stunt
-
కారుపై మట్టితో యువకుడి స్టంట్.. పోలీసుల దెబ్బకు తిక్క కుదిరింది!
సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ప్రతిఒక్కరూ క్రేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. షార్ట్స్, రీల్స్ చేస్తూ తొందరగా పాపులారిటీ తెచ్చుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఈ క్రమంలో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా యువత స్టంట్ల పేరుతో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి తన కారుతో విచిత్రమైన ప్రయోగం చేసి చిక్కుల్లో పడ్డాడు. ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో ఈ ఘటన జరిగింది. ముందలి గ్రామానికి చెందిన ఇంతేజార్ అలీ అనే వ్యక్తి తన మహీంద్రా థార్ కారు పైకప్పుపై పార సాయంతో మట్టిని నింపాడు. తర్వాత రోడ్డు మీద రాంగ్ రూట్లో అతివేగంతో ప్రయాణించాడు. దీంతో గాలికి ఆ మట్టి పైకి ఎగిరింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింటా వైరల్గా మారాయి.ఈ వీడియోను చూసిన అనేక మంది స్టంట్ చేసిన యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ పుటేజీ అధారంగా యువకుడిని మీరట్ పోలీసులు పట్టుకున్నారు. అతనిక రూ. 25 వేల చలాన్ విధించారు. मेरठ में THAR पर मिट्टी चढ़ाकर युवक ने दिखाया स्टंटpic.twitter.com/PqBGtMJ935— Priya singh (@priyarajputlive) November 29, 2024 -
రజనీకాంత్... స్టెంట్ కథ
అయోర్టిక్ అన్యురిజమ్ గురించి తెలుసుకునే ముందర అసలు అన్యురిజమ్స్ అంటే ఏమిటో చూద్దాం. బెలూన్ ఊదినప్పుడు అంతటా అది సాఫీగా సాగుతుంది. కానీ ఎక్కడైనా బెలూన్ గోడలు పలుచగా ఉన్నచోట అక్కడ అది ఉబ్బినట్లు అవుతుంది. అదే తరహాలో రక్తనాళాలు కూడా పలుచబారినచోట బలహీనంగా ఉండి ఉబ్బినట్లుగా అయిపోతాయి. ఇలా రక్తనాళాలు పరచబారి ఉబ్బినట్లుగా అయి΄ోవడాన్ని అన్యురిజమ్స్ అంటారు. ఉబ్బిన చోటను బట్టి పేరు... మెదడు, కడుపు మొదలుకొని, కాళ్లవరకూ రక్తనాళాలు ఎక్కడైనా బెలూన్లా ఉబ్బవచ్చు. ఉబ్బిన చోటును బట్టి డాక్టర్లు వాటికి పేరు పెడతారు. ఉదాహరణకు మెదడులో ఉబ్బితే సెరిబ్రల్ అన్యురిజమ్స్ లేదా మామూలుగా అన్యురిజమ్స్ అని వ్యవహరిస్తారు. కడుపు భాగంలో ఉబ్బడాన్ని ‘అబ్డామినల్ అన్యురిజమ్’ అని, ఛాతీలో జరిగితే ‘థొరాసిక్ అన్యురిజమ్’గా పేర్కొంటారు. ఇప్పుడు రజనీకాంత్ విషయంలో ‘అయోర్టా’లోని రక్తనాళాలు ఉబ్బడం వల్ల దాన్ని అయోర్టిక్ అన్యురిజమ్గా పేర్కొంటారు. అన్యురిజమ్ ఉన్న ప్రదేశాన్ని బట్టి లక్షణాలిలా...గొంతు బొంగురుపోవడం ∙మింగడంలో ఇబ్బంది గొంతు వాపు ఛాతీపై భాగంలో లేదా ఛాతీ వెనకాల వీపు భాగంలో నొప్పి వికారం, వాంతులు ∙గుండె వేగంగా కొట్టుకోవడం (టాకికార్డియా). నిర్ధారణ... అయోర్టిక్ అన్యురిజమ్ని గుర్తించడానికి అల్ట్రాసౌండ్ మొదటి పరీక్ష. ఇందులో అయోర్టిక్ అన్యురిజమ్ కనిపిస్తే దాన్ని నిర్ధారణ చేయడానికి సీటీ స్కాన్ గాని, ఎమ్మారై గాని, యాంజియోగ్రామ్ గాని చేస్తారు. వాటి సరైన పరిమాణం, ఎంతభాగం ఉబ్బింది అనే విషయాలు సీటీస్కాన్ లేదా ఎమ్మారైలో తెలుస్తాయి. చికిత్సలు : ∙అన్యురిజమ్ కనుగొనగానే దీనికి తక్షణం శస్త్రచికిత్స అవసరం ఉండదు. అయితే అది చిట్లిపోకుండా జాగ్రత్త కోసం రక్త΄ోటును నియంత్రణలో ఉంచేందుకు మందులు వాడతారు. అప్పటి నుంచి డాక్టర్లు అన్యురిజమ్ పెరుగుదలను తరచూ సీటీ స్కాన్ చేస్తూ గమనిస్తూ ఉంటారు. ఏడాదిలో అది 0.5 సెం.మీ. నుంచి 1 సెం.మీ. పెరిగితే, అప్పుడు దానికి రిపేరు చేయాల్సి ఉంటుంది. (సైజు ఎంతన్నది కాకుండా దాని పెరుగుదల రేటును బట్టి ఈ రిపేరు జరగాలి). ∙ఐదు సెంటీమీటర్ల లోపు ఉండే అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్ కి మందులతోనే చికిత్స చేస్తారు. 5.5 సెంటీమీటర్ల పరిమాణం దాటినప్పుడు వాటికి ఆపరేషన్ గాని లేదా స్టెంట్ గాని ఉపయోగించి చికిత్స చేస్తారు. అయోర్టిక్ అన్యురిజమ్ పరిమాణం ఆరు నెలల్లో 0.5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు లేదా అయోర్టిక్ అన్యురిజమ్ వల్ల లక్షణాలు కనబడుతున్నప్పుడు లేదా అన్యురిజమ్ పగిలిపోయే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు. స్టెంటింగ్ విధానం: ఈ ప్రక్రియలో కాలు ద్వారా ఒక లోహపు స్టెంట్ ని అయోర్టిక్ అన్యురిజమ్ లోకి ప్రవేశపెట్టడం ద్వారా అన్యురిజమ్ చికిత్స చేస్తారు. సుమారుగా రెండు గంటలు పట్టే ఈ ప్రక్రియని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు నిర్వర్తిస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తయిన రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. తర్వాత రక్తం పల్చగా అయ్యే మందులు కొంత కాలం ΄ాటు వాడాలి. ప్రక్రియ సజావుగా సాగితే కాంప్లికేషన్ ఉండే అవకాశం బాగా తక్కువ. ప్రస్తుతం రజనీకాంత్కు చేసిన చికిత్స ఇదే. శస్త్రచికిత్స ఎప్పుడంటే... ∙బాధితులు భారీ బరువులెత్తడం, ఫర్నిచర్ కదపడం, ఛాతీపై బరువు పడే పని చేయడం వంటి అంశాలు అన్యురిజమ్పై ప్రభావం చూపవచ్చు. ఈ సమయాల్లోగానీ లేదా ఇతరత్రాగానీ అన్యురిజమ్ హఠాత్తుగా చిట్లితే కార్డియోథొరాసిక్ సర్జన్లు అప్పటికప్పుడు శస్త్రచికిత్స నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సను కొంతకాలం వాయిదా వేసేందుకు కూడా స్టెంటింగ్, ఆర్టిఫిషియల్ గ్రాఫ్టింగ్ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలను డాక్టర్లు ఎంచుకుంటారు. అంటే బాధితుల పరిస్థితిని బట్టి ఏ ప్రక్రియను అనుసరించాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ∙కారణాలు... హైపర్టెన్షన్ (హైబీపీ) ∙రక్తనాళాల గోడలు మందంగా మారడం (అథెరోస్కి›్లరోసిస్); అలాగే రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోవడంవల్ల రక్తనాళం గోడపై ఒత్తిడి పడి ఉబ్బు వచ్చే అవకాశం / ముప్పు ఎక్కువ ∙వృద్ధాప్యం (వయసు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాల గోడల్లో మార్పులు వస్తూ అవి బిరుసుగా, మందంగా మారుతుంటాయి) ∙కొన్ని కనెక్టివ్ టిష్యూ జబ్బులు పోగతాగే అలవాటు (దీనివల్ల అయోర్టా గోడకు గాయమై చిట్లే ప్రమాదం ఎక్కువ) జన్యుపరమైన కారణాలతో పుట్టుకతోనే వచ్చే మార్ఫన్ లేదా ఎహ్లర్–డాన్లోస్ సిండ్రోమ్ వంటి వ్యాధుల కారణంగా.లక్షణాలు... నిజానికి తొలిదశల్లో అన్యురిజమ్స్తో ఎలాంటి లక్షణాలూ... అంటే నొప్పి, ఇతరత్రా ఇబ్బందులు కనిపించకపోవచ్చు. పలచబడిన చోట మరింత బలహీనపడుతూ, ఉబ్బిన భాగంలో ఉబ్బు మరింతగా పెరుగుతుంటుంది. సాధారణంగా ఇతర ఆరోగ్యసమస్యల గురించి వెదుకుతున్నప్పుడు ఇవి అనుకోకుండా బయటపడవచ్చు. అన్యురిజమ్స్ బాగా పెరిగి, పక్కనున్న అవయవాలపై ఒత్తిడి కలిగించవచ్చు లేదా బాగా పలుచబడిపోయిన రక్తనాళం అకస్మాత్తుగా చిట్లవచ్చు. దీన్ని అయోర్టిక్ డిసెక్షన్ అంటారు. ఈ అన్యురిజమ్ పగిలి తీవ్ర రక్తస్రావం జరిగి, ప్రాణాపాయ పరిస్థితీ ఏర్పడవచ్చు. -
ఫ్రీ బస్సు.. సీటు కోసం అక్క స్టంట్లు
-
రైలుకు వేలాడుతూ స్టంట్లు, కట్ చేస్తే..
