Social services
-
Manideep charitable trust : సామాజిక సేవలో మణిదీపం
చదువుతోనే సమాజ వికాసం జరుగుతుందన్న విశ్వాసం ఆయనది.. అందుకే ప్రతిఒక్కరూ ఉన్నత చదువులు చదువుకోవాలన్నదే అతడి ఆకాంక్ష.. విద్యకు డబ్బు సమస్య కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్పుల పేరిట తనవంతుగా ఆర్థిక సాయం అందిస్తూ వారు చదువు కొనసాగించేలా దోహదపడుతున్నారు. ఆయనే మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మణిదీప్. బేగంపేట కుందన్బాగ్కు చెందిన మణిదీప్ విభిన్న సేవా కార్యక్రమాలను చేపడుతూ నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. – సనత్నగర్మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ను 2018లో ప్రారంభించిన మణిదీప్ సేవలను విస్తరించుకుంటూ వెళ్తున్నారు. చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతగా నిలవాలని తలంపుతో మహా యజ్ఞాన్ని ఆరంభించారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 180 మందికి వారి ఆర్థిక స్థోమతను బట్టి సహకారం అందించి అండగా నిలబడ్డారు. ఈ ఒక్క ఏడాదే 50 మందికి స్కాలర్షిప్పులను అందజేశారు. అలాగే చినజీయర్ స్వామి ఆశ్రమంలోని గురుకుల్ ట్రస్ట్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు వైశ్య వికాస వేదిక వారు 10వ తరగతి, ఇంటర్ చదువుతున్న నిరుపేద విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో టాప్గా నిలిచిన వారికి ల్యాప్ట్యాప్లను అందజేశారు. చదవండి : బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం!పేద విద్యార్థులకు ఇప్పటి వరకు ఆయన 30 ల్యాప్ట్యాప్లను అందజేశారు. యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న 10 మంది విద్యార్థులకు ల్యాప్ట్యాప్లు అందించేందుకు ముందుకువచ్చారు. నిరుపేదలకు మెడిసిన్తో పాటు న్యూట్రిషన్, విటమిన్ ఆహారాన్ని అందిస్తూ వారి ఆరోగ్యపరంగానూ సేవలుఅందిస్తున్నారు. కరోనా సమయంలో సంస్థ తరఫున ఎన్నో సేవలు అందించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా యూత్ కన్వినర్గా కూడా మణిదీప్ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పలు సంస్థలతో కలిసి రక్తదాన శిబిరాల నిర్వహణ చేపట్టడంతో పాటు విపత్తుల సమయంలో తీవ్రంగా నష్టపోయిన వారికి అండగా నిలబడుతున్నారు. మణిదీప్ సేవలను గుర్తించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇటీవలే ప్రతిభా పురస్కారాన్ని కూడా అందించారు. ఇదీ చదవండి: ‘‘వీళ్లు మనుషుల్రా..బాబూ..!’’ జేసీబీని ఎత్తికుదేసిన గజరాజు, వైరల్ వీడియోల్యాప్ట్యాప్లు అందిస్తున్నాం సమాజం మనకు ఏమి ఇచ్చింది అనే కంటే.. సమాజానికి మనం ఏం చేశామన్నది ముఖ్యం. చదువే అన్నింటికీ సమాధానం. ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులతో చదువును ఎవరూ ఆపకూడదు. అందుకోసం మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం, అవసరమైన వారికి ల్యాప్ట్యాప్లు అందిస్తున్నాం. రాజ్భవన్ వేదికగా వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టాం. ఇండియన్ రెడ్క్రాస్సొసైటీ తరఫున సేవ చేసే అవకాశం లభించడం అదృష్టం. – మణిదీప్, మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ -
సామాజిక హితం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత మూడేళ్లుగా అభివృద్ధి వ్యయం పెరుగుతుండగా వడ్డీల చెల్లింపుల వ్యయం తగ్గుతున్నట్లు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) అధ్యయన నివేదిక వెల్లడించింది. రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్లపై నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ 2021–22 నుంచి 2023–24 వరకు ప్రధాన ఆర్థిక సూచికలను ఇందులో పొందుపరిచింది. సామాజిక సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలపై నేరుగా చేసే వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా నిర్వచించింది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యపై చేసే ఖర్చును అభివృద్ధి వ్యయంగా ఉదహరించింది. జీతభత్యాలు భారీగానే.. ► ఆంధ్రప్రదేశ్లో వరుసగా మూడేళ్లుగా సామాజిక రంగ వ్యయం పెరుగుతోంది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి, ఆహార నిల్వలు, గిడ్డంగులు ఈ కోవలోకి వస్తాయి. ఇదే సమయంలో ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగాల కోసం వెచ్చించే వ్యయం కూడా పెరుగుతోంది. ► 2021–22లో మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం రూ.1.19 లక్షల కోట్లు ఉండగా 2023–24 నాటికి రూ.1.92 లక్షల కోట్లకు పెరిగింది. ► వడ్డీ చెల్లింపులు పెరుగుతున్నాయనే వాదనల్లో నిజం లేదు. రెవెన్యూ రాబడిలో వడ్డీ చెల్లింపుల శాతం తగ్గుతోంది. ► ఏపీలో వేతనాలు, జీతాలు చెల్లింపులు గత ఐదేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు పీఆర్సీ అమలుతో పాటు చిరు ఉద్యోగుల వేతనాలను పెంచడంతో వేతనాలు, జీతాల వ్యయం పెరుగుతున్నట్లు సూచికలు వెల్లడిస్తున్నాయి. -
సామాజిక సేవలపై.. పెరిగిన మూలధన, రెవెన్యూ వ్యయం
సాక్షి, అమరావతి : 2020–21తో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో సామాజిక సేవలపై మూల ధన వ్యయంతో పాటు రెవెన్యూ వ్యయం కూడా పెరిగిందని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తెలిపింది. 2021–22కి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ ఇచ్చిన నివేదికను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. సామాజిక సేవలపై 2021–22లో 42.45 శాతం వ్యయం చేసినట్లు పేర్కొంది. ఇందులో ప్రధానంగా విద్య, ఆరోగ్య.. కుటుంబ సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పోషణ, క్రీడలు, కళలకు రూ.66,371 కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొంది. సామాజిక సేవలపై సాధారణ రాష్ట్రాల సగటు వ్యయం కన్నా ఏపీలో ఎక్కువగా ఉంది.ఇక సామాజిక సేవలపై రాష్ట్రాల సగటు వ్యయం 38.31 శాతం ఉండగా ఏపీలో 42.45 శాతం ఉంది. -
Pravasi Bharatiya Divas: విదేశాల్లో ఉన్నా స్వదేశంలో సేవ
జీవితంలో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో విదేశాలకు వెళ్లినవారు తమను తాము నిరూపించుకునే దిశగా సాగుతారు. కలల లక్ష్యాలను చేరుకోవడానికి శ్రమించడంతో పాటు తమ చుట్టూ ఉన్నవారికి చేయూతనివ్వాలనుకుంటారు. తమ మూలాలను గుర్తుపెట్టుకొని సొంత గడ్డ అభ్యున్నతికి పాటుపడాలని తపిస్తుంటారు. వారి ఆలోచనలతో మరికొందరి అడుగులకు స్ఫూర్తిగా నిలుస్తారు. విదేశాల్లో తాము ఎంచుకున్న రంగాల్లో కృషి చేస్తూనే సేవా కార్యక్రమాల ద్వారా స్వదేశంలో ఉన్నవారికి చేయూతనందిస్తున్నారు విజయవాడ వాసి అయేషా, ఖమ్మం జిల్లా వాసి ఝాన్సీ. పిల్లలకు కష్టం విలువ తెలియాలని.. విజయవాడ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు ఆయేషా. ఉద్యోగం, కుటుంబం బాధ్యతలతో బిజీగా ఉన్న ఆమె సేవాకార్యక్రమాలవైపు మళ్లిన ఆలోచనావిధానం గురించి తెలిపారు. ‘మా కుటుంబంతో కాలిపోర్నియాలో స్థిరపడ్డాను. నేను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ఇటీవల నాన్ప్రాఫిట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కూడా అందుకున్నాను. ఉద్యోగినిగా ఉన్న నేను మొదట ఒక తల్లిగా మా పిల్లలకు సేవా ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నాను. అదే సమయంలో మా చుట్టుప్రక్కల ఉండే పిల్లల పరిస్థితి గమనించాను. పిల్లల్లో మానవతా విలువలు పెంచాలని కమ్యూనిటీ సర్వీస్ చేయాలనే సదుద్దేశంతో ఏడేళ్ల క్రితం ఎంపవర్ అండ్ ఎక్సెల్ సంస్థని ప్రారంభించాను. ఇప్పుడు వందలాది మందికి పైగా వలెంటీర్లు మా ఆర్గనైజేషన్లో సేవలందిస్తున్నారు. మా అమ్మనాన్నలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. వారిని చూడటం కోసం మొదట మా పిల్లలను తీసుకొని ఇండియాకు వచ్చేదాన్ని. మారుమూల గ్రామాల్లోని పాఠశాల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి, ఆ స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. స్వచ్ఛందంగా పనిచేసే మిత్రులు కొందరు పరిచయమయ్యారు. వారితో నిరంతరం కాంటాక్ట్లో ఉంటూ అమెరికాలో మేమున్న ప్రాంతంలో సేకరించిన పుస్తకాలను ఆంధ్రాలోని గ్రామాల స్కూళ్లకు అందజేసేవాళ్లం. ఈ కార్యక్రమం ప్రతియేటా నిర్వహించేవాళ్లం. నాతోపాటు ప్రతి యేటా వలెంటీర్లుగా వర్క్ చేసే పిల్లలు కనీసం పదిమందినైనా ఇండియాకు తీసుకువచ్చేదాన్ని. వారితో ఇక్కడి స్కూల్ పిల్లలకు వర్క్షాప్స్ కండక్ట్ చేసేదాన్ని. ఆ తర్వాత సమస్యలు తెలుస్తున్న కొద్దీ వాటి మీద దృష్టి పెడుతూ వచ్చాను. అందరం ఉపాధి కోసం విదేశాలకు వచ్చినవాళ్లమే. కాని మా మూలాలను ఎప్పటికీ మర్చిపోలేం. ఈ పరిస్థితులలోనే స్వదేశంలోని పిల్లలకు సర్వీస్ చేయాలనుకున్నాను. ట్రైబల్ ఏరియాలోని పిల్లలకు మా సేవలు అందేలా కృషి చేస్తుంటాను. స్వచ్ఛంద సంస్థల ద్వారా మా సేవకార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. నిరుపేదలకు ఏదైనా సాయం కావాలని మా దృష్టికి వస్తే ఇక్కడ ఫండ్ రైజింగ్ కి వెబ్సైట్ లో ప్రకటిస్తాం. ఇప్పటి వరకు మనవాళ్లు ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు’’ అని తెలిపారు ఆయేషా. మహిళల శ్రేయస్సు కోసం.. ఖమ్మం జిల్లా వాసి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి. అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేశారు. మహిళలు, బాలికల సంక్షేమం కోసం అక్కడే ‘వెటా’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, వివిధ కార్యక్రమాల ద్వారా సేవలందిస్తున్నారు. అలాగే, పుట్టి పెరిగిన గడ్డకు మేలు చేయాలనే ఆలోచనతో స్వదేశంలోనూ సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ‘‘లక్ష్యం పెద్దదిగా ఉండాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దానిని సాధించే దిశగానే మన అడుగులు ఉండాలి. ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ అమెరికా వెళ్లి, అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. పిల్లలు పుట్టాక వారిని చూసుకునే క్రమంలో ఉద్యోగాన్ని మానేసి, రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాను. ఒక మహిళ ఏం చేస్తుంది ఈ రంగంలో అనుకునేవారికి నా విజయం ద్వారానే సమాధానం చెప్పాను. అమెరికాలోని మన భారతీయ మహిళల సమస్యల గురించి అర్థం చేసుకున్నాను. సొంతంగా ఎదగాలనుకునేవారు, ఉద్యోగాలు చేయాలనుకునేవారు, గృహహింస వంటి బాధలు పడేవారు .. అన్ని రకాలుగా జీవితంతో పోరాటం చేసేవారున్నారు. అలాంటివారి శ్రేయస్సు కోసం పనిచేయాలని ‘వెటా’ను స్థాపించాను. మన విజయాలను మన అనుకున్న నలుగురికి కూడా పంచాలి. మా సొంత ఊళ్లకు వచ్చినప్పుడు అక్కడి పరిస్థితులను గమనించి అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వచ్చాం. మా ఊరు బనిగండ్లపాడు గ్రామంలోనే కాదు, మా వారు పుట్టి పెరిగిన వరంగల్ జిల్లా తొర్రూరులోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గ్రంథాలయాలను ఏర్పాటు చేశాం. స్కూల్ భవనాలను కట్టించి, ప్రభుత్వానికి అప్పజెప్పాం. తొర్రూరులో హాస్పిటల్ కట్టించాం. గ్రామపంచాయితీ ఆఫీసు వంటివి ఏర్పాటు చేశాం. మా చుట్టుçపక్కల మరో ఆరుగ్రామాల వరకు మా సేవలు అందిస్తుంటాం. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది మా ఆలోచన. అందుకే, పేద విద్యార్థులకు ప్రతియేటా ఆర్థిక సాయం చేస్తుంటాం. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మాకు చేతనైంత సాయం అందించాలన్నదే మా సిద్ధాంతం. ముందుగా మనకు మనంగా ఎదగాలి. అందుకోసం ఎంతటి కష్టమైనా పడాలి. అలాగే, నలుగురి మేలు కోసం పాటుపడినప్పుడే మన జీవితానికి సంతృప్తి లభిస్తుంది’’ అని వివరించారు ఝాన్సీరెడ్డి. -
అంబులెన్స్ సేవలు ప్రారంభించిన ఆదిత్య ఓం
'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్పై హీరోగా, విలన్గా తన మార్క్ చూపించారు. దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకుంటున్న ఆదిత్య ఓం సేవారంగంలో తన ఔదార్యాన్ని చాటుతున్నాడు. పలు సేవా కార్యక్రమాలు ద్వారా ఆయన ఇప్పటికే ఎంతో మందికి పేదవాళ్లకు సహాయం చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుపల్లి లోని ఐదు గ్రామాలను దత్తత తీసుకుని దాదాపు 500 మంది కి సహాయం చేసిన ఆదిత్య ఓం తాజాగా కొత్తగూడెం జిల్లా మరియు తాండూరులోని చెరుపల్లి, కొత్తపల్లి మరియు పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సేవలను అందించడానికి తన వంతు కృషి చేశారు. అక్కడి గిరిజన గ్రామాల్లో చాలా కాలంగా పనిచేస్తున్న ఆదిత్య ఓం కోవిడ్ సమయంలో అంబులెన్స్ సేవలు లేకపోవడం మరియు ఆ ప్రాంతంలో పాము కాటు కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చూసి చలించారు. దాంతో అక్కడ పేరుగాంచిన రోటరీ క్లబ్, దానికి సంబంధించిన స్థానిక సంస్థల ఆర్థిక సహాయంతో ఈ ప్రాంతాలకు అంబులెన్స్ సేవలు అందించగలిగారు. తన స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలు అందించిన సహాయం మరియు స్థానిక ప్రజల అవగాహన కారణంగా ఇది సాధ్యం అయ్యింది ఆదిత్య ఓం అన్నారు. -
‘సామాజిక’ దృక్పథం
సాక్షి, అమరావతి: రాష్ట్రప్రభుత్వ వ్యయం ప్రధానంగా సామాజిక సేవల కోణంలో ఉన్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. సామాజిక సేవల్లో భాగమైన విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలపై వ్యయం గణనీయంగా పెరిగిందని తెలిపింది. 2020–21 ఆర్థిక పరిస్థితులపై కాగ్ నివేదికను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం అసెంబ్లీకి సమర్పించారు. 2020 – 21లో రాష్ట్రం మొత్తం వ్యయంలో సంక్షేమ కార్యక్రమాలపై ఖర్చు 17 శాతం ఉండగా విద్య, క్రీడలు, కళలు, సంస్కృతిపై వ్యయం 14 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వివిధ ప్రధాన పద్దుల్లో రెవెన్యూ వ్యయం గణనీయంగా పెరగ డానికి వైఎస్సార్–పీఎం ఫసల్ బీమా యోజన, వైఎస్సార్ వడ్డీలేని రుణాల ప«థకాల ద్వారా రైతుల కు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చడమే కారణ మని తెలిపింది. సచివాలయాలు, వలంటీర్లు, ఉపాధి హామీ వ్యయం పెరగడం, ఆర్టీసీ ఉద్యోగు లను రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడంతో రెవెన్యూ వ్యయం పెరిగిందని కాగ్ తెలిపింది. విపత్తు నిర్వహణ వ్యయం, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఖర్చులు, రైతుసాధికార సంస్థకు గ్రాంట్లు, వైఎస్సార్ పెన్షన్ కానుక, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలపై ఖర్చు పెరగడం కూడా రెవెన్యూ వ్యయం పెరగటా నికి కారణాలని పేర్కొంది. మరోపక్క తప్పనిసరి ఖర్చుల్లో భాగంగా వడ్డీ చెల్లింపులు, జీతాలు, పెన్షన్లు, రాయితీలపై వ్యయం పెరుగుతూనే ఉందని, దీంతో అభివృద్ధి వ్యయానికి వెసులుబాటు తక్కువగా ఉందని తెలిపింది. 2020–21లో జీతాలు, వేతనాల వ్యయం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 9.88 శాతం పెరిగిందని కాగ్ పేర్కొంది. స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం రెవెన్యూ వ్యయంలో 48.25 శాతంగా ఉన్నట్లు తెలిపింది. సామాజిక, ఆర్థికాభివృద్ధికే ఏపీఎస్డీసీ సామాజిక, ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టులు, కార్యకలాపా లకు ప్రణాళిక, నిధులు, ఆర్థిక సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్డీసీ) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసిందని కాగ్ పేర్కొంది. భవిష్యత్లో ఏపీఎస్డీసీ ద్వారా సేకరించే రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 వేలకోట్ల గ్యారెంటీని అందించిం దని తెలిపింది. 2020–21లో బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.17,472 కోట్లను అప్పుగా తీసు కుంది. ఇందులో 63 సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలైన (నవరత్నాలు) వైఎస్సార్ ఆసరా, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత అమలు కోసం రూ.16,899 కోట్లు పంపిణీ చేసిందని పేర్కొంది. 63 కార్పొరేషన్లలో 56 వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లు ఉన్నాయని కాగ్ తెలిపింది. ప్రత్యక్ష నగదుబదిలీ పథకాలైన వైఎస్సార్ చేయూత, ఆసరా కోసం 2020–21లో రూ.10,895.67 కోట్లను కేటాయించినట్లు తెలిపింది. పథకాల అమలును సులభతరం చేసేందుకు రాష్ట్ర సంఘటితనిధి నుంచి 8 కార్పొరేషన్ల వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు బడ్జెట్ను బదిలీచేసినట్లు పే ర్కొంది. అయితే ఈ పథకాల బడ్జెట్ ద్వారా కాకుం డా మార్కెట్ రుణాల ద్వారా నిధులు సమకూ ర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు డీబీటీ పథకాలతో సహా ఆరుసంక్షేమ పథకాలను ఏపీఎస్డీసీకి అప్పగించినట్లు కాగ్ తెలిపింది. -
మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారే..కానీ సేవల్లో శ్రీమంతులు
