special pooja
-
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతల ప్రత్యేక పూజలు
-
లడ్డూ పాపం చంద్రబాబుదే
-
రుషికొండలో గుడివాడ అమర్నాథ్, వరుదు కల్యాణి ప్రత్యేక పూజలు..
-
Watch Live: చంద్రబాబు పాపానికి ప్రక్షాళనకు రాష్ట్రం వ్యాప్తంగా ప్రత్యేక పూజలు
-
ప్రత్యేక పూజలో పాల్గొన్న అంబటి రాంబాబు..
-
చంద్రబాబు పాపాలను కడగాలి
-
సైకాలజీ చదివిన బ్యూటీ.. ప్రత్యేక పూజలు ఎందుకు చేయించుకున్నట్లో? (ఫోటోలు)
-
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు
జగిత్యాల, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం రోడ్డు మార్గంలో గట్టుకు చేరుకున్న ఆయనకు.. ఆలయ పూజారులు సాదరంగా స్వాగతం పలికారు. పవన్కు కొండగట్టు ఆలయం మొదటి నుంచి ఒక సెంటిమెంట్గా ఉంది. ఎన్నికల ప్రచారానికి ముందు కూడా ఆయన ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంతకు ముందు తుర్కపల్లి దగ్గర బీజేపీ-జనసేన శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి. ఆ సమయంలో కారుపైకి అభివాదం చేసిన ఆయన.. తెలంగాణలో రెండు పార్టీల పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
Anasuya Bharadwaj Photos: ఇంట్లో పూజ చేయించిన యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
విశాఖ: రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు
CM Jagan Vizag Tour Updates విశాఖలో సీఎం జగన్ శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ శారదా పీఠంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతి మన్యుసుక్త హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు ►రాజ్యశ్యామల అమ్మవారి యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీ శారద స్వరూప రాజ్యశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహాలను దర్శించుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి రాజ శ్యామల అమ్మవారి దీక్ష పీఠం వద్ద పూజలో పాల్గొన్న సీఎం జగన్ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి వన దుర్గ అమ్మవారిని దర్శించుకున్న సీఎం జగన్ ► శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ ► శారదా పీఠంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతి ►పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ శారదా పీఠంలో సీఎం జగన్కు సాదర స్వాగతం ► శారదాపీఠంలో ఉత్తరాధికారి స్వాత్మానందం సరస్వతి... పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిలను కలిసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి శారదా పీఠంలో సీఎం జగన్ శారదాపీఠం చేరుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి స్వాగతం పలికిన మంత్రులు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్,. వెస్ట్ ఇంచార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ విశాఖ విమానాశ్రయం నుంచి శారదా పీఠానికి బయలుదేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి వేపగుంట జంక్షన్ దాటిన సీఎం కాన్వాయ్ కాసేపట్లో శారదా పీఠానికి చేరుకుని వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ విశాఖ చేరుకున్న సీఎం జగన్ ►కాసేపట్లో రోడ్డు మార్గం గుండా చినముషిడివాలోని శ్రీశారదా పీఠానికి.. ►పీఠం వారికోత్సవ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ ►అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్ ►పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి పీఠంలోని దేవతామూర్తులకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు ►రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం జగన్ ►దాదాపు గంట పాటు పీఠంలోని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్ -
దైవసన్నిధిలో హీరో ప్రభాస్.. స్పెషల్ పూజలు కూడా (ఫొటోలు)
-
Nayanthara - Vignesh Shivan: న్యూబిగినింగ్స్ అంటూ నయనతార దంపతుల పూజలు! (ఫోటోలు)
-
సిద్దిపేటలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
-