సరదా మాటున విషాదం నెలకొంటున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. అయినా సోయి లేని పనులు చేస్తున్నారు కొందరు. అలా ఓ కుర్రాడు రైలుకు వేలాడుతూ స్టంట్లు చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యి పోలీసుల దాకా వెళ్లింది. అతన్ని వెతుక్కుంటూ ఆ కుర్రాడి ఇంటికి వెళ్లిన పోలీసులు.. చివరకు అక్కడి దృశ్యం చూసి కంగుతిన్నారు. ముంబైలోని సెవ్రీ రైల్వే స్టేషన్కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానిలో ఓ కుర్రాడు ముంబై లోకల్ ట్రైన్ డోర్ దగ్గర వేలాడుతూ విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో రైల్వే పోలీసులు ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టారు. ఆ కుర్రాడి ఆచూకీ తెలుసుకున్నారు. అయితే ఆ కుర్రాడిని ఒక చేయి, ఒక కాలు కోల్పోయిన స్థితిలో చూసి షాకయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం వాడాలాలోని ఆంటోప్ హిల్లో నివసిస్తున్న ఫర్హత్ అజా షేక్ అనే కుర్రాడిని లోకల్ రైలులో స్టంట్ చేసిన వ్యక్తిగా ఆర్పీఎఫ్ పోలీసులు కనుగొన్నారు. స్టంట్ చేస్తుండగా ఆ కుర్రాడు ఒక కాలు, ఒక చేయిని కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.ఈ కుర్రాడి స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన దరిమిలా రైల్వే పోలీసులు జూలై 14న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ కుర్రాడు ముంబైలోని ఆంటోప్ హిల్లో ఉంటున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం వారు అతని ఇంటికి వెళ్లారు. అక్కడ ఆ కుర్రాడు చేయి, కాలు కోల్పోయి కనిపించడంతో కంగుతిన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. #MumbaiAttn : @RailMinIndia @drmmumbaicr @grpmumbai @RPFCR @Central_Railway @cpgrpmumbaiSuch Idiots performing Stunts on speeding #MumbaiLocal trains are a Nuisance just like the Dancers inside the trains.Should be behind Bars.Loc: Sewri Station.#Stuntmen pic.twitter.com/ZWcC71J44z— मुंबई Matters™ (@mumbaimatterz) July 14, 2024 -
బస్సు కింద పడ్డ బ్రతికి బట్ట కట్టిండు
-
కొంపముంచిన స్టంట్: ఏకంగా 29వ అంతస్థు నుంచి
సోషల్ మీడియాకోసం చేసిన ఒక యువ స్కైడైవర్ సాహసం విషాదాంతమైంది. 29 అంతస్తుల అపార్ట్మెంట్ బ్లాక్ పైకప్పు నుండి డైవింగ్ చేస్తూన్న క్రమంలో 33 ఏళ్ల బ్రిటీష్ బేస్ జంపర్ ప్రాణాలను కోల్పోయాడు. థాయ్లాండ్లోని పట్టాయాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేంబ్రిడ్జ్షైర్కు చెందిన నాథీ ఓడిన్సన్ (33) శనివారం రాత్రి 29 అంతస్తుల భవనంపై నుంచి దూకాడు. ఈ సమయంలో పారాచూట్ తెరుచుకోకపోవడంతో ముందు చెట్టును బలంగా ఢీకొట్టి, ఆ తరువాత నేలపై పడి దుర్మరణం పాలయ్యాడు. సోషల్ మీడియా కోసం చేసిన ఈ స్కై డైవింగ్ వీడియో స్టంట్ తీరని విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు ఈ ఘటనపై ఫారెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. నేథన్ మృతి గురించి పోలీసులు బాంకాక్లోని బ్రిటన్ ఎంబసీకి సమాచారం అందించారు. నేథన్ కుటుంబసభ్యులను సంప్రదించేందుకు ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి సాహసోపేత వీడియోలను నాతీస్ స్కై ఫోటోగ్రఫీ పేరుతో ఇన్స్టా, ఫేస్బుక్ పేజీల్లో గతంలో చాలానే షేర్ చేశాడు. అంతేకాదు ఇలాంటి సాహసాలు చేయాలనుకునే వారికి సాయపడుతూ ఉంటాడు కూడా. స్కైడైవింగ్లో ఎన్నోఏళ్ల అనుభవం ఉన్న ఓడిన్సన్ దుర్మరణంపై అభిమానులు విచారం వ్యక్తం చేశారు. నిబంధనల్లో నిర్లక్ష్యం వహిస్తే.. జరిగేది రామోజీ ఫిలిం సిటీ ఘటనే ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ప్రమాదం తీవ్ర నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. ఈ ప్రమాదంలో అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈవో దుర్మరణం పాలయ్యారు. లైమ్లైట్ గార్డెన్లో విస్టెక్స్ ఆసియా కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకలను గ్రాండ్గా ప్లాన్ చేశారు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, భద్రతా ఏర్పాట్ల కొరత కారణంగా టెక్ సంస్థ సీఈవో సంజయ్ షా ప్రాణాలు పోయాయి. అలాగే ఈ సంస్ధ ప్రెసిడెంట్ దాట్ల విశ్వనాథ్ అలియాస్ ఆసుపత్రి పాలైనారు. సమయానికి అంబులెన్స్ కూడా అందుబాటులోలేదని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. (చదవండి : రామోజీ ఫిల్మ్ సిటీపై కేసు) View this post on Instagram A post shared by Nathy (@nathyskyphotography) -
యూట్యూబర్ క్రేజీ స్టంట్: ఏడు రోజులు సజీవ సమాధి, చివరికి...!
పాపులారిటీ కోసం, డేర్డెవిల్ అని నిరూపించుకునేందుకు ఏమైనా చేయడానికి యూట్యూబర్లు ఏమాత్రం తగ్గడం లేదు. 'కిల్ బిల్'లో ఉమా థుర్మాన్ పాత్ర తరహాలో తాజాగా ఒక పాపులర్ యూట్యూబర్ ఒళ్లు గగుర్పొడిచే సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా ఏడు రోజులపాటు తనను సజీవ సమాధి చేసుకున్నాడు. అవును మీరు చదివింది నిజమే. వెన్నులో వణుకు పుట్టించే ఈ స్టంట్కోసం ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాడు. రెండు రోజుల్లోనే ఈ వీడియో 64 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. వివరాలను పరిశీలిస్తే బీస్ట్గా పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్సన్ ఈ క్రేజీ స్టండ్ చేశాడు. ఏడు రోజులపాటు శవపేటిక లాంటి డబ్బాలో భూగర్భంలో ఉండిపోయాడు. తన 212 మిలియన్ల యూట్యూబ్ సబ్స్క్రైబర్లను ఫిదా చేయాలనే ఆలోచనతోనే ఈ స్టంట్ చేశాడు. చివరికి అదో మానసిక వేదనరా బాబు ఇలా చేయకండి అంటూ తన ఫోలవర్లకు సూచించాడు. ఈ ఫీట్కు తన స్నేహితులతో కలిసి ఎక్స్కవేటర్ని ఉపయోగించి శవపేటిక పైన 20వేల పౌండ్ల మట్టిని పోయించాడు. "రాబోయే ఏడు రోజులు నా జీవితాన్ని ఈ శవపేటికకు అప్పగిస్తున్నాను." అంటూ లోపలికి వెళ్లాడు. అయితే పైన ఉన్న తన టీంతో కమ్యూనికేట్ చేయడానికి వాకీ-టాకీని ఉపయోగించాడు. ఎన్ని చేసినా ఏడు రోజుల పాటు అలా ఉండటం అంటే మాటలా. చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పనైంది. చాలా నీరసించిపోయాడు. కాళ్లలో రక్తం గడ్డకట్టి, నిలబడలేకపోయాడు. అదృష్టవశాత్తూ ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ ఎదురు కాలేదు. 2021లో 50 గంటల పాటు సజీవంగా సమాధి అయ్యి రికార్డు కొట్టాలని ప్రయత్నించాడు.2012 నుండి యూట్యూబ్లో యాక్టివ్గా ఉన్నప్పటికీ, 2018లో బీస్ట్ బాగా పాపులర్ అయ్యాడు. అనేక విన్యాసాలు చేయడంతో పాటు, డొనాల్డ్సన్ వివాదాస్పదమైన దాతృత్వ చర్యలతో వార్తల్లో నిలిచాడు. 5లక్షల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ఆఫ్రికా అంతటా 100 బావుల నిర్మాణం పేరుతో డబ్బులు వసూలు చేయడం విమర్శలకు తావిచ్చింది. దీనికి సంబంధించినవ వీడియోను యూట్యూబ్లో షేర్ చేశాడు.పారదర్శకమైన శవపేటికలో వీడియోను రికార్డ్ చేయడానికి కెమెరాలు సహా అవసరమైన వస్తువులతో బీస్ట్ని నెమ్మదిగా భూమిలోకి దిపుతారు. ఈ సందర్బంగా ఒక్కోసారి బీస్ట్ భావోద్వేగానికి లోనయ్యాడు. బాత్రూమ్, సహా తన దినచర్య వివరాలనుషేర్ చేశాడు. వీడియో చివరలో ఏడు రోజుల తరువాత సూర్యుడిని చూస్తున్నా..ఈ అనుభవాన్ని వర్ణించలేను అనడంతో వీడియో ముగుస్తుంది. -
క్రీడా ఉత్సవంలో అపశ్రుతి.. ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి
చంఢీగర్: పంజాబ్ గురుదాస్పూర్లోని గ్రామీణ క్రీడా ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టంట్ చేస్తూ ఓ యువకుడు(29) ట్రాక్టర్ కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. Video | Man Crushed To Death Performing Tractor Stunt During Punjab Sports Fair Read here➡️https://t.co/TZIq7d6bvw pic.twitter.com/V2z6beZzey — NDTV (@ndtv) October 29, 2023 ఫతేఘర్ చురియన్ నియోజకవర్గంలోని సర్చూర్ గ్రామంలో ట్రాక్టర్ స్టంట్స్ క్రీడా ఉత్సవాలు జరిగాయి. ఈ క్రమంలో సుఖ్మన్దీప్ సింగ్ అనే యువకుడు స్టంట్స్ చేసే క్రమంలో మరణించాడు. స్టంట్స్ చేసే క్రమంలో సుఖ్మన్దీప్ ట్రాక్టర్పైకి ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: కేరళ పేలుళ్లు.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు -
అయ్బాబోయ్... ఇదేం డాన్సండీ!
