top 10
-
కొత్త కుబేరులు.. ఆసియా బిలియనీర్స్ లేటెస్ట్ లిస్ట్
ఆసియాలో కొత్త కుబేరులు అవతరించారు. ఫోర్బ్స్ ఏషియన్ బిలియనీర్స్ 2025 తాజా ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. 2024లో విడుదల చేసిన ర్యాంకింగ్స్తో పోలిస్తే 2025లో (మార్చి నాటికి) ఆసియా బిలియనీర్లు అపూర్వ సంపదను ఆర్జించగా, ఈ ఏడాది టాప్ 10 ఆసియా బిలియనీర్ల జాబితాలో ఇండోనేషియాకు చెందిన ప్రజోగో పంగేస్తు, భారత్కు చెందిన సావిత్రి జిందాల్ వంటి ప్రముఖులు చోటు కోల్పోయారు. 2025 ఆసియా బిలియనీర్ ర్యాంకింగ్స్లో అగ్రగామిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) నిలిచారు. ఆయన తరువాత ప్రసిద్ధ బాటిల్ వాటర్ కంపెనీ నాంగ్ఫు స్ప్రింగ్ యజమాని జోంగ్ షాన్షాన్ ఆసియాలో రెండవ ధనవంతుడిగా, చైనాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ సరఫరా సంస్థ కాంటెంపరరీ ఆంపరెక్స్ టెక్నాలజీని (సీఏటీఎల్) నడిపించే రాబిన్ జెంగ్, చైనీస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ షియోమీ సహ వ్యవస్థాపకుడు లీ జున్ 2025 ఆసియా రిచెస్ట్ లిస్ట్లో కొత్తగా చేరారు.యునిక్లో, థియరీ, జె బ్రాండ్ వంటి పోర్ట్ఫోలియో బ్రాండ్లతో 25 దేశాలలో 2,400 పైగా స్టోర్లతో బలమైన ఉనికిని కలిగి ఉన్న ప్రముఖ జపనీస్ రిటైల్ కంపెనీ ఫాస్ట్ రిటైలింగ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ తడాషి యానాయ్ ఒక్కరే జపాన్ నుండి జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక బిలియనీర్.ఆసియాలో టాప్ 10 ధనవంతులు (2025 మార్చి నాటికి )1 ముఖేష్ అంబానీ - 86.9 బి.డాలర్లు - భారత్2 జోంగ్ షాన్షాన్ - 56.0 బి.డాలర్లు - చైనా3 గౌతమ్ అదానీ 54.7 బి.డాలర్లు - భారత్4 మా హుటెంగ్ 53.3బి.డాలర్లు - చైనా5 జాంగ్ యిమింగ్ 45.6 బి.డాలర్లు - చైనా 6 తడాషి యానై & ఫ్యామిలీ 45.1 బి.డాలర్లు - జపాన్ 7 లీ జున్ 42.6 బి.డాలర్లు - చైనా 8 కొలిన్ హువాంగ్ 40.0 బి.డాలర్లు - చైనా 9 లీ కా-షింగ్ 38.3 బి.డాలర్లు - హాంగ్ కాంగ్ 10 రాబిన్ జెంగ్ 37.6 బి.డాలర్లు - హాంగ్ కాంగ్ -
మళ్లీ మస్కే.. ఫోర్బ్స్ తాజా టాప్ 10 బిలియనీర్లు వీళ్లే..
టెక్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మళ్లీ ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. ఫోర్బ్స్ (Forbes) తాజా బిలియనీర్ ర్యాంకింగ్ల ప్రకారం.. 420 బిలియన్ డాలర్లకుపైగా సంపదతో 2025 సంవత్సరాన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ప్రారంభించారు. ప్రధానంగా స్పేస్ఎక్స్ (SpaceX) విలువ 350 బిలియన్ డాలర్లకు పెరగడంతో గడిచిన డిసెంబర్ 1 నుండి మస్క్ నెట్వర్త్ 91 బిలియన్ డాలర్లు పెరిగింది.గణనీయ పెరుగుదలఫోర్బ్స్ ర్యాంకింగ్ మొదటి 10 మంది సంపన్న వ్యక్తుల నెట్వర్త్లో గణనీయమైన పెరుగుదలను చూపుతోంది. వారి మొత్తం సంపద డిసెంబర్లో 1.8 ట్రిలియన్ డాలర్ల నుండి 1.9 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 సంపన్న వ్యక్తులు.. పెరిగిన వారి సంపద గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..ఎలాన్ మస్క్421.2 బిలియన్ డాలర్ల నెట్వర్త్తో ఫోర్బ్స్ జాబితాలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచారు. 2002లో స్పేస్ఎక్స్ని స్థాపించి దాని సీఈవోగా (CEO) కొనసాగుతున్న మస్క్.. టెస్లాకు అధిపతిగా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ (X), ఏఐ (AI) కంపెనీ ‘ఎక్స్ఏఐ’ (xAI), టన్నెలింగ్ సంస్థ బోరింగ్ కోలో వాటాలను కలిగి ఉన్నారు. టెస్లాలో ఆయనకు 13% వాటా ఉంది.జెఫ్ బెజోస్అమెజాన్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్ జెఫ్ బెజోస్ (Jeff Bezos) 233.5 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో రెండవ స్థానంలో నిలిచారు. బెజోస్ 1994లో అమెజాన్ను ఆన్లైన్ పుస్తక దుకాణంగా స్థాపించారు. తరువాత క్లౌడ్ కంప్యూటింగ్, వినోదం, మరిన్నింటికి విస్తరించారు. ఆయన ప్రైవేట్ స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ను కూడా స్థాపించారు. గత డిసెంబర్ లో అమెజాన్ స్టాక్ 5% పెరిగింది. దీంతో ఆయన సంపదకు దాదాపు 10 బిలియన్ డాలర్లు తోడయ్యాయి.లారీ ఎల్లిసన్ఒరాకిల్ సహ-వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ (Larry Ellison) 209.7 బిలియన్ డాలర్ల నెట్వర్త్తో జాబితాలో మూడవ స్థానంలో నిలిచారు. 1977లో కంపెనీని స్థాపించిన ఆయన 2014 వరకు సీఈవోగా నాయకత్వం వహించారు. ఇప్పుడు ఛైర్మన్, సీటీవో (CTO)గా పనిచేస్తున్నారు. ఒరాకిల్ స్టాక్ డిసెంబర్ లో 9% పైగా పడిపోయింది. ఆయన సంపద నుండి సుమారు 17 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో ఆయన రెండో స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయారు.మార్క్ జుకర్బర్గ్మెటా వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) ఫోర్బ్స్ ప్రకారం 202.5 బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు. కంపెనీలో ఆయనకు దాదాపు 13% వాటా ఉంది. మెటా షేర్లు 1.9% పెరగడంతో గత డిసెంబర్ లో ఆయన నెట్వర్త్ 3.8 బిలియన్ డాలర్లు పెరిగింది. బెర్నార్డ్ ఆర్నాల్ట్లగ్జరీ గూడ్స్ దిగ్గజం ఎల్వీఎంహెచ్ (LVMH) సీఈవో, ఛైర్మన్ అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ( Bernard Arnault) నికర విలువ $168.8 బిలియన్ డాలర్లు. ఎల్వీఎంహెచ్ పోర్ట్ఫోలియోలో క్రిస్టియన్ డియోర్ కోచర్, గివెన్చీ, ఫెండి, సెలిన్, కెంజో, టిఫనీ, బల్గారీ, లోవే, ట్యాగ్ హ్యూయర్, మార్క్ జాకబ్స్, సెఫోరా వంటివి ఉన్నాయి. గత నెలలో ఎల్వీఎంహెచ్ షేర్లలో 7% పెరుగుదలతో ఆర్నాల్డ్ నెట్వర్త్ 8.5 బిలియన్ డాలర్లు పెరిగింది. లిస్ట్లో ఐదో స్థానంలో నిలిచారు.లారీ పేజ్గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ స్టాక్ ధర 11% పెరగడంతో లారీ పేజ్ (Larry Page) సంపద కూడా 14 బిలియన్ డార్లు పెరిగి 156 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తాజా లిస్ట్లో ఈయనది ఆరో స్థానం. పేజ్ 1998లో సెర్గీ బ్రిన్తో కలిసి గూగుల్ (Google)ని స్థాపించారు. 2001 వరకు, మళ్లీ 2011 నుండి 2015 మధ్య దానికి సీఈవోగా పనిచేశారు ఇప్పుడాయన ఆల్ఫాబెట్లో బోర్డు సభ్యుడుగా ఉంటూ నియంత్రణ వాటాను కలిగి ఉన్నారు.సెర్గీ బ్రిన్ఆల్ఫాబెట్ స్టాక్ ధర పెరుగుదల కారణంగా లారీ పేజ్ లాగే గూగుల్ మరో సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ (Sergey Brin) నెట్వర్త్ కూడా గత నెలలో 14.7 బిలియన్ డాలర్లు పెరిగి 149 బిలియన్ డాలర్లకు చేరింది.ఈ పెరుగుదల ఆయన్ని ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 8వ ర్యాంక్ నుండి 7వ స్థానానికి నెలబెట్టింది.వారెన్ బఫెట్డిసెంబర్లో బెర్క్షైర్ హాత్వే స్టాక్ ధర 6% పడిపోవడంతో వారెన్ బఫెట్ (Warren Buffett) సంపద నుండి 8.9 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడాయన నెట్వర్త్ 141.7 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ లిస్ట్లో ఆయన ర్యాంక్ 6 నుండి ర్యాంక్ 8కి పడిపోయింది. వారెన్ బఫ్ఫెట్ బీమా సంస్థ గీకో, బ్యాటరీ కంపెనీ డ్యూరాసెల్, ఫాస్ట్ ఫుడ్ చైన్ డైరీ క్వీన్ వంటి ప్రధాన వ్యాపారాలను కలిగి ఉన్నారు.స్టీవ్ బామర్మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బామర్ (Steve Ballmer) 124.3 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. హార్వర్డ్లో బిల్ గేట్స్ మాజీ క్లాస్మేట్ అయిన స్టీవ్ బామర్ 2000 నుండి 2014 వరకు మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, బామర్ లాస్ ఏంజిల్స్ క్లిప్పర్స్ను 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. డిసెంబరులో బామర్ సంపద సుమారు 500 మిలియన్ డాలర్లు తగ్గింది.జెన్సన్ హువాంగ్ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సన్ హువాంగ్ (Jensen Huang) 117.2 బిలియన్ డాలర్ల నెట్వర్త్తో 10వ స్థానంలో ఉన్నారు. ఏఐ రంగంలో కంపెనీ చిప్లు ప్రజాదరణ పొందడంతో ఆయన సంపద పెరిగింది. డిసెంబరులో ఎన్విడియా షేర్లలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, హువాంగ్ టాప్ 10 సంపన్నులలో స్థానాన్ని పొందారు. -
2024లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 లిస్ట్లో నాలుగు తెలుగు సినిమాలు (ఫొటోలు)
-
2024 జనవరి నుంచి జూన్ వరకు టాప్ 10 బ్రాండ్ ప్రమోటర్లు (ఫోటోలు)
-
టాప్-10 హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఇండియన్ హీరోల లిస్ట్ ఇదే
-
టాప్ 10 స్కూటర్లు..
