణాలివ్వాల్సి ఉండగా, కేవలం ఒక్కరంటే ఒక్కరికి మాత్రం రూ.3.75లక్షల రుణం మంజూరు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది 1701 మందికి రూ.17 కోట్ల రుణం ఇవ్వాలి ఉండగా, అందులో కేవలం 958 మందికి రూ.9కోట్లు సబ్సిడీ జమ చేశారు. ఇక, గిరిజనుల విషయానికి వస్తే మొత్తం 2,225 మందికి 27.43 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణాలివ్వలేదు. గత ఏడాది గ్రౌండింగ్ చేసి, గ్రామసభల ద్వారా ఎంపిక చేసిన వారికీ మొండిచేయే చూపించారు. ఇందులో చాలా మంది గిరిజన నిరుద్యోగులు తమ వాటా మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేసి రుణం కోసం ఇప్పటికీ బ్యాంకులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుండడం గమనార్హం. చేనేతకేదీ చేయూత! జిల్లాలోని చేనేత కార్మికుల రుణ మంజూరైతే, ప్రతి యేటా నిరాదరణకు గురవుతోంది. మా ర్కెట్ సదుపాయాలు లేక అర్ధాకలితో అలమటిస్తున్న జిల్లాలోని చేనేతలను ఆదుకోవడంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు జిల్లా యం త్రాంగం కూడా విఫలమవుతోందనే చెప్పాలి. ఈ ఏడాది జిల్లాలోని 4400 చేనేత యూనిట్లకు క్రెడిట్ కార్డు పథకం ద్వారా రూ.22 కోట్ల రుణాలివ్వాల్సి ఉండగా, అందులో ఒక్కరికి కూడా సబ్సిడీ జమచేయలేదు. కేవలం 336 యూని ట్లకు రుణం మంజూరు చేసి, గ్రౌండింగ్ చేసినట్టు లెక్కల్లో చూపెడుతున్నారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు వ్యవసాయ, వ్యాపార రంగాల్లో శిక్షణనిచ్చి వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చే కార్యక్రమం కూడా నత్తనడకన సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 750 మందిని ఎంపిక చేసి ఈ ఏడాది వారికి స్వావలంబన చేకూర్చాలన్న లక్ష్యం 45 శాతం మాత్రమే నెరవేరింది. అందులో బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం పొందిన యువకులు కేవలం 110 మంది మాత్రమే. తీరు ఎప్పుడు మారేనో? జిల్లాలో రుణపరపతి ప్రక్రియ నత్తనడకన, ఉదాసీనంగా నడవడం ఈ ఏడాదే కొత్తేం కాదు. ఏళ్ల తరబడి యాక్షన్ప్లాన్లు రూపొందించుకోవడం, ఆ తర్వాత వాటిని అమలుచేయకపోవడం అనేది జరుగుతూనే ఉంది. కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలో కూడా రుణం గగనంగానే ఉండడం లబ్ధిదారులకు మింగుడుపడడం లేదు. ఈ తీరు ఇప్పటికైనా మార్చుకోవాలని, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఇచ్చే రుణాలను ఇప్పించడంలో అటు రాజకీయ పార్టీల పెద్దలు, ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారులు చొరవ చూపాలని, బ్యాంకర్లు కూడా కొర్రీలు పెట్టకుండా వీలున్నంత మేలు చేకూర్చాలనేది అటు రైతు సంఘాలు, ఇటు యువజన, ప్రజాసంఘాల వాదన. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రుణపరపతి అమలు(రూ.కోట్లలో) సీజన్/రంగం లక్ష్యం మంజూరైంది par శాతంఙఖరీఫ్ 1226.52 816.91 66.6 రబీ 525.62 1159.25 220.55 టర్మ్లోన్లు 460 191.13 41.55 వ్యవసాయ అనుబంధ 123 58.8 47.87 చిన్నతరహా పరిశ్రమలు 779 593.48 76.18 ఎస్హెచ్జీలు 810 524.19 64.67 విద్యా రుణాలు 46.51 58.26 125.26 -
సర్వర్ జామ్
ఉపకార వేతనాలు, ఫీజ్ రీయింబర్స్మెంట్ కోసం దరఖస్తు చేసుకునే గడువు ముగుస్తున్న తరుణంలో మీ సేవ కేంద్రాల సర్వర్లు జామ్ కావడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. దరఖాస్తుతోపాటు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు తప్పనిసరిగా జత చేయాల్సి ఉండటంతో వీటి కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దరఖాస్తులను ఆయా మండలాల తహశీల్దార్లు పరిశీలించి మంజూరు చేస్తే.. మీ సేవ కేంద్రాలు ధ్రువపత్రాలు జారీ చేస్తాయి. అయితే గత రెండు రోజులుగా మీ సేవతోపాటు మండల కార్యాలయాల్లోని సర్వర్లు జామ్ కావడం, ఒక్కోసారి ధ్రువపత్రాలు జారీ చేసే సైట్ ఓపెన్ కాకపోవడంతో వీటి జారీ ప్రక్రియతో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో 230కి పైగా వివిధ రకాల కళాశాలలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజ్ రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. వీరిలో సుమారు లక్ష మంది రెన్యూవల్ విద్యార్థులు ఉన్నారు. కాగా రెన్యూవల్కు దరఖాస్తు గడువు ఈ నెల పదో తేదీతోనే ముగిసినప్పటికీ ప్రభుత్వం వారం రోజులు పొడిగించింది. ఆ గడువు కూడా సోమవారం ముగుస్తోంది. ఈ తరుణంలో సాంకేతిక సమస్యలతో ధ్రుపపత్రాలు అందక విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. మీ సేవ కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే గడువు కూడా ఈ నెల 30తో ముగుస్తున్నందున ఆ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ధ్రువపత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి తోడు 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల స్కాలర్షిప్పుల దరఖాస్తుకూ ఇదే సమయం కావడంతో మీ సేవ కేంద్రాలకు దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా అందుతున్నాయి. వీటిని స్వీకరించి, నమోదు చేయలేక కేంద్రాల్లోని సిబ్బంది అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 38 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 80 వరకు మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రం నుంచి సగటున రోజుకు 500 వరకు దరఖాస్తులు తహశీల్దార్ కార్యాలయాలకు చేరుతున్నాయి. ఈ లెక్కన రోజుకు 40 వేల వరకు ధ్రువపత్రాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో సర్వర్లు పనిచేయకపోవడం, నెట్ కనెక్ట్ కాకపోవడం వంటి సాంకేతిక సమస్యలు తలెత్తడం అటు అధికారులను, ఇటు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. -
పకడ్బందీగా ప్రణాళిక రూపొందించాలి
రాంనగర్ :మన జిల్లా- మన ప్రణాళికలో భాగంగా అన్ని శాఖల భాగస్వామ్యంతో పకడ్బందీగా ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ టి. చిరంజీవులు కోరారు. శనివారం తన బంగ్లాలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఫ్లోరైడ్ ప్రాంతాలలో మంచినీటి సరఫరాకు గల అవకాశాలను పరిశీలించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి మంచినీరు సరఫరా చేయడానికి నిధుల లభ్యత, వ్యయం, నిధులు సమకూర్చుకోవడం తదితర అంశాలను ప్రణాళికలో పొందుపర్చాలని సూచించారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హాస్టళ్లకు పక్కా భవనాలు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని భవనాలు అవసరం ఉన్నాయో, వాటికి ఎన్నినిధులు అవసరమో వచ్చే 5సంవత్సరాలలో ఏవిధంగా పూర్తి చేయాలో ప్రణాళికలో పొందుపర్చాలన్నారు. జిల్లాలో నిర్లక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు తగిన ప్రణాళిక రూపొందించాలన్నారు. అలాగే చదువుకున్న నిరుద్యోగ యువతీయువకులకు స్కిల్స్ డెవలప్మెంట్స్పై శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. వ్యవసాయ అనుబంధ విభాగాలు అన్నీ కలిసి సమగ్రమైన ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లాలో పండ్ల తోటలు, వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం అవసరమైన ప్రణాళికలు తీర్చిదిద్దాలని తెలిపారు. చేపల పెంపకం, సెరీకల్చర్, హార్టికల్చర్, మార్కెటింగ్ శాఖ ద్వారా గోదాములు నిర్మించడానికి సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మండలస్థాయిలో తయారు చేసిన ప్రణాళికలో రాని అంశాలను జిల్లా స్థాయిలో పొందుపర్చాలని సూచించారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలలో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తగిన ప్రణాళికను తయారుచేయాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, నియోజకవర్గానికి ఒక ఓల్డేజ్ హోం, మానసిక వికలాంగులకు పునరావాస కేంద్రం, శిశు కేంద్రాలు, వర్కింగ్ఉమెన్ హాస్టల్స్ భవనాల నిర్మాణా కోసం ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరిజవహర్లాల్, అదనపు జేసీ వెంకట్రావు, జెడ్పీ సీఈఓ దామోదర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