రేపు కోనాయిపల్లికి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రేపు సిద్ధిపేటకు వెళ్లనున్నారు. అక్కడి కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో నామినేషన్లు వేసే ముందు ప్రతిసారి కేసీఆర్ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. అయితే.. ఈసారి వరుస బీఆర్ఎస్ సభలు.. మధ్యలో యాగం, సమయాభావ పరిస్థితులు, పైగా రేపు శనివారం కావడంతో ఈసారి ముందుగానే ఈ ఆలయంలో పూజలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల9వ తేదీన గజ్వేల్తో పాటు కామారెడ్డి లోనూ కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అదే రోజు సాయంత్రం కామారెడ్డి బీఆర్ఎస్ ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం లోని కోనాయిపల్లి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. కేసీఆర్కు ఇది సెంటిమెంట్ దేవాలయం. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్ వేస్తారు. 1985లో మొదటిసారి సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లలో జరిగిన ఎన్నికల సమయంలో.. ఈ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లో ఆయన విజయం సాధించారు. మరో విశేషం ఏంటంటే.. 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీ ప్రకటన చేశారాయన. -
రెండో రోజు ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక పూజలు
-
తిరుమల : అంగరంగ వైభవంగా పుష్పపల్లకీ సేవ (ఫోటోలు)
-
తిరుమలలో నేడు ఆణివార ఆస్థానం
సాక్షి, తిరుపతి: తిరుమలలో ఇవాళ(సోమవారం, జులై 17) శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరగనుంది. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను సైతం రద్దు చేసింది. ఇక సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా.. బంగారం వాకిలిలో ఆస్థానం నిర్వహిస్తారు అర్చకులు. ఆపై స్వామివారికి రూపాయి హారతి ఇస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పుష్ప పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినానికి శ్రీవారి ఆలయం ఇప్పటికే ముస్తాబయ్యింది. ఉదయం బంగారువాకిలి ముందు ఘంటా మండపంలో ఉభయదేవేరుల సమేతంగా మలయప్పస్వామివారు గరుత్మంతుడికి అభిముఖంగా, మరో పీఠంపై స్వామివారి విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేయనున్నారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించనున్నారు. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. గతంలో ఆణివార ఆస్థానం రోజు నుండి శ్రీవారి ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేది. అయితే టీటీడీ ఏర్పడ్డాక ఏప్రిల్ నుండి ఆదాయ వ్యయాలు అనుసరిస్తూ వస్తోంది. జియ్యంగార్ల వస్త్ర సమర్పణ తిరుమల పెద జియ్యర్ స్వామి వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ‘పరివట్టం’ కట్టుకొని బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని స్వామిని ఆశీర్వదిస్తారు. భక్తులకు శుభవార్త భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించి రూ.300 దర్శన టికెట్లను రోజుకు 4వేలు చొప్పున అదనంగా విడుదల చేస్తామని, ఇప్పటికే రోజుకు 20వేల టికెట్లను కేటాయించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణకు నిబంధనల ప్రకారమే శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇదీ చదవండి: వాళ్లకు డబ్బులు ఇవ్వకండి.. భక్తులకు ఈవో సూచన -
Anchor Suma: భర్తతో కలిసి లక్ష్మీ పూజలో పాల్గొన్న సుమ (ఫొటోలు)
Anchor Suma: భర్తతో కలిసి లక్ష్మీ పూజలో పాల్గొన్న సుమ (ఫొటోలు) -
సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు
-
హైదరాబాద్: పంజాగుట్ట సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
-
విశాఖలో గురు పౌర్ణమి ప్రత్యేక పూజలు
-
తిరుత్తణి ఆలయంలో కేతిరెడ్డి పూజలు
సాక్షి, చెన్నై: పది నెలల పాలనలోనే.. పదేళ్ల ప్రగతి ముఖ్యమంత్రి అనే నినాదంతో సీఎం స్టాలిన్ పరిపాలనను కీర్తిస్తూ తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి తిరుత్తణి సుబ్రమణ్య స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి బంగారు రథాన్ని లాగారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టారు. వెంకటేశ్ నాయుడు, భూపతి, దేవయ్య లింగయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం తమిళనాడును అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి నిరంతర కృషి చేస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తమిళనాడు రాష్టం రాబోయే కాలంలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి.. తమిళనాడులో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో 40కి 40 స్థానాల్లో స్టాలిన్ను గెలిపించాలన్నారు. సీఎం స్టాలిన్ను దేశానికి ప్రధానిని చేసి దక్షిణాది నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకొనే ప్రయత్నం చేయాలని కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి ఆకాంక్షించారు. -