టూవీలర్లలో స్కూటర్లది ప్రత్యేకమైన విభాగం. అన్నివర్గాల వారూ స్కూటర్లను నడిపేందుకు ఇష్టపడతారు. ఈ క్రమంలో వాటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన అక్టోబర్లో జరిగిన విక్రయాల ఆధారంగా టాప్ 10 స్కూటర్లు ఏవో ఇక్కడ తెలుసుకుందాం..ఆటో న్యూస్ వెబ్సైట్ రష్లేన్ నివేదిక ప్రకారం.. గత అక్టోబర్లో టాప్ 10 స్కూటర్ల అమ్మకాలు 6,64,713 యూనిట్లతో ఏడాది ప్రాతిపదికతోపాటు అంతక్రితం నెలతో పోల్చి చేసినా మెరుగయ్యాయి. ఇవి గతేడాది అక్టోబర్లో 5,22,541 యూనిట్లు, ఈ ఏడాది సెప్టెంబర్లో 6,05,873 యూనిట్లు అమ్ముడుపోయాయి.ఇక అక్టోబర్ నెలలో ఏ స్కూటర్ ఎన్ని యూనిట్లు అమ్ముడుపోయాయో పరిశీలిస్తే.. 2,66,806 యూనిట్లతో హోండా యాక్టివా అగ్ర స్థానంలో ఉంది. మరోవైపు కస్టమర్ల నుంచి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా ఓలా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఓలా ఎస్1 గత అక్టోబర్లో 41,651 యూనిట్లు అమ్ముడుపోయింది. మొత్తం స్కూటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఎలక్ట్రిక్ విభాగంలో టాప్లో నిలిచింది.ఏ స్కూటర్ ఎన్ని?» హోండా యాక్టివా 2,66,806» టీవీఎస్ జూపిటర్ 1,09,702» సుజుకి యాక్సెస్ 74,813» ఓలా ఎస్1 41,651» టీవీఎస్ ఎన్టార్క్ 40,065» హోండా డియో 33,179» బజాజ్ చేతక్ 30,644» టీవీఎస్ ఐక్యూబ్ 28,923» సుజుకి బర్గ్మన్ 20,479» యమహా రేజర్ 18,451 -
స్మార్ట్ఫోన్స్ జోరు.. టాప్ 10 బ్రాండ్స్ ఇవే..
న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్ఫోన్ సరఫరా వరుసగా అయిదో త్రైమాసికంలో కూడా పెరిగింది. జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో సుమారు 6 శాతం వృద్ధి చెంది 4.6 కోట్లకు చేరింది. 72 శాతం మార్కెట్ వాటాతో చైనా కంపెనీల హవా కొనసాగింది.16 శాతం షేర్తో వివో అగ్రస్థానంలో ఉండగా, టాప్ 10 బ్రాండ్స్లో ఐకూ అత్యధిక వృద్ధి సాధించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం యాపిల్ మార్కెట్ వాటా 8.6 శాతంగా, శాంసంగ్ వాటా 12.3 శాతంగా ఉంది. వివో వాటా 13.9 శాతం నుంచి 15.8 శాతానికి పెరిగింది.అందుబాటు ధరలోని వై సిరీస్తో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన టీ3, వీ40 సిరీస్ల దన్నుతో వరుసగా మూడో త్రైమాసికంలో కూడా వివో అగ్రస్థానంలో నిల్చింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఒప్పో 13.9 శాతం, రియల్మీ 11.5 శాతం, షావోమీ 11.4 శాతం, పోకో 5.8 శాతం, మోటరోలా 5.7 శాతం, ఐకూ 4.2 శాతం, వన్ప్లస్ 3.6 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి. యాపిల్ అత్యధికంగా 40 లక్షల యూనిట్లు సరఫరా చేసింది. మిగతా విశేషాలు.. » రూ. 50,000 నుంచి రూ. 68,000 వరకు ధర శ్రేణి ఉండే ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల మార్కెట్ వార్షిక ప్రాతిపదికన అత్యధికంగా 86 శాతం వృద్ధి చెందింది. మొత్తం సరఫరా 2 శాతం నుంచి సుమారు 4 శాతానికి పెరిగింది. ఐఫోన్ 15/13/14, గెలాక్సీ ఎస్23, వన్ప్లస్ 12 ప్రధాన మోడల్స్గా నిల్చాయి. ఈ విభాగంలో యాపిల్ వాటా 71 శాతానికి పెరగ్గా శాంసంగ్ వాటా 30 శాతం నుంచి 19 శాతానికి పడిపోయింది.» రూ. 16,000 నుంచి రూ. 35,000 ధర శ్రేణిలోని ఎంట్రీ–ప్రీమియం సెగ్మెంట్ 42 శాతం వృద్ధి సాధించింది. మొత్తం స్మార్ట్ఫోన్ల సరఫరాలో 28%వాటాను దక్కించుకు ంది. ఒప్పో గణనీయంగా పెరగ్గా శాంసంగ్, వివోల మార్కెట్ వాటా తగ్గింది. ఈ విభాగంలో ఈ మూడింటి వాటా 53 %గా ఉంది. » 5జీ స్మార్ట్ఫోన్ల సరఫరా 57% నుంచి 83%కి పెరిగింది. అదే సమయంలో సగటు విక్రయ ధర (ఏఎస్పీ) 20% తగ్గింది. 5జీ సెగ్మెంట్లో మాస్ బడ్జెట్ విభాగం (రూ. 8,000–రూ. 16,000 వరకు ధర) దాదాపు రెట్టింపై 50 శాతానికి చేరింది. షావోమీ రెడ్మీ 13సీ, యాపిల్ ఐఫోన్ 15, ఒప్పో కే12ఎక్స్, వివో టీ3ఎక్స్.. వై28 మోడల్స్ మూడో త్రైమాసికంలో అత్యధికంగా సరఫరా అయ్యాయి. -
దూసుకెళ్లే టాప్10 ఎలక్ట్రిక్ బైక్లు
ప్రస్తుతం దేశమంతా పండుగ సీజన్ నడుస్తోంది. ఈ ఉత్తేజకరమైన సమయంలో మీరు బైక్ కొనాలనుకుంటున్నారా? అది కూడా మంచి రేంజ్, స్పీడ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్ల చూస్తున్నారా? అయితే మీ కోసమే రయ్మంటూ దూసుకెళ్లే టాప్10 లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జెడ్రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జెడ్ (Revolt RV400 BRZ) భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ బైక్గా ప్రసిద్ధి చెందింది. అధిక పనితీరు, సొగసైన డిజైన్, ఉత్తమ ఫీచర్లను కలిగి ఉంది. రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జెడ్ లాంచ్తో కంపెనీ ఇటీవలే ఆర్వీ400ని అప్డేట్ చేసింది. దీని రేంజ్ 150 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు. ప్రారంభ ధర రూ.1.09 లక్షలు.ఓలా రోడ్స్టర్ ప్రో ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే ఓలా రోడ్స్టర్ సిరీస్ విడుదలతో ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇది అత్యుత్తమ రేంజ్, పనితీరు, ఫీచర్లను అందిస్తుంది. విడుదల చేసిన మోడళ్లలో టాప్-ఎండ్ వేరియంట్, ఓలా రోడ్స్టర్ ప్రో (Ola Roadster Pro). దీని ప్రారంభ ధర రూ.1,99,999. అత్యధిక రేంజ్ 579 కిలో మీటర్లు. టాప్ స్పీడ్ 194 కిలో మీటర్లు.రివోల్ట్ ఆర్వీ1, ఆర్వీ1+ఇటీవల రివోల్ట్ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ కమ్యూటర్ మోటార్సైకిల్స్ రివోల్ట్ ఆర్వీ1, ఆర్వీ1+ (Revolt RV1 and RV1+)లను విడుదల చేసింది. ఆర్వీ1, ఆర్వీ1 ప్లస్ ఇప్పుడు దేశ మొట్టమొదటి కమ్యూటర్ మోటార్సైకిళ్లుగా నిలిచాయి. బేస్ మోడల్ ధర రూ. 84,990, ప్లస్ వెర్షన్ రూ. 99,990 (ఎక్స్-షోరూమ్). టాప్ రేంజ్ 160 కిలో మీటర్లు.ఒబెన్ రోర్బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ తయారు చేసిన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఒబెన్ రోర్ (Oben Rorr). ఇది ఒక పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్. స్టైలిష్ నియో-క్లాస్ డిజైన్ లుక్స్తో ఉన్న ఈ బైక్ ప్రతి రైడర్ను ఆకట్టుకుంటుంది. దీని రేంజ్ 187 కిలో మీటర్లు. టాప్ స్పీడ్ 100 కిలో మీటర్లు. ధర రూ.1,49,999.