ఉచిత షాక్
సీతంపేట, ఎల్.ఎన్.పేట, టెక్కలి: ఇది ఒక్క సోంబాడికి ఎదురైన అనుభవం కాదు. అదే గ్రామానికి చెందిన డొంబుడు, గయ్యారమ్మ, సుక్కయ్య.. అలాగే ఎల్.ఎన్.పేట, టెక్కలి మండలాల్లో అనేకమంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఇదే రీతిలో విద్యుత్ బిల్లులు అందాయి. సబ్సిడీ మొత్తాన్ని బిల్లుల్లో పేర్కొన్నా.. బిల్లు స్వీకరించేటప్పుడు దాన్ని మినహాయించకపోవడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ విషయంలో కొత్త ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఆ వర్గాల విని యోగదారులకు విద్యుత్ బిల్లులు షాకిస్తున్నాయి. విషయం ఏమిటంటే.. గత ప్రభుత్వం 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను ప్రకటించింది. అందులో భాగంగా రాష్ట్రంలో దళితవాడు, గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలు వినియోగించే విద్యుత్లో నెలకు 50 యూనిట్ల వరకు ఉచితమని పేర్కొన్నారు. అంతకుమించి వాడితే దానికి మాత్రమే వినియోగదారులు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. 50 యూనిట్ల వరకు బిల్లు మొత్తాన్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ట్రాన్స్కోకు చెల్లిస్తుంది. కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఘనంగా ప్రకటించిన ఈ పథకానికి గత 14 నెలలుగా ప్రభుత్వం సబ్సిడీ చెల్లించలేదు. ఈలోగా ఈ ఏడాది ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు, అదే సమయంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు రెండు నెలల వినియోగానికి సంబంధించి బిల్లులు సిద్ధం చేశారు. వాటిలో సబ్సిడీ మొత్తాలను కూడా పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే బిల్లులు వసూలు చేయాలని భావించారు. అయితే ఊహించని విధంగా ఈ పథకం కింద లబ్ధి పొందేవారు ఎస్సీ, ఎస్టీలని నిర్థారించే ధ్రువీకరణ పత్రాలు స్వీకరించాలని ఆదేశించింది. దీంతో అధికారులు ప్రస్తుతానికి ఈ రెండు నెలల బిల్లులు సబ్సిడీ లేకుండానే వసూలు చేయాలని నిర్ణయించారు. ఆ బిల్లులను వినియోగదారులకు అందజేస్తున్నారు. వాటిలో సబ్సిడీ మొత్తాలు పేర్కొన్నా. బిల్లు మొత్తం చెల్లించాల్సిందేనని విద్యుత్ సిబ్బంది స్పష్టం చేస్తుండటంతో వినియోగదారులు షాక్ తింటున్నారు. ఇదేమిటని కొందరు నిలదీస్తున్నారు. అయినా తామేం చేయలేమని అధికారులు చేతులెత్తేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. సబ్సిడీ ఉంటుందన్న ధీమాతో ఇన్నాళ్లూ ఉన్నామని, ఇప్పుడు ఉన్న పళంగా సబ్సిడీ మొత్తంతో కలిపి రెండు నెలల బిల్లు ఒకేసారి చెల్లించమంటే ఎక్కడి నుంచి తేవాలని పేదవర్గాలకు చెందిన వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పుడూ కట్టనంత మొత్తం.. పలువురు రూ.500 నుంచి రూ.800 వరకు వచ్చిందని ఎల్.ఎన్.పేట మండలం గోలుకుప్ప గ్రామానికి చెందిన బిడ్డిక రాజారావు, పాలక చంద్రరావు, బిడ్డిక శ్రీరాములుతో పాటు మరికొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రూ.6 కోట్ల పైనే బకాయి కాగా ఎస్సీ, ఎస్టీలకు ఉప ప్రణాళిక పరిధిలో జిల్లాలో 27,117 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి సంబంధించి సబ్సిడీ రూపంలో రూ.6.33 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. 14 నెలలుగా ఒక్క పైసా అయినా అందకపోవడంతో ఇక ఉచిత విద్యుత్ సబ్సిడీ ఉండదేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
యువత.. నిస్సహాయత!