జాతర సందడిలో తంత్రగాళ్ల ప్రత్యేక పూజలు
-
50 రకాల వంటకాలతో పునీత్కు పాలశాస్త్రం పూజలు
బెంగళూరు: పునీత్ రాజ్కుమార్ సమాధికి కుటుంబ సభ్యులు ఐదు రోజుల పాలశాస్త్రం పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆయన ఇష్టపడే ఇడ్లి, రాగిముద్ద, నాటుకోడి సాంబారుతో పాటు 50 రకాల వంటకాలను సమాధిపై పెట్టి పూజలు చేశారు. భార్య అశ్విని, కూతుర్లు ధృతి, వందితా, అన్నలు శివరాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్ కుటుంబ సభ్యులు, మంత్రి గోపాలయ్య పాల్గొన్నారు. తమిళ నటుడు పరామర్శ: తమిళ నటుడు శివ కార్తికేయన్ మంగళవారం బెంగళూరు నాగవారలోని శివరాజ్కుమార్ నివాసానికి వెళ్లారు. భార్య, కూతుర్లను పరామర్శించి, కంఠీవర స్టూడియోకు వెళ్లి సమాధికి పూజలు చేశారు. నేటి నుంచి పునీత్ సమాధి దర్శనాలు బనశంకరి: బుధవారం నుంచి పునీత్ రాజ్కుమార్ సమాధి దర్శనానికి అవకాశం కల్పిస్తారు. మంగళవారం పునీత్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు పాల పూజల అనంతరం పునీత్ అన్న శివరాజ్కుమార్ మాట్లాడుతూ... అప్పు సమాధి దర్శనానికి బుధవారం నుంచి అభిమానులను అనుమతి ఇస్తామని తెలిపారు. చదవండి: (పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున) -
లింబాద్రి గుట్టపై దిల్ రాజు ప్రత్యేక పూజలు
సాక్షి, భీమ్గల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండలంలోని లింబాద్రి గుట్టకు భక్తులు శనివారం పోటెత్తారు. గుట్టపై గల లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఏకాదశి విశిష్ఠ దినం కావడంతో స్వామి వారి దర్శనానికి సుమారు గంటన్నర పాటు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ప్రముఖ సీనీ నిర్మాత దిల్ రాజు సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేసారు. -
Dussehra: కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
సాక్షి, హైదరాబాద్: విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ప్రగతి భవన్లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్దంగా వాహన పూజ, అయధపూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వినాయకుడికి కిషన్ రెడ్డి, విజయశాంతి ప్రత్యేక పూజలు
-
ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు
-
వైఎస్ఆర్సీపీ గెలవాలని కడపలో ప్రత్యేక పూజలు
-
ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ నేతల ప్రత్యేక పూజలు
-
దేవాలయాల్లో జనవరి 1న ప్రత్యేక పూజలు రద్దు
-
మావుళ్లమ్మ సన్నిధిలో వరుణ్ సందేశ్
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారిని సినీ హీరో వరుణ్సందేశ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. బీజేపీ నేత కనుమూరి రఘురామకృష్ణంరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక వెంకటేశ్వర బుక్స్ అండ్ స్టేషనరీ యజమాని ప్రసాద్ ఎల్జీ 43 అంగుళాల ఎల్ఈడీ టీవీను ఆలయానికి బహూకరించారు. పాలకొల్లుకు చెందిన గుర్రం అమరకృష్ణ, ఫణి సత్యవతి 5 గ్రాములు, కొత్తపల్లి సూర్యప్రకాష్ (లాలు) 4 గ్రాములు, తటవర్తి పురుషోత్తం గుప్త, తారా దంపతులు 3.660 గ్రాముల బంగారం విరాళంగా సమర్పించారు. -
నోట్ల కష్టాలు తీర్చాలని కోరుతూ పూజలు
-
మావుళ్లమ్మ సన్నిధిలో తెలంగాణ ఐజీ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం మావుళ్లమ్మవారిని గురువరం తెలంగాణ ఐజీ వీసీ సజ్జనార్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. నరసాపురం డీఎస్పీ పూర్ణచంద్రరావు, వన్టాన్ సీఐ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ శ్యామ్సుందర్, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. సోమేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు పంచారామక్షేత్రం గునుపూడి ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయాన్ని ఐజీ సజ్జనార్ సందర్శించారు. స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. -
భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తమలపాకులతో పూజలు చేశారు. 108 ప్రదక్షిణలు చేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. క్షేత్రంలో ఉన్న ఉసిరిచెట్ట కింద దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్త బృందాల భక్తులు ఆలయ ప్రాంగణంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
అంజనీ పుత్రా.. పవనసుత నామ
జంగారెడ్డిగూడెం రూరల్: కార్తీక మంగళవారం కావడంతో జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు తమలపాకులతో ప్రత్యేక పూజలు, భక్తులు అందజేసిన 108 బంగారు తమలపాకులతో స్వామిని అర్చించారు. 108 ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉసిరిచెట్ల కింద మహిళలు దీపారాధన చేశారు. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. మంత్రి సుజాత పూజలు మద్దిక్షేత్రాన్ని మహిళా శిశు సంక్షేమ, గనులశాఖ మంత్రి పీతల సుజాత సందర్శించారు.చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు ఆమెకు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఆలయంలో దీపారాధన చేసి మంత్రి కార్తీక మాసోత్సవాలు ప్రారంభించారు. చిన్నారులకు పాలు పంపిణీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని, అన్నసమారాధనను ప్రారంభించారు. ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ సభ్యుడు శీలం రామచంద్రరావు, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, టీడీపీ నాయకులు ఆమె వెంట ఉన్నారు. ఆదాయం రూ.3.34 లక్షలు ఆలయానికి మంగళవారం ఒక్కరోజు రూ.3,34,666 ఆదాయం లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పూజా టికెట్ల రూపంలో రూ.60,040, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,37,550, స్వామి ఫొటోల విక్రయం ద్వారా రూ.26,200, అన్నదాన విరాళాల రూపంలో రూ.1,10,876 ఆదాయం లభించిందన్నారు. -
అంజన్న సేవలో హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్
జంగారెడ్డిగూడెం రూరల్ :జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని ఆదివారం హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ కొక్కుల శ్రీనివాసరావు, ఆయన సతీమణి ఏలూరు–2 అదనపు జిల్లా జడ్జి కొక్కుల సాయి రమాదేవి దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారి సన్నిధిలో పూజల అనంతరం వేద ఆశ్వీరచనాలు అందజేసి, స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. వీరి వెంట జంగారెడ్డిగూడెం జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఎంవీఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. -
మద్ది అంజన్న సన్నిధిలో దిల్రాజు
జంగారెడ్డిగూడెం రూరల్ : సినీనటుడు సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్ సినిమా విజయవంతం కావడంతో మద్ది ఆంజనేయస్వామి దర్శించుకున్నామని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని శనివారం రాత్రి నిర్మాత దిల్ రాజు, సుప్రీమ్ సినిమా దర్శకులు అనిల్ రావిపూడి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దిల్ రాజు విలేకరులతో మాట్లాడుతూ సుప్రీమ్ సినిమా రిలీజ్కు ముందు మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకుని సినిమా సూపర్ హిట్ కావాలని మొక్కుకున్నామని తెలిపారు. ఇక నుంచి ప్రతి సినిమాకు ముందు ద్వారకాతిరుమలతో పాటు మద్ది క్షేత్రాన్ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ సుప్రీమ్ సినిమా హిట్ చేసి మద్ది ఆంజనేయస్వామి తన మహిమ చూపినట్టు పేర్కొన్నారు. దిల్రాజు, అనిల్ను ఆలయ చైర్మన్ దుశ్శాలువాతో సత్కరించారు. ఈవో పెన్మెత్స విశ్వనా«థరాజు స్వామి వారి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేశారు. ఆదిత్య ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్వీఆర్, స్థానిక ఎగ్జిబ్యూటర్ కొండూరి అంజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో మంత్రి కొల్లు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం శ్రీవారిని, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. అనంతరం ఆలయ ఏఈవో కర్రా శ్రీనివాసరావు ఆయనకు శ్రీవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, టీడీపీ నాయకులు సుంకవల్లి బ్రహ్మయ్య, సోంబాబు, కూరాకుల బుజ్జి పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో మంత్రి కొల్లు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం శ్రీవారిని, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. అనంతరం ఆలయ ఏఈవో కర్రా శ్రీనివాసరావు ఆయనకు శ్రీవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, టీడీపీ నాయకులు సుంకవల్లి బ్రహ్మయ్య, సోంబాబు, కూరాకుల బుజ్జి పాల్గొన్నారు. -
వాసవీ మాత.. ఆరాధ్య దేవత
పెనుగొండ: జై వాసవీ.. జై జై వాసవీ..జై వాసమాంబాయన నమః అంటూ పెనుగొండ క్షేత్రం మార్మోగింది. పెనుగొండ వాసవీ శాంతి ధాంలో అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మవారి నిజపాదాల ప్రతిష్ఠ వైభవోపేతంగా జరిగింది. దక్షిత భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి ఆర్యవైశ్యులు వేలాదిగా తరలివచ్చారు. పెనుగొండ పీఠాధిపతి కష్ణానందపురి స్వామీజీ, వేద పండితులు రామడుగుల లక్ష్మీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు పీఎన్ గోవిందరాజులు, గౌరవ అధ్యక్షుడు ఎస్.రామమూర్తి నిజపాదుకల ప్రతిష్ఠను జరిపించారు. ఆర్యవైశ్యుల 102 గోత్రీకులకు సూచికగా 102 స్తంభాలతో 141 అడుగులు ఎత్తునిర్మించిన మందిరంలో 90 అడుగుల వాసవీ మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 45 టన్నుల బరువు గల విగ్రహానికి గాను 1.55 టన్నుల పాదాలను పంచలోహాలతో తయారుచేశారు. అమ్మవారి పాదాల కింద తామ్ర, రజత, స్వర్ణ పత్రాలు నిక్షిప్తం చేసి పూర్ణాహుతి జరిపించారు. కలశాలతో భారీ ఊరేగింపు ముందుగా కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు 1008 కలశలతో భారీగా గ్రామోత్సవం నిర్వహించారు. వాసవీ మాత మూలవిరాట్ నగరేశ్వర మహిషాసురమర్దనీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. అక్కడి నుంచి వాసవీ శాంతి ధాంకు చేరుకుని కలశాల్లోని పవిత్ర జలాలతో అమ్మవారి పాదాలను అభిషేకించారు. గ్రామోత్సవంలో కర్ణాటక కౌన్సిల్ చైర్మన్ డీహెచ్ శంకరమూర్తి, కర్ణాటక ఎమ్మెల్సీ టీఏ శరవణ, ఎమ్మెల్యే హెచ్పీ మంజునాథ్ పాల్గొన్నారు. వీరితో పాటు కోయంబత్తూరు నుంచి తరలి వచ్చిన ఆర్యవైశ్య మహిళలూ ఉన్నారు. 1.55 టన్నుల పాదాలు భారీ క్రేన్ సాయంతో 1.55 టన్నుల పాదాలను వేదికపై ఆశీనులు గావించారు. విగ్రహం 90 అడుగులు ఉండటంతో సుమారు 15 అడుగుల ఇనుప కమ్మిలను పాదాల మధ్యలో ఏర్పాటుచేసి ప్రతిష్ఠించారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పెనుగొండ వాసవీ శాంతి ధాంతో పెనుగొండ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పేర్గాంచనుందని కర్ణాటక కౌన్సిల్ చైర్మన్ డీహెచ్ శంకరమూర్తి అన్నారు. వాసవీ పాదాల ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి ఆర్యవైశ్యుడూ క్షేత్రాన్ని సందర్శించాలన్న ఉద్దేశంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. వాసవీ మాత ప్రపంచంలోనే తొలి శాంతిదూత అన్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా హింసకు తావివ్వకుండా శాంతి మార్గంలో వెళ్లాలన్న సందేశాన్ని అమ్మవారు ప్రపంచానికి తెలియజెప్పారన్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రతిష్ఠ ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేశారు. శాంతి ధాంలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రార ంభించారు. పీఠాధిపతులు రాక ప్రతిష్ఠ ఉత్సవాల్లో పెనుగొండ పీఠాధిపతి కష్ణానంద పురి స్వామిజీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పీఠాధిపతులు సదానందగిరి స్వామి, చిదానందగిరి స్వామి, సత్ చిత్త్ ఆనందగిరిస్వామి, శుద్ధ చైతన్యనందగిరి స్వామి, ఈశ్వరానంద స్వామి, వెంకటస్వామి, శంకర్ బాండు, మాత శివచైతన్యానంద, ప్రతిష్ఠానంద సరస్వతి స్వామి హాజరయ్యారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, కర్ణాటక ఐటీ మంత్రి కార్యదర్శి నందకుమార్, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.రామమూర్తి, అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు, ఉపాధ్యక్షుడు ఎంవీ నారాయణ గుప్త, డాక్టర్ టీఏ శరవణ, కార్యదర్శి కేఆర్ కష్ణ, కోశాధికారి ఎన్ఎస్ శ్రీనివాసమూర్తి, కోట్ల వెంకటేశ్వరరావు, ఆర్పీ రవిశంకర్, ఎస్.సతీష్, టి.శ్రీనివాసమూర్తి, కోట్ల సూర్యారావు, కోట్ల కష్ణ మూర్తి పాల్గొన్నారు. -