ఆ ముగ్గురూ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు. అయితేనేం సేవలో మాత్రం శ్రీమంతులని నిరూపించుకున్నారు. తమకు ఉన్నంతలోనే సాయపడుతు న్నారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఒకతను కరోనా సమయంలో పేదలకు అండగా నిలిస్తే.. మరొకతను ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారు. ఓ మహిళ బాలికలకు తోడుగా నిలిచారు. ఆత్మకూరుకు చెందిన పున్నేపల్లి సుబ్రహ్మణ్యం, కరవళ్ల రవీంద్రారెడ్డి, జ్యోతి జయలక్ష్మి విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. – ఆత్మకూరు వైఎస్సార్ను ఆదర్శంగా తీసుకుని.. పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కరవళ్ల రవీంద్రారెడ్డి సామాన్య రైతు. పొలం పనులు చేసుకుంటూ తన ఇద్దరు కుమారులను చదివించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది తన కొడుకు పుట్టినరోజు నాడు 200 మందికిపైగా పేదలకు దుప్పట్లు, వస్త్రాలు అందజేస్తుంటారు. ఇంకా నల్లపరెడ్డిపల్లి, బట్టేపాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మెరిట్ విద్యార్థులకు, ఆత్మకూరు కళాశాలలో మంచి మార్కులు సాధించిన వారికి నగదు బహుమతులు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం పేదలకు ఆర్థికంగా సాయం చేస్తున్నారు. విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. ఈయన సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసిన గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, సమీప బంధువులు తమవంతుగా విరాళాలు అందిస్తున్నారు. కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు పెట్టి.. దొరవారిసత్రం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పున్నేపల్లి సుబ్రహ్మణ్యం బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అండగా ఉంటారనుకున్న అక్కలు అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో దాతల సహకారంతో సంక్షేమ హాస్టళ్లలో చదువుకున్నారు. బీకాం కంప్యూటర్స్ చేశారు. ఈయన 18 ఏళ్ల క్రితం ఆత్మకూరులో స్థిరపడ్డారు. ఆత్మకూరు, ఉదయగిరి, వింజమూరు ప్రాంతాల్లో కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఆయన వల్ల అనేక మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. ఇంకా తల్లి పేరుతో రమా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా మదర్థెరిస్సా జయంతి రోజున గిరిజన, దళితకాలనీల్లో పేదలకు నిత్యావసర సరుకులు, వస్త్రాలు పంపిణీ చేస్తుంటారు. ఉపాధి కోసం పలువురికి ఉచితంగా కంప్యూటర్లను అందజేశారు. ఈయన సేవలను చూసి పలువురు తమవంతుగా ఆర్థిక సాయాన్ని ట్రస్ట్కు అందజేస్తున్నారు. కరోనా సమయంలో ఎన్నో కాలనీల్లో నిత్యావసర సరుకులు, భోజన ప్యాకెట్లను రోజుల తరబడి పంపిణీ చేశారు. దాతల సహకారంతో నెల్లూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేశారు. చేసిన సేవలకు గానూ ఇప్పటికి ఆరుసార్లు మంత్రులు, కలెక్టర్ ద్వారా అవార్డులు అందుకున్నారు. బాలికలకు భరోసా జ్యోతి జయలక్ష్మి ఆత్మకూరు మండలం కరటంపాడు మజరా శ్రీనివాసపురం దళితకాలనీకి చెందిన మహిళ. ఆమె పుట్టి పెరిగింది తమిళనాడు రాష్ట్రంలోనైనా వివాహానంతరం శ్రీనివాసపురంలో స్థిరపడ్డారు. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. చిన్నప్పటి నుంచి సేవా భావాలు కలిగిన జయలక్ష్మి కిశోర బాలికల సమస్యలను అర్థం చేసుకుని వారికి కావాల్సిన న్యాప్కిన్లు, సోప్లు అందజేశారు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఆ తర్వాత తన సేవలను మరింత విస్తరించారు. పౌష్టికాహారం తయా రు చేసి పేద పిల్లలకు అందిస్తున్నారు. పేద బాలికలకు యూనిఫాం కొనుగోలు చేసి అందజేశారు. కాలనీల్లో ప్రజలకు పరిశుభ్రత, దాని ప్రాధాన్యం వివరిస్తూ వారిని క్రమశిక్షణ దిశగా నడిపిస్తున్నారు. -
మతాలు కాదు... మనిషే ప్రధానం
అన్నిరకాలుగా నాశనమవుతూ ఉన్న మనిషిని బతికించుకోవాల్సిన అవసరం వచ్చింది. తన అలసత్వం, అజ్ఞానం, మూర్ఖత్వం వల్ల మనిషి తన ఉనికికే ప్రమాదకారి అవుతున్నాడు. మనిషి సజీవంగా ఉంటేనే ప్రభుత్వాలైనా, హక్కుల పోరాటాలైనా ఉనికిలో ఉంటాయి. అందుకే భూమి మీద ప్రమాదంలో ఉన్న మనిషిని ముందు బతికించు కోవాలి. అందుకు తగిన అవగాహన పెంచుకోవడానికే ఈ జూన్ 21ని మనం ‘హ్యూమనిస్ట్ డే’గా జరుపుకొంటున్నాం. అన్ని దశల్లో అన్నివేళలా మానవాభ్యుదయాన్ని కాంక్షించేదే మానవ వాదం. ఫెడ్రిక్ ఇమ్మాన్యుల్ నైథమ్మర్ తొలిసారి 1808లో ‘హ్యూమనిజం’ అనే పదాన్ని రూపొందించాడు. పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్దాలలో మానవ అవసరాల మీద శ్రద్ధ పెట్టడం, పనికిరాని విశ్వాసాల్ని పక్కకు నెట్టడం, ప్రతి దానికీ కారణాన్ని అన్వేషించడంతో ప్రారంభమై ‘మానవ వాదం’ ఒక ఆలోచనా ధోరణిగా రూపుదిద్దుకోవడం మొదల య్యింది. ఆ ఆలోచనా ధోరణి అన్ని కళల్లోకి వ్యాపించింది. మానవవాద దృక్పథంలోంచి లలిత కళలు, కవిత్వం, విద్య, వైద్యం వంటి రంగాలన్నీ బలపడుతూ వచ్చాయి. ప్రతిచోటా, ప్రతి రంగంలో ప్రశ్నకు విలువ పెరుగుతూ వచ్చింది. ఆ ప్రశ్న లకు సమాధానాలు అన్వేషించుకునే క్రమంలో హేతువాదంతో కూడిన మానవవాదం, శాస్త్రీయ అవగాహనా వ్యాప్తి చెందాయి. తొలిసారిగా 1933లో ‘హ్యూమనిస్ట్ మానిఫెస్టో’ చికాగో విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో విడుదల అయ్యింది. ఆ మానిఫెస్టో ప్రధానంగా... కారణం, నైతికత, సామాజిక–ఆర్థిక న్యాయం, సమన్వయం అనే సూత్రాల మీద ఆధారపడింది. వీటన్నింటితోపాటు మరొక విషయం ప్రత్యేకంగా చర్చించ బడింది. అదేమిటంటే– ఆధారం లేని విశ్వాసాలు, మూఢ నమ్మ కాలను పక్కకు నెట్టి, వైజ్ఞానిక అవగాహనను పెంపొందించా లనీ, దానిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉందనీ కూడా మాని ఫెస్టోలో రాశారు. మానవవాదం గురించి అవగాహన పెరుగు తున్న దశలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ నిఘంటువు ఒక వ్యతిరేకమైన అర్థాన్ని ప్రచురించింది. దాన్ని రూపొందించిన బృందంలో ఒక ఇంగ్లిష్ వాడు, హ్యూమనిస్ట్లంటే చులకన భావం గలవాడు ఆ అర్థాలు రాశాడు. ‘దైవ భావనను ధిక్కరించేవారు’, ‘ఉట్టి మానవతావాదులు’, ‘అరాచక వాదులు’, ‘ఆస్తులను దోపిడీ చేయువారు’ అని రాశాడు. బహుశా అతను విశాలమైన భావ జాలంతో, ప్రగతిశీల ధోరణితో ఆలోచించలేనివాడై ఉంటాడు. అందువల్ల అతను తన అక్కసును అలా వెళ్లగక్కుకున్నాడు. అది మాత్రమే కాదు, అలాంటి మరికొన్ని సంఘటనలు జరుగుతూ రావడం వల్ల సహజంగా మతతత్వ వాదులకు వెయ్యేనుగుల బలం చేకూరింది. అదే సమాజంలో వేళ్లూనుకుని పోయింది. తరతరాలుగా ప్రపంచవ్యాప్తంగా దైవభావన బలం పుంజు కుంది. దాని పర్యవసానంగానే మతాన్ని, దైవాన్ని ప్రశ్నించిన వారు దుర్మార్గులు, పాపాత్ములు, చెడ్డవారు అనే ముద్ర వేయ బడుతూ వచ్చారు. అందుకే చూడండి. పరిస్థితి ఈనాటికీ పూర్తిగా మారలేదు. మత విశ్వాసాలలో పడి కొట్టుకుపోయే వారిని మామూలు మనుషులుగా పరిగణిస్తున్నారు. స్వేచ్ఛాలో చనతో హేతుబద్ధంగా మాట్లాడేవాళ్లను ‘పిచ్చి’వాళ్ల కింద జమ కడుతున్నారు. విశాల హృదయంతో ఆలోచించలేని వారినీ, ఈ దేవుడు కాదు – ఆ దేవుడనీ, ఈ మతం కాదు ఆ మతమనీ కొట్టుకు చచ్చేవారిని – సమాజంలో అక్కడక్కడ అప్పుడప్పుడు కొందరు మహాను భావులు హెచ్చరిస్తూనే వచ్చారు. వాస్తవంలోంచి ఆలోచించం డనీ, కారణాల్ని వెతకండనీ బోధిస్తూనే వచ్చారు. అలాంటి వారిలో ఎర్నెస్ట్ రెనన్ పేరు తప్పక చెప్పాలి. ‘జ్ఞానం యొక్క భవిత: 1848 నాటి ఆలోచనలు’ – అనే గ్రంథంలో ఆయన ఇలా రాశాడు... ‘‘భవిష్యత్తులో మతమేదైనా ఉంటే, అది మా‘నవ’ వాదం – అని నేను మనస్ఫూర్తిగా నమ్ము తున్నాను. శాఖోపశాఖలుగా ఉన్న ఈ విశ్వాసాలన్నీ ఒక్కతాటిపై కొచ్చి, నైతిక విలువలతో కూడిన మా‘నవ’వాదంగా రూపు దిద్దుకుంటుంది– తప్పదు!’’ దుర్మార్గాల్ని ఆపే శక్తి సంప్రదా యాలకు లేదు– వైజ్ఞానిక అవగాహన పెరిగితేనే మానవత్వం వికసిస్తుంది! డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త ప్రముఖ రచయిత, జీవశాస్త్రవేత్త (జూన్ 21న ‘హ్యూమనిస్ట్ డే’ సందర్భంగా...) -
హైకోర్టులో ఆ ఐఏఎస్లకు ఊరట
సాక్షి, అమరావతి: ఐఏఎస్ అధికారులు వై. శ్రీలక్ష్మీ, బి. రాజశేఖర్, చినవీరభద్రుడు, జె. శ్యామలరావు, జి. విజయ్కుమార్, ఎంఎం నాయక్లకు రాష్ట్ర హైకోర్టు ఊరటనిచ్చింది. ఏదైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహంలో నెలలో ఓ ఆదివారం చొప్పున 12 ఆదివారాలు సామాజిక సేవ చేయాలంటూ సింగిల్ జడ్జి విధించిన శిక్షను హైకోర్టు ధర్మాసనం ఎనిమిది వారాలపాటు నిలిపివేసింది. తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ తర్లాడ రాజశేఖర్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సామాజిక సేవకు ఐఏఎస్ల అంగీకారం ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణాలను తొలగించాలన్న ఆదేశాలను సకాలంలో అమలుచేయకపోవడాన్ని సింగిల్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ కోర్టు ధిక్కారంగా పరిగణించారు. ఇందుకు పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, అప్పటి కమిషనర్ చిన వీరభద్రుడు, పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, ఆ శాఖ ప్రస్తుత స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై. శ్రీలక్ష్మీ, ఆ శాఖ అప్పటి డైరెక్టర్ జి. విజయ్కుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎంఎం నాయక్లను బాధ్యులుగా చేశారు. కోర్టు ధిక్కారం కింద వారికి నెలరోజుల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించారు. అయితే.. వారు క్షమాపణ కోరడంతో పాటు వారి అభ్యర్థన మేరకు ఆ శిక్షను సామాజిక సేవగా మార్చారు. ఈ తీర్పును పునః సమీక్షించాలంటూ శ్రీలక్ష్మీ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ కొట్టేశారు. దీంతో సామాజిక సేవ చేయాలన్న తీర్పును సవాలు చేస్తూ ద్వివేదీ, గిరిజా శంకర్లు ఇటీవల ధర్మాసనం ముందు వేర్వేరుగా రెండు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై గత వారం విచారణ జరిపిన సీజే ధర్మాసనం, గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్లకు విధించిన సామాజిక సేవ శిక్ష అమలును నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఆరుగురు ఐఏఎస్ అధికారుల అప్పీళ్లు ఈ నేపథ్యంలో.. మిగిలిన ఐఏఎస్ అధికారులు కూడా సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం జస్టిస్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపింది. ఐఏఎస్ అధికారుల తరఫున సీనియర్ న్యాయవాదులు సీవీ మోహన్రెడ్డి, ఎ. సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, కోర్టు ధిక్కారానికి పాల్పడిన వారికి ఎలాంటి శిక్ష విధించాలో, ఎంత కాలపరిమితితో విధించాలో కోర్టు ధిక్కార చట్టంలో స్పష్టంగా ఉందని వివరించారు. ఇదే వ్యవహారంలో సీజే ధర్మాసనం ఉత్తర్వులను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో శ్రీలక్ష్మీ తదితరులు దాఖలు చేసిన ఈ అప్పీళ్లలో కూడా సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
యూట్యూబ్తో లాభాలెన్నో.. ఇది తెలుసుకోండి
ఒకప్పుడు యూట్యూబ్ అంటే.. కేవలం వినోదం మాత్రమే!. మరి ఇప్పుడు.. వార్తలు.. వ్యాపారం.. విహారం అన్నీ అందులోనే. కానీ కొందరు కంటెంట్ క్రియేటర్లు.. ఇటు డబ్బు సంపాదనతోపాటు అటు సామాజిక సేవకూ తోడ్పడుతున్నారు. యూట్యూబ్ ఇటీవల విడుదల చేసిన ఇంపాక్ట్ రిపోర్ట్ ప్రకారం.. దక్షిణ భారతంలో సమాజంపై తమ ప్రభావాన్ని చూపిన చానెళ్లలో కొన్ని ఇవీ.. సృజనాత్మకతను ప్రోత్సహించే లక్ష్యంతో యూట్యూబ్ 2007లో మొదలుపెట్టిన పార్టనర్ షిప్ ప్రోగ్రామ్ ఇప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించింది. తమలోని కళ, నైపుణ్యాలను ప్రపంచానికి చూపేందుకు క్రియేటర్లు చానళ్లు మొదలుపెట్టారు. ఈ క్రమంలో క్రియేటర్లు ఎంతో కొంత ఉపాధి పొందడం మొదలైంది. కొందరు వంటలు చేయడం ద్వారా లక్షల మందిని ఆకర్షించి డబ్బులు వెనకేస్తుంటే.. మరికొందరు ఇంగ్లిషు పాఠాలు బోధిస్తూ సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ రెండేళ్ల క్రితం ఒక అధ్యయనం చేపట్టింది. యూట్యూబ్ క్రియేటర్ల ద్వారా ఆర్థిక వ్యవస్థలకు చేకూరుతున్న మేలు ఏమిటనేదానిపై ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ విభాగంతో కలిసి అధ్యయనం చేసి.. ఇంపాక్ట్ రిపోర్ట్ రూపొందించింది. దాని ప్రకారం.. మన దేశంలో 6.83 లక్షల మందికి ప్రత్యక్ష/పరోక్ష ఉపాధి లభించడానికి యూట్యూబ్ క్రియేటర్లు కారణమయ్యారు. వీరిద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు రూ.6,800 కోట్లు సమకూరినట్టు అంచనా వేశారు. యూట్యూబ్లోని 40 వేలకుపైగా చానళ్ల నిర్వాహకులు నెలకు రూ.లక్ష కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారని ఆ నివేదిక తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అలాంటి క్రియేటర్లు, చానళ్లలో కొన్ని ఇవి.. స్పోకెన్ ఇంగ్లిష్కు ‘కైజెన్ ఇంగ్లిష్’ తమిళనాడుకు చెందిన మలర్ సృష్టించిన చానల్ ఇది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాలేజీకి కూడా వెళ్లలేని మలర్.. దూరవిద్య కోర్సుల ద్వారానే డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత టీచర్గా ఉపాధి పొందారు కూడా. ఆ సమయంలో ఇంగ్లిష్ రాకపోవడం వల్ల తాను పడ్డ కష్టాలు ఇతరులకు రావొద్దన్న సంకల్పంతో ‘కైజెన్ ఇంగ్లిష్’ పేరిట యూట్యూబ్ చానల్ మొదలుపెట్టారు. తమిళంలో మాట్లాడుతూ ఇంగ్లిష్ భాషను బోధిస్తున్నారు. ప్రస్తుతం ఈ చానెల్కు 9.77 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ చానల్ ద్వారా కోచింగ్ పొందిన తాము ఉద్యోగ ఇంటర్వ్యూలను విజయవంతంగా ఎదుర్కొన్నామని, ఇతరులతో ఇంగ్లిషులో ధీమాగా మాట్లాడటం అలవాటు చేసుకున్నామని సబ్స్క్రైబర్లు చెప్తుండటం గమనార్హం. స్ఫూర్తినిచ్చే.. తెలుగు గీక్స్ ఆయన పేరు పోతుల ఫణిదీప్.. వైద్యుడు.. కొన్నేళ్ల క్రితం ఆస్పత్రిలో పనిచేస్తుండగా వేళ్లు వణుకుతున్నట్టు గుర్తిం చారు. ‘అమయోట్రోపిక్ లాటెరల్ స్కెలరోసిస్ (ఏఎల్ఎస్)’ఉన్నట్టు తేలడంతో ఉద్యో గం వదిలేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఫణిదీప్ తన నిరాశ, నిస్పృహలను దూరం చేసుకునేందుకు యూట్యూబ్ చానల్ మొదలుపెట్టాడు. వ్యక్తిత్వవికాసానికి దోహదపడే వీడి యోలు రూపొందించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుస్తకాల విషయాలను తెలుసుకోండి ఉచితంగా.. అని తెలుగులో రాసిన కవర్పేజీతో వచ్చే తెలుగు గీక్స్కు దాదాపు 14 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఫణిదీప్ నెలసరి ఆదాయం రూ.1.5లక్షలు. www.youtube.com/c/ TeluguGeeks/ featured ఎం4టెక్.. సైన్స్ పాఠాలతో.. పిల్లలకు ఆసక్తికర రీతిలో సైన్స్ పాఠాలు అందించే లక్ష్యంతో కేరళకు చెందిన జియోజోసెఫ్ మొదలుపెట్టిన చానల్ ఇది. సొంతంగా చేసుకోగల శాస్త్రీయ పరిశోధనలే ఈ చానల్ కంటెంట్. ఒక వీడియో బాగా వైరల్ కావడంతో జోసెఫ్ తన మిత్రుడు ప్రవీణ్తో కలిసి మరింత కంటెంట్ను రెగ్యులర్గా అందించడం మొదలుపెట్టాడు. తక్కువ కాలంలోనే చానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 74 లక్షలకు చేరుకుంది. నెలకు రూ.లక్షల్లో ఆదాయమూ తెచ్చిపెడుతోంది. ఎం4టెక్ చానల్లోని వీడియోల స్ఫూర్తితో ఇప్పుడు విద్యార్థులు సైన్స్ పోటీలకు సిద్ధమవుతున్నారంటే దాని ప్రభావం ఏమిటన్నది అర్థమైపోతుంది. https://www.youtube.com/c/M4Techofficial అనాథలకు అన్నం పెడుతున్న నవాబ్స్ కిచెన్ తెలంగాణకు చెందిన ఖ్వాజా మొయినుద్దీన్ స్థాపించిన యూట్యూబ్ చానల్.. కేవలం వంటల గురించి చెప్పేది మాత్రమే కాదు, ఈ క్రమంలోనే అనాథల కడుపులూ నింపుతోంది. తమ చానల్లో ప్రసారం చేయడం కోసం.. పెద్ద మొత్తాల్లో బిరియానీ, పలావ్ వంటి వంటలు వండటం, తర్వాత ఆ వంటను అనాథ పిల్లలకు పంచి పెట్టడం.. ఇదీ నవాబ్స్ కిచెన్ పనిచేసే తీరు. ఖ్వాజా మొయినుద్దీన్ తన మిత్రులతో కలిసి ఈ చానల్ మొదలుపెట్టారు. ఉద్యోగం మానేయడంతోపాటు మరెన్నో సమస్యలు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగిన ఖ్వాజాకు ఇప్పుడు తన చానల్ ద్వారా స్థిరమైన ఆదాయం లభిస్తోంది. అటు అనాథలకూ ఆహారం అందివ్వగలుగుతున్నాడు. ఇదీ చానల్ లింకు.. https://www.youtube.com/c/ NawabsKitchenFoodForAllOrphans - సాక్షి, హైదరాబాద్ -
8 మంది ఐఏఎస్ అధికారులకు వినూత్న శిక్ష
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సామాజిక సేవ చేయాలని వారిని ఆదేశించింది. నెలలో నచ్చిన ఓ ఆదివారం రోజున ఆ జిల్లాలో ఉన్న ఏదైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో సేవ చేయాలని చెప్పింది. ఇలా 12 ఆదివారాలు ఒక్కో వారం ఒక్కో హాస్టల్లో సేవ చేయడంతో పాటు ఆయా హాస్టళ్లలోని విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న లేదా రాత్రి భోజనాన్ని అందించాలని ఆదేశించింది. ఇందుకు అయ్యే వ్యయాన్ని సొంత జేబు నుంచి భరించాలంది. ఒక్కో అధికారికి ఒక్కో జిల్లాను కేటాయించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం తీర్పునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వంటి వాటిని నిర్మిస్తుండటాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పాఠశాలల్లో ఇలాంటి నిర్మాణాలు తగవంటూ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాలకు విరుద్దంగా పలు చోట్ల నిర్మాణాలు కొనసాగడంతో అధికారులపై హైకోర్టు సుమోటోగా ధిక్కార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యా శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, అప్పటి కమిషనర్ చిన వీరభద్రుడు, పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఆ శాఖ ప్రస్తుత స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మీ, ఆ శాఖ అప్పటి డైరెక్టర్ జి.విజయ్కుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎంఎం.నాయక్లను ప్రతివాదులుగా చేర్చింది. తాజాగా గురువారం ఈ ఎనిమిది మంది న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. ధిక్కార చర్యల తర్వాతే స్పందించారు.. సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు మొదలైన తర్వాతే అధికారులు స్పందించి, దాదాపు 1,371 పాఠశాలల్లో నిర్మాణాలను గుర్తించి, తొలగించారని న్యాయమూర్తి అన్నారు. కోర్టు ఆదేశాలను నిజమైన స్ఫూర్తితో అమలు చేయక పోవడంతో వల్లే.. అఫిడవిట్ దాఖలు చేశాక కూడా పిటిషన్లు పడుతున్నాయని చెప్పారు. ఈ దృష్ట్యా ఈ ఎనిమిది మందికి రెండు వారాల జైలు శిక్ష, రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. దీంతో భవిష్యత్లో ఇలా జరగకుండా చూసుకుంటామని అధికారులు కోర్టును బేషరతు క్షమాపణలు కోరారు. క్షమాపణలు ఆమోదించాలంటే సామాజిక సేవ చేయాలని న్యాయమూర్తి షరతు విధించారు. దీనికి అధికారులందరూ అంగీకరించడంతో న్యాయమూర్తి తానిచ్చిన జైలు శిక్ష, జరిమానాను మాఫీ చేస్తూ.. వాటి స్థానంలో సామాజిక సేవకు ఆదేశాలిచ్చారు. ఈ అధికారులు హాస్టళ్ల సందర్శన వివరాలు, ఫొటోలను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. -
సామాజిక సేవ చేయండి
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) కె.శామ్యూల్కు హైకోర్టు సామాజిక సేవను శిక్షగా విధించింది. అనంతపురం జిల్లాలోని ఏదైనా వృద్ధాశ్రమం లేదా అనాథ ఆశ్రమంలో ఉన్న వారికి వారం రోజుల పాటు భోజన ఖర్చులను భరించాలని ఆయనను ఆదేశించింది. ఆ వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడమంటే కోర్టులను అవమానించడమేనంది. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేసేలా తగిన చర్యలు చేపట్టాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నోషనల్ సీనియారిటీని కల్పించే విషయంలో అనంతపురం జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పి.వెంకటరమణ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు నోషనల్ సీనియారిటీ కల్పించాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో వెంకటరమణ గతేడాది కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, అప్పటి కమిషనర్ చినవీరభద్రుడు, అనంతపురం డీఈవో శామ్యూల్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల మేరకు వారంతా సోమవారం కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల అమలులో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, చినవీరభద్రుడు కారణం కాదని న్యాయమూర్తి తేల్చారు. డీఈవో శామ్యూల్ వల్లే కోర్టు ఆదేశాల అమలులో జాప్యం జరిగిందన్నారు. ఇందుకు ఆయనను బాధ్యుడిని చేస్తూ సామాజిక సేవను శిక్షగా విధించారు. -
హైవేపై కిలేడీ గ్యాంగ్.. సామాజిక సేవ పేరుతో..