ఖాళీ గ్యాస్ సిలిండర్ అయినా సరే, నెత్తి మీద పెట్టుకోవడం కష్టం. అలాంటింది డ్యాన్స్ చేయాలాంటే ‘అయ్ బాబోయ్’ అంటాం. దుర్గ అనే ఈ మహిళ మాత్రం ‘అయామ్ ఓకే’ అంటూ నెత్తి మీద గ్యాస్బండ పెట్టుకొని చిన్న స్టీలు బిందె ఎక్కి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో 23 లక్షల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘ఇలాంటి డేంజరస్ స్టంట్లు చేయవద్దు’ అంటూ నెటిజనులు ఆమెను హెచ్చరించారు. కొందరు మాత్రం ఆమె ‘బ్యాలెన్సింగ్ స్కిల్స్’కు భేష్ అన్నారు. ‘ఈ డేంజరస్ డ్యాన్స్ను పొరపాటున కూడా అనుకరించవద్దు’ అంటూ కొందరు హెచ్చరిక కామెంట్లు పెట్టారు. -
జాతీయ రహదారిపై కారు స్టంట్లు.. యువకుల పిచ్చి చేష్టలు..
ఢిల్లీ: ఢిల్లీ-మీరట్ జాతీయ రహదారిపై కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు. దేశ ప్రధాన రహదారిపై కారుతో చక్కర్లు కొడుతూ తోటి ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించారు. రద్దీగా ఉండే రహదారిపై యువకుల చేష్టలతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. వీడియోలో చూపిన విధంగా కొందరు యువకులు కారులో ప్రయాణిస్తున్నారు. అయితే.. సవ్యమైన దిశలో కాదు. రోడ్డుకు అడ్డంగా చక్కర్లు కొట్టారు. 25 సెకన్ల వీడియోలో చూపిన విధంగా రౌండ్లు వేస్తూ ఇతర ప్రయాణికులు వెళ్లకుండా ఇబ్బంది కలిగించారు. వీడియోలో యువకుల పిచ్చి చేష్టలకు భయపడిన తోటి ప్రయాణికులు కాసేపు ఎటూ వెళ్లకుండా అక్కడే నిలుచుని ఉండిపోయారు. Car stunt on Delhi Meerut Expressway#CarStunt #Meerut #Delhi #DelhiMeerutExpressway #viralvideo #NoConfidenceMotion #Suspended #DerekOBrien #DerekOBrienSuspended #DreamGirl2On25thAugust #DareToBeBold #AlluArjun #ElvishYadav #Adaniports pic.twitter.com/4NBGCgqlrp — Human Rights Reform Org. (@hqHumanRights) August 8, 2023 కారులో ఇద్దరు యువకులు బయటికి వేలాడారు. మరో ఇద్దరు కారులో కూర్చున్నారు. కనీసం జాతీయ రహదారి అనే జ్ఞానం లేకుండా రోడ్డుపై అడ్డంగా చక్కర్లు కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. పోలీసులు స్పందించారు. దోషులకు శిక్ష తప్పదని చెప్పారు. ఇదీ చదవండి: వీల్ ఛైర్లో మన్మోహన్సింగ్.. కాంగ్రెస్పై బీజేపీ ఫైర్ -
వీడు హీరో అయితే.. ఏ మిషనైనా పాజిబుల్!
4 వేల అడుగుల ఎత్తున్న ఒక పర్వతం.. అక్కడ ఫుట్పాత్ సైజులో ఉన్న స్టీల్ ర్యాంప్.. దానిపై ఒక వ్యక్తి 200 కిలోమీటర్ల వేగంతో బైక్పై దూసుకెళ్తున్నాడు.. అందరూ అలా నోరెళ్లబెట్టి చూస్తున్నారు.. అంతే.. ఒక్కసారిగా పర్వతం మీద నుంచి జంప్ చేసేశాడు.. అందరి గుండెలు దడదడలాడుతున్నాయి.. మృత్యువుకు అతనికి మధ్య ఉన్నది ఒక్క పారాచూట్ మాత్రమే.. దాన్ని సమయానికి తెరవకుంటే.. అతడి శవం ఆనవాలు కూడా దొరకదు.. పారాచూట్ తెరుచుకుంది. అతడు క్షేమంగా ల్యాండ్ అయ్యాడు. ప్రపంచ సినిమా చరిత్రలోనే అతిపెద్ద స్టంట్గా పేరొందిన ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఆ వ్యక్తి.. టామ్ క్రూజ్.. హాలీవుడ్ డాషింగ్ హీరో.. వయసు జస్ట్ 61 ఏళ్లు!!! మిషన్ ఇంపాజిబుల్ సిరీస్లోని తాజా చిత్రం డెడ్ రెకనింగ్ పార్ట్ 1 కోసం ఈ సాహసాన్ని చేశారు. సినిమాలో కేవలం 60 సెకన్లు ఉండే ఈ సన్నివేశం కోసం రిహార్సల్స్ మూడేళ్ల క్రితం ప్రారంభమయ్యాయని ఈ చిత్ర స్టంట్ కోఆర్డినేటర్ ఈస్ట్వుడ్ చెప్పారు. శిక్షణలో భాగంగా మన హీరో 13 వేల మోటార్ క్రాస్ జంప్స్, 500 స్కైడైవ్స్ చేశారట. ‘200 కిలోమీటర్ల వేగంతో బైక్ మీద వెళ్లి.. పర్ఫెక్ట్గా జంప్ చేయాలి. అదే సమయంలో గాలిలో కరెక్టు టైంకి బైక్ను వదిలేయాలి.. భూమికి 500 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు పారాచూట్ను తెరవాలి. సరిగా బాలెన్స్ చేసుకుంటూ నేలపై దిగాలి. ఇందులో ఏ ఒక్క విషయంలో చిన్నపాటి తేడా జరిగినా ఇక అంతే.. టామ్కు చిన్నప్పటి నుంచి బైక్ డ్రైవింగ్ మీద మంచి గ్రిప్ ఉంది. అది ఇక్కడ ఉపయోగపడింది’ అని ఈస్ట్వుడ్ తెలిపారు. మీకో విషయంలో తెలుసా..? ఒక బైక్ మీద వేగంగా వెళ్లి.. పర్వతంపై నుంచి దూకి.. వెంటనే పారాచూట్ తెరిచి.. ల్యాండ్ అవ్వాలన్నది టామ్ క్రూజ్ చిన్నప్పటి కల అట. చిన్నప్పుడు ఇంట్లో ర్యాంప్లాంటిది ఏర్పాటు చేసుకుని.. సైకిల్ మీద ఇలా జంప్ చేసిన ఘటనలు ఎన్నోనట. అలాగే దెబ్బలు తిన్న ఘటనలు కూడా.. ప్రాణాలకు తెగించి మరీ చేసిన ఈ స్టంట్తో ఇన్నాళ్లకు ఆయన కల తీరిందన్నమాట. ఈ వీడియోను నెట్లో చూసినోళ్లంతా సూపర్ అనేస్తున్నారు. ఏంటీ సింపుల్గా సూపరా.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఓవరాక్షన్ చేస్తే అడ్రస్ గల్లంతే
-
ముద్దుకోసం రిస్క్ చేసిన హనీరోజ్
-
27 అంతస్థుల భవనంపై దూకుతూ పిల్లల డేంజరస్ స్టంట్లు
-
నడిరోడ్డుపై కారు ఆపినందుకు..ఊహించని రేంజ్లో జరిమానా!
ఇటీవల కొంతమంది సోషల్మీడియా వినియోగదారులు మంచి మంచి వీడియోలతో రాత్రికి రాత్రి మంచి స్టార్డమ్ తెచ్చుకుంటున్నారు. ఆ క్రమంలో వాళ్లు చేసే పిచ్చి స్టంట్లు వారిని ఇబ్బందిపాలు చేయడం లేక కటకటాల పాలుచేయడమో! జరుగుతోంది. అచ్చం అలాంటి పనే ఇక్కడొక యువతి చేసి భారీ జరిమానాను ఎదుర్కొంటోంది. ఇన్స్టాగ్రాంలో మంచి ఫేమ్ ఉన్న ఆ యువతి ఒక వీడియో కోసం అని ఒక పిచ్చి స్టంట్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఆ వీడియోని చూసిన పోలీసులు ఆమెకు భారీగా జరిమాన విధించడమే గాక లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటు చేసుకుంది. ఆమె కారుని హైవే మధ్యలో ఆపి హిరోయిన్ రేంజ్లో ఫోజులు కొడుతున్న ఓ వీడియోని ఇన్స్టాగ్రాంలో పోస్ చేసింది. ఐతే నెట్టింట వైరల్ అవుతున్న ఆవీడియోని చూసి ఘజియాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో పోలీసలు సదరు మహిళను ఇన్స్టాగ్రాంలో మంచి ఫాలోవర్స్ ఉన్న వైశాలి చౌదరి ఖుటైల్గా గుర్తించారు. అంతేగాదు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏకంగా రూ. 17 వేలు జరిమానా విధిస్తూ గట్టి షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. ఈ మేరకు సాహిబాద్ ఏసీపీ ట్విట్టర్ వేదికగా ఠాణా సాహిబాద్ ప్రాంతంలో ఒక యువతి కారుని నడిరోడ్డుపై ఆపి ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకుగానూ రూ.17 వేలు జరిమాన విధిస్తున్నట్లు చలానా పంపినట్లు తెలిపారు. అంతేగాదు ఇందుకు గాను ఆ యువతిపై తాము న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఏసిపీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Vish ♥️ (@vaishali_chaudhary_khutail) (చదవండి: ఆ స్కూల్లో ఒకే ఒక్కడు స్టూడెంట్!) -
సైకిల్పై షాకింగ్ స్టంట్స్.. గూస్బంప్స్ తెప్పించే వీడియో
-
అగ్నితో చెలగాటమా? దెబ్బకు ముఖం కాలిపోయిందిగా..!