మావుళ్లమ్మ సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
భీమవరం: పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారిని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి పి.శివశంకరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ ఉప ప్రధానఅర్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ, అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి న్యాయమూర్తి శివశంకరరావుకు జ్ఞాపికను అందజేశారు. పట్టణానికి చెందిన పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
సింధూ కోసం దేశమంతటా ప్రార్ధనలు
-
శ్రీవారి పవిత్రోత్సవాలకు శ్రీకారం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని జరిపి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా అర్చకులు, పండితులు ఆలయ ఆవరణకు పుట్టమన్నును తెచ్చి సిద్ధంగా ఉంచిన పాలికల్లో వేశారు. తర్వాత మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ నవధాన్యాలను పాలికల్లో ఉంచారు. దీంతో అంకురార్పణ కార్యక్రమం ముగిసింది. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. బుధవారం పవిత్రాదివాసం జరుపనున్నట్టు అర్చకులు తెలిపారు. -
ఉత్తరాధిలో శివుడికి ప్రత్యేక పూజలు
-
వైభవంగా ఆంజనేయస్వామి కల్యాణం
ఏలూరు(ఆర్ఆర్పేట) :హేలాపురి బ్రాహ్మణ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం నుంచి ప్రారంభమైన శ్రీ నవగ్రహ పాశుపత సహిత రుద్రయాగంలో భాగంగా ఆదివారం శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయ స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం సూర్యగ్రహ శాంతి యాగం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. స్థానిక అగ్రహారంలోని పేరయ్య కోనేరు ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు గణపతి పూజ, గోపూజ, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహవనం పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యగ్రహ జప, తర్పణ, అభిషేక, అర్చన, సూర్యగ్రహ మహాసౌర, అరుణ హోమం, అనంతరం సూర్య నమస్కారాలు కార్యక్రమాలు జరిపారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణం అనంతరం రాత్రి 8.30 గంటలకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి చతుర్వేద స్వస్తి పలికారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. చెరుకుపల్లి విశ్వనాథ శర్మ బ్రహ్మత్వంలో నిర్వహించిన యాగ కార్యక్రమాలను హేలాపురి బ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంపటి శ్రీరామ రవికుమార్ శర్మ, నండూరి రాఘవ శర్మ పర్యవేక్షించారు. -
వెండిరథంపై మల్లన్న ఆలయ ప్రదక్షిణ
శ్రీశైలం: శ్రావణమాసం మూడో సోమవారం రోజున శ్రీ భ్రమరాంబాసమేతుడై శ్రీమల్లికార్జునస్వామి వెండిరథంపై కనువిందుగా దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలోనే వెండిరథంతో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి దక్షిణద్వారం వద్దకు చేర్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం ప్రారంభమైంది. దీనికి ముందుగా సహస్ర దీపాలంకరణ మండపంలో సోమవారాన్ని పురస్కరించుకుని సహస్ర దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. -
పద్మావతి అమ్మవారి పూజలు రద్దు
తిరుచానూరు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు రద్దయ్యాయి. స్థానిక సమాజం వీధిలో నివాసముంటున్న రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కే.రాజాగాంధీ(85) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతిచెందారు. మాడవీధుల్లో ఎవరైనా మృతి చెందితే ఆలయ నిబంధనల ప్రకారం మృతదేహానికి దహన సంస్కారమయ్యే వరకు అమ్మవారి దర్శనం మినహా నైవేద్యం, పూజలు, ఆర్జిత సేవలు, హారతి, తీర్థం, శఠారీ ఇవ్వకూడదు. ఈ నేపథ్యంలో దహనసంస్కారాల అనంతరం సాయంత్రం 4.25 గంటలకు ఆలయం, మాఢ వీధుల్లో పుణ్యాహవచనం నిర్వహించి సుప్రభాతం, నిత్య కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం యథావిధిగా పూజలను కొనసాగించారు. -
జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు
అలంపూర్ రూరల్ (మహబూబ్నగర్) : అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో మంగళవారం అమావాస్యను పురస్కరించుకుని చండీహోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. మరోవైపు స్థానిక రేణుకా దేవి ఆలయంలో మంగళవారం సంతానలక్ష్మి పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు దేవస్థానం వారు బ్రహ్మేశ్వర నిత్యాన్నదాన సత్రంలో భోజన వసతి కల్పించారు. ప్రతి మంగళ, శుక్రవారాలో సంతాన లక్ష్మి పూజలు నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ఈవో గురురాజ తెలిపారు. -
మురిసిన ముక్కంటి
ఎమ్మిగనూరు/టౌన్, న్యూస్లైన్: శ్రీనీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు మహా రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. హరోంహర.. భక్తజన సంరక్షక నామస్మరణంతో పట్టణం మారుమ్రోగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణ.. మంగళ వాయిద్యాలు.. భక్తజనం హర్షధ్వానాల మధ్య రథోత్సవం వైభవోపేతంగా సాగింది. దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామి దర్శనంతో తన్మయత్వానికి లోనయ్యారు. ఉదయం స్వామి వారి ఆలయుంలో నీలకంఠడుకి పురోహితులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తేరుబజార్కు తీసుకొచ్చారు. అక్కడ స్వామి వారిని పీఠంపై అధిష్టింపజేసి హోమం నిర్వహించారు. పూర్ణకుంభంతో నైవేద్యం సవుర్పించి హోవుం చుట్టూ స్వామి వారిని ప్రదక్షిణ చేయించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తిని వుహారథంపై అధిష్టింపజేసి హారతిపట్టారు. అక్కడి నుంచి అశేష భక్తజన వాహిని నడుమ వుహారథం ముందుకు కదిలింది. రథాన్ని లాగి స్వామి కృపను పాత్రులయ్యేందుకు భక్తులు పోటీపడ్డారు. శ్రీవూర్కండేయుస్వామి ఆలయుం వద్దకు చేరుకున్న రథోత్సవం తిరిగి తేరుబజారు వరకు కొనసాగింది. ఉత్సవంలో జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పురోహితులు నిర్వహించిన విశిష్ట పూజా ఘట్టాలు, నందికోళ్ల సేవ , వుంగళ వారుుద్యాలు, గొరవయ్యల నృత్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రవూలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారుు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయు ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి నేతృత్వంలో ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి, ఎమ్మిగనూరు సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటైంది. కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వుంత్రాలయుం మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మంత్రాలయం ఎంపీపీ సీతారామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వై.రుద్రగౌడ్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బి.వి.జయనాగేశ్వరరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బి.టి.నాయుడు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
కనుల పండువగా కుంకుమార్చన
ఎచ్చెర్ల, న్యూస్లైన్ : కుంచాలకుర్మయ్యపేట గ్రామంలోని శ్రీచక్రపురం గురువారం భక్తులతో కిటకిటలాడింది. కనుమ పండుగ సందర్భంగా అమ్మవారికి ఘనంగా కుంకుమపూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. శ్రీచక్రార్చన, విశేష పూజలు ఆలయ వ్యవస్థాపకుడు బాలభాస్కరశర్మ ఆధ్వర్యంలో జరిగాయి. శివాలయం, బాబా మందిరంలో రుత్వికులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలభాస్కరశర్మ మాట్లాడుతూ కనుమ రోజున ప్రతి జీవిలోను భగవతస్కారం ఉంటుందన్నారు. అందు కే పూర్వికులు కనుమ రోజున పశువులకు పిండివంటలు పెట్టేవారని, అయితే ఇప్పుడు ఆ సంప్రదాయాలను పక్కన పెడుతున్నారన్నారు. లలితా సహస్రనామాలతో ఆరు వందల మంది మహిళలతో కుంకుమార్చన చేయించారు. అనంతరం ఖడ్గమాల లలితా పారాయణం జరిగింది. 13 వందల మంది భక్తులకు అన్న సంతర్పణ చేయించారు. కార్యక్రమంలో రుత్వికులు ఎం.సంతోష్కుమార్, విశ్వనాథ్శర్మ, అనంతశర్మ, టి.రమేష్, బాబి, నారాయణరావు, అయ్యప్పశ్రీను పాల్గొన్నారు. -