సాక్షి, ఖిలా వరంగల్: ఏడుగురు సభ్యులతో కూడిన ఓ మహిళా ముఠా హైవేలపై తిష్ట వేసి వాహనదారులను లక్ష్యంగా చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. జీన్స్ పాయింట్, టీషర్ట్ ధరించి ఉన్నారని వాహనం ఆపితే అంతే సంగతులు. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవ పేరుతో వాహనాలను నిలిపి చందాలు వసూళ్లు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే మంగళవారం మధ్యాహ్నం వరంగల్– ఖమ్మం జాతీయ రహదారిపై బొల్లికుంట క్రాస్ రోడ్డు వద్ద జరగగా బుధవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరంతా రాజస్తాన్కు చెందిన మహిళలుగా అనుమానిస్తుండగా, మూఠాగా ఏర్పడి వచ్చి వెళ్లే వాహనదారులను చందాల పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారు. వీరిని గమనించిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గట్టిగా నిలదీయడంతోపాటు సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా ఆటోలో పరారయ్యారు. ఏడుగురు జీన్స్ పాయింట్, టీషర్ట్స్ ధరించి ఉన్నారని, సడన్గా వాహనం ఆపి సామాజిక సేవ పేరుతో డబ్బులు అడిగారని పలువురు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి మామునూరు పోలీసులు చేరుకుని వివరాలను సేకరించి గాలిస్తున్నట్లు తెలిసింది. -
పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది.. అయినా కుంగిపోలేదు
లుథియానా జిల్లా టూసా గ్రామానికి చెందిన సత్విందర్ కౌర్కు... అందరి అమ్మాయిల్లానే వయసు రాగానే తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. టీచర్గా పనిచేస్తోన్న మంచి వరుడు దొరకడంతో 2009 ఫిబ్రవరి 23న పెద్దల సమక్షంలో కోటి ఆశలతో పెళ్లి చేసుకుంది సత్విందర్. ఆ ఆశలన్నీ మూణ్ణాళ్ల ముచ్చటేనని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వివాహం అయిన కొద్దిరోజులకే భర్త విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2010లో జార్జియా వెళ్లి అక్కడ నుంచి ఉక్రెయిన్కు మారాడు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో విదేశీ విద్యార్థుల కో ఆర్డినేటర్గా పనిచేసేవాడు. అతను మాత్రమే వెళ్లి తనను ఎందుకు తీసుకెళ్లలేదో సత్విందర్కు అర్థం కాలేదు. అలా ఐదేళ్లు గడిచిపోయాయి. 2015 జూలై 20 న ఇండియాకు భర్త తిరిగి వస్తున్నారని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసింది సత్విందర్. సంవత్సరాల తరువాత విదేశాల నుంచి వచ్చిన భర్త కుటుంబంతో అయిష్టంగా వ్యవహరిస్తూ.. మనం వేరే ఇంటికి అద్దెకు వెళ్దాం అని చెప్పి కిరాయికి ఇల్లు తీసుకుని అక్కడకు మకాం మార్చాడు. నెల తరువాత ‘‘నేను ఇప్పుడు ఉక్రెయిన్ వెళ్తున్నాను. మూడు నెలల తరువాత నిన్ను తీసుకెళ్తాను’’ అని చెప్పి తిరిగి వెళ్లిపోయాడు. కానీ చెప్పినట్లుగా సత్విందర్ను తీసుకెళ్లలేదు. తన భర్త తనని మోసం చేసాడని తెలుసుకున్న సత్విందర్ 2016లో ఎన్ఆర్ఐ సెల్లో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఆమె భర్త విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. దీంతో కొన్ని వాయిదాల తరువాత పదివేల రూపాయల జీవన భృతితో కోర్టు విడాకులు ఇస్తూ తీర్పు ఇచ్చింది. విడాకులు మంజూరు అయ్యేంత వరకూ సత్విందర్.. తనలాగా భర్తచేతిలో మోసపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఎంతోమంది అమ్మాయిల సాధక బాధలను దగ్గర నుంచి గమనించేది. చిన్న చిన్న అమ్మాయిల జీవితాలు రోడ్డున పడడం వారు న్యాయం కోసం సంవత్సరాలపాటు కోర్టుల చుట్టూ తిరగడం, సత్విందర్కు కూడా అటువంటి ప్రత్యక్ష అనుభవం ఉండడంతో తనలాంటి వారికి సాయపడాలనుకున్నారు. అబ్ నహీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ.. భర్తల చేతిలో మోసపోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలను ఆదుకోవాలని నిర్ణయించుకుని 2016లో ‘అబ్ నహీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ’ పేరున స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా మోసపోయిన అమ్మాయిలు, మహిళలకు సాయం చేయడం ప్రారంభించారు. కోర్టులు, పోలీసు స్టేషన్స్ దగ్గర తనకు ఎదురైన అమ్మాయిలను, ఇంకా ఫేస్బుక్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మరికొంతమంది బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకుని ఎన్ఆర్ఐ సెల్స్, జాతీయ మహిళ కమిషన్ నిర్వహించే సెమినార్స్కు వారిని ఆహ్వానించి అక్కడ వాళ్లకు న్యాయం ఎలా అందుతుందో వివరించేవారు. ప్రభుత్వ పెద్దలను సంప్రదించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా గురుద్వారాలను సంప్రదించి బాధిత మహిళ వివరాలు తెలుసుకుని వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇప్పటిదాకా 700 మంది మహిళలకు సాయపడ్డారు. ఎన్జీవోని సంప్రదించిన 40 మంది పురుషులకు సత్విందర్ సాయపడడం విశేషం. ‘‘నా భర్త నన్ను మోసం చేసినప్పుడు చాలా బాధపడ్డాను. కానీ కొన్నిరోజులకు నన్ను నేను తమాయించుకుని ధైర్యంగా పోరాడాలనుకున్నాను. ఈ క్రమంలోనే నాలా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారిలో ధైర్యం నింపుతూ.. సాయం చేయాలనుకున్నాను. ఎన్జీవో స్థాపించి నేను చేయగలిగిన సాయం చేస్తున్నాను. సాయం కోసం నా దగ్గరకు వచ్చేవారిలో 65 ఏళ్ల లోపు మహిళలు 22 మంది ఉన్నారు. వీళ్లంతా దశాబ్దాలుగా తమ భర్తల కోసం ఎదురు చూస్తున్నారు. పంజాబ్, హర్యాణ రాష్ట్రాల్లోనే దాదాపు 32 వేల మంది బాధిత మహిళలు ఉన్నారు. వీరిలో చాలా మందికి సరైన న్యాయం అందడం లేదు. కొన్ని సందర్భాల్లో మోసం చేసిన భర్తల పాస్పోర్టులు రద్దుచేయించడం, ప్రపంచ నలుమూలల్లో ఏదేశం లో ఉన్నా ఇండియాకు రప్పించి న్యాయం చేస్తున్నాం. ఇప్పటిదాక 20 జంటలను కౌన్సెలింగ్ ద్వారా కలిపాము’’ అని సత్విందర్ వివరించారు. -
వయసు చిన్నది.. సేవ గొప్పది..!
మన పని మనం చేసుకుంటూ పోతే గుర్తింపు దానంతట అదే వస్తుందన్న మాటకు ఉదాహరణగా నిలుస్తు్తన్నారు ఢిల్లీకి చెందిన దేవాన్షి రంజన్, సనా మిట్టార్లు. ఈ ఇద్దరు విద్యార్థినులూ చదువుతోపాటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. కరోనా సమయంలోనూ వెనుకంజ వేయక వీరు చేస్తోన్న కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. దివంగత ప్రిన్సెస్ డయానా గౌరవార్థం సామాజిక సేవ, మానవతా కారణాలకోసం కృషి చేసే 9–25 ఏళ్ల యువతీయువకులకు ఇచ్చే డయానా అవార్డు ఈ ఇద్దరమ్మాయిలనూ వెతుక్కుంటూ వచ్చి మరీ పురస్కరించింది. పిల్లలకు చదువు చెబుతున్న దేవాన్షి, సనా ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదువుతోన్న 21 ఏళ్ల దేవాన్షి రంజన్ లింగ సమానత్వం, మానసిక ఆరోగ్యం, బాలబాలిక విద్యపై కృషిచేస్తోంది. గత ఐదేళ్లుగా మురికివాడల్లో నివసించే నిరుపేద పిల్లలకు చదువు చెప్పడం, నిరుపేద మహిళల్లో ఆర్థిక అంశాలు, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తోంది. మైక్డ్రాప్.. ‘‘కరోనా కారణంగా అంతంతమాత్రంగా ఉన్న నిరుపేద బతుకులు రోడ్డు మీద పడడంతో చాలా మంది పిల్లలు బడికెళ్లడం మానేశారు, కొంతమంది స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే స్థోమత లేకపోవడం వల్ల కూడా చదువుకు దూరమయ్యారు. ఇటువంటి వారందరికి చదువు చెప్పేందుకు లడ్లీ అనే ఎన్జీవో ఫౌండేషన్తో కలిసి పనిచేయడం ప్రారంభించాను. స్టడీ మెటిరియల్, స్టేషనరీలు విద్యార్థులకు అందించి వారిని చదివించేందుకు ప్రోత్సహిస్తున్నాను. ఢిల్లీలోని మురికివాడల్లోని వెయ్యిమందికిపైగా పిల్లలకు చదువు చెబుతున్నాము. ఈ క్రమంలోనే మా సామాజిక సేవా కార్యక్రమాలను పదిరాష్ట్రాల్లోని యాభై జిల్లాల్లో విస్తరించాము. స్నేహితులతో కలిసి గతేడాది జూలైలో మైక్డ్రాప్ పేరిట ప్రాజెక్టును ప్రారంభించాను. స్త్రీవాదం, రాజకీయాలు, లింగ సమానత్వం, ఇంకా కళల ద్వారా మహిళలు ఎలా ఉపాధి పొందవచ్చు అన్న అంశాలపై వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం మా బృందంలో 50 మంది సభ్యులు ఉండగా మరో150 మంది కంట్రిబ్యూటర్స్ వివిధ ప్రాంతాల నుంచి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వర్క్షాపులు, వెబినార్స్ను నిర్వహిస్తూ నిరుపేదల్లో అవగాహన కల్పిస్తున్నాము’’ అని దేవాన్షి వివరించింది. మనదేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో సనా మిట్టార్ 150 వలంటీర్లతో డిజిటల్ క్యాంపెయిన్ను సమన్వయ పరిచి ఐదు లక్షల రూపాయల విరాళాలను సేకరించింది. అంతేగాక లాక్డౌన్ కాలంలో నిరుపేద విద్యార్థులు స్మార్ట్ఫోన్లు కొనుక్కునేందుకు సాయం చేసింది. 40 మంది విద్యార్థులు సనా సాయంతో ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు. సోషల్ ఎంటర్పైజ్ గ్లోబల్ వలంటీర్ యాక్షన్ నెట్వర్క్(జీవీఏఎన్)ను ఏర్పాటు చేసి సాయం చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితుల్లో ఉన్న యువతను జీవీఏఎన్ వేదికగా వారి సహాయ సహకారాలను సమాజానికి అందిస్తోంది సనా. పిల్లలకు చదువు చెబుతున్న దేవాన్షి, సనా -
సాయం కోసం డబ్బు తీసుకోవడం లేదు!
‘‘కోవిడ్ బాధితుల అవసరార్థం ఆక్సిజన్ సిలిండర్లు, రెమెడెసివిర్ ఇంజెక్షన్లు, ఆస్పత్రిలో బెడ్లు.. ఇలా నెల రోజుల నుంచి నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఎన్నో రిక్వెస్ట్లు వచ్చాయి. సోషల్ మీడియాలో వాలంటీర్లు, నా ఫ్రెండ్స్, నా అభిమానులు నాకు సాయంగా ఉంటున్నారు’’ అని నిఖిల్ అన్నారు. నిఖిల్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు చేసుకోవాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం షూటింగ్లు ఆగిపోయాయి.. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం? అందుకే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రస్తుతానికి ఎవరి వద్దా డబ్బు సహాయంగా తీసుకోవడం లేదు. నా సొంత డబ్బులతోనే సాయం అందిస్తున్నాను. చాలా మంది డబ్బులు పంపుతామని సంప్రదించారు. అయితే ఆ డబ్బుతో మీ ప్రాంతాల్లో అవసరమైన వారికి సాయపడండి అని చెబుతున్నాను’’ అన్నారు. వైవాహిక జీవితం గురించి నిఖిల్ మాట్లాడుతూ – ‘‘గత ఏడాది మే 14న కోవిడ్ సమయంలోనే పల్లవితో నా పెళ్లి అయింది. హనీమూన్కి విదేశాలకు వెళ్లే పరిస్థితి అప్పుడు లేకపోవడంతో సిమ్లా, గోవాలకు వెళ్లాం. పల్లవి డాక్టర్ కావడంతో రోగులకు అవసరమైన మందులను ఫోనులో చెబుతుంటుంది. నేను చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తను కూడా ఓ వాలంటీర్’’ అన్నారు. చేస్తున్న సినిమాల గురించి చెబుతూ – ‘‘ప్రస్తుతం ‘18 పేజెస్’, ‘కార్తికేయ 2’ చిత్రాలు చేస్తున్నాను. మరో మూడు సినిమాలకు సంతకం చేశాను’’ అన్నారు. -
"సోనుసూద్ అంబులెన్స్" సేవలకు శ్రీకారం..
-
మానవ సేవే మాధవ సేవ
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో మన తోటి మనుషులు ఎంతో మంది రోజుకు ఒక్క పూట కూడా ఆహారం దొరకక పస్తులు ఉంటున్నారు. లాక్డౌన్కి ముందు కష్టం చేసుకొని స్వశక్తితో బతికిన ఎంతో మంది వలసకూలీలు, దినసరి కూలీలు, నిరుపేదలు ఆకలితో నీళ్లు తాగి పడుకునే దుస్థితి దాపురించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను, వలస కూలీలను ఆదుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. దీనికి తోడు సామాన్యులు సైతం ఈ సమయంలో ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. పేదలకు నిత్యవసర సరుకులు, ఆహారాన్ని అందిస్తున్నారు. అలా సాయం చేస్తున్న సామాన్యులు కొంతమంది సాక్షి.కామ్ ద్వారా వాళ్ల సేవ కార్యక్రమాన్ని తెలిపి మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అనుశ్రీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి అధ్వర్యంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పొయిన వలస కూలీలకు, పేదలకు, దినసరి కూలీలకు గత మూడు రోజులుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోజుకు 500 మందికి అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సహాయం అందించిన వారికి అసోసియేషన్ అధ్యక్షలు అంబటి నాగరాజు, ఉపాధ్యక్షులు రమేష్గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. మనమంతా గ్రూప్ వారు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 4 ఆశ్రమాలకు కు కిరాణా సరుకులు, అద్దె ఖర్చులు అందించి సాయం చేశారు. సుధీర్ ఫౌండేషన్, హయత్ నగర్, మాతృ అభయ ఫౌండేషన్ , మేడిపల్లి, సాయి సురక్షిత వృద్ధ ఆశ్రమం, ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమాలకు సాయం చేశారు. ఈ కార్యక్రమంలో మనమంతా గ్రూపు ఫౌండర్ రవి, జగదీష్ కుమార్ జల్లు, శేఖర్ ఉదయగిరి గారు, సుజాత గారు, రామాంజనేయులు, సునీత గారు, సుధాకర్ రెడ్డి, ఉష గారు సహాయ సహకారాలు అందించారు. ఇవే కాకుండా మానసిక వికలాంగురాలి కోసం టీవీ, నెలకు సరిపడా ఆర్గానిక్ ఫుడ్స్ అందించారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పొయిన పేదలకు, నిరాశ్రయులకు కృష్ణజిల్లా గూడూరులో యతిరాజం గిడియోన్ తన వంతు సహాయాన్ని అందించారు. ప్రజలకు నిత్యావసర సరుకులు బియ్యం, కంది పప్పు, వంట నూనె అందించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ, ట్రైనీ డీఎస్పీ శ్రావణి , బండారు తాలూకా సీఐ, గూడూరు ఎస్సై ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, సోలమన్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా పూణేలో ఇరుక్కపోయిన యల్టీఐలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్న కాయల రామకృష్ణుడు తన సొంత గ్రామమైన కడపజిల్లా గంగాయపల్లిలో పేదలకు కూరగాయలు, గుడ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో తనకు సహాయం చేస్తున్న గ్రామ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఖతర్లో ఉంటున్న కొణిజేటి శ్రీనివాసరావు తన స్వగ్రామమైన ఒంగోలులో ఉంటున్న వైద్యసిబ్భందికి 3560 మాస్క్లు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. బోడుప్పల్కి చెందిన శ్రీనివాసరావు వారి స్వచ్ఛంద సంస్థ జెరూషా ఫౌండేషన్ ద్వారా హైవేల పక్కన ఉంటున్న నిరాశ్రయులకు, లాక్డౌన్ కారణగా జీహెచ్యమ్సీ వారు ఏర్పాటు చేసిన షల్టర్స్లో ఉంటున్న వారికి పులిహోర, గుడ్లు పంపిణీ చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని లాక్డౌన్ చివరి వరకు కొనసాగిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. చంద్రన్న పాలానికి చెందిన గెత్సమన్ ప్రార్థన సమూహము వారు కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకి ఆహారాన్ని అందించారు. మణికొండలో లాక్డౌన్ కారణంగా ఆహారం అందక ఇబ్బంది పడుతున్న రోజువారీ కూలీలకు, పేదలు 100 మందికి నీలేష్ దుబే అన్నదానం చేశారు. నెల్లూరు జిల్లా పియ్యలపాలేం గ్రామంలో అరబిందో ఫార్మా లిమిటెడ్ రిప్రజెంటేటివ్ పీనక గోపినాథ రెడ్డి 315 కుటుంబాలకు కూరగాయలు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ పీనక శ్రీనివాసులు రెడ్డి, రమణయ్య, సురేంద్ర రెడ్డి, సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. -
లాక్డౌన్ : అన్నం, వాటర్ ప్యాకెట్లు పంపిణీ
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ అమలవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో రోజువారి కూలీలు, వలస జీవులు, బడుగులు, సంచాలకులు తిండి దొరకని దీన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ గడ్డుకాలంలో వారిని ఆదుకోవడానికి అనేక మంది ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు డబ్బులు పంచుతుంటే, మరికొందరు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్కు చెందిన ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి స్వచ్చందం ముందుకు వచ్చారు. ఈ గడ్డు కాలంతో తిండి దొరక్క అలమటిస్తున్న సికింద్రాబాద్ ప్రాంతంలో నిరాశ్రయులకు, సంచాలకులకు పులిహోర, వాటర్ ప్యాకెట్లు పంపిణి చేసి మనవతను చాటుకున్నారు. (నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బిట్స్ పిలానీ) -
నా సేవలు కొనసాగిస్తా
చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘చాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019’ అవార్డు అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్కి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీకి ధన్యవాదాలు. 40ఏళ్ల ప్రయాణంలో సేద తీర్చుకోవడానికి అవార్డులు ఉపయోగపడతాయి. నా సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రక్త దాతలకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. భవిష్యత్తులో సమాజం కోసం నా సేవలు కొనసాగిస్తా’’ అన్నారు. -
పావనం
శ్రీ రామకృష్ణ పరమహంస సేవలో, శిష్యరికంలో ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరిన గృహస్థు నాగ మహాశయుడు. వైద్యుడైన ఆయన తన వద్దకు వచ్చే నిరుపేద రోగులకు ఉచితంగా మందులిచ్చి సేవచేయడమేగాక, పథ్యపానీయాలకు సరిపడ డబ్బును కూడా తానే సమకూర్చేవాడు. అవధూతలా జీవించిన నాగమహాశయులు ఒకసారి కలకత్తా నుంచి స్వగ్రామం వెళ్లారు. ఆ రోజు ఏదో పర్వదినం. ఇలాంటి పర్వదినాన కలకత్తాలో ఉండి కూడా పవిత్రమైన గంగలో స్నానం చేయకుండా వచ్చేసినందుకు తండ్రి ఆయన్ని మందలించాడు. అందుకు నాగమహాశయులు ‘‘తండ్రీ! గంగ కలకత్తాలోనే కాదు... అన్నిచోట్లా ఉంది. భగవదనుగ్రహం ఉంటే, మనం ఉన్నచోటే మనం గంగాస్నానం చేయవచ్చు’’ అని జవాబిచ్చాడు. అంతలోనే ఒక అద్భుతం జరిగింది. నాగమహాశయులు స్నానం చేయడానికి వెళుతున్నారు.. అప్పుడు పెరట్లో ఒకచోట చిమ్మిన గొట్టంలోనుంచి వస్తున్నట్లుగా నీరు పైకి ఎగజిమ్ముతూ వచ్చి ఆ ఆవరణమంతా జలమయం అయిపోయింది. భగవదనుగ్రహం జలప్రవాహంలా ప్రవహించి, తన నమ్మకాన్ని నిలబెట్టినందుకు నాగమహాశయుడు పొంగిపోయి, భావోద్రేకంతో ‘‘స్వాగతం గంగామాతా! స్వాగతం! మమ్మల్నందరినీ పావనం చెయ్యి తల్లీ’’ అని అరిచాడు. ఆయన తండ్రి, ఇరుగు పొరుగు వారందరూ ఆ పవిత్ర గంగాజలాలలో స్నానం చేసి, గంగాస్నానం చేసిన అనుభూతికి లోనయ్యారు. దైవకృప... దేవుని పట్ల ప్రగాఢ విశ్వాసం ఉంటే ఇలానే జరుగుతుంది మరి. -
గ్రూప్1 అధికారిగా రిటైర్డ్ అయ్యి..తాను చదివిన పాఠశాలకు..