ఉత్సవాలు, వేడుకల్లో కొందరు వివిధ రకాల స్టంట్స్ చేసి ఆకట్టుకుంటారు. అలాగే, ఓ యువకుడు అగ్నితో రిస్కీ స్టంట్ చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వేదికపై కాగడాను పట్టుకుని, నోటిలో పెట్రోల్ పోసుకుని దానిపైకి ఊదాలనుకున్నాడు. అది వికటించి ముఖానికి మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ముఖానికి మంటలు అంటుకున్న వెంటనే చేతిలోని కాగడాను కింద పడేశాడు ఆ యువకుడు. పక్కనే ఉన్న కొందరు వెంటనే స్పందించి గడ్డానికి అట్టుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. చేతులతో నొక్కిపట్టి మంటలను ఆర్పేశారు. ఈ వీడియోను రవి పటిదార్ అనే వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. అయితే, ఇది ఎక్కడ జరగిందనే విషయం తెలియదు. అక్టోబర్ 6న పోస్ట్ చేయగా ఇప్పటి వరకు 12.3 మిలియన్ల మంది వీక్షించారు. ఇలా ప్రాణాలను పణంగా పెట్టి చేసే స్టంట్లకు దూరంగా ఉండాలని కొందరని సూచించారు. అగ్నితో ఆటలాడొద్దు, నీవే కాలిపోతావ్ అంటూ మరొకరు రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Ravi Patidar (@ravipatidar603) ఇదీ చదవండి: కరోనా రోగుల పట్ల చైనా కర్కశత్వం.. పశువులకన్నా హీనంగా క్రేన్ల సాయంతో..! -
భయానక స్టంట్: ఏకంగా కింగ్ కోబ్రా తలపై ముద్దు: వీడియో వైరల్
ఇటీవల కాలంలో పాములతో రకరకాల స్టంట్లు చేస్తున్నారు. ఆ స్టంట్లలో చాలా వరకు బెడిసి కొట్టిన ఘటనలే చూశాం. అదీగాక విషసర్పలతో కామెడీ చేస్తే ప్రాణాలకే ముప్పు అని చాలా విషయాల్లో ప్రూవ్ అయ్యింది కూడా. ఇటీవలే ఒక వ్యక్తి నాగుపాము నుదుట ముద్దు పెట్టుకోబోతే రివర్స్లో కాటేసిన సంఘటన చూశాం. అయిన పలువురు స్నేక్ క్యాచర్లు ఇలాంటి స్టంట్లే చేస్తున్నారు. ఇక్కడొక స్నేక్ క్యాచర్ ఏకంగా కింగ్ కోబ్రా తలపై ముద్దు పెట్టే స్టంట్ చేశాడు. వివరాల్లోకెళ్తే..ఈ హార్ట్ రైజింగ్ స్టంట్ వీడియోని సౌరబ్ జాదవ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఆ వీడియోలో ఒక వ్యక్తి కింగ్ కోబ్రా తలపై ముద్దు పెట్టుకునే స్టంట్ చేశాడు. ఈ స్టంట్ చేసిన వ్యక్తి వావా సురేష్ అనే కేరళ వాసి. అతను ఇప్పటివకరకు సుమారు 38 వేల విషసర్పాలను పట్టుకున్నాడు. మూడువేల సార్లుకు పైగా పాము కాటుకి గురయ్యాడు. అంతేగాదు సుమారు 190కి పైగా కింగ్ కోబ్రాలను రక్షించాడు. దీంతో అతన్ని అందరూ కేరళ స్నేక్ మ్యాన్గా పిలుస్తుంటారు. అసలు ఈ వీడియో చూస్తే.. అతను ఎలా ఉన్నా టెన్షన్తో చూస్తున్న మనకు గుండె ఆగిపోయినంత భయం వేస్తుంది. View this post on Instagram A post shared by Saurabh Jadhav Jadhav (@10_viper_21) (చదవండి: మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..) -
జలపాతానికే రంగులు వేసే స్టంట్...పర్యావరణ అధికారులు ఫైర్
ఇటీవల కాలంటో స్టంట్ల క్రేజ్ మామాలుగా లేదు. కొంతమంది సోషల్ మీడియా స్టార్డమ్ కోసం ఎలాంటి స్టంట్లు చేస్తున్నామన్నా అవగాహన కూడా లేకుండా చేసేస్తున్నారు. ఆ స్టంట్లు ఒక్కొసారి వారి ప్రాణాలకు లేదా పక్కవారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ఉంటున్నాయి. ఇక్కడొక జంట అయితే ప్రకృతినే పొల్యూట్ చేసే స్టంట్కి ఒడిగట్టారు. దీంతో రంగంలోకి దిగిన పర్యావరణ అధికారులు ఆ జంట ఎవరా? అని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. వివరాల్లోకెళ్తే... బ్రెజిల్కి చెందిన ఒక జంట సహజ సిద్ధమైన జలపాతాలను తమ స్టంట్ కోసం కలుషితం చేశారు. ఇంతకీ ఏం చేశారంటే...జలపాతం సహజంగా పాలనురగాలా కనిపిస్తుంది జౌనా!. ఐతే ఈ జంట నీలి రంగులా కనిపించేలా ఇంకో అమ్మాయి నీలి రంగు ఫోమ్ని జల్లుతూ ఉంటుంది. ఈ స్టంట్ ఉద్దేశ్యం ఏంటంటే..నీలిరంగులో జలపాతం కనిపిస్తే శిశువు మగబిడ్డను సూచిస్తుందని చెబుతూ ఈ స్టంట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో సహజ సిద్ధంగా కనిపించే జలపాతాన్ని కలుషితం చేస్తారా అని నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీంతో బ్రైజిల్ పర్యావరణ అధికారులు ఈ సంఘటనపై ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. అంతేగాదు బ్రెజిల్ పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన గత ఆదివారం సెప్టంబర్ 25న మాటో గ్రాస్ అనే రాష్ట్రంలో చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఆ జంట కలుషితం చేసిన జలపాతం ప్రసిద్ధ టూరిజం ప్రాంతమైన క్యూమా పే నది అని అధికారులు వెల్లడించారు. ఆ నది పశ్చిమ ప్రాంతంలోని తంగారా డా సెర్రా నగరానికి ప్రాథమిక నీటి వనరు అని కూడా స్పష్టం చేశారు. అసలు ఆ గుర్తు తెలియని దంపతులు ఏ ఉత్పత్తులు వినియోగించి జలపాతానికి నీలి రంగు వచ్చేలా చేశారు, పర్యావరణానికి హాని జరిగిందా లేదా అనే దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. É sério que acharam uma boa ideia colocar corante numa cachoeira?! Tantas maneiras de fazer um chá revelação e conseguiram escolher justo uma com impacto ambiental. pic.twitter.com/YePJ0lPhhQ — A Eng. Florestal do YouTube 🌳 (@vanecosta10) September 26, 2022 (చదవండి: ‘డబ్ల్యూడబ్ల్యూఈ’ని తలపించేలా నడి రోడ్డులో మహిళల ఫైట్) -
కార్లు, బైక్తో హిరో మాదిరి స్టంట్లు...ఖైదీలా జైల్లో...
సాక్షి, నొయిడా: ఇటీవల కాలంలో సోషల్ మీడియా స్టార్డమ్ కోసం రకాలరకాల స్టంట్లు చేసి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకన్న ఉదంతాలను చూస్తునే ఉన్నాం. కొన్ని ప్రమాదకరమైన స్టంట్లు రద్దీగా ఉండే రహదారుల్లో చేసి ప్రజలను భయబ్రాంతుకు గురిచేసిన సందర్భాలు కోకొల్లలు. అంతేకాదు ఇలాంటి విన్యాసాలతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యిపోవాలనుకుంటారే తప్ప అవి ఎంత ప్రమాదకరమని కొంచెం కూడా ఆలోచించారు. అలానే ఒక వ్యక్తి ముందు వెనుక ఆలోచించకుండా రద్దీగా ఉండే రహదారుల్లో ఇలాంటి స్టంట్లు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన 21 ఏళ్ల వ్యక్తి సోషల్ మీడియా క్రేజ్ కోసం భయంకరమైన స్టంట్లు చేసి కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు ఆ వ్యక్తి రద్దీగా ఉండే రహదారిలో బాలీవుడ్ సినిమా 'పూల్ ఔర్ చిత్రంలో' హిరో అజయ్ దేవ్గన్ ఎంట్రీ స్టంట్ని చేశాడు. రెండు ఎస్యూవీ కారులపై ఏ మాత్రం భయంలేకుండా నిలబడి ఉండే భయంకరమైన స్టంట్ చేశాడు. అంతేకాదు మోటారు బైక్తో కూడా కొన్ని రకాల భయంకరమైన విన్యాసాలు చేశాడు. ఐతే అతను తన ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పెట్టే స్టంట్లు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీపుటేజ్ల ఆధారంగా సదరు వ్యక్తిని రాజీవ్గా గుర్తించడమే కాకుండా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో స్టంట్ వీడియోలు పోస్ట్ చేసేందుకే ఈ ప్రమాకరమైన స్టంట్ చేసినట్లు చెప్పాడన్నారు. गाड़ियों व बाइक पर खतरनाक स्टंट करने वाले युवक को थाना सेक्टर-113 नोएडा पुलिस द्वारा गिरफ्तार कर स्टंट में प्रयुक्त वाहनों को सीज किया गया।#UPPolice pic.twitter.com/92yYu33O45 — POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) May 22, 2022 (చదవండి: ఇంట్లో అలంకరణకు ఉపయోగించే ప్లవర్వేజ్... ఓ కుటుంబాన్ని కోటిశ్వరులుగా మార్చింది) -
మూడు పాములతో యువకుడి స్టంట్.. చివరకు ఏమైందో చూడండి..