అల్ట్రావయోలెట్ ఎఫ్77 మాక్ 2 ఎలక్ట్రిక్ బైక్లలో అల్ట్రావయోలెట్ అత్యంత ఇష్టమైన పేర్లలో ఒకటి. బెంగుళూరుకు చెందిన ఈ సంస్థ ప్రత్యేకమైన డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఉత్తమ ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్లను ఉత్పత్తి చేస్తుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 మాక్ 2 (Ultraviolette F77 Mach 2) దాని ఎఫ్77 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ అప్గ్రేడ్ వెర్షన్గా విడుదలైంది. దీని రేంజ్ 323 కి.మీ. కాగా టాప్ స్పీడ్ 155 కి.మీ. ప్రారంభ ధర రూ.2,99,000.కొమాకి రేంజర్ ఎక్స్పీకొమాకి రేంజర్ పోర్ట్ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ బైక్లు ఉన్నాయి. అవి రేంజర్, ఎం16. రేంజర్ను భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్గా చెప్తారు. ఇది భారీ, దృఢమైన చక్రాలు, అద్భుతమైన క్రోమ్ ఎక్స్టీరియర్స్, ప్రీమియం పెయింట్ ఫినిషింగ్ను కలిగి ఉంది. కొమాకి రేంజర్ ఎక్స్పీ (Komaki Ranger XP) రేంజ్ 250 కిలో మీటర్లు కాగా స్పీడ్ 70-80 కిలో మీటర్లు. ఇక దీని ధర రూ.1,84,300.మ్యాటర్ ఏరామ్యాటర్ ఎనర్జీ కంపెనీ గత ఏడాది తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ మ్యాటర్ ఏరా (Matter Aera)ను విడుదల చేసింది. ఇది సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్తో స్పష్టమైన, వినూత్న సాంకేతికతను మిళితం చేస్తూ బోల్డ్, స్ఫుటమైన డిజైన్తో వస్తుంది. ఈ బైక్ రేంజ్ 125 కి.మీ.కాగా ధర రూ.1,73,999 నుంచి ప్రారంభమవుతుంది.టోర్క్ క్రాటోస్-ఆర్ అర్బన్పుణెకి చెందిన ఎలక్ట్రిక్ బైక్మేకర్ టోర్క్ మోటార్స్ కొత్త క్రాటోస్-ఆర్ మోడల్ ( Tork Kratos R Urban)ను విడుదల చేసింది. ఈ సరికొత్త మోడల్ను రోజువారీ ప్రయాణాల కోసం, అర్బన్ రైడర్లకు సౌకర్యంగా రూపొందించారు. దీని ధర రూ.1.67 లక్షలు. ఇది 105 కిలో మీటర్ల టాప్ స్పీడ్, 120 కిలో మీటర్ల వరకూ రేంజ్ను అందిస్తుంది.ఒకాయ ఫెర్రాటో డిస్రప్టర్ఒకాయ ఈవీ ఈ ఏడాది మార్చిలో తన కొత్త ప్రీమియం అనుబంధ బ్రాండ్ ఫెర్రాటోను ప్రారంభించింది. ఇదే క్రమంలో ఫెర్రాటో బ్రాండ్ కింద డిస్రప్టర్ (Okaya Ferrato Disruptor)పేరుతో మొదటి మోడల్ను పరిచయం చేసింది.ఫెర్రాటో డిస్రప్టర్ ఆధునిక, ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ డిజైన్ను కలిగి ఉంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 95 కి.మీ. కాగా 129 కిలో మీటర్ల రేంజ్ను ఇస్తుంది. ధర రూ.1,59,999.ఓర్క్సా మాంటిస్ఓర్క్సా ఎనర్జీస్ గత సంవత్సరం మాంటిస్ (Orxa Mantis) ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ను భారతదేశంలో విడుదల చేసింది. ప్రీమియం ధర కలిగిన మాంటిస్, పదునైన ట్విన్-పాడ్ LED హెడ్ల్యాంప్లు, స్ట్రైకింగ్ ట్యాంక్ కౌల్, విలక్షణమైన కట్లు,క్రీజ్లతో ఆకట్టుకుంటోంది. దీని ధర రూ.3.6 లక్షలు. 221 కి.మీ.రేంజ్ను, 135 కి.మీ టాప్ స్పీడ్ను అందిస్తుంది. -
కాబోయే తొలి టాప్10 ట్రిలియనీర్లు వీళ్లేనా?
ప్రపంచంలో కొందరి సంపద అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటికే లక్షల కోట్లు దాటిపోయింది. ఇప్పటి వరకూ వారిని మల్టీ బిలియనీర్లు అనేవారు. ఇప్పుడు కొత్త టైటిల్ రాబోతోంది. అదే ట్రియనీర్. అంటే 1000 బిలియన్లు ఒక ట్రిలియన్కి సమానం. అయితే ఇప్పటి వరకూ ఎవరూ అధికారింగా ట్రిలియనీర్ టైటిల్ పొందలేదు. ఆ టైటిల్ సాధించే దిశగా టాప్ 10లో ఎవరెవరుంటారు అనే దానిపై ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ ఓ జాబితాను తయారు చేసింది.ఎలాన్ మస్క్ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఎలాన్ మస్క్కు ఉంది. ప్రస్తుతం ఆయన నెట్వర్త్ 195 బిలియన్ డాలర్లు. ఇది సగటున ఏడాదికి 109.88 శాతం చొప్పున పెరుగుతోంది. దీని ప్రకారం ఆయన 2027 కల్లా ట్రిలియన్ డాలర్ల సంపదను చేరుకుంటారు. ఎలాన్ మస్క్ టెస్లా, స్పేస్ఎక్స్, న్యూరా లింక్ వంటి సంస్థలకు అధినేతగా ఉన్నారు.గౌతమ్ అదానీభారత్కు చెందిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ట్రిలియనీర్ అయ్యేవారి జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఈయన 2028 నాటికి ట్రిలియనీర్ కానున్నారు. 84 బిలియన్ డాలర్లున్న గౌతమ్ అదానీ నెట్వర్త్ ఏటా సగటున 122.86 శాతం వృద్ధి చెందుతోంది.జెన్సెన్ హువాంగ్చిప్ కంపెనీ ఎన్విడియా కోఫౌండర్, సీఈవో జెన్సెన్ హువాంగ్ నెట్వర్త్ 77 బిలియన్ డాలర్లు కాగా సంవత్సానికి 111.88 శాతం పెరుగుతోంది. దీని ప్రకారం 2028 కల్లా ట్రిలియనీర్ జాబితాలోకి చేరనున్నారు.ప్రజోగో పంగెస్టుబరిటో పసిఫిక్ వ్యాపార సమ్మేళం అధినేత ప్రజోగో పంగెస్టు కూడా ట్రిలియనీర్ కానున్నవారి జాబితాలో ఉన్నారు. ఈయన 2028 నాటికి ట్రిలియనీర్ కానున్నారు. 43.4 బిలియన్ డాలర్లున్న పంగెస్టు నెట్వర్త్ ఏటా సగటున 135.95 శాతం పెరుగుతోంది.బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబంఎల్వీఎంహెచ్ ఫౌండర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం సంపద 223 బిలియన్ డాలర్లు. ఇది ఏటా 29.33 శాతం వృద్ధి చెందుతోంది. ఈ లెక్కన 2030 కల్లా ఆర్నాల్ట్ కుటుంబం ట్రిలియనీర్ జాబితాలోకి రానుంది.మార్క్ బుకర్బర్గ్మెటా ఫౌండర్, చైర్మన్, సీఈవో అయిన మార్క్ బుకర్బర్గ్ 2030 నాటికి ట్రిలియనీర్ కానున్నారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడిగా ఉన్న బుకర్బర్గ్ నెట్వర్త్ ఏటా 35.76 శాతం వృద్ధి చెందుతోంది.ఫిల్ నైట్ కుటుంబంనైక్ చైర్మన్ ఫిల్ నైట్, ఆయన కుటుంబం సంయుక్తంగా 40.9 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. ఇది సంవత్సరానికి సగటున 7.99 శాతం పెరుగుతోంది. 2030 నాటికి ఈ కుటుంబం ట్రిలియనీర్ జాబితాలో చోటు దక్కించుకోనుంది.ముఖేష్ అంబానీఆసియా అపర కుబేరుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 2033 కల్లా ట్రిలియనీర్ కానున్నారు. ఆయన నెట్వర్త్ ఏటా సగటున 28.25 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది.మైకేల్ డెల్డెల్ టెక్నాలజీస్ చైర్మన్ సీఈవో మైకేల్ డెల్ ప్రస్తుత నెట్వర్త్ 91 బిలియన్ డాలర్లు. ఇది సంవత్సరానికి 30.89 శాతం చొప్పున పెరుగుతూ వస్తోంది. దీని ప్రకారం ఆయన 2033 నాటికి ట్రిలియన్ డాలర్ క్లబ్లో చేరనున్నారు.స్టీవ్ బామర్మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బామర్ ప్రస్తుత నెట్వర్త్ 121 బిలియన్ డాలర్లు. 25.76 శాతం చొప్పున ఏటా వృద్ధి చెందుతోంది. ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక ప్రకారం ఈయన 2034 నాటికి ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఉంది. -
‘ఎక్స్’లెంట్ ఫాలోయింగ్! అత్యధిక ఫాలోవర్లున్న ప్రముఖులు (ఫొటోలు)
-
ఒక్క కంపెనీ లాభం.. రోజుకు రూ.216 కోట్లు!