కష్టపడి చదివి.. ఉద్యోగం సాధించి.. కుటుంబం, పిల్లల ఉన్నతికి బాటలు వేసి.. ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంతంగా గడపవచ్చు. అయితే చివరకు వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం ఇంతేనా అనిపించవచ్చు. అందుకే ఆయన ఉన్నత ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినా ఇప్పటికీ సామాజిక సేవలోనే తరిస్తూనే ఉన్నారు. మంచి మనసుతో చేసే పనితో సమ సమాజ నిర్మాణం సాధ్యమని నిరూపిస్తున్నారు. సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సొంత నిధులు వెచ్చిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. – నంద్యాల సాక్షి, కర్నూలు: మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో జన్మించి మొదట ఎస్ఐ ఉద్యోగం సాధించి అంచలంచెలుగా ఎదుగుతూ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా, రాష్ట్ర ఇన్కంట్యాక్స్ జాయింట్ కమిషనర్గా పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన నాగస్వారం నరసింహులు ఒకటవ తరగతి నుంచి ఎంఏ పీహెచ్డీ వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలల్లోనే చదువుకున్నారు. తర్వాత 1983లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించారు. ఎస్ఐగా ఉంటూ ఏపీటీఎస్సీ పరీక్షలు రాసి గ్రూప్–2 అధికారిగా ఎంపికయ్యారు. అనంతరం 1996లో గ్రూప్–1 ఉద్యోగం సాధించారు. 2005 నుంచి 2016 వరకు రాష్ట్ర ట్యాక్స్ జాయింట్ కమిషనర్గా, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా కడపలో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. గతంలో అతను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కనీస వసతులు లేకపోవడంపై నిత్యం తన స్నేహితులతో ఆవేదన వ్యక్తం చేసేవారు. దీంతో రిటైర్డ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పాఠశాల సమస్యలపై పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హృదయాల్లో జల ప్రదాతగా పేరు తెచ్చుకున్నారు. పదవ తరగతిలో నాలుగుసార్లు ఫెయిల్ తల్లిదండ్రులు తడికెలు, గంపలు అల్లేవారు. వారికి తోడుగా నరసింహులు పని చేస్తూ ఇంటి వద్దనే గడిపేవాడు. ఈ క్రమంలో చదువుపై ఆసక్తి తగ్గింది. దీంతో పదవ తరగతి నాలుగుసార్లు ఫెయిల్ అయ్యారు. తర్వాత తల్లిదండ్రుల సూచన మేరకు పట్టుబట్టి పదవ తరగతి పాస్ అయ్యారు. అనంతరం ఎస్ఐ, గ్రూప్–2, గ్రూప్–1 స్థానానికి ఎదిగారు. చదువుకుంటున్న సమయంలోనే కళాశాల నుంచి జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ ఆటగాడిగా గుర్తింపు పొందారు. వాటిలో భాగంగా 2014–2016వ సంవత్సరంలో ఇండియా బాస్కెట్బాల్ టీంకు మేనేజర్గా వ్యవహరించారు. థాయిల్యాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, జపాన్ వంటి దేశాలకు ఇండియా టీం మేనేజర్గా వెళ్లారు. సేవతోనే ఆత్మసంతృప్తి ప్రభుత్వ పాఠశాలకు, పేద విద్యార్థులకు సేవ చేస్తున్నందుకు ఆత్మసంతృప్తి కలుగుతుంది. మేము చదువుకున్న సమయంలో పాఠశాలల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పటికే దాదాపు 80పాఠశాలల్లో నీటి బోర్లు వేయించి నీటి సమస్యను తీర్చడం చాలా ఆనందంగా ఉంది. టీవీల్లో, పేపర్లలో వచ్చే ప్రభుత్వ పాఠశాల సమస్యలపై స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నాను. – నాగస్వారం నరసింహులు, మాజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సేవా కార్యక్రమాలు.. ⇔ డిసెంబర్ 2017లో చాగలమర్రి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో బోరు ఏర్పాటు చేశారు. ⇔ చిలకలడోన కస్తూరిబా గాంధీ పాఠశాల బాలికలకు రూ.40వేలు విలువ గల క్రీడా సామగ్రి అందించారు. ⇔ పాణ్యం సమీపంలోని కస్తూర్భా గాంధీ పాఠశాలకు రూ.40వేలు విలువ చేసే వంట సామగ్రిని అందజేశారు. ⇔ ఎర్రగుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.30వేలు చేయూతనిచ్చారు. ⇔ గోనెగండ్ల కస్తూర్భా గాంధీ పాఠశాలకు రూ.60వేలతో బోరు వేయించి పైపులైన్ సౌకర్యం కల్పించారు. ⇔ దీబగుంట్ల ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులు రికార్డులు భద్రంగా ఉంచేందుకు రూ.25వేల సేఫ్లాకర్ను అందించారు. ⇔ కర్నూలు పట్టణంలో ఇద్దరు అనాథలను పిల్లలను దత్తత తీసుకొని వారి చదువుకు అయ్యే ఖర్చులను భరిస్తున్నారు. ⇔ మాయలూరు జెడ్పీపాఠశాలలో రూ.40 వేలతో బోరు వేయించారు. ⇔ దిగువపాడు జెడ్పీ హైస్కూల్కు రూ.60వేలతో నీటి బోరు వేయించారు. ⇔ నంద్యాల జెడ్పీ బాలికల పాఠశాలలో రూ.55 వేలతో నీటి సౌకర్యం. వెంటనే స్పందించారు మా పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యపై పత్రికలో వచ్చిన వార్తకు ఆయన వెంటనే స్పందించి మరుసటి రోజు మా పాఠశాలను సందర్శించారు. పాఠశాలల్లో రూ.50వేలతో నీటి బోరు వేయించి తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులు సమాజంలో చాలా తక్కువగా ఉంటారు. – సుబ్బన్న, ఉపాధ్యాయుడు, తిమ్మాపురం -
డొనేషన్.. కమీషన్
సాక్షి, సిటీబ్యూరో: కాగితాలకే పరిమితమైన సొసైటీ..రికార్డుల్లోనే పొందుపరుస్తున్న సామాజిక సేవలు..ఆదాయపు పన్ను సర్టిఫికెట్ సృష్టించి.. మూడు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులతో దందా... వెరసి మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.41.74 కోట్లు డొనేషన్గా తీసుకున్నాడు... ఈ మొత్తాన్ని షెల్ కంపెనీల ద్వారా మళ్ళీ ‘దాతలకే’ పంపి కమీషన్లు తీసుకున్నాడు... మొత్తమ్మీద ఆదాయపుపన్ను శాఖకు పన్ను రూపంలో రావాల్సిన రూ.22.43 కోట్లకు గండికొట్టాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గురువారం ప్రధాన సూత్రధారి సనతన రవిని అరెస్టు చేసిన అధికారులు ఈ కేసులో దాదాపు మరో 200 మంది నిందితులుగా ఉన్నట్లు తేల్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన సుబ్బారావు 1993లో రూరల్ డెవలప్మెంట్ సొసైటీని స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు చేసే ఇలాంటి సంస్థలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) అనేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. వీటి పనితీరును బట్టి కొన్ని మినహాయింపులు ఇస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఇవి కలిగి ఉన్న సంస్థలకు డొనేషన్లు ఇచ్చే వారికి ఆదాయపుపన్ను మినహాయింపు వస్తుంది. మహబూబ్నగర్ సమీపంలోని కొల్లాపూర్కు చెందిన రవి కొన్నాళ్ళు ఈ సంస్థలో పని చేశాడు. ఆపై అది తన సంస్థే అంటూ 2013లో హైదరాబాద్కు వచ్చి పంజగుట్ట ప్రాంతంలో కార్యాలయం ఏర్పాటు చేశాడు. నల్లగొండలోని గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్యను అధిగమించడమే తమ సంస్థ లక్ష్యమని, దీని కోసం భారీ పరిశోధనలు చేస్తున్నట్లు రికార్డులు రూపొందించాడు. దీని ఆధారంగా సీబీడీటీకి దరఖాస్తు చేసుకుని సెక్షన్ 12 (ఎ) సర్టిఫికెట్ పొందాడు. ఇది కలిగిన స్వచ్ఛంద సంస్థకు డొనేషన్ ఇచ్చే దాతలు ఆ మొత్తంలో 50 శాతానికి సమానమైన నగదుకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇలా కొన్నాళ్ళు డొనేషన్లు తీసుకున్న అతగాడు 2017–18 ఆర్థిక సంవత్సరంలో ‘సెక్షన్ 35’ కింద సర్టిఫికెట్ కోసం సీబీడీటీకి రవి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సర్టిఫికెట్ లభించిన సంస్థలకు డొనేషన్లు ఇస్తే... దాతలు ఆ మొత్తానికి 175 శాతానికి సమానమైన నగదుపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ దరఖాస్తు సీబీడీటీ వద్ద పెండింగ్ ఉండగానే రవి తనకు అనుమతి లభించినట్లు నకిలీ సర్టిఫికెట్ రూపొందించాడు. దీని ఆధారంగా మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్ల్లోని కొందరు వ్యాపారులతో కలిసి భారీ కుట్ర పన్నాడు. వారి నుంచి ఏటా డొనేషన్లు తీసుకుంటున్న రవి వాటిని కొన్ని షెల్ కంపెనీలకు మళ్ళిస్తున్నాడు. వాటి సహకారంతో ఆ మొత్తంలో 95 శాతం ‘దాత’లకే పంపించేస్తూ... 5 శాతం కమీషన్గా తీసుకుంటున్నాడు. ఇలా చేయడంతో ఆయా సంస్థలకు చెందిన ‘ఆన్లైన్ ధనం’ లిక్విడ్ క్యాష్గా మారి చేతికి వస్తోంది. అంతే కాకండా ఆ మొత్తంలో 175 శాతానికి సమానమైన నగదుకు ఆయా వ్యాపారులు ఐటీ మినహాయింపు పొందుతున్నారు. ఈ రకంగా 2015–16 నుంచి 2018–19 వరకు ఆ మూడు రాష్ట్రాలకు చెందిన వ్యాపారుల నుంచి మొత్తం రూ.41,74,38,000 డొనేషన్లు తీసుకున్న రవి వాటిలో 95 శాతం షెల్ కంపెనీల ద్వారా తిరిగి వారికే పంపాడు. ఇలా మొత్తమ్మీద ఆదాయపు పన్ను శాఖకు రావాల్సిన రూ.22.43 కోట్లకు గండి కొట్టడానికి సహకరించాడు. పరిశోధన చేస్తున్నట్లు ప్రకటించిన రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవహారాలపై ఆరా తీసిన ఐటీ అధికారులు వారికి అసలు ల్యాబొరేటరీ లేదని తేల్చారు. మరికొంత లోతుగా దర్యాప్తు చేయగా సెక్షన్ 35 సర్టిఫికెట్ నకిలీది సృష్టించారని, దీని ఆధారంగా మూడు రాష్ట్రాలకు చెందిన 200 మంది వ్యాపారులతో కలిసి భారీ స్కామ్కు పాల్పడి ఆదాయపు పన్నుకు గండి కొట్టినట్లు గుర్తించారు. దీంతో ఆ అధికారులు సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఏసీపీ ఎస్వీ హరికృష్ణ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. ప్రాథమిక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో గురువారం రవిని అరెస్టు చేసింది. ‘ఈ వ్యవహారంలో దాదాపు 200 మంది వ్యాపారులకు ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నాం. దీనిపై ప్రాథమిక ఆధారాలు లభించిన తర్వాత వారి పైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని ఏసీపీ హరికృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. -
ఆ సమయంలో నొప్పి రాకుండా ఉండాలంటే...
పీరియడ్స్ టైమ్లో నొప్పి రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిట్కాల గురించి తెలియజేయగలరు. ప్రైమరీ డిస్మెనోరియా అంటే ఏమిటి? –పీఎల్, ఒంగోలు పరీక్షలు ఏమి చేసినా, కారణాలేవీ లేకుండా, సమస్య ఏమీ లేకుండా పీరియడ్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి రావడాన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటారు. పీరియడ్ సమయంలో ప్రోస్టోగ్లాండిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వీటి ప్రభావం వల్ల రక్తనాళాలు కుంచించుకుని, గర్భాశయంలోని ఎండోమెట్రియమ్ పొరకి రక్తప్రసరణ తగ్గిపోయి బ్లీడింగ్ రూపంలో ఈ పొర ఊడిపోయి బయటకు వస్తుంది. అలాగే గర్భాశయం కుంచించుకుంటూ బ్లీడింగ్ను బయటకు పంపుతుంది. ఈ ప్రోస్టోగ్లాండిన్స్ విడుదలయ్యే మోతాదును బట్టి కొందరిలో ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో కొద్దిగా ఉంటుంది. కొందరిలో అసలే నొప్పీ ఉండదు. కొందరిలో గర్భాశయంలో గడ్డలు, ఎండోమెట్రియాసిస్, గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ వంటి ఎన్నో కారణాల వల్ల కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి ఉంటుంది. దీనిని సెకండరీ డిస్మెనోరియా అంటారు. కారణాన్ని బట్టి పీరియడ్స్ నొప్పికి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. నొప్పి అసలు రాకుండా ఉండటానికి జాగ్రత్తలు ఏమీ ఉండవు. కాకపోతే నొప్పి తెలియకుండా ఉండటానికి వాకింగ్, యోగా, ధ్యానం, వ్యాయామాలు వంటివి చేస్తూ మితమైన పోషకాహారం తీసుకుంటూ ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం మంచిది. పీరియడ్స్ సమయంలో రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం, ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, క్యాల్షియం, విటమిన్–బి, మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవడం, అల్లం, పసుపు, సోంపు, కొద్దిగా చెక్క వంటివి తీసుకోవడం, పొత్తికడుపుపై మసాజ్, వేడి కాపడం పెట్టడం, వేడినీళ్ల స్నానం చేయడం వంటి చిట్కాలను పాటించడం ద్వారా కూడా నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. నేను బ్యాంకు ఉద్యోగిని. సోషల్ సర్వీస్ అంటే ఇష్టం. అక్కడక్కడా గర్భిణి స్త్రీలను చూసినప్పుడు.... తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే అనుమానం వస్తుంటుంది. ప్రెగ్నెంట్గా ఉండి కూడా కూలీ పనులకు వెళుతున్న, ఎండలో బట్టలు ఉతుకుతున్న గర్భిణులను చూసినప్పుడు... నేనే చొరవ తీసుకొని వారి దగ్గరకు వెళ్లి ‘ఇలా చేయకూడదమ్మా’ అని చెబుతుంటాను. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పది ప్రధాన జాగ్రత్తల గురించి చెబితే... నేను వాటిని నిరక్షరాస్యులైన గర్భిణి స్త్రీలకు తెలియజేస్తాను. – ఆర్.శైలజరాణి, మంగపేట ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తలు: 1. గర్భ నిర్ధారణ జరిగిన వెంటనే డాక్టర్ను సంప్రదించి, వారి సలహాలను పాటించడం. 2. ఆహారంలో ఎక్కువగా ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, పలచని మజ్జిగ, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవడం. 3. ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం మాత్రలను తొమ్మిదినెలల పాటు తీసుకోవడం. దీని వల్ల రక్తహీనత లేకుండా తల్లి, బిడ్డ ఎముకలు గట్టిగా ఉండటానికి దోహదడుతుంది. 4. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా చెకప్లు, రక్తపరీక్షలు చెయ్యడం, మందులు ఇవ్వడం, గుడ్లు పాలు ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఏవైనా సమస్యలు ఉన్నా, వాటికి చికిత్స తీసుకోవచ్చు. 5. బ్లడ్ గ్రూప్, హీమోగ్లోబిన్, సుగర్, సీయూఈ, హెచ్ఐవీ, హెపటైటిస్, వీడీఆర్ఎల్ వంటి రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవడం వల్ల ముందుగానే రక్తహీనత, ఇన్ఫెక్షన్లు వంటివి ఉంటే చికిత్స తీసుకోవచ్చు. 6. డాక్టర్ దగ్గరికి సక్రమంగా చెకప్లకు వెళ్లి బరువు, బీపీ వంటివి చూపించుకోవడం. 7. బిడ్డలో అవయవ లోపాలు, ఆరోగ్యం తెలుసుకోవడానికి కనీసం ఐదవ నెలలో ఒకసారి, తొమ్మిదవ నెలలో ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం. 8. నెలలు నిండే కొద్దీ మధ్యాహ్నం ఒక గంట, రాత్రి ఎనిమిది గంటలు నిద్ర తప్పనిసరి. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల బిడ్డకి, తల్లికి కూడా రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది,. 9. నెలలు పెరిగే కొద్దీ బిడ్డ కదలికలు గమనించుకుంటూ, కదలికలు తెలియకపోయినా, యోని భాగం నుంచి నీరులా కారిపోవడం, బ్లీడింగ్ అవడం, కడుపులో నొప్పి, కాళ్లు బాగా వాచడం వంటి లక్షణాలు కనిపిస్తే, తొందరగా ఆస్పత్రికి వెళ్లడం. మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, ఆయాసం లేనంత వరకు పనులు చేసుకుంటూ ఉండటం వల్ల కాన్పు సులభంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. 10. కాన్పు ఇంట్లో కాకుండా ఆస్పత్రిలో అయ్యేలా చూసుకోవడం మంచిది. దీనివల్ల తల్లికి, బిడ్డకి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటమే కాకుండా, తల్లిలో అధిక రక్తస్రావం, హైబీపీ వంటి కాంప్లికేషన్లకు తగిన చికిత్స వెంటనే తీసుకోవడానికి వీలవుతుంది. దీనివల్ల తల్లీబిడ్డల మరణాల రేటును తగ్గుతుంది. తల్లీబిడ్డా క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు. నేను ప్రెగ్నెంట్. ఈమధ్య ఒక ఆర్టికల్లో preeclampisa డిసీజ్ గురించి చూశాను. ఇది తల్లి, బిడ్డలకు ఎందుకు వస్తుంది? మన దేశంలో కూడా ఈ సమస్య ఉందా? ఇది రాకుండా ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి? – కె.మమత, విశాఖపట్టణం గర్భిణి సమయంలో కొందరిలో బీపీ పెరిగి, అది కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది. దాని వల్ల మూత్రంలో ఆల్బుమిన్ ప్రొటీన్ ఎక్కువగా పోవడం జరుగుతుంది. ఈ సమస్యనే ‘ప్రీ ఎక్లామ్సియా’ అంటారు. ఇది ఎవరికి ఎందుకు వస్తుందనేది ముందుగా కచ్చితంగా చెప్పడం కష్టం. సాధారణంగా ఎక్కువ బరువు ఉన్నవారిలో, మరీ చిన్న వయసులో గర్భం దాల్చినా, లేటు వయసులో గర్భం దాల్చినా, కుటుంబంలో ఎవరికైనా బీపీ ఉన్నా, కొన్ని హార్మోన్లలో మార్పుల వల్ల, తల్లిలో రక్తనాళాలు సన్నబడటం వల్ల తల్లిలో బీపీ పెరగడం, అలాగే బిడ్డకు రక్తప్రసరణ తగ్గడం జరుగుతుంది. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే బీపీ బాగా పెరిగి, కిడ్నీ, లివర్, మెదడు వంటి ఇతర అవయవాలపై ప్రభావం చూపడం వల్ల తల్లిలో పీఐహెచ్, ప్రీ ఎక్లామ్సియా, తర్వాత ఎక్లామ్సియా (గుర్రపువాతం) అంటే ఫిట్స్ వంటి ప్రాణాపాయకరమైన కాంప్లికేషన్స్ ఏర్పడతాయి. ఇందులో బిడ్డ బరువు పెరగకపోవడం, బిడ్డ కడుపులోనే చనిపోవడం వంటివి జరగవచ్చు. ఒక్కోసారి నెలలు నిండకుండానే కాన్పు చేయాల్సి రావచ్చు. భారతదేశంలో 8–10 శాతం గర్భిణులకు ప్రీఎక్లామ్సియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇది రాకుండా జాగ్రత్త పడలేము కాని, సక్రమంగా డాక్టర్ దగ్గర బీపీ, బరువు చెకప్ చేయించుకుంటూ, బీపీ పెరుగుతుంటే దానికి సరిగా మందులు తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే, కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటే దానికి తగిన చికిత్స చేయడం, అలాగే కాన్పు ముందుగానే చెయ్యడం వల్ల తల్లికి ప్రాణాపాయం తప్పుతుంది. అధిక బరువు ఉన్నవాళ్లు ప్రెగ్నెన్సీ రాకముందే బరువు తగ్గడం, ప్రెగ్నెన్సీలో అధిక బరువు పెరగకుండా ఉండటం, కుటుంబంలో బీపీ చరిత్ర బాగా స్ట్రాంగ్గా ఉన్నా, ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీలో మూడవ నెల నుంచి ఎకోస్పిరిన్ మాత్రలను డాక్టర్ సూచించడం జరుగుతుంది. దీనివల్ల రక్తనాళాలు సంకోచించకుండా తల్లికి, బిడ్డకు సక్రమంగా రక్తప్రసరణ జరిగి, ప్రీఎక్లామ్సియా కాంప్లికేషన్స్ మరీ ఎక్కువ కాకుండా బయటపడే అవకాశం ఉంటుంది. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బోహైదర్నగర్ హైదరాబాద్ -
ఆటోవాలా.. సేవలు భళా..