పాములతో వ్యవహరించే సమయంలో ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. రోడ్డుపై, అడవిలో పాములు తమ దారిలో అవి వెళ్తుంటే వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. అలా కాకుండా పాములతో ఆడుకోవాలని చూస్తే మాత్రం.. అచ్చం ఇదిగో ఈ వ్యక్తికి ఎదురైన ఘోర అనుభవమే రిపీట్ అవుద్ది. ఇంతకీ ఏం జరిగిందంటే..కర్ణాటకు చెందిన మాజ్ సయ్యద్ అనే వ్యక్తి స్నేక్ క్యాచర్. అతని యూట్యూబ్ ఛానల్లో పాములకు సంబంధించిన వీడియోలే ఉంటాయి. అయితే ఓసారి అతను పాముల ముందు కూర్చొని వాటితో సహాసాలు చేశాడు. పాముల తోకలను పట్టుకొని లాగడం, వాటిని కదిలించడం చేశాడు. చేతులు, కాళ్లతో పాములను భయపెడుతుండగా ఊహించని విధంగా అందులోని ఓ పాము అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి చేసింది. వ్యక్తి మీదకు జంప్ చేసి అతని మోకాలిని కొరికి పట్టుకుంది. దీంతో షాక్కు గురైన వ్యక్తి పామును లాగేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఎంతకీ విడిచి పెట్టలేదు. చదవండి: ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతిచెందిన కేసులో ట్విస్ట్ This is just horrific way of handling cobras… The snake considers the movements as threats and follow the movement. At times, the response can be fatal pic.twitter.com/U89EkzJrFc — Susanta Nanda IFS (@susantananda3) March 16, 2022 ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా తన ట్విటర్లో పోస్టు చేశారు. ‘పాములను ఇలా హ్యండ్లింగ్ చేయడం భయంకరమైనది. వ్యక్తి చేసిన కదలికలను పాము బెదిరింపుగా భావిస్తుంది, వాటిని అనుసరిస్తుంది. కొన్నిసార్లు పాముల ప్రతిస్పందన ప్రాణాంతకం కావచ్చు’ అని కామెంట్ చేశారు. ఈ వీడియో చూసి నెజటిన్లు భయంకరంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. పాములతో అలా స్టంట్స్ చేయోద్దని హితవు పలుకున్నారు. చదవండి: వలలో పడ్డ రంపం చేప.. వామ్మో చూడాలంటేనే భయమేస్తోంది! -
అత్యంత విషపూరితమైన 11 పాములను నోట్లో కుక్కి.. బాబోయ్!
Dangerous Stunt Of Guinness Records: రికార్డులను బద్దలు కొట్టాలని ఈ జిందగీలో ఎవరికి ఉండదు! ఐతే.. ఇతను చేసిన విన్యాసం ముందు అవన్నీ దిగదుడుపేనని అంటున్నారు నెటిజన్లు.. పాపం! అంతటి ప్రమాదకరమైన స్టంట్ చేసినా ‘మేము గిన్నిస్ రికార్డులో నీ పేరు నమోదు చేయం’ తేల్చిచెప్పారా అధికారులు! ఏం చేశాడో మీరే చూడండి.. అమెరికాలోని టెక్సాస్కు చెందిన జాకీ బిబ్బీ ఏకంగా 11 అత్యంత విషపూరితమైన పాములను నోట్లో కుక్కుకుని ప్రపంచంలోనే సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 2010లో కూడా ఇటువంటి ఫీటే చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు. ఐతే ఇప్పుడు తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసి మరొకమారు రికార్డును తిరగరాయాలని అనుకున్నాడు. కానీ అందుకు గిన్నిస్ బుక్ అధికారులు ససేమిరా అన్నారు. దీనిని సంబంధించిన ఫొటోను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారిక ఫేస్బుక్లో చూడొచ్చు. ఒక నివేదిక ప్రకారం.. జాకీ ఈ పాములన్నీంటినీ నోట్లో కుక్కుకోవడానికి చేతులను ఉపయోగించలేదట. నోటితోనే వాటిని నేరుగా పట్టుకున్నాడట. అర్థమైందా.. ఇదెంతటి ప్రమాదకరమైన స్టంటో! వాటిల్లో ఏ ఒక్కపాము కరచినా అతని ప్రాణాలు పోగొట్టుకునేవాడు. తెలిసి.. తెలిసి ఈ విన్యాసం చేశాడితడు. ఐతే గిన్నిస్ అధికారులు అందుకు భిన్నంగా ఆలోచించారు. ‘ఇకపై ఈ రికార్డును అస్సలు పర్యవేక్షించడం లేదు. ఎందుకంటే.. చాలా మంది ప్రజలు అలాంటి రికార్డు కోసం తమ జీవితాలతో ఆటలాడుకునే ప్రమాదం ఉంది. మరొకరు ఈ స్టంట్ చేయాలని కోరుకోవడంలేదని’ తేల్చిచెప్పారు. నిజమే కదా! సరదా ప్రాణాలను తీసేంతగా ఉండకూడదు.. చదవండి: వింత నమ్మకం.. ఐదేళ్ల కొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికి..! -
మామూలోడు కాదుగా..! గడ్డంతో 63 కేజీల యువతిని ఎత్తాడు.. రికార్డు కొట్టాడు!!
Guinness World Record Man Lifting 63 kg Woman Using Beard: గిన్నీస్ వరల్డ్ రికార్డు తాజాగా ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వృద్ధుడు 63 కేజీల మహిళలను పైకి ఎత్తుతాడు. ఆ.. ఇలాంటివి చాలానే చూశాం.. అనుకుంటున్నారా! అతను ఎత్తింతి చేతులతో కాదు.. అదే ట్విస్ట్!! ఈ వీడియోలో స్టంట్ చేసిన వ్యక్తి పేరు అంటనాస్ కాంట్రిమాస్. అతని గడ్డంకు ఉన్న జుట్టుకు కట్టిన 63.80 కేజీ బరువున్న మహిళను ఏ సపోర్టు తీసుకోకుండా లేపడం కనిపిస్తుంది. మహిళను పైకి ఎత్తేటప్పుడు అతని ముఖంలో బాధ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఐతే ఆ బాధంతా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టడానికే భరించానని అంటున్నాడు ఈ గెడ్డం వీరుడు. దీంతో గడ్డంతో అత్యంత బరువును ఎత్తిన మొట్టమొదటివ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు మిలియన్లలో వీక్షణలు, లక్షల్లో కామెంట్లతో వైరల్ అవుతోంది. ఇది నిజంగా చాలా అద్భుతం, భిన్నమైన ప్రతిభ అని ఒకరు, ఇతని వెంట్రుకలు దేనితో తయారు చేయబడ్డాయో.. ఇంత స్రాంగ్గా ఉన్నాయని మరొకరు సరదాగా కామెంట్ చేశారు. ఏదిఏమైనప్పటికీ ఇతని గడ్డం గురించి నెట్టింట చర్చలు కొనసాగుతున్నాయి. చదవండి: Wild Facts About Octopuses: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!! View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
ట్రైన్ జర్నీలో యువకుడి డేంజరస్ ఫీట్లు.. ఒళ్లు గగుర్పుడిచే దృశ్యాలు
ముంబై: యువత తమ నైపుణ్యాలను, సాహసాలను ప్రదర్శించేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. సమయం చిక్కినప్పుడల్లా స్టంట్లు, విన్యాసాలు ప్రయత్నిస్తుంటారు. బైక్, కారు, రైల్లో ప్రయాణం చేసేటప్పుడు అస్సలు కుదురుగా ఉండరు. హద్దు మీరి సాహసాలు చేసి ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ క్రమంలో ముంబై లోకల్ రైలులో ఓ యువకుడు చేసిన విన్యాసాల వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. వాస్తవానికి ఇది 2015లో చోటుచేసుకోగా తాజాగా ఓ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఇందులో ప్రమాదకరమని తెలిసినా కదులుతున్న రైలు డోర్ వద్ద తన స్నేహితులతో కలిసి నిలబడిన ఓ యువకుడు విన్యాసాలు చేశాడు. ముందుగా రైలు వెనక నుంచి పరుగెత్తకుంటూ వచ్చి రైలు ఎక్కాడు. తరువాత ట్రైన్ డోర్ హ్యాండిల్ను పట్టుకొని మరోవైపు ఊగుతూ కనిపిస్తున్నాడు. అంతటితో ఆగకుండా పదేపదే కిందకు మీదకు దూకడం, దారిలో వచ్చే స్తంభాలను తాకుతూ డేంజరస్ ఫీట్లు చేశాడు. మధ్యలో రైలు నుంచి దూకి గోడపై నడిచి మళ్లీ రైలులోకి రావడం చేశాడు. ఇదంతా తన స్నేహితులతో వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిని చూసిన నెటిజన్లు యువకుడి అజాగ్రతను చూసి షాక్కు గురవుతున్నారు. ఇలాంటి విన్యాసాలు చేయడం చాలా ప్రమాదకరమని, స్టంట్ ప్రయత్నాలు చేసే సమయంలో గాయలు, ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చదవండి: షాకింగ్: ఇద్దరు విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలో ఏకంగా రూ. 900 కోట్లు జమ! వైరల్: బాబోయ్.. బైకుపై 13 మంది.. ఏంటీ వెర్రి పని! Wow #OMG #Madness #trains #Travel @ladbible @HldMyBeer @CrazyFunnyVidzz @Viralmemeguy #Lol #funny @LockerRoomLOL @YoufeckingIdiot @LovePower_page @DailyViralPro @DailyViralPro pic.twitter.com/Tl8nEY9xfn — Cazz inculo (@InculoCazz) September 14, 2021 -
బంగీజంప్..ఇలా ఎప్పుడైనా చూశారా?