దేశంలోని కొన్ని కంపెనీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అవి మనం నిత్యం వింటున్న పేర్లే.. బాగా తెలిసిన కంపెనీలే. అయితే అవి రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటాం. 2024 ఆర్థిక సంవత్సరానికి ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ఆధారంగా సగటున రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.ముఖేష్ అంబానీ నేతృత్వలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.79 లక్షల కోట్ల ఏకీకృత ఎబీటా (EBITDA)ని నివేదించింది. నికర లాభం రూ. 79,020 కోట్లుగా ఉంది. అంటే కంపెనీ సగటున రోజుకు ఆర్జిస్తున్న లాభం రూ.216.5 కోట్లు. ఈటీ మనీ నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో సగటున రోజువారీ లాభంలో టాప్ టెన్ కంపెనీల జాబితా ఇదే..లాభాల్లో టాప్10 కంపెనీలు🔝రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.216.5 కోట్లు🔝ఎస్బీఐ రూ.186.7 కోట్లు🔝హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.179.3 కోట్లు🔝ఓఎన్జీసీ రూ.156.4 కోట్లు🔝టీసీఎస్ రూ.126.3 కోట్లు🔝ఐసీఐసీఐ బ్యాంక్ రూ.123.3 కోట్లు🔝ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.118.2 కోట్లు🔝ఎల్ఐసీ రూ.112.1 కోట్లు🔝కోల్ ఇండియా రూ.102.4 కోట్లు🔝టాటా మోటర్స్ రూ.87.1 కోట్లుఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ.. -
మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్-10 ఇండియన్ సినిమాలు (ఫొటోలు)
-
సంపదలో తగ్గేదేలే అంటున్న ధీరవనితలు వీళ్లే!
-
ప్రపంచ పర్యాటక దినోత్సవం: టాప్ 10 పర్యాటక ప్రాంతాలు (ఫొటోలు)
-
రీ-రిలీజ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-10 సౌత్ ఇండియా సినిమాలు (ఫొటోలు)
-
ప్రపంచంలోనే టాప్ 10 నివాసయోగ్యమైన నగరాలు (ఫొటోలు)
-
మిస్ ఏఐ అందాల పోటీ టాప్లో జరా శతావరి! ఎవరీ బ్యూటీ..? (ఫోటోలు)
-
10 ప్రముఖ రామాలయాలు.. వీటి గొప్పదనం ఇదే..
అయోధ్యలో నూతనంగా నిర్మితమైన రామాలయంలో జనవరి 22న బాలరాముడు కొలువుదీరనున్నాడు. ఆ రోజున దేశవ్యాప్తంగా పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే దేశంలోని 10 ప్రముఖ రామాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్య రామ మందిరం (ఉత్తరప్రదేశ్) ఈ ఆలయ గొప్పదనం జగద్విదితం. అయోధ్యను రామజన్మభూమి అని అంటారు. ఇది సరయూ నది ఒడ్డున ఉంది. శ్రీరాముని దర్శనం కోసం ప్రతి ఏటా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. త్రిప్రయార్ శ్రీరామ దేవాలయం (కేరళ) ఈ ఆలయం కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కొలువైన శ్రీరాముని విగ్రహాన్ని శ్రీకృష్ణుడు పూజించాడని చెబుతారు. కేరళలోని చెట్టువా ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడంటారు. తరువాతి కాలంలో ఆ ప్రాంత పాలకుడు వక్కయిల్ కైమల్ ఆ విగ్రహాన్ని త్రిపయార్ ఆలయంలో ప్రతిష్టించాడు. ఇక్కడికి వచ్చిన భక్తుడు దుష్టశక్తుల నుండి విముక్తి పొందుతాడని భక్తులు నమ్ముతారు. కాలారామ్ ఆలయం (నాసిక్) మహారాష్ట్రలోని నాసిక్లోని పంచవటి ప్రాంతంలో కాలారామ్ ఆలయం ఉంది. ఇక్కడ రెండు అడుగుల ఎత్తయిన రాముడి నల్లని విగ్రహం కనిపిస్తుంది. సీత, లక్ష్మణుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయాన్ని సర్దార్ రంగారు ఒదేకర్ నిర్మించారు. గోదావరి నదిలో రాముని నల్లని విగ్రహం ఉన్నట్లు అతనికి కల వచ్చింది. దీంతో ఆయన మరుసటి రోజు ఆ విగ్రహాన్ని వెలికి తీయించి ఆలయాన్ని నిర్మించారు. సీతా రామచంద్రస్వామి ఆలయం (తెలంగాణ) ఈ ఆలయం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో ఉంది. లంక నుండి సీతామాతను తీసుకువచ్చే క్రమంలో.. శ్రీరాముడు గోదావరి నదిని దాటిన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఆలయంలోని శ్రీరాముని విగ్రహం విల్లు, బాణాలతో కూడివుంటుంది. చేతిలో కమలం పట్టుకున్న సీతామాత శ్రీరాముని పక్కన నిలుచుని ఉంటారు. రామరాజ దేవాలయం (మధ్యప్రదేశ్) ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని ఓర్చాలో ఉంది. భారతదేశంలో శ్రీరాముని దేవునిగా కాకుండా రాజుగా పూజించే ఏకైక ఆలయం రామరాజ ఆలయం. ఇక్కడ ప్రతిరోజూ శ్రీరామునికి ఆయుధ వందనం చేస్తుంటారు. కనక్ భవన్ ఆలయం (అయోధ్య) అయోధ్య రాముని జన్మస్థలం. ఇక్కడే ఉన్న కనక్ భవన్ ప్రముఖ రామాలయాల్లో ఒకటిగా పరిగణిస్తుంటారు. ఆలయంలోని బంగారు సింహాసనాలపై ఆభరణాలతో అలంకృతమైన సీతారాములు ఉన్న కారణంగా ఈ ఆలయానికి కనక్ భవన్ ఆలయం అనే పేరు వచ్చింది. సూర్యుడు ఉదయించినప్పుడు ఆలయ గోడలు అద్భుతంగా కనిపిస్తాయి. శ్రీ రామ తీర్థ మందిర్ (అమృత్సర్) ఈ ఆలయం పంజాబ్లోని అమృత్సర్లో ఉంది. లంక నుండి వచ్చిన తరువాత సీతామాతను శ్రీరాముడు విడిచిపెట్టినప్పుడు, ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. ఈ ఆలయం అదే స్థలంలో నిర్మితమయ్యిందని చెబుతారు. ఇక్కడే సీతామాత కవలలకు జన్మనిచ్చిందని అంటారు. కొందండ రామస్వామి దేవాలయం (చిక్కమగళూరు) ఈ ఆలయం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఉంది. హిరమగళూరులో పరశురాముడు.. శ్రీరాముని వివాహ దృశ్యాలను చూపించమని ఆయనను అభ్యర్థించాడట. దీనికి ప్రతిగా కోదండరామస్వామి ఆలయంలోని విగ్రహాలు హిందూ వివాహ అలంకారంలో కనిపిస్తాయి. రాముడు, లక్ష్మణునికి కుడి వైపున సీతామాత నిలుచునివున్న ఏకైక ఆలయం ఇదే. రామస్వామి దేవాలయం (తమిళనాడు) రామస్వామి దేవాలయం తమిళనాడులో ఉంది. రామస్వామి ఆలయాన్ని దక్షిణ భారతదేశంలోని అయోధ్య అంటారు. భరతుడు, శత్రుఘ్నునితో పాటు రాముడు, సీత, లక్ష్మణ విగ్రహాలు ప్రతిష్ఠితమైన ఏకైక ఆలయం ఇదే. రఘునాథ్ ఆలయం (జమ్మూ) ఈ ఆలయం జమ్మూలో ఉంది. ఇది ప్రసిద్ధ దేవాలయం. ఈ ఆలయ సముదాయంలో దాదాపు ఏడు ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ హిందూ మతంలోని ఇతర దేవతలకు కూడా పూజలు జరుగుతుంటాయి. ఈ ఆలయం మొఘలల నిర్మాణ శైలిలో ఉంటుంది. -
ఆసియాను కుదిపేసిన 10 భారీ భూకంపాలివే..