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సేవ చేయాలనే తపన ఉంటే చాలు డబ్బు లేకున్నా ఎదుటి వారికి సహాయం చేయవచ్చని నిరూపిస్తున్నాడీ ఆటోవాలా. రోజస్తమాను ఆటో నడిపితే కేవలం ఇంటి ఖర్చులు, ఆటో నెలవారీ వాయిదా కట్టుకోవడానికే ఇబ్బందులు పడుతున్న ఈయన ఎదుటి వారికి సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదెలా అని అనుకుంటున్నారా? అయితే కాకినాడ వెళ్లాల్సిందే. ఆయన సేవాతర్పతను చూడాల్సిందే. కాకినాడ ఎస్ అచ్చుతాపురం మధురానగర్కు చెందిన చెల్లి సుబ్బారావు సుమారు ఎనిమిదేళ్ల క్రితం సెకండ్ షో సినిమా చూసి ఆటోపై ఇంటికి వెళుతున్న సయమంలో స్థానిక కరణంగారి సెంటర్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళ ఆవేదన చూసి చలించిపోయాడు. భార్య బాధ పడుతుంటే భర్త అతికష్టం మీద ద్విచక్రవాహనంపై ఆసుపత్రికి తీసుకెళ్తున దృశ్యం అతడి హృదయాన్ని చలింపజేసింది. అప్పటి నుంచి గర్భిణులకు, బాలింతలకు సేవ చేయాలని నిర్ణయించుకొన్నాడు. తన కుటుంబాన్ని పోషించుకునే ఆటోలోనే అత్యవసర సమయాల్లో వారిని ఉచితంగా ఆసుపత్రులకు తీసుకెళ్తున్నాడు. మరికొందరి సహాయంతో బాలింతలకు ఐదు కిలోల పాత బియ్యం, కేజీ నూనె, ఇతర వస్తువులు ఉచితంగాఅందిస్తున్నాడు. ఒక్క ఫోన్ చేస్తే చాలు ఆటో సిద్ధం.. అర్ధరాత్రయినా ఒక్క ఫోన్ చేస్తే గర్భిణులను ఉచితంగా ఆసుపత్రులకు చేర్చుతున్నారు. సుబ్బారావుతో పాటు ఇతర ఆటోసోదరులు కూడా ఫోన్ చేస్తే క్షణాల్లో స్పందిస్తూ ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ ఆటో సోదరులు ఉచితంగా గర్భిణులను ఆసుపత్రులకు తీసుకెళుతుంటారు. ఓ సంఘంగా ఏర్పడి.. గర్భిణులు చేస్తున్న సాయాన్ని చూసిన తోటి ఆటో సోదరులందరూ కలిసి చెల్లి సుబ్బారావు పేరిట ఉచిత సంక్షేమ సేవా సంఘాన్ని ఏర్పాటు చేశారు. 29 మంది సభ్యులుగా చేరి ప్రతినెలా కొంత మొత్తం సమకూర్చుతున్నారు. రెండు నెలలకోసారి కాకినాడ బోట్క్లబ్ ఆవరణలో సమావేశం నిర్వహించుకుని సంఘం అభివృద్ధికి చేపట్టాల్సి న సేవా కార్యక్రమాలపై చర్చిస్తారు. -
అభాగ్యులకు అండగా..
సేపూరి వేణుగోపాలాచారి – సాక్షి, కామారెడ్డి: ఖతార్లోని ‘ఇండియన్ కమ్యూనిటీ బెనెవలెంట్ ఫోరం’ (ఐసీబీఎఫ్) ఆ దేశంలో భారతీయులకు విశేష సేవలను అందిస్తోంది. అక్కడి భారత దౌత్య కార్యాలయం కింద ఒక ప్రత్యేక సంస్థగా ఐసీబీఎఫ్ పనిచేస్తోంది. దోహా తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై, కోర్టు కేసులు, మృతదేహాల తరలింపులో ఈ సంస్థ సహాయ సహకారాలను అందిస్తున్నది. 2006లో ప్రారంభమైన ఐసీబీఎఫ్ పలు సేవల్లో ఆదర్శంగా నిలిచింది. ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో, దుకన్, అల్కోర్లలో హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేయడం ద్వారా ఐసీబీఎఫ్ సేవలను విస్తరించింది. కొంత మంది ఏజెంట్ల, కొన్ని కంపనీల మోసాల బారిన పడినవారు తమ సమస్యలను ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసుకువెళ్తే ఎంబసీ సూచన మేరకు ఐసీబీఎఫ్ సంస్థ పనిచేస్తుంది. బాధితుల వివరాలు తెలుసుకుని ఆహారం, వసతి కల్పించడం, దాతల ద్వారా గానీ ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా గానీ వారికి సహకారం అందిస్తారు. ఐసీబీఎఫ్ సేవలు ఇలా.. ♦ ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఐసీబీఎఫ్ తగిన సేవలందిస్తోంది. ♦ నకిలీ ఏజెంట్ల మోసాలకు గురై ఇక్కడకు వచ్చిన తర్వాత కనీస సౌకర్యాలు లేని వారికి అండగా నిలుస్తుంది. మహిళా కార్మికులకు వసతులు, సౌకర్యాలను కల్పిస్తుంది. ♦ ఖతార్లో చనిపోయిన వ్యక్తులపై ఆధారపడి ఉన్నవారికి సహాయం అందిస్తుంది. ♦ కోర్టు కేసుల్లో ఇరుక్కున్న వారికి న్యాయపరమైన సహకారాన్ని సంస్థ సభ్యులు అందజేస్తారు. ♦ ఎవరైనా చనిపోతే వారి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించడం, డాక్యుమెంటేషన్, రవాణా ఏర్పాట్లు చూ స్తారు. అందుకు అయ్యే ఖర్చులను ఐసీబీఎఫ్ భరిస్తుంది. ♦ జైల్లో ఉండే భారత ఖైదీలకు అవసరమైన న్యాయ సహాయాన్ని అందజేస్తారు. ♦ భారత కార్మికులు నివసించే చోట్లలో ఉచిత వైద్య పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేయిస్తున్నారు. అవగాహన కల్పించాలి గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు, కల్పించే సౌకర్యాల మీద సరైన అవగాహన లేక ఎంతో మంది ఏజెంట్ల చేతుల్లో మోసాలకు గురవుతున్నారు. కంపెనీలు, ఉద్యోగాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చి సమస్యల బారిన పడిన వారికి మా సంస్థ తరఫున ఆదుకుంటున్నాం. ఇక్కడ నిబంధనలను కఠినంగా ఉంటాయి. ఇండియన్ ఎంబసీని సంప్రదించిన తర్వాతనే కంపెనీ వీసాలపై నమ్మకం తెచ్చుకోవాలి. అప్పుడే మోసాలకు గురికాకుండా ఉంటారు.– రజనీమూర్తి, ఐసీబీఎఫ్ ప్రతినిధి, ఖతార్ ఐసీబీఎఫ్ హెల్ప్ డెస్క్ నంబర్ +974 446 70060 (సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు).మొబైల్: +974 555 12810 -
పతంగులే ఆదర్శమంటున్న హైదరాబాద్ ‘కైట్స్’
సాక్షి, సిటీబ్యూరో : కొందరు పొద్దున లేచిన దగ్గర్నుంచీ ఏవేవో చేస్తుంటారు. ఎన్నెన్నో ఆస్వాదిస్తుంటారు. సమయం దొరికితే సమస్త విశ్వాన్ని చుట్టేద్దామన్నంత ఆరాటంతో ఉంటారు.మరికొందరేమో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా.. అన్న ప్రశ్నలకు ఆన్సర్లు రాసుకుంటూ గడిపేస్తుంటారు. ఇంతకన్నా మనం చేసేదేముందంటూ నిర్లిప్తత ప్రదర్శిస్తుంటారు. ఇదే మనకు అసలైన జబ్బు అంటోంది హైదరాబాద్ కైట్స్. అభిరుచుల్ని విస్తరించుకుంటే అప్పటి దాకా మన చుట్టూ ఉన్న ప్రపంచం అమాంతం మారిపోతోదంటోంది. మొత్తమ్మీద బతకడం కాదు జీవించడం నేర్చుకోమంటోంది. అభిరుచుల కలబోత.. ‘పాటలు పాడాలని కొందరు, ఆటలాడదాం అని మరికొందరు. సైక్లింగ్, రన్నింగ్లంటే మక్కువతో ఇంకొందరు. సేవాభిలాషతో, సాటి మనిషికి సాయం చేయాలనే తహతహతో ఎందరో. ఇలా మనలో చాలా మందికి ఏదో చేయాలని ఉంటుంది. సరైన మార్గదర్శకత్వం లేక ప్రోత్సాహం లేక ఏమీ చేయలేకపోతుంటాం. అలాంటి ఆలోచనల్ని సజీవంగా ఉంచడం, సాకారం చేయడమే మా ‘లక్ష్యం’ అంటున్నారు హైదరాబాద్ కైట్స్ నిర్వాహకుడు వసంత కార్తీక్. ఆరోగ్యార్థుల నుంచి ఆపన్నహస్తం అందించడం దాకా.. ప్రతి పనిలోనూ మేం మీకు తోడుంటాం అని హామీ ఇచ్చే సరికొత్త తరహా వేదికను ఆయన తన మిత్రబృందంతో కలిసి ఏర్పాటు చేశారు. ఇలాంటి అభిరుచులు ఉన్నవారిని ఒక దగ్గరకు చేర్చి వాటినిపరస్పరం పంచుకుంటూ ఆస్వాదించేలా చేస్తున్నారు. సేవతో మమేకం.. ఆరోగ్యమే మహాభాగ్యం అనే వాక్యాన్ని మనసారా నమ్మి దానికి అనుబంధంగానే తమ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఈ సంస్థ సాటి మనిషికి సేవ చేయడం కూడా చక్కని సంతృప్తిని మనకు అందిస్తుందని నమ్ముతోంది. దీనికి అనుగుణంగా పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ♦ ‘నగరానికి చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ పల్లవి‘కైట్స్’ను సంప్రదించి బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. గత డిసెంబర్ 22న నగరంలోని పలు ఏరియాల్లో 100 దాకా బ్లాంకెట్స్, ఫుడ్ ప్యాకెట్స్ కూడా అందించారు. ♦ నల్లగొండకు చెందిన నాలుగున్నరేళ్ల ఆయుషి బాలికకు లుకేమియా కేన్సర్ వచ్చింది. ఆ విషయం తెలిసి ఏమైనా హెల్ప్ చేయాలని ఆశించిన కొందరితో కలిసి గత ఏడాది ఏప్రిల్ 14న డ్యాన్స్ ఫర్ ఆయుషి పేరిట ఒక డ్యాన్స్ కమ్యూనిటీ సహకారంతో హైటెక్ సిటీ దగ్గరున్న ఫినిక్స్ ఎరినాలో ఈవెంట్ నిర్వహించారు. దీని ద్వారా రూ.3.50 లక్షలు వచ్చాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అప్పటి మంత్రి కేటీఆర్ ఆ అమ్మాయికి అవసరమైన చికిత్స చేయించారు. ఇప్పుడు ఆ పాప ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. ♦ పవన్ అనే 20 ఏళ్ల యువకుడు బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం బసవ తారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. సాయం అందించాలనుకున్నవారితో మ్యూజిక్ ఫర్ పవన్ అనే ఈవెంట్ చేశారు. దీని ద్వారా రూ.2లక్షలు, అంతర్జాతీయంగా అందిన సాయం ద్వారా మొత్తం రూ. 8 లక్షల దాకా అందించారు. ♦ కేరళ వరదల సమయంలో కేరళ మ్యూజికల్ బ్యాండ్కి చెందిన సందీప్ శర్మ తమ రాష్ట్రం కోసం ఈవెంట్ చేయండి అని అడిగతే వియ్ ఫర్ కేరళ పేరుతో ఓ ఈవెంట్ చేసి వచ్చిన మొత్తాన్ని అతనికి ఇచ్చి పంపారు అంటూ వివరించారు వసంత కార్తీక్. త్వరలోనే మరిన్ని విభిన్న కార్యక్రమాల ద్వారా నగరంలో అభిరుచుల ఆస్వాదనను ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మార్చాలనుకుంటున్నామని అంటోంది హైదరాబాద్ కైట్స్ బృందం. ♦ అదో ఔత్సాహికుల బృందం. మురికివాడల ప్రజలతో కలిసి గాలిపటాలు ఎగరవేస్తుంది. సిటీ లేక్లను కాపాడాలంటూ సందేశాన్నిస్తుంది. రన్ బాబా రన్ అంటూ ఈవెంట్స్ నిర్వహిస్తుంది. పరుగు తీస్తే అనారోగ్యం మనకు దూరంగా పరుగు తీస్తుందంటూ వెన్ను తడుతుంది. ఆటలైనా పాటలైనా.. అభిరుచి ఉంటే చాలు ఆనందం మీ వెంటే ఉంటుందని హామీ ఇస్తుంది. ‘కైట్స్’కు వసంత కార్తీకం.. ‘ఆరోగ్య జీవనశైలికి ముందుగా కావాల్సినవి చక్కని అభిరుచులు. వాటిని ఎంతగా సానబెట్టుకుంటే అంత ఆనందం, ఆరోగ్యం’ అనేది తన స్వానుభవం అని చెప్పే వసంత కార్తీక్.. తన ఆలోచనని అంగీకరించిన మరికొందరు కార్పొరేట్ ఉద్యోగులు, విభిన్న రంగాల ఔత్సాహికులతో కలిసి ‘కైట్స్’ను నిర్వహిస్తున్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో కొంత కాలంగా విభిన్న అభిరుచుల వారీగా ఏర్పాటైన దాదాపు 25 బృందాలను ఒక చోట చేర్చగలిగారు. ‘సరైన దశా దిశా లేని టాలెంటెడ్ పీపుల్కి వారికి ఉపకరించే పేషనేట్ కమ్యూనిటీస్ని పరిచయం చేస్తాం’ అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రగతినగర్లో ఉన్న ప్రగతి రన్నర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ మీద అవగాహన కల్పిస్తున్న ‘హైదరాబాద్ కైట్స్’ గత ఏడాది జనవరిలో కైట్స్ ఫెస్టివల్ నిర్వహించింది. ‘లేక్లను రక్షించుకోండి అనే సందేశంతో ఇబ్రహీం లేక్ దగ్గర పార్క్లో కుటుంబ సమేత పతంగుల పండగను నిర్వహించాం, ఎకో ఫిలిం ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశాం’ అని చెప్పారు వసంత కార్తీక్. త్వరలో జనవరి 22న హైటెక్స్లో వన్ నేషన్ వన్ డ్యాన్స్ అనే పేరుతో మరో ఈవెంట్ చేస్తున్నామని ఆయన వివరించారు. -
‘విస్తరిస్తున్న’ కార్పొరేట్ల సేవ
న్యూఢిల్లీ: ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించిన మాదిరిగానే భారత కార్పొరేట్లు తమ సామాజిక సేవా కార్యక్రమాలను సైతం విస్తరిస్తున్నారు. దీంతో సామాజిక సేవ, అభివృద్ధి కార్యక్రమాల కోసం వీరు వెచ్చిస్తున్న మొత్తం గణనీయంగా పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2017–18)లో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కార్యక్రమం కోసం చేసిన నిధుల వ్యయం 11% మేర పెరిగింది. రూ.10,030 కోట్లను ఇందుకు ఖర్చు చేయడం విశేషం. ఎన్ఎస్ఈలో లిస్ట్ అయిన 1,795 కంపెనీల్లో 1,080 కంపెనీల నిధుల వ్యయం ఆధారంగా ప్రైమ్ డేటాబేస్ గ్రూపు ఈ వివరాలను వెల్లడించింది. ఎన్ఎస్ఈ లిస్డెడ్ కంపెనీల సీఎస్ఆర్ నిధుల వ్యయం వార్షికంగా 16 శాతం చొప్పున గత మూడు సంవత్సరాల్లో వృద్ధి చెందినట్టు ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హాల్దియా తెలిపారు. పెరిగిన భాగస్వామ్యం సీఎస్ఆర్ చట్టం 2014 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. రూ.500 కోట్లకు పైగా నికర విలువ కలిగిన కంపెనీలు లేదా రూ.1,000 కోట్ల ఆదాయం ఉన్న కంపెనీలు లేదా రూ.5 కోట్ల నికర లాభం ఆర్జిస్తున్నవి తమ లాభాల్లో 2 శాతాన్ని (క్రితం మూడు సంవత్సరాల్లో సగటు లాభంపై) సీఎస్ఆర్ కోసం ఖర్చు చేయాలని చట్టం నిర్దేశిస్తోంది. 2017–18లో కంపెనీలు రూ.10,885 కోట్లను ఇందుకోసం ఖర్చు చేయాలనుకున్నాయి. చట్టప్రకారం చూస్తే వాస్తవంగా ఖర్చు చేయాల్సిన దానికంటే ఇది రూ.200 కోట్లు ఎక్కువ. అయితే, ఇందులో రూ.1,717 కోట్లు ఖర్చు చేయకుండా ఉండిపోయాయి. అయితే, అంతిమంగా సీఎస్ఆర్ కింద చేసిన వ్యయం రూ.10,030 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2016–17లో ఈ కార్యక్రమం కింద కార్పొరేట్ల నిధుల వ్యయాల మొత్తం రూ.9,060 కోట్లు. సీఎస్ఆర్ కింద నిధులు ఖర్చు చేసిన కంపెనీల సంఖ్య 2016–17లో 931గా ఉంటే (మొత్తం కంపెనీల్లో 92%), 2017–18లో వీటి సంఖ్య 1016కు (94%) పెరిగింది. అగ్రస్థాయి కంపెనీల వాటా అగ్రస్థాయి పది కంపెనీలు పెట్టిన ఖర్చే మొత్తం సీఎస్ఆర్ నిధుల వ్యయాల్లో 36.06 శాతంగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐవోసీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎన్టీపీసీ, టాటా స్టీల్, విప్రో అగ్ర స్థాయి పది కంపెనీలుగా ఉన్నాయి. మొత్తం మీద 59 శాతం కంపెనీలు నిధుల వ్యయాలను పెంచాయి. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన స్వచ్ఛ భారత్, క్లీన్ గంగా కార్యక్రమాలకు నిధుల కేటాయింపులు 10%, 47% చొప్పున తగ్గిపోయాయి. స్వచ్ఛభారత్కు 2016–17లో కార్పొరేట్ కంపెనీల వినియోగం రూ.581 కోట్లుగా ఉంటే, 2017–18లో రూ.521 కోట్లకు పరిమితమైంది. క్లీన్ గంగాకు కేటాయింపులు 2016–17లో ఉన్న రూ.151 కోట్ల నుంచి 2017–18లో రూ.80 కోట్లు తగ్గిపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపించిన 2015–16లో స్వచ్ఛభారత్ కార్యక్రమానికి నిధుల కేటాయింపులు రూ.1,009 కోట్ల మేర ఉన్నాయి. ఇతర కార్యక్రమాలకూ చేయూత కంపెనీల చట్టం 11 భిన్న షెడ్యూళ్లలో నిధుల వ్యయాలను తప్పనిసరి చేసింది. వీటికి అదనంగా కొన్ని కంపెనీలు అయితే సామాజికాభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, చిన్నారుల సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఖర్చు చేస్తుండటం అభినందించే విషయమే. 2017–18లో విద్యా సంబంధిత కార్యక్రమాలకు 38 శాతం నిధులు అందగా, హెల్త్కేర్కు 25 శాతం, అసమానతల నిరోధానికి 2 శాతం, జాతీయ వారసత్వ సంపదకు 4 శాతం, సాయుధ బలగాలకు 1 శాతం, క్రీడలు 2 శాతం నిధులు అందుకున్నాయి. -
ముగ్గురు విజేతలు
విజి పేన్కూట్టు, రాహీబాయి, మీనా గయేన్.. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైన, స్ఫూర్తిదాయకమైన’ మహిళలుగా బీబీసీ తయారు చేసిన తాజా వందమంది జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ ముగ్గురు భారతీయ స్త్రీలు తమ శక్తికి మించిన ప్రయత్నాలతో వివిధ సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టి సమాజానికి ఆదర్శంగా నిలిచారని బిబీసీ ప్రశంసించింది. రైట్ టు సిట్ విజి పేన్కూట్టు.. వయసు యాభైఏళ్లు. వృత్తి టైలరింగ్. 22 ఏళ్ల వయసులో సామాజిక సేవ మొదలుపెట్టారు. ఘనత.. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలకు మెరుగైన పని పరిస్థితులు కల్పించడం కోసం పోరాడారు. దాదాపు నాలుగేళ్ల ఉద్యమం తర్వాత ఆమె ఘోష విన్నది కేరళ ప్రభుత్వం ఆ మేరకు చట్టాన్ని సవరించింది. అంతేకాదు ఆడవాళ్లు పనిచేస్తున్న ప్రతి షాపులో వాళ్లు కూర్చోవడానికి వీలుగా కుర్చీలను ఏర్పాటును తప్పనిసరి చేసింది. విజి చేపట్టిన ఉద్యమం పేరు ‘రైట్ టు సిట్’. ‘‘బీబీసీ జాబితాలో నా పేరుండడం నిజంగా సంతోషాన్నిస్తోంది. రైట్ టు సిట్ అనేది కేవలం మనదేశంలోని సమస్యే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేల్స్గర్ల్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం’’ అంటుంది విజి పేన్కూట్టు. సీడ్ మదర్ రాహీబాయి.. స్వస్థలం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా, కోంభాల్నే గ్రామం. వృత్తి రైతు. ఘనత.. ఆగ్రో– బయోడైవర్సిటీలో సెల్ఫ్ మేడ్ ఎక్స్పర్ట్. వరిలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధిస్తూ ఆదర్శరైతుగా నిలిచింది. తన పొలంలో సొంతంగా నీటి సంరక్షణా నిర్మాణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీంతో రెండెకరాల బంజరుభూమిని మాగాణిగా మలచుకుంది. ఆ నేలలో కూరగాయలను పండిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. విత్తన భాండాగారాన్నీ స్థాపించి రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తోంది. ఇదిగాక విత్తనాల ఎంపిక, నేల సారాన్ని వృద్ధిపరుచుకోవడం, ఎరువుల వాడకం వంటివాటిపై రైతులకు, వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు శిక్షణనూ ఇస్తోంది. ఈ కృషికి ‘ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్’ సంస్థ ఆమెను ‘సీడ్ మదర్’ అనే బిరుదుతో సత్కరించింది. భగీరథి మీనా గయేన్.. పశ్చిమ బెంగాల్ వాస్తవ్యురాలు. ఘనత.. సుందర్బన్స్లోని మహిళలందరినీ ఏకం చేసి ఆ ప్రాంతంలో రహదారులను నిర్మించింది. చుట్టూ నదులతో శాశ్వత రహదారులకు అనుకూలంగా లేని ప్రదేశం సుందర్బన్స్. అలాంటి చోట అక్కడి గ్రామాల స్త్రీలనందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చి పర్మినెంట్ రోడ్లను నిర్మింపచేసి అభినవ భగీరథిగా కీర్తిగాంచింది రాహీబాయి. అందుకే బీబీసీ ఆమెను మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ఇన్సిపైరింగ్ ఉమన్గా గౌరవించింది. -
సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్: యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ సోషల్ సర్వీస్ స్వాతి, విజయ్
-
‘లైఫ్ ఈజ్ ఆన్’తో సమంత..
సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ.. మంచి మనసున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు సమంత. ఇటీవలె రంగస్థలం, మహానటి, అభిమన్యుడు లాంటి వరుస హిట్లతో దూసుకెళ్తోన్నారు. సమంత నటిగా ఎంత బిజీగా ఉన్నా.. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమంత పొనాక్ సంస్థను శుక్రవారం సందర్శించారు. ‘లైఫ్ ఈజ్ ఆన్’ అనే స్లోగన్తో.. వినికిడి లోపం ఉన్న పిల్లలకు సహాయం అందించేందుకు కృషి చేస్తోందీ సంస్థ. వినికిడి లోపం గుర్తించే శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 36 శాఖలున్నాయని తెలిపారు. సమంత చేతుల మీదుగా ఓ పదిమంది చిన్నారులకు వినికిడి యంత్రాలను అందించారు. పొనాక్ సంస్థకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సమంత అన్నారు. -
సమాజ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర కీలకం
యైటింక్లయిన్కాలనీ(రామగుండం) : సమాజ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర కీలకమని ఆర్జీ–2 జీఎం వజ్జల విజయబాబు, గోదావరిఖని టూటౌన్ సీఐ చిలుకూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం యైటింక్లయిన్కాలనీ షాపింగ్ కాంప్లెక్స్లో ఆధునీకీకరించిన ప్రెస్భవన్ ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం, ప్రజలు, యాజమాన్యం, ఉద్యోగుల మధ్య పత్రికలు వారధిగా పనిచేస్తున్నాయన్నారు. పాజిటివ్ ఆలోచనలతో పాత్రికేయులు ముందుకు సాగి నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. సమాజంలో నిత్యం జరుగుతున్న కార్యక్రమాలు, సంఘటనలు ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయులు ముందున్నారని కొనియాడారు. సింగరేణి సంస్థ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కార్మిక కుటుంబాలకు చేరవేడంతో పాటు విలువైన సూచనలు సలహాలు అందించాలన్నారు. సంస్థలో జరుగుతున్న ఘటనలు, ముఖ్యమైన విషయాలపై యాజమాన్యం వివరణ తీసుకుని వార్తను మరో కోణంలో కూడా చూడాలని సూచించారు. ఈసందర్భంగా జీఎం విజయబాబు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రెస్భవన్ను ప్రారంభించారు. ప్రెస్భవన్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ఎస్ఓటూ జీఎం రవీందర్, గోదావరిఖని ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వంశీ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, డీజీఎం సివిల్ రామక్రిష్ణ, పర్సనల్ ఎన్వీరావు, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, ప్రెస్భవన్ కార్యదర్శి వర్ధినేని సుధాకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆర్జీ–2 జీఎం విజయబాబు, ఎస్ఓటూ జీఎం రవీందర్ను పాత్రికేయులు శాలువాతో సన్మానించి జ్ఞాపికలను బహూకరించారు. -
ఉద్యమ నాయకుడు : బండా ప్రకాష్
సాక్షి ప్రతినిధి, వరంగల్ :జిల్లా ప్రజలకు సూపరిచితులైన సామాజిక వేత్త, విద్యావేత్తగా పేరొంది న బండా ప్రకాష్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు అయ్యారు. 1969 ఉద్యమం నుంచి ప్రజా జీవితంలో మమేకమయ్యారు. చదువు వద్దంటూ అజ్ఞాతంలోకి వెళ్లారు... తిరిగి వచ్చి డాక్టర్ పట్టా పొందారు. అజ్ఞాతాన్ని వీడినా.. సామాజిక సృహ కోల్పోలేదు. సేవా కార్యక్రమాలు కొనసాగించారు. ఇటీవల రాజ్య సభకు ఎన్నికయ్యారు. తన జీవన ప్ర స్థానంలో ముఖ్య అంశాలను ‘సాక్షి’తో ఆయన పంచుకున్నారు. బండా ప్రకాష్ ఆమంటున్నారో ఆయన మాటల్లోనే.. ఉద్యమ నేపథ్యం 1969లో పదో తరగతిలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. 1970లో జరిగిన ఎన్నికల్లో ప్రజా సమితి పార్టీ తరఫున ప్రచారంలో ఉదృతంగా పాల్గొన్నాను. సీకేఎం కాలేజీలో డిగ్రీలో చేరిన తర్వాత వామపక్ష భావజాలం వైపు ఆకర్షితుడినయ్యాను. ఆర్ఎస్యూ వ్యవస్థాపకుడిలో ఒకడిగా ఉన్నాను. అప్పుడు ఉస్మానియాలో విద్యార్థి నాయకుడుజార్జిరెడ్డి హత్యకు నిరసనగా వరంగల్లో భారీ ర్యాలీ నిర్వహించాను. ఆ రోజుల్లో హైకోర్టు జడ్జిగా ఉన్న వ్య క్తిని ఉస్మానియా వర్సిటీకి వైస్ చాన్స్లర్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ పరీక్షలు బహిష్కరించాం. ఓ ర కంగా డిగ్రీ చదివే రోజుల్లో సీకేఎం కాలేజీని ఉద్యమా ల అడ్డాగా మార్చేశాం. అప్పటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావు సీకేఎం కాలేజీకి వస్తున్నారని తెలుసుకుని వరవరరావును జైలు నుంచి విడుదల చేయాలంటూ హోరెత్తించాం. దీంతో మమ్మల్ని కాలేజీలో నిర్బంధించారు. చుట్టూ పోలీసులు ఉన్నా రు. వీళ్లందరినీ ఛేదించుకుంటూ కాలేజీ గేటు దగ్గరికి వచ్చి సబ్జైలు–దేశాయిపేట అని రాసి నిరసన తెలి పాం. సుమారు మూడు సార్లు కాలేజీ నుంచి తొలగి స్తే.. కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం. ఈ ఉద్యమాలు చేస్తూనే డిగ్రీ మధ్యలో వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లాను. కొండపల్లితో అనుబంధం అజ్ఞాతంలో ఉన్నప్పుడు కొండపల్లి సీతారామయ్యతో ఎనిమిది నెలలు కలిసి పని చేశాను. హైదరాబాద్లో పార్సిగుట్ట, రాంనగర్ ఏరియాల్లో ఒకే ప్రాంతంలో కలిసి ఉన్నాం. ఆ సమయంలో కొండపల్లి చెప్పే పొలిటికల్ క్లాసులు శ్రద్ధగా వినేవాన్ని. సీతారామయ్యకు సమాచారం చేరేవేసే పని ఎక్కువగా నేనే చేసేవాడిని. 1977లో నాగ్పూర్లో జరిగిన ప్లీనరీకి వెళ్లాను. ఆ ప్లీనరీకి గణపతి, మల్లావఝల కోటేశ్వరరావు వచ్చారు. తర్వాత కాలంలో వాళ్లు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. వామపక్ష సాహిత్యంలో కృష్టా జిల్లాలో జరుగుతున్న సంస్కరణ పోరాటాలకు పెద్దపీట వేస్తూ తెలంగాణ సాయుధ పోరాటానికి తగిన ప్రా«ధాన్యం ఇవ్వకపోవడాన్ని ఆ ప్లీనరీలో నిరసించాను. ఎమర్జెన్సీ తర్వాత అజ్ఞాతం నుంచి బయటకు వచ్చాను. మేనమామ మాటలతో.. ‘గొప్పగొప్ప వాళ్లు జైలులో ఉంటూ చదువుకున్నారు. గొప్ప పుస్తకాలు రాశారు. నువ్వు కూడా ప్రపంచ చరిత్ర ను అధ్యయనం చేయి. చదువు ఆపొద్దు’ అంటూ మేనమామ చెప్పిన మాటలు నాపై గొప్ప ప్రభావం చూ పించాయి. దీంతో ఆజ్ఞాతం నుంచి బయటకు రాగానే తిరిగి డిగ్రీలో జాయిన్ అయ్యాను. మావో సేటూంగ్ను పూర్తిగా అధ్యయనం చేశాను. ప్రపంచ చరిత్ర చదివా ను. విప్లవ సాహిత్యం విరివిగా చదివాను. కమ్యునిస్టు మెనిఫెస్టో, దాస్ కాపిటల్, అమ్మ, ఏడుతరాలు వంటి పుస్తకాలు చదివాను. ఇదే స్ఫూర్తితో ఎంఏలో గోల్డ్మెడల్ సాధించాను. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. గ్రామీణాభివృద్ధిపై పీహెచ్డీని పూర్తి చేశాను. రాజకీయాల్లోకి.. 1981లో ఏంఏ థర్డ్ సెమిస్టర్లో ఉండగా నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గాజుల జనార్దన్పై ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిచాను. అప్పుడు కాంగ్రెస్లో ఉన్న రెండు గ్రూపుల కారణంగా నాతో పాటు గెలిచిన 16 మంది ఇండిపెండెంట్లతో కలిసి కాంగ్రెస్లో చేరి వైస్ చైర్మన్ పదవి చేపట్టాను. పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లను ఆధారాలతో పట్టించి మూడేళ్లు బ్లాక్లిస్టులో పెట్టాను. ఆ తర్వాత కేయూ, ‘కుడా’ పాలకమండలి సభ్యుడిగా పని చేశాను. 1996 నుంచి 2001 వరకు జయశంకర్ సార్తో కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టాను. సామాజిక దృక్పథం.. అజ్ఞాతంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించి అన్నం పెట్టింది, చేతికి డబ్బులు ఇచ్చింది సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలే. అందువల్లే ఎక్కడ ఉన్నా సామాజిక సృహతోనే పని చేశాను. కార్మిక నాయకుడిగా ఆజాంజాహి మిల్లు పరిరక్షణ కోసం ప్రయత్నించాను. కాంగ్రెస్లో ఉంటూనే ముదిరాజ్ మహాస భ పేరుతో ముదిరాజ్లను సమీకరించి తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యేలా శ్ర మించాను. సకల జనుల సమ్మె,లో కీలక పాత్ర పోషించాం. తెలంగాణ వచ్చాక అభివృద్ధిలో ముదిరా జ్ల వాటా కోసం ప్రయత్నించాం. మత్స్యకారుల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం. -
నమస్తే.. మేడమ్!