శ్రీకాకుళం కలెక్టరేట్: సర్కారు సంక్షేమాన్ని మరిచింది. యువతకు చేయూత కొరవడుతోంది. స్వయం ఉపాధి ఎండమావిగా మారుతోంది. గత రెండేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, యువజన స్వయం ఉపాధి రుణాల పంపిణీ లక్ష్యానికి బారెడు దూరంగా ఉండటం ఈ దుస్థితిని స్పష్టం చేస్తోంది. ప్రతి ఏటా ఔత్సాహికులు, నిరుద్యోగ యువకులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నా.. అవన్నీ బుట్టదాఖలవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీకి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయకపోవడంతో యూనిట్లు మంజూ రైనా రుణాలు విడదల కాలేదు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావ డం.. ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడంతో ఆ దరఖాస్తులన్నింటికీ కాలదోషం పట్టింది. బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖలతోపాటు, రాజీవ్ యువశక్తి పథకానికి సంబంధించి యూనిట్ల మంజూరులో లక్ష్యాలు సాధించలేకపోయారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు నెలలు ముగిసి.. మూడో నెల మూడొంతులు గడిచిపోయింది. అయినా ఇప్పటివరకు యూనిట్ల లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించలేదు. దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభం కాలేదు. వివిధ శాఖల లక్ష్యాలు, పనితీరు ఒకసారి పరిశీలిస్తే.. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2013-14 ఆర్థిక సం వత్సరంలో 4321 స్వయం ఉపాధి యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా తీసుకున్నారు. వీటికి రూ.1296.30 లక్షల ప్రభుత్వ రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు బీసీ వర్గాల యువత నుంచి 1027 దరఖాస్తులు వచ్చాయి. సంబంధిత మండలాధికారులు వీటిని ఆన్లైన్లో పొందుపరిచి మంజూరు కోసం ఉన్నతాధికారులకు రిఫర్ చేశారు. అయితే వీటిలో ఒక్క యూనిట్ అయినా మంజూరు కాలేదు. దీంతో బీసీ కార్పొరేషన్ లక్ష్యసాధన సున్నా శాతంగా నమోదైంది. ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించి 50 శాతం రాయితీపై 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1175 యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం రూ.1096 లక్షల రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ 718 మందికి మాత్రమే యూనిట్లు మంజూరు చేసి రూ.7.63 లక్షల రాయితీ మాత్రమే అందజేయగలిగారు. దాంతో లక్ష్యసాధన 55 శాతానికే పరిమితమైంది. రాజీవ్ యువశక్తి పథకం ద్వారా 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లా యువతకు 350 యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకు రూ. 360 లక్షల సబ్సిడీ కేటాయించారు. అయితే 251 యూనిట్లు పంపిణీ చేసి రూ. 251లక్షల సబ్సిడీ మాత్రమే ఇవ్వగలిగారు. -
రాజధానిగా రాజమండ్రి అనుకూలం
కోటగుమ్మం (రాజమండ్రి, న్యూస్లైన్ : సీమాంధ్ర రాజధానిగా రాజ మండ్రి అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజమండ్రి వేంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో ‘ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రాజమండ్రిని చేయాలి’ అనే అంశంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం సదస్సు నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమండ్రికి రాజధానిగా ఉండగల అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. విమానాశ్రయం, ఓఎన్జీసీ, ఆధునిక ఆస్పత్రులు, నీటి పారుదల సౌకర్యం ఉందన్నారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు గల ప్రాంతానికి మధ్యలో ఉందని తెలిపారు. మానవహక్కుల కౌన్సిల్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ రాజమండ్రిని రాజ దానిగా చేసేందుకు వందశాతం అనుకూలమైన వనరులున్నాయన్నారు. సామర్లకోట ప్రాంతం