భూకంపం.. నివారించడం సాధ్యం కాని విపత్తు. అందుకే జాగ్రత్త, అప్రమత్తతే దీనికి పరిష్కారం. ముందస్తుగా సన్నద్ధం కాగలిగితే భూకంపాల తరహా విపత్తుల వల్ల కలిగే నష్టాన్ని కొంత వరకు నివారించవచ్చు. తాజాగా నేపాల్లో సంభవించిన భూకంపం కారణంగా వందలాదిమంది మృతి చెందారు. ఈ నేపధ్యంలో ఆసియా ఖండంలో సంభవించిన పది అతిపెద్ద భూకంపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో తరచూ విపత్తులకు గురయ్యే ఆసియాఖండంలో భూకంపాలు అత్యంత ప్రమాదకర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యూఎన్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ (యూఎన్ఐఎస్డీఆర్) తెలిపిన వివరాల ప్రకారం ఆసియాలోని చైనా, భారత్, ఇండోనేషియా, మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఆసియాలోని నగరాలు చాలా వరకు ప్రణాళికాబద్ధంగా లేవు. అవి నిర్మితమైనప్పుడు లోపభూయిష్టంగా ఉన్నాయని బ్యాంకాక్లోని ఆసియన్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ అర్బన్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అరంబెపోలా గతంలో తెలిపారు. కాగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపిన వివరాల ప్రకారం ఆసియాలో సంభవించిన పది అత్యంత భారీ భూకంపాలు ఇవే.. 1. ఇండోనేషియా: 2004, డిసెంబరు 26న ఇండోనేషియాలోని సుమత్రాలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు మొత్తం 2,27,898 మంది మరణించారు. ఆ తర్వాత వచ్చిన సునామీ 14 ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాలపై ప్రభావం చూపింది. ఇది జరిగిన మూడు నెలల తర్వాత ఉత్తర సుమత్రాలో 2005, మార్చి 28న 8.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించగా, సుమారు వెయ్యి మంది మరణించారు. 2. చైనా: 2008, మే 12న తూర్పు సిచువాన్లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 87,587 మంది మృత్యువాత పడ్డారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 3,74,177 మంది క్షతగాత్రులయ్యారు. 3. పాకిస్తాన్: 2005, అక్టోబర్ 8న 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 86 వేల మంది మరణించారు. రాజధాని ఇస్లామాబాద్కు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర పాకిస్తాన్లో ఈ భూకంపం సంభవించింది. 4. ఇరాన్: 1990, జూన్ 21న ఉత్తర ఇరాన్లో సంభవించిన భూకంపంలో 50 వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలొదిలారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదయ్యింది. భూకంప తాకిడికి ఇరాన్లోని మంజిల్, రడ్బర్ పట్టణాలు నేలమట్టమయ్యాయి. 5. ఇరాన్: 2003, డిసెంబర్ 26న బామ్లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 31 వేల మంది మరణించారు. ఇది రెండు వేల సంవత్సరాలలో ఈ ప్రాంతంలో సంభవించిన అతిపెద్ద భూకంపం. ఈ భూకంపం తాకిడికి నగరంలోని 70 శాతం ధ్వంసమైందని నివేదికలు చెబుతున్నాయి. 6. జపాన్: 2011, మార్చి 11న జపాన్లో సంభవించిన సునామీ భూకంపంలో 20,896 మంది ప్రాణాలు కోల్పోయారు. 8.9 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. సాండియాకు 80 మైళ్ల దూరంలో ఈ భూకంపం చోటుచేసుకుంది. 7. భారతదేశం: 2001, జనవరి 26న భుజ్లో సంభవించిన భూకంపంలో 20,085 మంది మృతి చెందారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.6గా నమోదైంది. గుజరాత్లో దాదాపు సగం జనాభా ఈ విపత్తుకు ప్రభావితమయ్యింది. 8. టర్కీ: 1999 ఆగస్టు 17న పశ్చిమ టర్కీలోని ఇజ్మిత్లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 17,118 మంది మరణించారు. ఈ భూకంపం దేశంలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్కు గణనీయమైన నష్టాన్ని మిగిల్చింది. 9. భారతదేశం: 1993, సెప్టెంబరు 30న మహారాష్ట్రలోని లాతూర్లో సంభవించిన భూకంపానికి 20 వేల మంది బలయ్యారు. ఈ భూకంప తీవ్రతకు లాతూర్ పట్టణమంతా ధ్వంసమయ్యింది. 40 సెకెన్లపాటు సంభవించిన ఈ భూకంపంలో 30 వేలమందికిపైగా ప్రజలు గాయపడ్డారు. 10. ఇండోనేషియా: జావాలో 2006 మే 27న 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 5,749 మంది మృతి చెందారు. రెండేళ్ల వ్యవధిలో ఇండోనేషియాలో సంభవించిన మూడో అతిపెద్ద విపత్తు ఇది. 2009, సెప్టెంబరు 30న దక్షిణ సుమత్రాలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 1,117 మంది మృత్యువాత పడ్డారు. ఇది కూడా చదవండి: ఏ రకమైన భూకంపం అత్యంత ప్రమాదకరం? -
టాప్ 10 టెక్నాలజీ కంపెనీలు: అరకోటి మంది టెకీలు వీటిలోనే..
ప్రపంచవ్యాప్తంగా టెక్ జాబ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. మంచి వేతన ప్యాకేజీలు, మెరుగైన లైఫ్ స్టైల్ కారణంగా చాలా వీటిని డ్రీమ్ జాబ్స్గా భావిస్తున్నారు. ఇలాంటి టెక్ జాబ్లు కల్పించే టెక్నాలజీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 కంపెనీల్లోనే సుమారు అరకోటి మందికిపైగా టెకీలు పనిచేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ గ్యాడ్జెట్స్ నౌ నివేదిక ప్రకారం.. అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్ 10 టెక్నాలజీ కంపెనీల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ▶ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) సుమారు 1,461,000 మంది ఉద్యోగులతో అగ్రస్థానంలో ఉంది. కంపెనీకి చెందిన క్లౌడ్ కంప్యూటింగ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్తో సహా వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ▶యాపిల్ (Apple)కు సంబంధించిన అతిపెద్ద ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన ఫాక్స్కాన్ (Foxconn) 826,608 మంది ఉద్యోగులతో రెండవ స్థానంలో నిలిచింది. ఐఫోన్ల ఉత్పత్తిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ▶జాబితాలో తర్వాతి స్థానంలో ఐటీ కన్సల్టెన్సీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) సుమారు 738,000 మంది ఉద్యోగులతో ఉంది. ▶భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 614,795 మంది గ్లోబల్ వర్క్ఫోర్స్ కలిగి ఉంది. ఇది ప్రపంచ ఐటీ పవర్హౌస్గా మారింది. ▶ఫ్రాన్స్కు చెందిన టెలిఫర్ఫార్మెన్స్ (Teleperformance) ప్రపంచవ్యాప్తంగా 410,000 మంది ఉద్యోగులతో కూడిన గ్లోబల్ డిజిటల్ బిజినెస్ సర్వీస్ ప్రొవైడర్. ▶యునైటెడ్ స్టేట్స్కు చెందిన కాగ్నిజెంట్ (Cognizant)లో దాదాపు 351,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ▶మరొక భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys)లో ప్రపంచవ్యాప్తంగా 336,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో కన్సల్టింగ్, ఐటీ సేవలలో ప్రత్యేక కంపెనీగా నిలిచింది. ▶జర్మన్ సమ్మేళనం సిమెన్స్ ప్రపంచవ్యాప్తంగా 190 కేంద్రాల్లో సుమారు 3,16,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ▶యూఎస్ కేంద్రంగా ఉన్న ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐబీఎం (IBM)లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 288,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ▶సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,21,000 మంది ఉద్యోగులతో డ్రీమ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. మైక్రోసాఫ్ట్ వర్క్ఫోర్స్లో దాదాపు 60 శాతం మంది దాని స్వదేశమైన యునైటెడ్ స్టేట్స్ నుంచే ఉన్నారు. -
ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే!
ప్రపంచం కుబేరుల జాబితాలోనే కాదు, భారతదేశంలోని టాప్ 10 ధనవంతుల లిస్ట్లో కూడా దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) పేరు ఎందుకు లేదనే సందేహం ఇప్పటికే చాలామంది మనసులో ఒక ప్రశ్నగా మిగిలి ఉంటుంది. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఉప్పు నుంచి కార్లు, విమానం, బంగారం, ఐటీ వంటి అన్ని రంగాల్లోనూ తమదైన రీతిలో దూసుకెళ్తున్న టాటా సన్స్ కంపెనీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఈయన సంపద వేల కోట్లలో ఉంటుంది. అయినప్పటికీ ధనవంతుల జాబితాలో ఈయన పేరు లేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కువ డబ్బుని దాతృత్వానికి వినియోగించడమే. అపారమైన వ్యాపార సామ్రాజ్యం, అంతకు మించిన పేరు ప్రతిష్టతలు కలిగిన రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు. కంపెనీ నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ కారణంగానే టాప్ 10 ధనవంతుల జాబితాలో కూడా ఉండలేకపోతున్నారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు.. కారణం ఇదే! 2021 - 22లో టాటా కంపెనీల మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లు అని నివేదికలు చెబుతున్నాయి. టాటా సంస్థల్లో ఏకంగా 9,35,000 కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కాగా రతన్ టాటా 2012లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. -
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే?