ప్రస్తుతం శోభనా రనాడే పుణె శివాజీనగర్లో ఉన్న హెర్మన్ జమైన్ సోషల్ సెంటర్ తరఫున వీధి బాలలకు చదువు, పోషకాహారం, ఆరోగ్యం, కౌన్సెలింగ్, పునరావాసం కల్పిస్తున్నారు. ఎందరో మహిళలకు ఆమె జీవితం ఒక చక్కని పుస్తకం. ప్రతి పేజీలోనూ ఆమె సంతకం ఉంటుంది. ఆ సంతకం వెనుక గాంధీజీ ఆశయాల స్ఫూర్తి ఉంటుంది. అణగారిన వర్గాల మహిళల ఉన్నతి కోసం పాటుపడిన జీవితం ఉంటుంది. ఆమే.. శోభనా రనాడే. అత్యున్నత పద్మభూషణ్ అందుకున్నారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ను దక్కించుకున్నారు. ఇప్పుడు ‘జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్’ కు నామినేట్ అయ్యారు. ఈ 93 ఏళ్ల వయసులోనూ సమాజసేవలో తరించాలని తపించిపోతున్నారు. ప్రధానంగా గిరిజన బాలికలు, మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. గాంధీజీని కలిశారు శోభనా రనాడే సుమారు 50 ఏళ్లుగా సామాజిక సేవలో ఉన్నారు. తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఆవిడ మనసు ఆర్ద్రతతో నిండిపోయేది. ఎంతో మంది మహిళలు, బాలలు నిరక్షరాస్యులుగా ఉండటం ఆమెను కలిచివేసేది. వీధిబాలలు తిండి కోసం కుక్కలతో పోట్లాడటం, మహిళలు అత్యాచారాలకు గురికావడం చూసి ఆమె హృదయం ద్రవించిపోయేది. వాళ్లకేదైనా చేయాలని సంకల్పించుకుంది. çపుణె అగాఖాన్ గాంధీ మెమోరియల్ సొసైటీలో, నేషనల్ ట్రయినింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమన్లో పని చేసిన అనుభవం ఆమె సంకల్పానికి బలం చేకూర్చింది. మొదట 1942లో తన 18వ ఏట, శోభన పుణెలోని అగాఖాన్ ప్యాలెస్లో మహాత్మాగాంధీని స్వయంగా కలిశారు. వినోభాతో నడిచారు 1955లో శోభన లక్ష్యసాధనకు ఒక మార్గం దొరికింది. అస్సాంలోని ఉత్తర లఖింపూర్కి వినోబాభావేతో కలసి పాదయాత్ర చేయడానికి వెళ్లారు. అప్పుడు ఆమె వయసు 31. ఆ పరిసరాలలో నివసిస్తున్న అనాథ బాలలను చూసి, వారి కోసం అక్కడ ఏదైనా ఒకటి ప్రారంభించాలనుకున్నారు. ముప్పై మంది పిల్లలతో శిశునికేతన్ ప్రారంభించారు. వారికి చదువు నేర్పడంతో పాటు, సకల సౌకర్యాలు కల్పించారు. ఆమెలోని సేవా భావం చూసిన కొందరు సంపన్నులు, శిశు నికేతన్ నిర్వహణ కోసం చందాలు ఇచ్చి, ఒక ట్రస్ట్ ఏర్పాటుచేశారు. నేటికీ ఆ సంస్థ ఎంతో చక్కగా నడుస్తోంది. అక్కడ ఉండగానే, డిగ్బోయ్ జిల్లాలో మొట్టమొదటి బాలల సంక్షేమ పాఠశాల ప్రారంభించారు శోభన. గిరులలో తిరిగారు అస్సాంలో కొన్నేళ్లు ఉండి నాగాలాండ్ వెళ్లారు శోభన. అక్కడ కూడా సేవా కార్యక్రమాలను కొనసాగించారు. ‘ఆదిమజాతి సేవా సంఘ్’ నెలకొల్పి నాగా గిరిజన మహిళలకు అల్లికలలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. కోహిమాలో ఖాదీ భాండార్ ప్రారంభించి, గిరిజన మహిళలు రూపొందించిన వస్తువులను విక్రయించారు. అక్కడ ఉంటూనే, అరుణాచల్ ప్రదేశ్లో మహిళా సాధికారత కోసం పాటుపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలలోని వెనుకబాటుతనాన్ని కళ్లారా చూసిన శోభన వారి అభ్యున్నతికి తన వంతుగా కృషి చేశారు. తర్వాత పుణె తిరిగి వచ్చారు. నేర్పించారు.. నిలబెట్టారు శోభన పుణెలోని పురందర్ తాలూకా సస్వాద్లో ఉన్న కస్తూర్బా గాంధీ నేషనల్ ట్రస్ట్కి ట్రస్టీగా కూడా వ్యవహరించారు. ఈ ట్రస్ట్ పదకొండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అందులో ఆరు ఎకరాలు వ్యవసాయానికి కేటాయించారు శోభన. మిగిలిన ఐదు ఎకరాలలో ఆశ్రమానికి సంబంధించిన రకరకాల కార్యక్రమాలు నిర్వహించేవారు. అందులోనే, బాలగృహలో 40 మంది మహిళలకు ఆవాసం ఏర్పాటు చేసి, భోజన వసతి కల్పించి, ఉపాధి విద్యలు నేర్పించారు. ఆశ్రమంలోనే ఓ మూల కూరలు పండించేలా ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు, వృత్తి విద్యలలోనూ, గ్రామీణ పరిశ్రమలలోను అక్కడి మహిళలకు శిక్షణ ఇప్పించారు. టైలరింగ్, పిండి రుబ్బటం, పిండి వంటలు తయారుచేయటం, నగలు తయారుచేయటం నేర్పించారు. వీటి ద్వారా ఈ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారు. వారి కాళ్ల మీద వారు నిలబడ్డారు. – రోహిణి (జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్ అందించిన వివరాల ఆధారంగా) -
మనసున్న పోలీస్
పోలీసులను విమర్శించే వారు అతడి గురించి తెలుసుకుంటే మరోసారి నిందలేయరు. పోలీసు యూనిఫాం గర్వపడేలా అరుదుగా కనిపించేవారిలో చిత్తూరు నగరానికి చెందిన కరుణాకరన్ ముందు వరసలో ఉంటారు. అందరూ కందా అని పిలుచుకునే ఈయన పెద్ద మనసున్న పోలీసు. అనాథ శవాలను మోస్తుంటారు. అభాగ్యులకు అన్నం పెడుతుంటారు. అంత్యక్రియలకు షెడ్లు కట్టిస్తారు. నమ్మిన దైవం కోసం గుడి కట్టిస్తారు. సంపన్నుడేమీకాదు. ఓ సాధారణ కానిస్టేబుల్ మాత్రమే. చిత్తూరు అర్బన్: చిత్తూరులో కరుణాకరన్ పేరు చెబితే తెలియనివాళ్లు ఉండరు. ప్రభు త్వాస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, ఆశ్రమాల్లో, మున్సిపల్ కార్యాలయం, నాగాలమ్మగుడి వద్ద ఈయన పేరు చాలా ఫేమస్. చేసేది పోలీస్ ఉద్యోగమే. ఆర్ముడు రిజర్వు (ఏఆర్)లో పనిచేస్తుండడంతో జనరల్ డ్యూటీ, బందోబస్తు విధులే ఎక్కువగా ఉంటాయి. నగరంలో అనాథశవం కనిపించినా కరుణాకరన్ 9391665281కు ఫోన్ వస్తుంది. డ్యూటీ మధ్యలోనే వెళ్లాల్సి వస్తే ఏ ఒక్క అధికారీ అడ్డుచెప్పరు. చివరకు ఎస్పీ అయినా సరే భుజం తట్టి ప్రోత్సహిస్తుంటారు. తాను తయారు చేయించిన బండిలో మృతదేహాన్ని ఉంచి డప్పుల వాయింపులు.. టపాసులు పేలుస్తూ ఆడుతూ పాడుతూ అంత్యక్రియలు చేసేస్తారు. 28 ఏళ్లుగా అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తూనే ఉన్నాడు. తొమ్మిది నెలలుగా ప్రతిరోజూ మధ్యాహ్నం అనాథలు, అభాగ్యులకు ఉచితంగా భోజనం పెడుతున్నారు. ఆయన తల్లి, భార్య వంటచేసి అనాథలకు కడుపునిండా అన్నం పెడతారు. పెట్టడమే కాదు వీరితో పాటు కూర్చుని కుటుంబం మొత్తం ఇదే భోజనం తింటారు. ఇక సంతపేటలో తాను నమ్మినదైవం నాగాలమ్మకు చిన్నపాటి గుడికట్టించడం, ఉత్తర క్రియలు (దినాలు) చేసుకోవడానికి ఓ షెడ్డును ఏర్పాటు చేసి అందరికీ ఉచితంగా ఇవ్వడం కరుణాకరన్కు మాత్రమే సాధ్యమైన విజయాలు. తన సుదీర్ఘ పయనానికి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు మధుబాబు, గుప్త, ధనలక్ష్మి, దైవశిఖామణి, భద్ర, రవీంద్రారెడ్డి అండగా నిలు స్తున్నారు. ఇంట్లో అడ్డుచెప్పరు.. అమ్మ ఇంద్రాణి. నాన్న రాధాకృష్ణ. సంతపేటలో ఓ చిన్న టీ అంగడి పెట్టుకుని రాధాకృష్ణ తన ఐదుగురు పిల్లల్ని పోషించేవారు. ఇందులో కంద (కరుణాకరన్) చివరివాడు. నాన్న టీ వేస్తూ ఉంటే స్కూల్కు వెళ్లొచ్చిన తర్వాత టీ అంగడి వద్దే ఎక్కువ సమయం గడిపేవాడు. 1980వ దశకంలో చుట్టుపక్కల ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని తాకడానికి ఎవరూ ముందుకొచ్చేవారుకారు. ఎవరూ లేకుంటే మున్సిపాలిటీ వారొచ్చి చెత్త ట్రాక్టర్లో శవాన్ని వేసుకుని వెళ్లిపోయేవారు. కరుణాకరన్ అప్పట్లో చూసిన ఈ ఘటనలు మనసులో బలమైన ముద్ర వేశాయి. వయస్సు 20 ఏళ్లు చుట్టుపక్కల వాళ్లు ఎవరైనా చనిపోతే శ్మశానం వరకు వెళ్లి పిడికెడు మట్టివేయడం అలవాటయ్యింది. అలా చేస్తే ఏదో తెలియని ఆనందం. మృతదేహాన్ని మోస్తూ కాటికి తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్న వారిలో మార్పు తీసుకురావాలనుకున్నాడు. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు ఎక్కడ ఎవరు చని పోయినా మంచి బట్టలు వేసుకుని శుభ్రంగా రెడీ అయ్యి వెళ్లడం, అందరి కంటే ముందు మృతదేహాన్ని మోస్తూ వెళ్లడం చేశాడు. ఎవరో చదువుకున్న కుర్రాడిలా ఉన్నాడు.. చూడ్డానికి బాగానే ఉన్నాడు. ఇతనే శవాన్ని మోస్తుంటే మనకేంటీ అనే ఆలోచన ఒక్కొక్కరి నుంచి అందరికీ అనిపిస్తూ సామాజిక మార్పును తెచ్చింది. ఇంటర్ వరకు చదివి 24 ఏళ్లకే పోలీస్ కానిస్టేబుల్గా సెలక్ట్ అయ్యాడు కంద. అమ్మా నాన్న చాలా ఆనందపడ్డారు. ఆ మరుసటి ఏడాది నాన్న చనిపోయాడు. ఏడాది తర్వాత దేవితో కందకు పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు. అమ్మాయి జ్యోతిప్రియ డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ తనకొచ్చే జీతంలో 25 శాతం పేదల కోసం ఖర్చుచేయమని నాన్నకు పంపుతుంటుంది. కొడుకు సాయి ధనుష్. ఇతను నగరంలోని ఓ కంపెనీలో పనిచేస్తూ నెలకు రూ.3 వేలు అక్కలాగే సేవా కార్యక్రమానికి ఇచ్చేస్తుంటాడు. తానూ ఇందులో భాగమై అభాగ్యులకు వంటచేసి పెట్టి, వారి ఆకలి తీరుస్తుండటం భార్య దేవికి సంతోషం కలిగి స్తోంది. పిల్లల భవిష్యత్తు కోసం నాలుగు రూపాయలు దాచి ఉంచారా అని అడిగితే.. అందరికీ పెట్టడం మాత్రమే తెలిసిన తమకు ఎత్తిపెట్టుకోవాలనే ఆలోచన ఏనాడు రాలేదని చెబుతున్నాడీ మనసున్న పోలీసన్న. ఆ రోజు కంట నీళ్లు.. 18 ఏళ్ల క్రితం ఓ అనాథ శవానికి అంత్యక్రియలు చేయాలని కబురొచ్చింది. జేబులో రూపాయి కూడా లేదు. స్నేహితుడొకడి ఇంటికి వెళ్లాడు. రూ.400 అప్పు ఇమ్మన్నాడు. ఎందుకని అడిగితే విషయం చెప్పాడు. అప్పు ఇచ్చినా కరుణాకరన్ చర్యల్ని వ్యతిరేకించాడు. దీంతో మూడు రోజుల తర్వాత డబ్బులు తిరిగిచ్చేసి ఆ స్నేహానికి ఓ దండం పెట్టి మరీ వచ్చేశాడు. -
కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ శిబిరం
నిర్మల్టౌన్ : జ్ఞాన సరస్వతీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్మల్రూరల్ మండలంలోని అనంతపేట్ గ్రామంలో చేపట్టిన ఎన్ఎస్ఎస్ శిబిరం ఆదివారం నాటికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశారు. అలాగే మురికినీరును శుభ్రం చేశారు. ఇందులో సర్పంచ్ చింతకింది నర్సయ్య, ఎంపీటీసీ దాసరి పంతులు, వీడీసీ మెంబర్ భీమన్న, కళాశాల ప్రిన్సిపాల్ దత్తాద్రి, అధ్యక్షుడు తుల భోజన్న, అధ్యాపకులు, విద్యార్థులున్నారు. -
12వ ప్రణాళిక మొత్తం పెట్టుబడి ఎంత?
12వ ప్రణాళిక (2012 -2017) 12వ ప్రణాళికలో సమ్మిళిత వృద్ధిని సాధించడానికి కింద పేర్కొన్న అంశాలను ముఖ్య సాధనాలుగా చెప్పవచ్చు. వ్యవసాయ రంగంలో పనితీరును మెరుగుపర్చడం. పారిశ్రామిక రంగంలో ఉద్యోగ అవకాశాల కల్పనను వేగవంతం చేయడం. వ్యవస్థాపన సౌకర్యాలను విస్తృత పర్చడం. ఆరోగ్యం, విద్యా నైపుణ్యాల అభివృద్ధి. లాభదాయకంగా లేని లేదా వెనుకబడిన ప్రాంతాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక పథకాలను ప్రారంభించడం. పేదలకు ఉద్దేశించిన పథకాల ప్రభావాన్ని మెరుగుపర్చడం. వృద్ధి లక్ష్యాలు 11వ ప్రణాళికలో నిర్ణయించిన 9శాతం వృద్ధిరేటునే ఈ ప్రణాళికలోనూ కొనసాగించడం. 9.5 శాతం సగటు వృద్ధిరేటును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ లక్ష్యానికి అనుకూలంగా ఉండేలా వివిధ రంగాల్లో వృద్ధిరేటు ను నిర్ణయించారు. ప్రణాళిక పెట్టుబడి 12వ ప్రణాళిక మొత్తం పెట్టుబడి - రూ. 80,50,124 కోట్లు కేంద్రం వాటా - రూ.43,33,739 కోట్లు రాష్ట్రాలు అందజేసిన పెట్టుబడి - రూ. 37,16,385 కోట్లు. మొత్తం = రూ. 80,50,124 కోట్లు లక్ష్యాలు విద్యుత్ ఉత్పత్తి: 82,000 మెగావాట్లకు పెంచాలని నిర్దేశించారు. ఉన్నత విద్య: 2016-17 నాటికి 18 నుంచి 25 శాతం, 2020 నాటికి 30 శాతానికి పెంచాలి. జీడీఎస్ : 36.2 శాతానికి పెంచాలి. (11వ ప్రణాళికలో 34 శాతం) జీడీఐ : 38.7 శాతం (11వ ప్రణాళికలో 36.4 శాతం) {దవ్యోల్బణం: 4.5 నుంచి 5 శాతం మధ్యలో ఉంటుందని ఆశించారు. (11వ ప్రణాళి కలో 6 శాతం) మూలధన ఖాతాలో మిగులు: 5 శాతం ఉండాలని నిర్దేశించుకున్నారు. (11వ ప్రణాళికలో 3.8 శాతం) పేదరికం 10 శాతం తగ్గించాలి. 50 మిలియన్ల ఉద్యోగాలు వ్యవసాయేతర రంగాల్లో కల్పించాలి. శిశు మరణాలు: 50నుంచి 25కు తగ్గించాలి. ఎంఎంఆర్:254 నుంచి 100కు తగ్గించాలి. (వేయికు ఒకటి తగ్గించాలి/లక్షకు 100) టీఎఫ్ఆర్: ప్రత్యుత్పత్తి రేటును 2.9 నుంచి 2.1కు తగ్గించాలి. {స్తీ-పురుష నిష్పత్తి (0-6సం): 950కి పెంచాలి. జీడీపీలో అవస్థాపన వ్యయం 9 శాతానికి పెంచాలి. స్థూల సాగుభూమిని 90 మిలియన్ హెక్టార్ల నుంచి 103 మిలియన్ హెక్టార్లకు తీసుకురావాలి. విద్యుత్ నష్టాలను 20 శాతానికి తగ్గించాలి. గ్రామ టెలి సాంద్రతను 70 శాతానికి పెంచాలి. ఏటా ఒక మిలియన్ హెక్టార్ భూమిలో మొక్కలు పెంచాలి. 30,000 మెగావాట్ల పునరుత్పత్తి విద్యుత్ ను సాధించాలి. 90 శాతం కుటుంబాలకు బ్యాంకింగ్ సేవ లు అందించాలి. ఆధార్ కార్డు ద్వారా ప్రత్యక్ష సబ్సిడీని కల్పించాలి. వ్యవసాయం - గ్రామీణాభివృద్ధి 11వ ప్రణాళికలో వ్యవసాయ రంగంలో సగటున 3.2 శాతం వృద్ధి సాధించారు. 12వ ప్రణాళికలో వ్యవసాయ రంగంలో 4 శాతం, ధాన్యాల విషయంలో 1.5 శాతం వృద్ధిరేటును సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఉత్పాదకతను పెంచడానికి విత్తనాలు, నీటిపారుదలకు ప్రాధాన్యం ఇచ్చారు. నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపై ఎక్కువగా దృష్టి సారించారు. పారిశ్రామిక అభివృద్ధి ఏటా 2 మిలియన్ల అదనపు ఉద్యోగాలను సృష్టించడానికి 12వ ప్రణాళికలో 11.12 శాతం వరకు పారిశ్రామిక రంగ వృద్ధిని సాధించాలని నిర్ణయించారు. కీలక రంగాల్లో పెట్టుబడిని, ఎఫ్డీఐలను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పారిశ్రామిక పరిశోధన అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు కొత్త నవకల్పనలను ప్రోత్సహించాలని నిర్దేశించుకున్నారు. రాష్ట్రాల వ్యవస్థాపరమైన సౌకర్యాలను, ప్రత్యేక పారిశ్రామిక మండళ్లను అనుసంధానంతో అభివృద్ధి చేయడం, అధికంగా ఉద్యోగ కల్పనకు అవకాశం ఉన్న పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. విద్యా- నైపుణ్యాల అభివృద్ధి 2017 నాటికి సెకండరీ విద్యను విశ్వజనీనం చేయడంతోపాటు ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి శాతాన్ని 2017 నాటికి 20 శాతానికి పెంచాలి. నాణ్యమైన విద్య, అధ్యాపకుల అభివృద్ధికి ఎక్కువ పెట్టుబడిని పెట్టడం, టీచర్ల శిక్షణ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టిని సారించడం. ఆరోగ్యం 12వ ప్రణాళిక చివరి నాటికి కేంద్ర, రాష్ట్రాలు ఆరోగ్యం మీద చేసే వ్యయాన్ని జీడీపీలో ప్రస్తుతం ఉన్న 1.3 శాతం నుంచి 2 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీలైతే 2.5 శాతం వరకు కూడా పెంచాలని నిర్ణయించారు. శక్తి రంగం 12వ ప్రణాళికా లక్ష్యమైన 9 శాతం వృద్ధిరేటు సాధించడానికి వాణిజ్యపరమైన ఇంధన వృద్ధిరేటు ఏడాదికి 7 శాతం అవసరం అవుతుందని అంచనా. 12వ ప్రణాళికా కాలంలో లక్ష మెగావాట్ల కొత్త ఇంధన సామర్థ్యాన్ని కల్పించడం. అణు ఇంధన పథకాన్ని రక్షణ దృష్ట్యా సమీకరించి కొనసాగించడం. రవాణా 12వ ప్రణాళికలో రవాణాపరమైన వ్యవస్థాపనా సౌకర్యాలను త్వరితగతిన విస్తరింపచేయడంపై దృష్టి సారించారు. ఈ ప్రణాళిక చివరి నాటికి ‘తూర్పు- పశ్చిమ రైల్వే డెడికేటెడ్ ప్రైట్ కారిడార్స’ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూలధన సాంద్రత, రవాణా ప్రాజెక్టులకు కావాల్సిన వనరుల కోసం ప్రైవేట్ రంగం పెట్టుబడులను ప్రోత్సహిస్తారు. ఓడరేవులు, ప్రస్తుతం ఉన్న రోడ్లు, రైల్వే నెట్వర్క మధ్య పూర్తి అనుసంధానం ఉండేలా చూడటం. 11, 12వ ప్రణాళికల నిర్ణయాలు- లక్ష్యాలు వ్యవసాయ రంగం వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 3.2 శాతం సాధించగా, 12వ ప్రణాళికలో 4 శాతంగా నిర్ణయించారు. గనులు, ఖనిజాల వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 4.7 శాతం సాధించగా, 12వ ప్రణాళికలో 8 శాతంగా నిర్దేశించుకున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 7.7 శాతం కాగా 12వ ప్రణాళికలో 9.8 శాతంగా నిర్ణయించారు. విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 6.4 శాతం ఉండగా, 12వ ప్రణాళికలో 8.5 శాతం లక్ష్యం. నిర్మాణ రంగం వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 7.8 శాతం కాగా, 12వ ప్రణాళికలో 10 శాతంగా నిర్ణయించారు. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచారం 11వ ప్రణాళికలో 9.9 శాతం వృద్ధిరేటు సాధించగా, 12వ ప్రణాళికలో 11 శాతం వృద్ధి సాధించాలని నిర్దేశించుకున్నారు. బ్యాంకింగ్ - బీమా, రియల్ ఎస్టేట్, వర్తక సేవల వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 10.7 శాతం ఉండగా, 12వ ప్రణాళికలో 10 శాతంగా నిర్ణయించారు. సామాజిక, వ్యక్తిగత సేవల వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 9.4 శాతం కాగా 12వ ప్రణాళికలో 8 శాతంగా నిర్దేశించారు. 11వ ప్రణాళికలో జీడీపీ వృద్ధిరేటు 8.2 శాతం. 12వ ప్రణాళిక వృద్ధిరేటును 9 శాతంగా నిర్ణయించారు. నోట్: 11వ, ప్రణాళికలో అత్యధిక వృద్ధిరేటు సాధించిన రంగాలు.. 1. బ్యాంకింగ్ - బీమా, రియల్ ఎస్టేట్, వర్తక సేవలు ( 10.7 శాతం) 2. వాణిజ్యం - హోటల్స్, రవాణా, సమాచారం, నిల్వలు ( 9.9 శాతం). 12వ ప్రణాళికలో కేటాయింపులు సాంఘిక సేవలు 34.7 శాతం శక్తి 18.8 శాతం రవాణా 15.7 శాతం ఆరోగ్యం 11.45 శాతం గ్రామీణాభివృద్ధి 6 శాతం సాగునీరు 5.5 శాతం పరిశ్రమలు 4.9 శాతం పట్టణాభివృద్ధి 4.6 శాతం వ్యవసాయం 4.7 శాతం ఎస్ అండ్ టీ 2.2 శాతం సమాచారం 1.1 శాతం సాధారణ సేవలు 1.4 శాతం ఇతరాలు 27.8 శాతం మాదిరి ప్రశ్నలు 1. 11వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా జాతీయ స్థాయిలో ఉప ప్రయోజనాలు (సబ్ బెనిఫిట్స్) 27 కాగా, రాష్ర్టస్థాయిలోఉప ప్రయోజనాల సంఖ్య ఎంత? 1) 11 2) 13 3) 25 4) 50 2. రెండో ప్రణాళికలో అత్యధిక పెట్టుబడి ఏ రంగానిది? 1) వ్యవసాయం, నీటి పారుదల 2) పరిశ్రమలు 3)రవాణా,సమాచారం 4) విద్యుత్ శక్తి 3. రెండో ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రంగం ఏది? 1) వ్యవసాయం, నీటిపారుదల 2) పరిశ్రమలు 3) రవాణా, సమాచారం 4) విద్యుత్ శక్తి 4. విదేశీ సహాయాన్ని అధికంగా వినియోగించుకున్న కేంద్ర ప్రణాళిక ఏది? 1) 1వ 2) 3వ 3) 5వ 4) 9వ 5. అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే వారిలో పొదుపును ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన పథకం ఏది? 1) రాష్ట్రీయ స్వాస్థ బీమా యోజన 2) ఆమ్ ఆద్మీ బీమా యోజన 3) స్వావలంబన 4) రాష్ట్రీయ పొదుపు పథకం సమాధానాలు 1) 2; 2) 3; 3) 2; 4) 2; 5) 3. -
మరాఠీ గడ్డపై తెలుగు బిడ్డలు