మాస్కో: సాధారణంగా బంగీ జంప్ ఎత్తైన ప్రదేశాల నుంచి చేసే ఒక స్టంట్..ఇది చాల ధైర్యం ఉన్నవారు మాత్రమే చేస్తారు. ఈ జంప్ చేసేవారు.. సేఫ్టీ కోసం భుజాలకు, నడుముకు తాడులను కట్టుకుంటారు. అయితే, ఈ వ్యక్తి కాస్త వెరైటీగా ఆలోచించాడు. సేఫ్టీ కోసం పెట్టే కొక్కాన్ని తన పిరుదులకు తగిలించుకున్నాడు. ఇప్పడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతొంది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన రష్యలో చోటుచేసుకుంది. దీనిలో సదరు వ్యక్తికి నిర్వహకులు , నడుముకు తాడును కట్టారు. అదేవిధంగా అతను నడుముకు కొక్కెలు కూడా తగిలించుకున్నాడు. భవనంపైన 50 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా కిందకు జంప్ చేశాడు. అతను,కిందకు పోయే క్రమంలో గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ఆ వ్యక్తి మాత్రం కిందకు సేఫ్టీగానే చేరుకున్నాడు. అయితే, అతని చర్మం ఉందా..లేక..ఊడిపోయిందా! అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు..ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ అక్కడ..దమ్ముంది’ కాబట్టి కొక్కెం తగిలించుకున్నాడు..‘ ఇదేం స్టండ్రాబాబు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, రష్యాలో మరొక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ప్యారాచుట్లో ఎగురుతున్నాడు. ఆ ప్యారాచుట్ హెలికాప్టర్ చివరన చిక్కుకుంది. దీంతో అది.. ఎత్తైన ప్రదేశంలో లాక్కొనిపొయింది. అక్కడ మైనస్20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. దీన్నిగమనించిన గ్రామస్థులు మిలటరీ వారికి సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి అతని ప్రాణాలను కాపాడారు. చదవండి: లేడి దొంగ..బట్టలు జారిపోతున్నా పట్టించుకోలేదు! -
కొంచెం పట్టు తప్పినా ప్రాణాలు దక్కవు
"మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప దాటవు" అని ఓ సామెత. కానీ ఇక్కడ చెప్పుకునే వ్యక్తి విషయంలో దీన్ని రివర్స్లో చెప్పాలేమో! 'చేతలు కోటలు దాటుతాయి.. కానీ మాటలు గడప దాటవు' అని! ఎందుకంటే అతను సాహసాలు చేస్తానంటూ బీరాలు పలకలేదు. సైలెంటుగా పోయి చేయాలనుకున్నది చేసి చూపించాడు. అంతే, కానీ అది చూసిన మనకు ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగిపోతుందేమో అన్న భయం వేయక మానదు. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. కొండంచున వెళ్లి నిలబడ్డాడు. అది కూడా పాదాన్ని సగం కొండకు ఆనించి, మిగతా సగం గాలిలోనే ఉంచాడు. ఆ తర్వాత గాలిలో ఎగిరి పల్టీ కొట్టాడు. (మనం నిద్రిస్తే కరోనా కూడా నిద్రిస్తుందట!) ఈ క్రమంలో అతను లోయలో పడిపోతాడేమోనని మనకు భయం వేసినప్పటికీ.. ఎంతో అనుభవమున్నవాడిలా తిరిగి కొండపైనే దిగాడు. కనీసం అతను ఈ ప్రమాదకర విన్యాసం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్న ఆనవాళ్లూ కనిపించడం లేదు. వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా "అతని ప్రతిభకు మెచ్చుకోవాలా? లేదా మూర్ఖత్వంగా కొట్టిపారేయాలా?" అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 14 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. మెజారిటీ జనాలు అతడిని తిట్టిపోస్తుంటే కొద్ది మంది మాత్రం గ్రేట్ అంటూ పొగుడుతున్నారు. 'స్టంట్ చేస్తున్న వ్యక్తితో పాటు దాన్ని చిత్రీకరిస్తున్న వ్యక్తికి కూడా బుర్ర పని చేయడం లేదు', 'కొంచెం పట్టు కోల్పోయినా ప్రాణాలు దక్కవు' అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. (హుర్రే: ఆర్డర్ చేసిందొకటి.. వచ్చింది మరొకటి) -
కిమ్కి శస్త్ర చికిత్స జరిగిందా ?
సియోల్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ కుడి చెయ్యి మణికట్టుపై సూదితో పొడిచినట్టు ఉన్న గుర్తులు కనిపిస్తున్నా యి కదా ! ఆ గుర్తులు ఏమిటన్న దానిపై సర్వత్రా చర్చ జ రుగుతోంది. 20 రోజుల పాటు కనిపించకుండా పోయిన కిమ్ మే 1న ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అప్పుడు తీసిన ఫొటోల్లో కిమ్ చేతిపై కనిపించే గుర్తులు చూసి ఆయన గుండెకి శస్త్రచికిత్స జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతకు ముందు కిమ్ ఏప్రిల్ 11న ప్రజల మధ్యకి వచ్చినప్పుడు తీసిన ఫొటోల్లో చేతిపై అలాంటి గుర్తులేవీ కనిపించలేదు. గుండెలో రంధ్రాలను పూడ్చడానికి స్టంట్ అమర్చడం కోసం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చేతి ద్వారా కూడా శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతుందని కొందరు వైద్య నిపుణులు వాదిస్తూ ఉంటే మరికొందరు గుండెకి స్టంట్ వెయ్యడానికి చేసే ఇంట్రావీనస్ ప్రక్రియకి అలాంటి గురుతులు పడవని అంటున్నారు. ఆయన గుండెకు ఆపరేషన్ చేయడానికి ముందు ఏవైనా పరీక్షలు జరిగి ఉండవచ్చునని వారు చెబుతున్నారు. అయితే, కిమ్కు సర్జరీ జరిగిందంటూ వస్తున్న వార్తల్ని దక్షిణ కొరియా కొట్టి పారేసింది. కిమ్కి ఎలాంటి శస్త్రచికిత్స కానీ, వైద్య పరీక్షలు కానీ జరగలేదని స్పష్టం చేశారు. -
రైల్లో రిస్కీ స్టంట్, క్షణాల్లో..
సాక్షి, ముంబై : క్షణాల్లో ప్రాణాలు పోతున్నా కొంతమంది యువకుల సాహసాలకు హద్దు, పద్దూ లేకుండా పోతోంది. తాజాగా ప్రమాదమని తెలిసి కూడా డేంజరస్ ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలు డోర్ వద్ద నిలబడి బయటకు వేలాడుతూ ఫీట్ చేశాడో యువకుడు. ఈ ఫీట్ వికటించి అదుపు తప్పి ప్లాట్ఫాం మీద పడి అక్కడికక్కడే చనిపోయాడు. దీన్ని అతని స్నేహితులు వీడియో తీసారు. స్వయంగా రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి సబంధించిన వీడియోను ట్వీట్ చేసింది. డిసెంబర్ 26న ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది. ఈ ప్రమాదంలో దిల్షాన్ అనే యువకుడు మరణించాడని పేర్కొంది. రైలులో ఇలాంటి స్టంట్స్ చేయవద్దు, ఇది చట్టవిరుద్ధం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయని ప్రయాణికులను వారించింది.భద్రతను పట్టించుకోకుండా, కదిలే రైలు ఎక్కడం, కదిలే రైలులోఅనాలోచిత ప్రయోగాలు లాంటివి చేయొద్దని సూచించింది ट्रेन में स्टंट ना करें ये गैरकानूनी है एवं जानलेवा भी सिद्ध हो सकता है। मुंबई में 26 दिसंबर को दिलशान नाम का युवक ट्रेन के बाहर लटक कर स्टंट करते हुए अपनी जान गंवा चुका है। अपनी सुरक्षा की अवहेलना करके ट्रेन के बाहर लटकना,चलती ट्रेन में चढ़ना, हादसे का बुलावा हो सकता है। pic.twitter.com/oGEsqjoka6 — Ministry of Railways (@RailMinIndia) December 30, 2019 -
అద్భుత విన్యాసంలో అకాల మరణం
కొలంబియా వైమానిక దళానికి చెందిన ఇద్దరు సైనికులు అద్భుత విన్యాసం చేస్తూ దురదృష్టవశాత్తు అకాల మరణం పొందారు. సంప్రదాయబద్ధమైన మెడిలిన్ పుష్ప ప్రదర్శన ముగింపు సందర్భంగా ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రదర్శనలో ఇరువురు సైనికులు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశిస్తున్నామని కొలంబియా రక్షణ శాఖ ప్రకటించింది. పుష్ప ప్రదర్శనను పురస్కరించుకుని హెలికాప్టర్ నుంచి వేలాడుతున్న కేబుల్ చివరన జాతీయ జెండాను కట్టారు. ఆ జెండా రెపరెపలాడే విధంగా పై కొసన ఒక సైనికుడు, కింది కొసన ఓ సైనికుడు జాతీయ జెండాను కలిపి పట్టుకొని వేలాడుతుండగా, హెలికాప్టర్ స్థానిక ఓలయ విమానాశ్రయానికి వచ్చింది. వారు అక్కడ దిగాల్సిన సమయంలో హెలికాప్టర్ నుంచి వేలాడుతున్న కేబుల్ తెగిపోయింది. దాంతో ఇద్దరు సైనికులు నేలను ఢీకొని అక్కడికక్కడే చనిపోయారు. దీంతో బంబేలెత్తిన అధికారులు వెంటనే విమానాశ్రయాన్ని మూసివేశారు. మెడిలిన్లో ప్రతిఏట జరిగే పుష్ప ప్రదర్శనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రదర్శనకు అదనపు ఆకర్షణను తేవడానికి, అలాగే దేశభక్తిని చాటి చెప్పేందుకు ఈ షోను ఏర్పాటు చేయగా విషాద సంఘటన చోటు చేసుకొంది. -
రన్నింగ్ ట్రైన్తో ఆటలు..
ఓ యువకుడు సరదాకు చేసిన స్టంట్ ప్రాణాల మీదకు తెచ్చింది. నాందేడ్ బెంగళూరు ఎక్స్ప్రెస్ ట్రైన్లో 26 ఏళ్ల యువకుడు చేతులతో రైలు కిటికీ రాడ్డులను పట్టుకొని ఫుట్ బోర్డుపై స్టంట్ చేశాడు. చేతులతో పట్టుకుని కాళ్లు కిందకు చాచి వేలాడాడు. కొద్దిసేపటి తర్వాత కాళ్లు కింద రాళ్లను తగలడంతో చేతులు జారి కిందపడిపోయాడు. వేగంగా వెళ్లే రైలులోంచి యువకుడు రాళ్ల మీద పడటంతో తీవ్రగాయాలయ్యాయి. గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు నెట్ఇంట్లో హల్చల్ చేస్తోంది. అయితే యువకుడి విన్యాసాలను చూస్తున్న ప్రయాణికులు రైలు చైన్ను లాగి, అతన్ని హెచ్చరించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండకపోయేదని నెటిజన్లు స్పందిస్తున్నారు. మొబైల్లో వీడియోను షూట్ చేసిన ట్రైన్లోనే ఉన్న మరో యువకుడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. సామాజికి మాధ్యమాల్లో లైకులు, షేర్ల కోసం యువకులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్టంట్లు చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. -
రన్నింగ్ ట్రైన్తో సరదా స్టంట్ ఆపై..