భారతదేశం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంతో పోలిస్తే టెక్నాలజీ ఇప్పుడు మరింత ఊపందుకుంటోంది. ఈ కారణంగా 2023లో ప్రపంచంలోని అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థలుగా వృద్ధి చెందిన దేశాల జాబితాలో ఇండియా 5 వ స్థానంలో చేరింది. ఒక దేశం GDPని అంచనా వేయడానికి మొత్తం వినియోగ వస్తువులు, కొత్త పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయాలు, ఎగుమతుల నికర విలువ ఉపయోగపడుతుంది. అయితే 2023లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఏది? ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో అమెరికా మొదటి జాబితాలో ఉంది. ఐదవ స్థానంలో భారత్ చేరగా.. 10వ స్థానంలో బ్రెజిల్ ఉంది. 2023లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన 10 దేశాలు & జీడీపీ.. అమెరికా - 26854 బిలియన్ డాలర్లు చైనా - 19374 బిలియన్ డాలర్లు జపాన్ - 4410 బిలియన్ డాలర్లు జర్మనీ - 4309 బిలియన్ డాలర్లు ఇండియా - 3750 బిలియన్ డాలర్లు యూకే - 3159 బిలియన్ డాలర్లు ఫ్రాన్స్ - 2924 బిలియన్ డాలర్లు ఇటలీ - 2170 బిలియన్ డాలర్లు కెనడా - 2090 బిలియన్ డాలర్లు బ్రెజిల్ - 2080 బిలియన్ డాలర్లు ప్రపంచంలోని టాప్ 10 దేశాల వారీగా జీడీపీ.. 👉అమెరికా జీడీపీ: 26854 బిలియన్ తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 80,030 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 1.6 శాతం 👉చైనా జీడీపీ: 19374 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 13,720 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 5.2 శాతం 👉జపాన్ జీడీపీ: 4,410 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 35,390 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 1.3 శాతం 👉జర్మనీ జీడీపీ: 4,309 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 51,380 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: -0.1 శాతం 👉ఇండియా జీడీపీ: 3,750 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 2,601 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 5.9 శాతం 👉యూకే (యునైటెడ్ కింగ్డమ్) జీడీపీ: 3,159 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 46,370 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: -0.3 శాతం 👉ఫ్రాన్స్ జీడీపీ: 2,924 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 44,410 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 0.7 శాతం 👉ఇటలీ జీడీపీ: 2,170 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 36,810 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 0.7 శాతం 👉కెనడా జీడీపీ: 2,090 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 52,720 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 1.5 శాతం 👉బ్రెజిల్ జీడీపీ: 2,080 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 9,670 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 0.9 శాతం -
Best Camera Phones: ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ కెమెరా మొబైల్ ఫోన్స్
-
2023 భారతదేశంలో టాప్ 10 బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్
-
దేశంలో యూట్యూబ్ తోపులు వీళ్లే!
యూట్యూబ్ ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతిఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూట్యాబ్ను వీక్షిస్తున్నారు. భారతదేశంలోనూ కోట్ల మంది యూట్యూబ్ వీక్షకులు ఉన్నారు. ఇందుకు తగినట్లే యూట్యూబర్లు, యూట్యాబ్ ఛానళ్లు సైతం ఇటీవల పెద్ద సంఖ్యలో పెరిగాయి. యూజర్లు కంటెంట్ని వినియోగించే విధానంలో యూట్యాబ్ విప్లవాత్మక మార్పులు చేసింది. దేశంలో ఈ ప్లాట్ఫారమ్ కొత్త తరం డిజిటల్ సెలబ్రిటీలకు జన్మనిచ్చింది. కామెడీ స్కెచ్ల నుంచి టెక్నికల్ రివ్యూల వరకు దేశంలోని ఈ టాప్ యూట్యూబర్లు దూసుకుపోతున్నారు. 2008లో భారతదేశంలో యూట్యూబ్ అరంగేట్రం కొత్త శకానికి నాంది పలికింది. ప్రారంభంలో మ్యూజిక్ వీడియోలకే పరిమితమైన యూట్యూబ్ అనతి కాలంలోనే దేశంలోని యూట్యూబర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అతిపెద్ద వేదికగా మారింది. వర్ధమాన చిత్రనిర్మాతల నుంచి గృహిణుల వరకు యూట్యూబ్ కోట్లాది మంది గొంతుగా మారింది. 2023లో దాదాపు 467 మిలియన్ల మంది యూజర్లతో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యూట్యూబ్ సబ్స్క్రైబర్లను దేశంగా భారత్ నిలిచింది. దేశంలోని టాప్ 10 యూట్యూబర్లు భారతదేశంలో డిజిటల్ సూపర్స్టార్లు ఈ టాప్ 10 యూట్యూబర్లు. యూట్యూబ్లో యూజర్లను పెంచుకోవడం మామూలు విషయం కాదు. యూట్యూబ్ అల్గారిథంను అవపోసన పట్టి యూజర్ల నాడిని తెలుసుకుని అందుకు తగిన కంటెంట్ను క్రియేట్ చేసే వాళ్లే ఇక్కడ టాప్లో నిలుస్తారు. అలా యూజర్లపరంగా టాప్ 10లో ఉన్న యూట్యాబర్లు, వారి చానళ్లు, ఏ రకమైన కంటెంట్ అందిస్తున్నారో తెలుసుకుందాం.. క్యారీమినాటి, 39.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, రోస్టింగ్, కామెడీ కంటెంట్ టోటల్ గేమింగ్, 35.7 మిలియన్ సబ్స్క్రైబర్లు, గేమింగ్ కంటెంట్ టెక్నో గేమర్స్, 34.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, గేమింగ్ కంటెంట్ మిస్టర్ ఇండియన్ హ్యాకర్, 32.1 మిలియన్ సబ్స్క్రైబర్లు, లైఫ్ హ్యాక్స్, ప్రయోగాలు రౌండ్2హెల్, 30.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ స్కిట్లు ఆశిష్ చంచలానీ, 29.8 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ స్కిట్లు, వ్లాగ్లు సందీప్ మహేశ్వరి, 27.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, మోటివేషనల్ స్పీకింగ్ బీబీకి వైన్స్, 26.3 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ, వినోదం అమిత్ భదానా, 24.3 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ, వినోదం టెక్నికల్ గురూజీ, 23.1 మిలియన్ సబ్స్క్రైబర్లు, టెక్నాలజీ రివ్యూస్ -
దేశంలో అత్యంత సంపన్న మహిళలు వీళ్లే.. (ఫొటోలు)
-
రూ. వేల కోట్లు ట్యాక్స్ కట్టిన టాప్ 10 కంపెనీలు ఇవే.. (ఫొటోలు)
-
అద్భుత మహిళలు, గొప్ప సామాజిక వేత్తలు
-
ప్రపంచాన్ని మార్చిన టాప్ 10 గాడ్జెట్స్
-
చిన్నవే కానీ..ప్రాణాలు తీసేస్తాయ్!
-
ప్రపంచంలోని వింతైన, అద్భుతాలను చూశారా?
-
భారతదేశంలోని టాప్ 10 జానపద గాయకులు
-
భారతదేశంలోని టాప్ 10 ఎత్తైన విగ్రహాలు
-
మార్కెట్ విలువ ప్రకారం టాప్ 10 భారతీయ కంపెనీలు
-
ఆంధ్ర ప్రదేశ్లోని టాప్ 10 ప్రసిద్ధ దేవాలయాలు
-
ప్రపంచంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాలు
-
ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన భవనాలు
-
అత్యంత స్కైస్క్రాపర్స్ ఉన్న 10 నగరాలు
-
ప్రపంచంలోని అత్యంత అందమైన బీచ్లు
-
ప్రపంచంలోని టాప్ 10 పురాతన గుహ చిత్రాలు
-
ఊహించని ప్రదేశాలలో వింత ఆవిష్కరణలు
-
ఎక్కువ ఫేమస్ అయిన సెలబ్రిటీస్ వీళ్లే!
-
పెళ్లి మాటే ఎత్తని ఈ భామల్ని చూశారా?
-
ప్రపంచంలోని 10 ప్రసిద్ధి చెందిన టొంబ్స్
-
వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్స్
-
అత్యంత అందమైన టాప్ 10 రోమన్ యాంఫీథియేటర్స్
-
ప్రపంచంలో బెస్ట్ ఆక్టర్స్ ఎవరో తెలుసా..
-
ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన విగ్రహాలు
-
ప్రపంచంలోని టాప్ - 10 అందమైన పురుషులు
-
భారతదేశంలోని టాప్ 10 అందమైన రాజభవనాలు
-
అత్యధిక సంఖ్యలో ఆస్కార్లు గెలుచుకున్న టాప్ 10 నటులు
-
టాప్ 10 - ప్రపంచంలోని అత్యంత సంపన్న నటులు
-
అత్యంత ప్రజాదరణ ఉన్న టాప్ 10 కళాకారులు
-
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 10 సముద్ర జీవులు
-
ప్రపంచంలోని టాప్ 10 స్ట్రీట్ మర్కెట్స్
-
ఉత్తర భారతదేశంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాలు
-
ప్రపంచలోనే అత్యంత పురాతన జైళ్లు ఇవే.. వందల ఏళ్ల కిందటే నిర్మాణం
-
ప్రపంచంలోని టాప్ 10 పవిత్ర స్థలాలు
-
2023లో టాప్ 10 ఇన్స్టాగ్రామ్ ఫాల్లోవర్స్
-
Secret Places In The World: భూమిపై మనం వెళ్ళడానికి నిషేధించబడిన టాప్ 10 ప్రదేశాలు
-
ప్రపంచంలోని టాప్ 10 ఫ్యాషన్ బ్రాండ్లు
-
టాప్ 10 దక్షిణ భారత పర్యాటక ప్రదేశాలు
-
ప్రపంచంలోని టాప్ 10 అందమైన చర్చిలు
-
ప్రపంచంలోని 10 అత్యంత నిశ్శబ్దమైన ప్రదేశాలు
-
Top Car Companies In India: భారత్లో టాప్ 10 కార్ కంపెనీ ఇవే (ఫోటోలు)
-
టాప్ 10 అత్యంత ఖరీదైన మొక్కలు
-
ప్రపంచంలోని టాప్ 10 అరుదైన శిలలు
-
ప్రపంచంలోని టాప్ 10 ఖరీదైన రెస్టారెంట్లు
-
ప్రపంచంలో నీటి అడుగున ఉన్న టాప్ 10 నగరాలు
-
టాప్ లేపేస్తున్న ‘పాప్’ సింగర్స్
-
ప్రపంచంలోని టాప్ 10 యూనివర్సిటీస్
-
టాప్ 10 హర్రర్ సినిమాలు ఇవే..