- ముంబైతోపాటు మహారాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర - రాజకీయ, సామాజిక సేవల్లోనూ తమదైన ముద్ర సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మరాఠీలతో తెలుగు ప్రజలు మమేకమైపోయారు. ముంబైతోపాటు మహారాష్ట్రలోని పలు రంగాల్లో అభివృద్ధిలో తెలుగు ప్రజలు తమదైన ముద్రను వేయగలిగారు. భవన నిర్మాణం, రాజకీయాలతోపాటు పలు రంగాల్లో రాణించారు. రాష్ట్ర రాజకీయాల్లో అనేక మంది తెలుగు ప్రజలు క్రియాశీలక పాత్ర పోషించారు. రాష్ట్ర చరిత్రలో తెలుగువారికి ఓ ప్రత్యేకత ఉంది. స్పీకర్ , ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్లతోపాటు మేయర్ల వరకు అనేక పదవులను తెలుగువారు అనుభవించారు. ఈ నెల 15న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అన్నిరంగాల్లో ఓ వెలుగు వెలిగిన తెలుగు ప్రజల కీర్తి గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం. తొలిస్పీకర్గా సయాజీ శీలం దేశంలోనే అత్యంత ప్రాముఖ్యతగల రాష్ట్రాల్లో ఒకైటె న మహారాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్గా తెలుగు వ్యక్తి సయాజీ శీలం పనిచేశారు. తెలుగువారి కీర్తి పతాకాన్ని మరాఠ గడ్డపై ఆవిష్కరించారు. అప్పటి నిజాం రాష్ట్రం నుంచి బొంబాయికి వచ్చిన సయాజీ శీలం. మే 18, 1896లో జన్మించారు. బాంబే విశ్వవిద్యాలయం నుంచి 1912లో మెట్రిక్యులేషన్, 1916లో బీ.ఏ, 1920లో ఎల్.ఎల్.బీ పూర్తి చేశారు. సామాజిక సేవాతత్పరుడైన సయాజీ 1914లో కామాటిపుర, నాగ్పాడా, బైకలా ప్రాంతాలుండే ‘ఈ’ వార్డు పరిధిలో పేద, నిరిక్షరాస్యులైన ప్రజల అభ్యన్నతికోసం పనిచేశాడు. 1918 సంవత్సరంలో అంటువ్యాధి సమస్య తీవ్రంగా ప్రబలిన సమయంలో ఆయన ధైర్యంగా ప్రజలకు సేవలందించారు. విద్యా సంస్థల నిర్వాహణలో, వైద్య శిబిరాల ఏర్పాటులో సయాజీ చురుకైన పాత్ర పోషించారు. తెలుగు మిత్ర అనే అనే పత్రిక ను మరాఠి భాషలో నిర్వహించి వెనుకబడిన వర్గాల కోసం కృషి చేశారు. సయాజీ శీలం బాంబే స్టేట్ స్పీకర్గా 21 నవబంర్ 1956 నుంచి 1957 వరకు పనిచేశారు. 1957 నుంచి 1960 ఏప్రిల్ వరకు సభాపతిగా తన సేవలనందించారు. భాష ప్రాతిపదికగా సంయుక్త మహారాష్ట్ర అవతరించిన తర్వాత ఆయన రాష్ట్ర శాసనసభకు తొలి స్పీకర్గా 1960 మే 1 నుంచి 1962 మార్చి 19 వరకు కొనసాగారు. తర్వాత పాండిచ్చేరికి లెఫ్ట్నె ంట్ గవర్నర్గా పదవీ భాద్యతలను చేపట్టారు. నేటితరం తెలుగు నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముంబై అభివృద్ధిలో ‘పుప్పాల’ కీలకపాత్ర... ముంబై అభివృద్ధి అనేక మంది తెలుగు ప్రజలు కీలకపాత్ర పోషించారు. శంకర్రావ్ పుప్పాల మనవడు నర్సింగ్రావ్ పుప్పాల 1942 నుంచి ముంబైకి సుపరిచితులు. ఆయన మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ నుంచి ముంబై మేయర్గా ఎదిగారు. ముంబై అభివృద్ధికి కృషిచేసి తెలుగువారి ముద్రను వేయగలిగారు. ముంబై నగరం పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చెందడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అన్ని రాష్ట్రాల ప్రజలు వలస రావడానికి అవకాశం ఏర్పడింది. ముంబై తెలుగు వెలుగులు.. ముంబై రాజకీయాల్లో అనేక మంది తెలుగు ప్రజలు ఓ వెలుగు వెలిగారు. తెలుగు కాంట్రాక్టర్ జాయా కారాడీ లింగూ బాయిఖలా ‘ఈ’ డివిజన్ నుంచి ముంబై మున్సిపల్ కార్పొరేటర్గా 12 ఏళ్లు పని చేశారు.1893లో జరిగిన మతపరమైన అల్లర్లను నివారించడంలో జాయాకారాడీ లింగూ కీలక పాత్ర నిర్వహించారు. కామాటిపుర, నాగ్పాడా ప్రాంతాల్లో అల్లర్లు ఎక్కువగా జరుగుతుండేవి. హిందూ-ముస్లిం ప్రజల మధ్య సఖ్యతను పెంచేందుకు లింగూ కీలకపాత్ర పోషించారు. లింగూ నిర్వహించిన పాత్రను అప్పటి పోలీస్ కమిషనర్ విన్సెంట్ సైతం ప్రశంసించారు. లింగూ 63వ యేట, అక్టోబరు 28, 1898న మరణించారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అదే సంవత్సరం నవంబర్ 9న ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ముంబై రాజకీయ సమాజంలో రావ్ బహదూర్ యెల్లప్పా బలరామ్ పేరు తరచుగా వినిపించేది. 1888 నుంచి ఆయన 27 సంవత్సరాల పాటు భైఖలా డివిజన్ నుంచి కార్పొరేటర్గా పనిచేశారు. బల్రామ్కు అనేక మంది రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన చేసిన అనేక స్వచ్ఛందసేవలు చేశారు. 1883లో జస్టిస్ ఆఫ్ పీస్, 1891లో రావ్సాహెబ్, 1898లో రావ్బహదూర్ బిరుదులనిచ్చి సన్మానించారు. 1914లో యెల్లప్పా బలరామ్ మరణించారు. రాజకీయాల్లో మేరు నగధీరులు నాటి రాజకీయాల్లో పర్ష శంకర్రావు, పుప్పాల పరశురామ్, పుప్పాల శంకర్రావ్, రావ్సాహెబ్ పోరాడే, రాయపల్లి దశరథ్ తదితరులు కీలకపాత్ర నిర్వహించారు. పర్ష శంకర్రావ్ అప్పట్లో తెలుగు వాళ్ల సమస్యలపై వార్తపత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. తెలుగు సమాచార్ లాంటి పత్రికను ఆయన నడిపించారు. విద్యా సంస్థలు గ్రంథాలయాల నిర్వహణ కోసం నిధులను వెచ్చించారు. మద్యపాన నిషేధం, స్వదేశి వస్తువు వినియోగ ప్రచారాల కోసం ఆయన జీవిత కాలం పనిచేశారు. లోక్మాన్య తిలక్ జ్ఞాన కోశ్కర్ ఖేత్కార్, బాబాసాహెబ్ అంబేద్కర్ కత్తరకోటి శంకరాచార్యా లాంటి గొప్ప వ్యక్తుల స్నేహాన్ని శంకర్రావ్ సంపాదించారు. పుణే నగరంలో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన సార్వజనిక గణేశోత్సవాలకు పర్ష శంకర్రావ్ 13వ వీధికి కార్యదర్శిగా ఉండేవారు. కామాటిపుర కాంగ్రెస్ కమిటీకి ఆయన రెండు సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. శంకర్రావ్ చూపిన ఉత్తమ సేవాభావానికి ఆ నాటి కాంగ్రెస్ నాయకులు సయాజీరావ్ శీలం ఆకర్శితులయ్యారు. శంకర్రావ్ను కాంగ్రెస్లో చేర్పించారు. కామాటిపురాలోని తెలుగు సమాజంలో కాంగ్రెస్ ఉద్యమాలకు పుప్పాల శంకర్రావ్ సయాజీ శీలంలు, వర్ష శంకర్రావ్లు ప్రసిద్ధి చెందారు. 1935లో 40 సంవత్సరాల వయస్సులోనే రక్తపోటుతో శంకర్రావ్ ఉప్పాల మరణించారు. ఆ తరువాత 1939లో ఏప్రిల్ ఆరున వర్ష శంకర్రావ్ మరణించారు. ఈ ఇద్దరు నాయకులు ఆకస్మికంగా మరణించడంతో తెలుగు సమాజంలో నాయకత్వ కొరత ఏర్పడింది. అనేక మంది విద్యావంతులు ఆ లోటును పూరించగలిగారు. శంకర్రావ్ పుప్పాల చనిపోయినప్పుడు ఆయన కుమారుడు పరశురామ్ 17 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉండేది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ 1942 ఉద్యమంలో పరశురామ్ కీలకపాత్ర నిర్వహించారు. కామాటిపురా, నాగ్పాడాలలో అనేక సంవత్సరాల పాటు మత ఘర్షణలు కొనసాగాయి. అనేక మంది తెలుగు నాయకుల మాదిరిగానే లింగన్న పూజారి అనే తెలుగు నాయకుడు మత సామరస్యాన్ని ఈ ప్రాంతంలో నెలకొల్పేందుకు విశేషంగా కషి చేశారు. 1944లో డంకన్ రోడ్లో జరిగిన అల్లర్లలో లింగన్న పూజారి ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. అప్పటి కమిషనర్ విల్సన్ లింగన్నను ప్రశంసించారు. లింగన్న పూజారి 1946లో మున్సిపల్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఆనాటి నుంచి రాష్ట్రంలో తెలుగు ప్రజల కీర్తిపతాకం రెపరెపలాడుతోంది. -
జీరో కూపన్ బాండ్స్ సూచిస్తుంది?
SBI Pos, Clerks Banking Awareness 1. What is "Non - Interest Income" of banks? a) Income earned from social services b) Income earned by keeping assets with the RBI c) Income earned by investing in derivates d) Income derived from fee-based services e) None of these 2. Funding under SJSRY shared between Centre and States in general in the ratio of … a) 50:50 b) 80:20 c) 75:25 d) 60:40 e) None of these 3. Which one of the following measures is not adopted by RBI for controlling credit in India ? a) Cash Deposit Ratio b) Capital Adequacy Ratio c) Cash Reserve Ratio d) Statutory Reserve Ratio e) None of these 4. Interest on saving Banks account is now calculated by banks on? a) Minimum balance during the month b) Minimum balance from 7th to the last day of the month c) Minimum balance during from 10th to the last day of the month d) Maximum balance during the month e) Daily product basis 5. With regard to lockers, which of the following guideline is not issued by the RBI? a) Branches are to link the allotment of lockers to placement of fixed deposits b) To ensure prompt payment of locker rent, branch are to obtain a Fixed Deposit which would cover 3 years rent and charges for breaking open the locker c) Branch Manager can allot the 1/3rd of vacant lockers d) Wait list of lockers need not be maintained. e) None of these 6. What is ASBA with respect to banking? a) Application supported by Black Amount b) Application sign by Blocked Amount c) Application supported by blocked Array d) Application support by Blocked Amount e) None of these 7. The Central Board of RBI consists of: a) One Governor b) Maximum four Dy. Governors c) 14 Directors d) All of the above e) None of these 8. According to the world Bank Report released on April 29, 2014, India has replaced which country to become third largest economy based on 'Purchasing Power Parity'? a) South Africa b) Germany c) Japan d) France e) Russia 9. The Minimum capital required to start a new private sector bank is… a) 500crore b) 400crore c) 300crore d) 200crore e) 100crore 10. Zero Coupon Bonds refers to? a) Bond issued at face value b) Bond issued with face value & interest c) Bond issued at discount from its face value with interest d) Bond issued at discount from its face value without interest e) None of these 11. 'The Global Information Technology Report' Published by which organization annually? a) World Trade Organization b) World Bank c) World Economic Forum d) World Technology Organization e) None of these 12. When RBI reduces the CRR it results into? a) Decrease in deposits b) Increase in deposits c) Increase in lendable resources d) Decrease in lendable resources e) None of these 13. IFSC code consists of …….. digits? a) 9 b) 10 c) 15 d) 11 e) 12 14. Which of the following scheme is launched to provide pension to the members of unorganized sectors in India? a) Swabhiman b) Swavalamban c) Jeevan Dhara d) Jeevan Kalyan e) Asha 15. Money laundering means? a) Concealment of income source mainly to avoid income tax b) Money acquired from undisclosed sources and deposited in foreign banks c) Money acquired from undisclosed source and deposited in private bank d) Process of conversion of money obtained illegally to appear to have originated from legitimate sources to convert black money into white money e) Money acquired from drug trafficking 16. Banks in India are Regulated under? a) Companies Act, 1956 b) Banking Regulation Act, 1949 c) Reserve Bank of India Act, 1934 d) Special Powers conferred on the RBI e) None of these 17. Definitions of weaker section includes: a) Small farmer - farmer having 2.5 ac of irrigated land OR 5.0 ac of un-irrigated land b) Marginal farmer- farmer having 1.25 ac of irrigated land OR 2.5 ac of un-irrigated land c) Agricultural labourers - more than 50% of their annual income is from activities engaged in agriculture d) Tenant farmers - farmers who take land on lease for cultivation e) All of the above 18. Ombudsman Scheme is framed under which Act? a) Section 35A of Banking Regulation Act b) Section 35 A of RBI Act c) Section 42 of RBI Act d) Ombudsman Scheme rules 1995 e) None of the above 19. Right of Set-off refers to? a) Marking of lien in deposit account of the borrower b) Transfer of term deposit balance, which is due for maturity in the next year to borrower account for adjustment of over dues c) Transfer of credit balance in deposit account for adjustment of over dues in loan account of the same person. d) b & c e) None of these 20. In Case of Co-operative Banks RBI reduced Priority Sector advances to______% on ANBC. a) 50% b) 60% c) 40% d) 80% e) None 21. RBI injects liquidity through? a) Increase Bank Rate b) Reduction of Repo Rate c) Reduction of Reverse Repo Rate d) Increase CRR e) Increase SLR 22. When Commercial Banks purchases the Government Securities…. a) The Liquidity in the Banking system increases b) The Liquidity in the Banking system remains unchanged c) The Liquidity in the Banking system gets diminished d) All of these e) None of these 23. RBI provides …… to meet expenditure mismatch of both Central and State Government? a) Treasury bills b) Ways and Means advance c) Date and Securities d) All of the above e) None of these 24. CRA in Banking parlance stands for? a) Credit Rating Association b) Credit Rating Agency c) Credit Risk Assessment d) Credit Ranking Agency e) None of these 25. Recently which among the following panel Recommends One-license policy for all Banks Irrespective of the Ownership pattern? a) C Rangarajan b) Arvind Mayaram c) P J Nayak d) Nachiket Mor e) Rajiv Takru 26. During March 2014, RBI has proposed to setup of a Trade Re-ceivables and Credit Exchange for financing (TCE) to finance ... a) Exporters of Iron b) Importers of Gold c) Foreign Exchange Dealers d) Bankers and Pawn Brokers e) Micro, Small and Medium Enterprises (MSMEs) 27. According to the RBI Guidelines the age group of minors to open Savings Bank account is ? a) 14 years b) 8 years c) 15 years d) 10 years e) None of these 28. The Banker- Customer relationship in credit card is? a) Creditor- debtor b) Debtor-creditor c) Agent-Principal d) Principal-agent e) None of these 29. Expand the term FSDC? a) Financial Suitability and Development Council b) Financial Sustainability and Development Council c) Financial Structure Development Council d) Financial Stability and Development Council e) Financial Sovereignty and Development Council 30. RBI executive director G. Gopalakrishna has voluntarily retired from the service and joined as director of CAFRAL. CAFRAL stands for a) Center for Audit and Finan-cial Research and Learning b) Central Agricultural Finance and Rural Area Learning c) Centre for Advanced Fina-ncial Research and Learning d) Centre for Agriculture Fin-ance And Advanced Learning e) None of the above Key 1) d 2) c 3) a 4) e 5) a 6) d 7) d 8) c 9) a 10) d 11) c 12) c 13) d 14) b 15) d 16) b 17) e 18) a 19) c 20) c 21) b 22) c 23) b 24) b 25) c 26) e 27) d 28) a 29) d 30) c -
భారతీయ గృహిణికి రాచమర్యాద
విశిష్ట సామాజిక సేవలను అందిస్తున్న వారికి బ్రిటిష్ రాజకుటుంబం చేతుల మీదుగా ఇచ్చే ‘డేమ్ కమాండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ (డిబిఇ) టైటిల్ (ఇదే డేమ్హుడ్) ఆశా ఖేమ్కాకు దక్కింది. ఈ గౌరవం దక్కిన రెండో భారతీయ మహిళ ఆమె. ఒకప్పుడు ఇంగ్లీషు అక్షరం ముక్క రాని ఆశ నేడు విద్యావేత్తగా ఈ స్థాయికి ఎదగడం విశేషం. ఇకపై ఆమె బ్రిటన్లో ఎక్కడి కెళ్లినా ఆశా అని కాకుండా ‘డేమ్ ఆశా’ అని సంబోధిస్తారు. బీహార్ లోని సీతామఢీ నుంచి 1978లో లండన్ వెళ్లే నాటికి ఆశాఖేమ్కా ఇంగ్లిష్ ముక్క ఎరుగరు. ఇంగ్లిష్ మాట్లాడ్డం, రాయడం రెండూ రావు. అయితే ఇవాళ ఆవిడ ఓ విద్యావేత్త. దీనర్థం ఆశ ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చారని మాత్రమే కాదు, తనతో పాటు ఎందరికో ఆమె జీవితాన్నిచ్చారనీ, వాళ్ల జీవన గతినే మార్చారనీ! లండన్లోని వెస్ట్ నాటింగ్హామ్షైర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆశాఖేమ్కా అకస్మాత్తుగా ఇప్పుడు వార్తల్లోకి రావడానికి తగిన కారణమే ఉంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘డేమ్హుడ్’ టైటిల్ను ఇటీవలే ఆమె అందుకున్నారు. బ్రిటన్ రాణి లేదా రాజు స్వహస్తాలతో ప్రదానం చేసే ఈ పురస్కారాన్ని 1917లో నెలకొల్పారు. నాటి నుంచి నేటి వరకు ‘డేమ్హడ్’ టైటిల్ అందుకున్న రెండో మహిళ ఆశాఖేమ్కా. (తొలిమహిళ ధార్ మహారాణి లక్ష్మీదేవి. 1931లో ఆమె ఈ టైటిల్ పొందారు). మగవాళ్లకు ఇచ్చేది ‘నైట్హుడ్’ అయితే, ఆడవాళ్లకు ఇచ్చేది ‘డేమ్హుడ్’. ఎంతోకాలంగా అత్యంత అమూల్యమైన, విశిష్టమైన సామాజిక సేవలను అందిస్తున్న వారికి ఇచ్చే ‘డేమ్ కమాండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ (డిబిఇ) టైటిల్ (ఇదే డేమ్హుడ్)ను ఆశాఖేమ్కా గతవారం బకింగ్హామ్ ప్యాలెస్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇకనుంచి బ్రిటన్లో ఆమె ఎక్కడికి వెళ్లినా ఆమెను ఆశా అని కాకుండా ‘డేమ్ ఆశా’ అని సంబోధిస్తారు. రుణపడి ఉంటాను... ‘‘సాధారణంగా నేను మాటలకు తడుముకోను. పదాలను వెతుక్కోను. కానీ డేమ్హుడ్ను స్వీకరిస్తున్నప్పుడు దాదాపుగా మూగబోయినంత పని చేశాను. ఈ టైటిల్ ఇచ్చినవారికి నేనెంతో రుణపడి ఉన్నాను. నా కలలను నిజం చేసుకోడానికి నాకు లభించిన ఈ ప్రోత్సాహం ఎంతగానో ఉపయోగపడుతుంది’’ అని అన్నారు ఆశాఖేమ్కా అవార్డు అందుకుంటూ. ఆశా సేవలు లండన్కు మాత్రమే పరిమితం కాలేదు. ఇండియాలో ‘అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్’కు ఆమె చైర్ప ర్సన్. త్వరలోనే చండీగఢ్లో ఒక ‘స్కిల్ సెంటర్’ను ఏర్పాటు చేయనున్నారామె. అక్కడి నుంచి దేశంలోని యువతీయువకులకు ఇంగ్లిషులో, మేథమేటిక్స్లో ఆన్లైన్ కోచింగ్ ఇప్పించాలని ఆమె ఉద్దేశం. ఆశ భర్త శంకర్లాల్ ఖేమ్కా పాట్నాలో ట్రామా, ఆర్థోపెడిక్ సర్జన్. 1975లో వైద్యార్హతల కోసం పాట్నా మెడికల్ కాలేజ్లోని ‘నేషనల్ హెల్త్ సర్వీస్’లో చేరారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. అమ్మాయి షాలిని, ఇద్దరు అబ్బాయిలు... షీల్, స్నేహ్. పదిహేనేళ్లకే... న్యాయమూర్తుల కుటుంబం నుంచి వచ్చిన ఆశ తన 13వ యేట చదువు మానేయవలసి వచ్చింది. 15వ యేట వివాహం అయింది. కుటుంబంతో సహా ఇంగ్లండ్ వెళ్లే నాటికి నిరక్షరాస్యురాలైన ఈ పాతికేళ్ల యువతికి అంత ఇంగ్లిషు ఎలా వచ్చింది? అంటే టీవీలో పిల్లల ఛానల్స్ చూసి నేర్చుకున్నారు. ఆపిన చదువును తిరిగి కొనసాగించారు. అప్పటికే ఆమె ముగ్గురు పిల్లలు స్కూలుకు వెళుతున్నారు. టీచర్ కెరీర్ను ఎంపిక చేసుకున్న ఆశ కార్డిఫ్ యూనివర్శిటీ నుంచి బిజినెస్ డిగ్రీ పూర్తి చేశారు. డేమ్హుడ్కు ఆశా ఎంపికైనట్లు ప్రకటిస్తూ -‘‘వెస్ట్ నాటింగ్హామ్షైర్ ప్రిన్సిపాల్గా ఆశాఖేమ్కా... వెస్ట్ మిడ్లాండ్స్లోని నిరాదరణకు గురైన వారెందరినో చేరదీసి విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ఆమె నేతృత్వంలో ఆ కళాశాల బ్రిటన్కే వన్నెతెచ్చారు’’ అని బ్రిటన్ ప్రభుత్వ విభాగమైన కేబినెట్ ఆఫీస్ ప్రకటించింది.