పారిశ్రామిక కారిడార్కు అనువైన దని, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆరువేల ఎకరాలు వరకు భూములు ఉన్నాయన్నారు. శ్రీకృష్ణ కమిషన్ కూడా రాజమండ్రిని రాజధానిగా చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నట్టు తన నివేదికలో తెలిపిందని వివరించారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి సీమాంధ్రకు రెండు హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేసి, ఒకదానిని రాజమండ్రిలో ఏర్పాటు చేయాలి. ఐఐటీలు, వైద్య విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలి. - కర్రి రామారెడ్డి, మానిసిక వైద్య నిపుణులు. ఉద్యోగావకాశాలు పెంచాలి సీమాంధ్రలోని 13 జిల్లాలోను అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలి. 950 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంది. దీనికి రోడ్డు మార్గం అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలి. - గెద్దాడ హరిబాబు, ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు -
గిరిజనం.. దా‘రుణం
కడప సాధారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వికలాంగుల కార్పొరేషన్ వ్యక్తిగత బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి జూన్, జులైలో ప్రకటన వెలువడుతుంది. కాగా, 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా ఎస్టీ కార్పొరేషన్కు ప్రభుత్వం గడిచిన జనవరి రెండవ వారంలో రుణ లక్ష్యాలను కేటాయించింది. దీంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న గిరిజన వర్గాలు రుణాల దరఖాస్తులను పొందారు. 101 జీఓ నిబంధనల మేరకు దరఖాస్తును పూర్తి చేయడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు దాదాపుగా చాలా వరకు దరఖాస్తులను సమర్పించగలిగారు. అయితే, ప్రస్తుతం రుణాల మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. 660 మంది లబ్ధిదారులకు! జిల్లా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా గిరిజన వర్గాలకు 194 యూనిట్లను 666 మందికి అందించాల్సి ఉంది. ఒక యూనిట్ విలువ 60 శాతం సబ్సిడీతో రూ. లక్ష, రూ. 3.50 లక్షలు, రూ. 8 లక్షల వరకు రుణాన్ని అర్హులకు అందించాల్సి ఉంది. అందుకోసం ప్రభుత్వం సబ్సిడీ కింద రూ. 1.34 కోట్లను మంజూరు చేయాలి. కాగా ప్రభుత్వం ఆలస్యంగా అంటే జనవరి 2వ వారంలో రుణ లక్ష్యాలను కేటాయించడంతో రుణాల ప్రక్రియ వేగవంతంగా సాగినప్పటికీ ఒక్కరికి కూడా రుణం అందని పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా మార్చిలోకి అడుగిడగానే దాదాపు 75 శాతం మందికి పైగా రుణాలు అందాల్సి ఉంది. ప్రభుత్వం ఆలస్యంగా లక్ష్యాలను నిర్దేశించడంతో ఆ ప్రభావం రుణాలపై పడింది. అయితే, ఇంతవరకు సబ్సిడీ గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. ప్రభుత్వం సబ్సిడీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తేనే బ్యాంకర్లు ఆ సబ్సిడీని కలుపుకుని తమవంతు వాటాగా సదరు వ్యక్తికి రుణాన్ని అందిస్తారు. సబ్సిడీ ఖాతాల్లో జమకాకపోతే రుణ మంజూరు ప్రసక్తి ఉండదు. కాగా, 101 జీఓ కారణంగా సవాలక్ష ఆంక్షలను అధిగమించి దరఖాస్తులను పూర్తి చేయడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు సమస్యలను అధిగమించి 90 శాతంమందికి పైగా గిరిజన వర్గాలు రుణాల కోసం సంబంధిత శాఖలకు సమర్పించారు. ఆ దరఖాస్తుల పరిశీలన నిమిత్తం అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఎన్నికల కోడ్తో గందరగోళం హైకోర్టు మన్సిపల్ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని ఆదేశించడంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద అడుగులు వేసింది. సోమవారం ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రుణాల మంజూరు ముందుకు సాగుతుందా? నిలిచిపోతుందా? అనే సందిగ్ధం నెలకొంది