-
అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు
-
పెళ్లి తరువాత కరియర్కు గుడ్బై చెప్పిన బ్యూటీస్
-
ప్రపంచంలోని టాప్ 10 నృత్యాలు
-
భారతదేశంలోని టాప్ 10 అత్యంత నేరాలు జరిగే నగరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత నేరాలు జరిగే నగరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 ఆర్కిటెక్చర్ రైల్వే స్టేషన్లు
-
భారతదేశంలోని టాప్ 10 శాస్త్రీయ నృత్యాలు
-
ప్రపంచంలోని టాప్ 10 ప్రత్యేక భవనాలు
-
ఒలింపిక్స్లో అత్యధిక బంగారు పతకాలు సాధించిన టాప్ 10 క్రీడాకారులు
-
ప్రపంచంలోని టాప్ 10 నౌకాదళాలు
-
ప్రపంచంలోని టాప్ 10 మిలిటరీ ఫోర్సెస్
-
ప్రపంచంలో అధికంగా మంచు కురిసే దేశాలు
-
ప్రపంచంలోని ప్రపంచ టాప్ 10 డేంజరస్ గన్స్
-
భారతదేశంలోని టాప్ 10 సాహస ప్రదేశాలు
-
ప్రపంచంలోని టాప్ 10 జూలాజికల్ పార్కులు ఇవే!
-
భారతదేశంలోని టాప్ 10 విషరహిత పాములు
-
ప్రపంచంలోని టాప్ 10 దేశాలు ఇవే!
-
ధ్యానం మరియు యోగా కోసం ప్రపంచవ్యాప్తంగా 10 ఆశ్రమాలు
-
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 వంటకాలు ఇవే!
-
ప్రపంచంలో ఎక్కువ మందు బాబులు ఉండేది ఈ దేశాల్లోనే!
-
ప్రపంచంలోని టాప్ 10 మార్షల్ ఆర్ట్స్ వీరులు వీరే
-
భారతదేశంలోని టాప్ 10 అత్యంత కాలుష్య నగరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ఖరీదైన వివాహ వేడుకలు
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ఖరీదైన రిస్ట్ వ్యాచ్స్
-
ప్రపంచంలోని టాప్ 10 కాలుష్య నగరాలు
-
భారతదేశంలోని టాప్ 10 విషపూరిత పాములు
-
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద డంపింగ్ యార్డ్లు
-
ప్రపంచంలోని టాప్ 10 బెస్ట్ ఐస్ క్రీమ్స్
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత అందమైన హిల్ స్టేషన్లు
-
భారతదేశంలోని అత్యంత అందమైన టాప్ 10 గ్రామాలు
-
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 నెమ్మదైన జంతువులు
-
ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన పర్వత శిఖరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 విషరహిత పాములు
-
ప్రపంచంలోని టాప్ 10 విషపూరిత పాములు
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యుత్తమ ఫుట్బాల్ స్టేడియంస్
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత అందమైన మహిళలు
-
ప్రపంచంలోని టాప్ 10 ఆకర్షణీయమైన పక్షులు
-
భారతదేశంలోని టాప్ 10 అతిపెద్ద ఆనకట్టలు
-
ప్రపంచంలోని టాప్ 10 సాహస ప్రదేశాలు
-
భారతదేశంలో టాప్ 10 వంతెనలు
-
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నదులు
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత అరుదైన ఆభరణాలు
-
భారతదేశంలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాలు
-
దుబాయ్లోని టాప్ 10 అందమైన ప్రదేశాలు
-
యునైటెడ్ కింగ్డమ్లోని టాప్ 10 అందమైన ప్రదేశాలు
-
ప్రపంచంలోని టాప్ 10 పచ్చదనంతో కూడిన ప్రదేశాలు
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ప్రమాదకరమైన రోడ్లు
-
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద రోడ్ నెట్వర్క్లు
-
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద కోటలు
-
భారతదేశంలోని టాప్ 10 చారిత్రక కోటలు
-
ప్రపంచంలోని టాప్ 10 జలపాతాలు
-
తక్కువ వడ్డీతో లోన్ కావాలా? ఇదిగో టాప్ 10 బెస్ట్ బ్యాంకులు!
ప్రస్తుతం చాలీ చాలని ఉద్యోగాలతో జీవితం నెట్టుకొస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు క్రెడిట్ కార్డ్స్, ప్రైవేట్ సంస్థలు ఇచ్చే లోన్స్ తీసుకుని భారీ వడ్డీలను కడుతూ చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. అయితే ఇబ్బందులకు చెక్ పెట్టడానికి కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీతో పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. అలంటి టాప్ 10 బ్యాంకుల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా: 9.90% నుంచి 14.75% వడ్డీతో రూ. 20 లక్షల వరకు 84 నెలలు లేదా 7 సంవత్సరాల కాల వ్యవధితో అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 10 శాతం లేదా అంత కంటే తక్కువ వడ్డీ రేటుతో రూ. 20 లక్షల వరకు 84 నెలలు లేదా 7 సంవత్సరాల కాల వ్యవధితో అందిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్: 10.26% నుంచి 32.53% వడ్డీతో కనిష్టంగా రూ. 30వేల నుంచి గరిష్టంగా రూ. 25 లక్షల వరకు 12 నెలల నుంచి 60 నెలల కాల వ్యవధితో అందిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్: 10.40% నుంచి 16.95% వడ్డీ రేటుతో సుమారు 5 సంవత్సరాలు లేదా 60 నెలల కాల వ్యవధితో రూ. 10 లక్షల వరకు లోన్ అందిస్తుంది. యాక్సిస్ బ్యాంక్: 10.49% నుంచి 22.00% వడ్డీ రేటుతో 60 నెలలు / 5 సంవత్సరాల కాల వ్యవధితో రూ. 50వేలు నుంచి రూ. 40 లక్షల వరకు లోన్ అందిస్తుంది. IDFC ఫస్ట్ బ్యాంక్: 10.49% లేదా అంతకంటే తక్కువ వడ్డీతో 6 నుంచి 60 నెలల కాల వ్యవధితో సుమారు రూ. కోటి వరకు లోన్ అందిస్తుంది. HDFC బ్యాంక్: 10.50% నుంచి 24.00% వడ్డీ రేటుతో 12 నుంచి 60 నెలల కాల వ్యవధితో సుమారు రూ. 40 లక్షల వరకు లోన్ అందిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్: 10.75% నుంచి 19.00% వడ్డీతో 12 నుంచి 72 నెలల కాల వ్యవధితో రూ. 50వేలు నుంచి రూ. 50 లక్షల వరకు లోన్ అందిస్తుంది. ఐడిబిఐ బ్యాంక్: 10.50% నుంచి 15.50% వడ్డీ రేటుతో 12 నుంచి 60 నెలల కాల వ్యవధితో రూ. 25వేలు నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ అందిస్తుంది. కరూర్ వైశ్యా బ్యాంక్: 10.50% నుంచి 13.50% వడ్డీ రేటుతో 12 నుంచి 60 నెలల కాల వ్యవధితో రూ. 10 లక్షల వరకు లోన్ అందిస్తుంది. -
Island: ప్రపంచంలోని టాప్ 10 దీవులు
-
ప్రపంచంలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాలు (ఫోటోలు)
-
భారతదేశంలోని టాప్ 10 ఉత్తమ ప్రకృతి ప్రదేశాలు (ఫోటోలు)
-
రూ.20వేల లోపు సూపర్ స్మార్ట్ఫోన్లు..