-
నడిరోడ్డుపై స్టంట్ ట్రిక్..వీడియో వైరల్
-
గుండె ఆగినంత పనైంది..
మెదీనా, సౌదీ అరేబియా : రద్దీగా ఉన్న రోడ్డుపై స్టంట్ ట్రిక్ ప్లే చేసినందుకు ఓ వ్యక్తిని సౌదీ అరేబియా పోలీసులు అరెస్టు చేశారు. వేగంగా వస్తున్న లారీని చూసిన వ్యక్తి కారు మీద నుంచి దూకి ఒక్కసారిగా ట్రక్కుకు ఎదురువెళ్లాడు. అతి దగ్గరకు వచ్చిన తర్వాత వేగంగా పక్కకు తప్పకున్నాడు. ఇందుకు సంబంధించి రికార్డు చేసిన వీడియోను అతను సోషల్మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్గా మారింది. ఈ వీడియోను వీక్షించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మిగతా ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ప్రవర్తించినందుకు అతన్ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. -
మెగా మేళా.. మహా మాయ
జాబ్మేళాలో పొంతనలేని ఉద్యోగాల సంఖ్య రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు వచ్చాయన్న లోకేష్ పెదవి విరుస్తున్న నిరుద్యోగులు ఎన్నికల స్టంట్ చేస్తున్న అధికార పార్టీ నేతలు ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అంటూ ఎన్నికల ఊదరగొట్టిన తెలుగుదేశం పార్టీ.. ఆ హామీని నెరవేర్చకపోవడంతో తమను మోసం చేశారన్న ఆవేదన, ఆగ్రహం నిరుద్యోగ యువతలో గూడుకట్టుకుని ఉంది. ఇంటికో ఉద్యోగం, లేదంటే ప్రతి నెలా రూ. 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా నేటి వరకు అమలు చేయలేదు. దీంతో యువతలో వ్యతిరేకత వస్తుందన్న భయంతో అధికారపార్టీ నేతలు మెగా జాబ్ మేళాల పేరుతో యువతలో ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వేలల్లో ఉద్యోగాలు అంటూ ప్రచారం చేస్తూ యువతకు నిరుద్యోగ యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. – సాక్షి, రాజమహేంద్రవరం వికాస సంస్థ, నన్నయ్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగిన మెగా జాబ్ మేళాను అధికార పార్టీ నేతలు తమ పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు. బ్యానర్లు, ఫ్లెక్సీల్లో ఎక్కడా నన్నయ యూనివర్సిటీ, వికాస సంస్థ పేర్లు, లోగోలు కనపడకపోవడం గమనార్హం. అదేవిధంగా జాబ్ల సంఖ్యపై ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రకటించారు. నిర్వాహకులు 6 వేలు, నారా లోకేష్ సభావేదికపై 10 వేలు, విలేకర్లతో మాట్లాడుతూ 8 వేలు అంటూ పలు రకాలుగా లెక్కలు చెప్పారు. చివరి రోజు నిర్వాహకులు 7,300 అంటూ మరో లెక్క చెప్పడం యువతకు తాము వేల ఉద్యోగాలు ఇప్పించేస్తున్నామనే భ్రమలు కలిగించే ప్రయత్నం చేశారు. అందుకేనా ఈ మేళాలు ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అని ప్రాసతో అ«ధికార పార్టీ నేతలు ఎన్నికల్లో హోరెత్తించగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ‘బాబు వచ్చాడు, జాబులు పోతున్నాయి’ అన్న ప్రాసతో ఎద్దేవా చేస్తున్నారు. ఇందుకు అన్ని శాఖల్లో ఔట్స్సోర్సింగ్ ఉద్యోగులను విడతల వారీగా తొలగించడాన్ని ఉదహరిస్తున్నారు. ‘నాన్నగారు రెండేళ్లో గట్టిపునాది వేయబట్టే ఇప్పటి వరకు రెండు లక్షల ఉద్యోగాలు వచ్చాయి’ అని శుక్రవారం జాబ్మేళా ప్రారంభించిన అనంతరం నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం జాబ్మేళాలో 6 వేల ఉద్యోగాలు ఉన్నాయంటూ కంపెనీలు వివరాలు కరపత్రంలో పొందుపరిచారు. ఇందులో దాదాపు 5,700 ఉద్యోగాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న కంపెనీల్లోను ఉన్నాయి. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో మిగతా 300 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి కూడా పదో తరగతి విద్యార్హతతో వచ్చే ఉద్యోగాలు కావడం గమనార్హం. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో నిర్వాహకులు ఇచ్చిన కరపత్రంలోని ఈ సమాచారం స్పష్టం చేస్తోంది. రెండేళ్లలో రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రాకుండానే ప్రైవేటు రంగంలో కొత్తగా లక్ష ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయో అర్థం కావడంలేదని యువత ప్రశ్నిస్తోంది. నాలుగు రోజుల ముందుగానే వికాస సంస్థ వెబ్సైట్లో ఆ¯ŒSలై¯ŒS రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్న నిరుద్యోగులు తిరిగి మైదానంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పడంతో క్యూలైన్లలో నిలబడి అష్టకష్టాలు పడ్డారు. ఇంత చేసినా వారికి ఇచ్చింది కంపెనీల వివరాలతో కూడిన కరపత్రం మాత్రమే. అందులో వివరాలు చూసి తాము ఎలాంటి ఉద్యోగానికి సరిపోతామో చూసుకుని ఆయా కంపెనీల ఇంటర్వూ్యలకు వెళ్లాలి. అదేదో ఆ¯ŒSలై¯ŒSలో రిజిస్ట్రేష¯ŒS చేసుకోని వారికి పెడితే తమకు కొంతమేరకైనా ఎండలో నిలబడే బాధ తప్పేదంటున్నారు. 24 వేల మందిలో 6 వేల మంది దొరకలేదా? మొత్తం 6 వేల ఉద్యోగాలున్నాయని నిర్వాహకులు ప్రకటించారు. రెండు రోజుల్లో 24,173 మంది ఇంటర్వూ్యలకు హాజరయ్యారని తెలిపారు. మొత్తంమీద 3,520 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంటే హాజరైన నిరుద్యోగుల్లో 15 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినట్లు ఆఫర్ లెటర్లు ఇచ్చారు. జాబ్మేళాకు విస్తృత ప్రచారం చేయడంతో ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వ్యయప్రయాసలకోర్చి నిరుద్యోగులు హాజరయ్యారు. నిర్వాహకులు ప్రకటించిన కరపత్రంలోని ఉద్యోగాలలో దాదాపు 90 శాతం నా¯ŒS టెక్నికల్ ఉద్యోగాలే. అలాంటప్పడు 24 వేల మందిలో అర్హతున్న వారు 25 శాతం కూడా లేరా? అని నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినా ఎంపిక కాకపోవడంతో తమలోని ఆత్మ స్థయిర్యం దెబ్బతింటోందని శ్రీకాకుళం నుంచి వచ్చిన నిరుద్యోగ యువకుడు ఎర్రన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఈ వీడియో చూస్తే ఇంకోసారి ఇలా చెయ్యరు..
-
గుండెకు ఏ స్టంట్ అయినా ఒకటే..
సాక్షి,హైదరాబాద్:మూసుకుపోయిన గుండె రక్తనాళాలను తెరిచేందుకు చేసే ప్రైమరీ యాంజియోప్లాస్టీ, సాధారణ యాంజియోప్లాస్టీలో స్టంట్లను వాడటం సహజమని, ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా అందిస్తున్న స్టంట్లకు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న స్టంట్లకు జీవిత కాలం విషయంలో తేడాలేదని, ఖరీదైన స్టంట్ వేసుకున్నంత మాత్రన రోగి జీవితకాలం పెరుగుతుందనేది అపోహ మాత్రమేనని. కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ స్పష్టం చేసింది. తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 18–24 వరకు‘ఎటాక్ ది హార్ట్ ఎటాక్ వీక్’ పేరుతో నిర్వహించిన సర్వే వివరాలను శుక్రవారం మెర్క్యరీ హోటల్లో చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ జె.శివకుమార్, కార్యదర్శి డాక్టర్ నరసరాజు, సీతారామ్, శ్రీధర్రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ రోగి జీవితకాలం పెంపు, నాణ్యమైన జీవితం రోగి జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని, అతను వేసుకున్న స్టంట్పై కాదన్నారు. చికిత్స సమయంలో స్టంట్ల ఎంపిక పూర్తిగా రోగి ఇష్టంపైనే ఆధారపడి ఉండాలని, ఈ విషయంలో రోగులను బలవంతం చేయకూడదని వారు పేర్కొన్నారు. తీవ్రమైన గుండె పోటుతో బాధపడుతున్న బాధితుల్లో కేవలం 23 శాతం మందికే ప్రైమరీ కరోనరీ యాంజియోప్లాస్టీ(60 నిమిషాల్లో మూసుకుపోయిన గుండె రక్తనాళాన్ని తెరిపించడం) చికిత్సలు అందుతున్నాయన్నారు. అవగాహన రాహిత్యం, మౌలిక సదుపాయాల లేమి కారణంగా మరో 73 శాతం మంది సాధారణ యాంజియోప్లాస్టీతో సరిపెట్టుకోవాల్సి వస్తోందన్నారు. చికిత్సలో జాప్యంతో గుండె కండరాలు మరింత దెబ్బతింటున్నాయని, ఛాతిలో నొప్పి వచ్చిన తర్వాత ఆస్పత్రికి వెళ్లడానికి పట్టణాల్లో నాలుగు నుంచి ఆరుగంటలు పడుతుండగా,గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటలకు పైగా సమయం పడుతున్నట్లు తేలిందన్నారు. కేవలం 73 మందికే ఆ చికిత్సః సర్వేలో భాగంగా 296 మంది బాధితుల నుంచి వివరాలు సేకరించగా, 73 మందికి మాత్రమే ప్రైమరీయాంజియోప్లాస్టీ చికిత్సలు అందినట్లు తెలిపారు. హైదరాబాద్లో 18 శాతం, జిల్లాల్లో 8 శాతం మందికి మాత్రమే ఈ సేవలు అందాయని వారు వివరించారు. తీవ్రమైన గుండెపోటుతో బాధపడుతున్న బాధితులకు మందులు, ఇంజక్షన్ల కంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీ చికిత్సే ఉత్తమమని,తద్వారా రోగి జీవితకాలాన్ని పెంచడంతో పాటు నాణ్యమైన జీవితాన్ని అందించవచ్చని వారు పేర్కొన్నారు. ఛాతిలో నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. -
రైల్వే బ్రిడ్జిపై ఎంతటి బరి తెగింపు..!