జగన్ దీక్షకు సంఘీభావం
ఒంగోలు, న్యూస్లైన్: నిరవధిక నిరాహార దీక్షతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జగన్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ శుక్రవారం పలుచోట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలు సంతపేట సాయిబాబా ఆలయంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జగన్ని బలవంతంగా వైద్యశాలకు తరలించినా.. ఆయన దీక్ష కొనసాగిస్తుండగా కొందరు రాజకీయ నాయకులు స్వార్థబుద్ధితో తప్పుడు ఆరోపణలు చేస్తుండటం బాధాకరమన్నారు. పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ వై వెంకటేశ్వరరావు, వివిధ విభాగాల కన్వీనర్లు కేవీ రమణారెడ్డి, వేమూరి సూర్యనారాయణ, ముదివర్తి బాబూరావు, వంకే రాఘవరాజు, ఈర్ల అనిల్కుమార్, మల్లవరపు శ్రీనివాసరావు, శ్రీను, రాంబాబు, అంజి పాల్గొన్నారు. పలుచోట్ల రిలే దీక్షలు: వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా పర్చూరులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 13 మంది రిలే దీక్షల్లో కూర్చున్నారు. దీక్షల్లో కూర్చొన్నవారిని పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త గొట్టిపాటి నర్సయ్య తదితరులు కలిసి సంఘీభావం ప్రకటించారు. మార్కాపురంలో పాత బస్టాండ్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్రెడ్డి దీక్షను బలవంతంగా భగ్నం చేసే యత్నానికి నిరసనగా నల్ల రిబ్బన్లు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనలో మార్కాపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి పాల్గొన్నారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే దీక్షల్లో పది మంది పాల్గొన్నారు. త్రిపురాంతకంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేసి జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటించారు. జగన్ ఆరోగ్యం బాగుండాలని లింగసముద్రంలో వైఎస్సార్ సీపీ నాయకులు వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం స్వార్థ రాజకీయ ప్రేరేపితం: నూకసాని తెలంగాణ ఉద్యమం కేవలం స్వార్థ రాజకీయ ప్రేరేపిత ఉద్యమంగా వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుట్రల ఫలితంగా రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారని, అయినా హృదయంలేని బండరాయిగా కేంద్ర ప్రభుత్వం మారిందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా శనివారం కలెక్టరేట్ ఎదురుగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో రోడ్లు ఊడ్చే కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి నిరసన తెలియజేయనున్నట్లు బాలాజీ ప్రకటించారు. జగన్ దీక్షను యువత స్వాగతిస్తోంది పైనం నాగరాజు, సమైక్యాంధ్ర ఫ్రంట్ అధ్యక్షుడు ప్రజల గుండె చప్పుడు తెలిసిన నాయకుడు జగన్. జైలులో ఉన్నా..ఆస్పత్రిలో ఉన్నా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. జగన్ దీక్షను యువత స్వాగతిస్తోంది. చంద్రబాబు బస్సు యాత్ర పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ఆయన సమైక్య వాదా కాదా అనేది స్పష్టం చేసి బస్సు యాత్ర చేయాలి. లేనిపక్షంలో యాత్రను అడ్డుకుంటాం. ప్రజల కోసం ఏమైనా చేసే వ్యక్తి జగన్ కుంచా అశోక్, ప్రైవేటు ఉద్యోగి, ఒంగోలుసమైక్యాంధ్ర కోసం జగనన్న చేపట్టిన నిరాహార దీక్షకు యువత అంతా సంఘీభావం తెలుపుతోంది. ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా ప్రజా సమస్యలపై ఏ నాయకుడు ఇలా దీక్ష చేయలేదు. ఒక్క జగనే ప్రజల కోసం ఏమైనా చేస్తాడని మేమంతా నమ్ముతున్నాం. రాష్ట్రాన్ని విభజిస్తే విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతాం. నీటి సమస్యతో అభివృద్ధి కుంటుపడుతుంది. మేమంతా జగన్ వెంటే.. చప్పిడి విజయమ్మ, ఒంగోలు ఆస్పత్రిలో ఉండి కూడా జగనన్న ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన కోసం మేం ఏం చేయడానికైనా సిద్ధం. సమైక్యాంధ్రను సాధించే వరకు మేమంతా జగన్తో కలిసి ఉద్యమిస్తాం. జగన్ను అక్రమంగా జైల్లో పెట్టారు సంగా బుజ్జమ్మ, ఒంగోలు జగన్ను అక్రమంగా జైల్లో పెట్టించారు. అయినా జనం మనిషి కాబట్టే సమైక్యాంధ్ర కోసం ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రజల కోసం తపించే మహోన్నత వ్యక్తి జగన్.