ఘజియాబాద్: అచ్చం సినిమాలో మాదిరిగా నరాలు తెగే ఉత్కంఠ.. ఏం జరుగుతుందో అనే ఆందోళన.. రైలు డ్రైవర్ కూడా కాస్తంత వణికిపోయే పరిస్థితి.. కానీ పట్టాలపై నిల్చున్న ఆ ఏడుగురు ఆకతాయిలకు మాత్రం ఎలాంటి జంకూ బొంకూ లేదు. రైలు తమను తాకేంత దగ్గరగా వచ్చే వరకు అలాగే చూశారు. తగులుతుందా అనే సమయంలో గబాళ్లున దూకేశారు అది కూడా నదిలోకి. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్ ఘజియాబాద్ లోని మసురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ వీడియో బయటకు రావడంతో వెంటనే అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి పిచ్చిపని చేసిన ఆ యువకులు ఎవరో గుర్తించాలని, ఎందుకిలా చేశారో కనుక్కోవాలని పోలీసులకు స్ట్రిట్ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 50 సెకన్లు ఉన్న ఈ వీడియోలో ఈ దృశ్యం కనిపించింది. మసురి ప్రాంతంలో గంగా నది కాలువపై ఓ రైల్వే బ్రిడ్జి ఉంది. దీనిపైకి వెళ్లిన కొంతమంది ఏడుగురు రైలును కూడా లెక్కచేయకుండా స్టంట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అయింది. -
రియాలిటీ షో కోసం హీరో సాహసం!
బాలీవుడ్ యువ కెరటం అర్జున్ కపూర్ ఓ రియాలిటీ షో కోసం ఒళ్లుగగుర్పొడిచే సాహసం చేశాడు. సాహసకృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఓ రియాలిటీ షోకి అర్జున్ మొదటిసారి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. దీనిలో భాగంగా మొదటి ఎపిసోడ్లోనే అర్జున్ సాహసానికి దిగాడు. ప్రమాదకరమైన తేనెటీగలు ఉన్న పెట్టెలో తలపెట్టి అందులో ఉన్న పండ్లను తిన్నాడు. ముఖం నిండా స్వీట్ క్రీమ్ రాసుకుని భయంకరమైన రకరకాల ఈగలు ఉన్న పెట్టెలో తల పెట్టి అందులో ఉన్న స్ట్రాబెర్రీలు మొత్తం తినాలి. ఈ సాహసా కృత్యానికి అర్జున్ తనంతటతానుగా పూనుకున్నాడు. ఈగలన్నీ తన ముఖం మీద వాలి క్రీమ్ రుచి చూస్తుండగా ఏ మాత్రం తొణకకుండా పెట్టెలోని స్ట్రాబెర్రీలన్నీ తినేశాడు. కాస్త తేడా వచ్చినా పరిస్థితి ప్రమాదకరంగా ఉండేది. ఇటువంటి సాహసం చేసిన మొట్టమొదటి హోస్ట్ అర్జునే అంటూ సదరు రియాలిటీ షో యూనిట్ పొగడ్తలతో ముంచెత్తింది. దీనిపై అర్జున్ మాట్లాడుతూ.. 'మాటలకన్నా చేతలు గట్టిగా పనిచేస్తాయి. షోలో పాల్గొనే అభ్యర్థులకు మరింత ప్రోత్సాహం అందించాలనే ఇలా చేశాను. అయినా నాకెలాంటి ఫోబియాలు లేవు, అందువల్లే ప్రమాదకారి ఈగలన్నీ నాపై వాలినా నేను భయపడలేదు, ఏదేమైనా ఈ అనుభవం సరికొత్తగా ఉంది.. చాలా ఎంజాయ్ చేశాను' అంటూ చెప్పుకొచ్చాడు. -
స్టంట్ హీరో దారా సింగ్...
దారా సింగ్ అంటే రుసుం-ఏ- హింద్. అంతటి పహిల్వాన్ మరొకడు లేడని పేరు. బహుశా అప్పట్లో పండితులు పామరులు అన్న తేడా లేకుండా భారతదేశం అంతటికీ తెలిసిన ఆటగాడు ఇతడొక్కడేనేమో. అమృత్సర్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో పుట్టాడు. ఆరడుగుల 2 అంగుళాల పొడవు, 120 కిలోల బరువు, 53 అంగుళాల విశాలమైన ఛాతీ... పహిల్వాన్గా రాణించడానికి ఇంతకుమించి ఏం కావాలి. అయితే దేశంలో ఉండగా ఈ పని సాధ్యం కాలేదు. సింగపూర్లో బాబాయి పని చేస్తుంటే అతడితో పాటు వెళ్లి అక్కడ తగిన తిండి దొరికే పరిస్థితి ఏర్పడ్డాక పహిల్వాన్గా మారాడు. అప్పటికే ‘హెర్క్యులస్’ వంటి సినిమాలు కలెక్షన్లు కురిపిస్తున్నాయి. ఇండియన్ హెర్క్యులస్ కోసం తమిళ, ఉత్తరాది నిర్మాతలు వెతుకుతున్నారు. దారాసింగ్ వాళ్ల కళ్లల్లో పడ్డాడు. ఎవరో వచ్చి సినిమాల్లో చేస్తావా అడిగితే ‘స్టంట్స్ వరకూ చేస్తాను. యాక్టింగ్కు ఇంకొకరిని పెట్టుకోండి’ అన్నాడట. అంతటి అమాయకుడు. హీరో అంటే యాక్టింగు, స్టంట్సు అన్నీ చేయాలి అని ఒప్పించారు. రిటైర్ అయిన పహిల్వాన్లు ఆర్థిక బాధలు పడటం అప్పటికే గమనించిన దారాసింగ్ సినిమాల్లో చేయడం వల్ల నాలుగు డబ్బులు వస్తే చివరి రోజుల్లో పనికొస్తాయని ఒప్పుకున్నాడు. అప్పట్లో ఉర్దూ వాడకం ఎక్కువగా ఉండేది. దారాసింగ్కు రాదు. మొదటి నాలుగు సినిమాల్లో డబ్బింగ్ చెప్పించి ఐదో సినిమా నుంచి పూర్తి స్థాయి హీరోని చేశారు. దారాసింగ్ వల్ల కింగ్ కాంగ్, శాంసన్, డాకూ మంగళ్సింగ్ వంటి స్టంట్ సినిమాలు ప్రేక్షకులు చూడగలిగారు. ఆయన పక్కన ఎవరూ చేయకపోతే ముంతాజ్ చాలా సినిమాలు చేసి ఆయనను నిలబెట్టింది. దారాకు కుస్తీలో వరల్డ్ చాంపియన్షిప్ ఉంది. రాజ్యసభకు నామినేట్ అయిన తొలి ఆటగాడు ఆయన. రామాయణం సీరియల్లో హనుమంతుడిగా వేయడం వల్ల ఆబాలగోపాలానికి మరోమారు దగ్గరయ్యాడు. దారా అంటే భారత్ బలం. కండ. దేహ ధారుడ్యం. 2012లో 83 ఏళ్ల వయసులో మరణించిన ఆయన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలిగిన భాగ్యశాలి. -
మైండ్ బ్లోయింగ్
-
‘హాలిడేలో’ అన్నీ రియల్ ఫైట్లే
అక్షయ్కుమార్ న్యూఢిల్లీ: త్వరలో విడుదల కానున్న హాలిడే సినిమా షూటిం గ్లో భాగంగా బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ ఓ భవంతిపై నుంచి కిందికి దూకాడు. అంతేకాకుండా ఓ భీకరమైన పోరాటం కూడా చేశాడు. ఈ సందర్భంగా అక్షయ్ మీడియా తో మాట్లాడుతూ తన మనోభావాలను పంచుకున్నాడు. ‘సైనికుడెప్పుడూ సెలవు తీసుకోడు. అయితే చిన్నదైనా, పెద్దదైనా సినిమా షూటింగ్లో భాగంగా స్టంట్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. రిస్కీ సీన్లు చేసే సమయంలో ఎంతో ఔచి త్యంతో వ్యవహరించాలి. చివరికి చిన్న జంప్లు చేసేటపుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. పెద్ద స్టంట్లు మాత్రమే ప్రమాదమనుకోకూడదు. ఒక్కోసారి చిన్న స్టంట్కూడా ప్రాణాలపైకి రావొ చ్చు’ అని అన్నాడు. హాలిడే సినిమాలో భారీ స్టంట్లు చేస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా పై విధంగా స్పందించాడు. ఎ.ఆర్.మురగదాస్ సారథ్యంలో రూపొందుతున్న హాలి డే సినిమా కోసం నిర్మాతలు బ్రిటన్నుంచి ప్రముఖ స్టంట్మెన్ గ్రెగ్ పొవెల్ను ఇండియాకు రప్పించారు. హారీ పొట్టర్, జేమ్స్ బాండ్ తదితర సినిమాలకు గ్రెగ్ పొవెల్ స్టంట్మెన్గా చేశాడు. ఈ నేపథ్యంలో హాలిడే సినిమా కోసం అతనిని ఇండియాకు నిర్మాతలు రప్పించారు. ఈ విషయమై అక్షయ్ మాట్లాడుతూ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకులను కచ్చితంగా అబ్బురపరుస్తాయన్నాడు. ‘నా దర్శకుడు రియాలిటీనే కోరుకుంటాడు. అందువల్ల ఫైట్ సీన్లను తిలకించే సమయంలో ప్రేక్షకులంతా అబ్బురపోవడం తథ్యం’ అని అన్నాడు. ఈ సినిమాలో అన్నీ రియల్ ఫైట్లేనన్నాడు. ఈ సినిమాలో అకీరు స్టంట్ అనే యుద్ధ విద్య కూడా చేశాన ని ఈ 46 ఏళ్ల నటుడు చెప్పాడు. సినిమా షూటింగ్ మొత్తం ముంబైలోనే జరిగిందన్నాడు. స్టూడియోలలో తీయలేదన్నాడు.