దేశంలో రూ.20 వేల లోపే సూపర్ ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. మంచి పనితీరుతో పాటు ప్రీమియం డిజైన్, అద్భుతమైన కెమెరా ఆప్షన్లు ఉన్నాయి. గేమింగ్ ఇష్టపడేవారికి 6జీబీ ర్యామ్తో అత్యంత సామర్థ్యం గల ప్రాసెసర్లను కలిగిన స్మార్ట్ ఫోన్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. శాంసంగ్, మోటరోలా, నోకియా, షావోమీ వంటి టాప్ బ్రాండ్ల ఫోన్లు రూ.20 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: ఆర్బీఎల్ బ్యాంకుకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆర్బీఐ! రూ.కోట్లలో జరిమానా.. పోకో (POCO) X4 ప్రో ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్ , స్నాప్డ్రాగన్ 695 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.67 అంగుళాలు కెమెరా: 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh షావోమీ రెడ్మీ (Xiaomi Redmi) Note 12 ధర: రూ. 17,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 4 Gen 1 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.67 అంగుళాలు కెమెరా: 48 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్మీ (realme) 10 Pro 5G ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 695 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.72 అంగుళాలు కెమెరా: 108 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఇదీ చదవండి: టాటాతో కుదరలేదు.. ఇక బిస్లెరీకి బాస్ ఆమే... వన్ప్లస్ (OnePlus) Nord CE 2 Lite 5G ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 695 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.59 అంగుళాలు కెమెరా: 64 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్ (realme) 9 5g SE ధర: రూ. 16,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 778G ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు (16.76 సెం.మీ.) కెమెరా: 48 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన! రియల్మీ (realme) 9 ధర: రూ. 16,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 680 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.4 అంగుళాలు కెమెరా: 108 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh శాంసంగ్ గెలాక్సీ A14 5G ధర: రూ. 16,499 ప్రాసెసర్: ఆక్టా కోర్, Samsung Exynos 1330 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... ఒప్పో (OPPO) A78 5G ధర: రూ. 18,980 ప్రాసెసర్: ఆక్టా కోర్ , మీడియాటెక్ డైమెన్సిటీ 700 ర్యామ్: 8 GB డిస్ప్లే: 6.56 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh మోటో (Moto) G73 ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 930 ర్యామ్: 8 GB డిస్ప్లే: 6.5 అంగుళాలు కెమెరా: 50 MP + 8 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh వివో (Vivo) Y56 ధర: రూ. 19,780 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ర్యామ్: 8 GB డిస్ప్లే: 6.58 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh -
హైదరాబాద్లోని టాప్ 10 వాటర్ పార్కులు (ఫోటోలు)
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత పరిశుభ్రమైన నగరాలు (ఫోటోలు)
-
భారతదేశంలోని టాప్ 10 అతిపెద్ద రైల్వే స్టేషన్లు (ఫోటోలు)
-
ప్రపంచంలోని టాప్ 10 వంతెనలు (ఫోటోలు)
-
భారతదేశంలో ఉన్న టాప్ 10 ప్రసిద్ధ దేవాలయాలు (ఫోటోలు)
-
టాప్ 10 అంతర్జాతీయ విమానాశ్రయాలు (ఫోటోలు)
-
భారతదేశంలోని టాప్ 10 మహిళా స్వాతంత్ర్య సమరయోధులు (ఫోటోలు)
-
ప్రపంచంలో జీవించడానికి అనువుగా ఉన్న టాప్ 10 నగరాలు (ఫోటోలు)
-
ప్రపంచంలో నీరు లేకుండా జీవించే టాప్ 10 జంతువులు (ఫోటోలు)
-
ప్రపంచంలోని టాప్ 10 ఆర్థికంగా స్థిరమైన దేశాలు (ఫోటోలు)
-
ప్రపంచంలోని టాప్ 10 బిజీయెస్ట్ కంటైనర్ పోర్ట్లు (ఫోటోలు)
-
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాలు ఇవే (ఫొటోలు)
-
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. అనంతను ముంచెత్తిన వాన ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అనంతపురం నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఆ ప్యాకేజీకి ఓకే అంటే మునుగోడు నుంచి తప్పుకుంటాం తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. బీజేపీకి బంపరాఫర్ ప్రకటించారు. మునుగోడు బరి నుంచి తప్పుకునేందుకు ప్యాకేజీ సిద్ధమా? అంటూ ప్రశ్నించారాయన. రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికి రూ. 18,000 కోట్లు కాంట్రాక్టు ఇచ్చారు కదా అంటూ తీవ్ర విమర్శలే గుప్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. డెమొక్రటిక్ పార్టీకి తుల్సీ గబ్బార్డ్ గుడ్బై 20 ఏళ్ల బంధానికి ముగింపు పలికారు తుల్సీ గబ్బార్డ్. అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి, ఆ దేశ చట్ట సభ్యురాలు అయిన గబ్బార్డ్ సంచలనానికి తెర లేపారు. డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆమె.. ఈ క్రమంలో పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. డెమొక్రటిక్ పార్టీ దేశంలోని ప్రతీ అంశాన్ని జాతివివక్ష కోణంలోనే నడిపిస్తోందన్న ఆమె.. వీడియో సందేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారామె. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. యూరప్లోనూ యూపీఐ చెల్లింపులు యూరప్కు వెళ్లే వారు అక్కడ కూడా యూపీఐతో చెల్లింపులు చేసే రోజు అతి త్వరలో సాకారం కానుంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) యూరప్కు చెందిన చెల్లింపుల సేవల సంస్థ ‘వరల్డ్లైన్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూరప్ వ్యాప్తంగా భారత చెల్లింపులను ఆమోదించడం ఈ ఒప్పందంలో భాగమని ఎన్ఐపీఎల్ ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాగర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ ఉత్తరాంధ్ర యాత్ర. అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. బీజేపీలో చేరలేదనే గంగూలీకి అవకాశం ఇవ్వలేదు! భారత క్రికెట్ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందునే మాజీ కెప్టెన్ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. ఉక్రెయిన్ కోసం కాదు.. అందుకైతే పుతిన్ను కలుస్తా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలిసే ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్ దురాక్రమణ అంశంపై అసలు చర్చించే ప్రసక్తే లేదని తేల్చేశారు. అయితే ఆ వ్యవహారంపై మాత్రం పుతిన్తో అవకాశం ఉంటే చర్చిస్తానని తెలిపారు. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటంటే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. మాలీవుడ్ ఎంట్రీ.. పాన్ ఇండియా లెవల్ తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే తెలుగులో క్రేజీ హీరోయిన్గా మారిపోయిన కృతీ శెట్టి మాలీవుడ్కి హాయ్ చెబుతున్నారు. టోవినో థామస్ హీరోగా మలయాళంలో ‘అజయంటే రందం మోషణం’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోనే కృతీ శెట్టి ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాతో జితిన్ లాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. టీ20 వరల్డ్కప్.. టీమిండియాకు బలం టి20 ప్రపంచకప్ 2022 ప్రారంభానికి ముందు టీమిండియా గుడ్న్యూస్. టీమిండియా ఫ్రంట్లైన్ పేసర్ మహ్మద్ షమీ ఫిట్నెస్ టెస్టులో పాసైనట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో షమీకి ఫిట్నెస్ టెస్టు నిర్వహించారు. ఫిట్నెస్ నిరూపించుకోవడంతో షమీ ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నాడు. టి20 ప్రపంచకప్కు మరో రెండు వారాలు సమయం ఉండడంతో షమీ తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. మానవహక్కుల దూత అశ్విని, తొలి దళిత యువతిగా.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్హెచ్ఆర్సి) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని నియమించింది. ఆ మేరకు చరిత్ర సృష్టించిన ఆ యువతి పేరు అశ్విని కె.పి. బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న 36 ఏళ్ల అశ్విని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కు ప్రత్యేక దూతగా ఉంటూ... దాని కార్యకలాపాలను నమోదు చేయడమే కాకుండా జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం గురించి వివిధ దేశాల్లో పెచ్చరిల్లుతున్న ధోరణులను స్వతంత్రస్థాయిలో నివేదిస్తుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
నిలువెత్తు గెలుపు సంతకం
‘మర్యాద, సభ్యత, క్రమశిక్షణ అనేవి మనిషిని తీర్చిదిద్ది ఉత్తములుగా తయారుచేస్తాయి’ అనేది మంచిమాట. ఈ మాటకు తన వంతుగా మరో మాట చేర్చాడు ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ లారీ బేకర్... ‘మర్యాద, సభ్యత, క్రమశిక్షణ అనేవి అత్యుత్తమ నిర్మాణాలకు కారణం అవుతాయి’ ఆర్కిటెక్ట్గా దేశవిదేశాల్లో రాణిస్తున్న శ్వేతా దేశ్ముఖ్ లారీ బేకర్ చెప్పిన ప్రతి మాటను అక్షరాలా ఆచరించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ది ఇండియన్ అలర్ట్ ‘టాప్ టెన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్–2022’ జాబితాలో చోటు సంపాదించిన శ్వేతాదేశ్ముఖ్ గురించి... ముంబైకి చెందిన శ్వేతాదేశ్ముఖ్కు చిన్నప్పటి నుంచి స్కెచ్చింగ్, పెయింటింగ్ అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనను ఆర్కిటెక్చర్ వైపు తీసుకువచ్చింది. నాగ్పుర్లో బీ.ఆర్క్, పుణెలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. ఆ తరువాత సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఉద్యోగంలో చేరితే ఎలా ఉండేదో తెలియదుగానీ, సొంతంగా ప్రాక్టిస్ చేయడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. వివాహం తరువాత ముంబైలోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్గా పనిచేసిన శ్వేత ఆ తరువాత ‘డిజైన్బాక్స్’ పేరుతో ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మొదలుపెట్టింది.‘డబ్బులు ఎక్కువ వచ్చినా సరే, తక్కువ క్రియేటివిటీ ఉండే ప్రాజెక్ట్లకు దూరంగా ఉండాలి’ అనే నిబంధన విధించుకుంది. క్లయింట్స్ నుంచి సైట్ ఫోటోలు, వీడియోలు, డ్రాయింగ్స్ తీసుకోవడమే కాదు డిజైన్ ప్రాసెస్లో కూడా వారిని భాగం చేస్తుంది. కలర్ కన్సల్టింగ్, ఫర్నిచర్ డిజైనింగ్, వాల్ డెకర్, లైటింగ్ ఐడియాస్... ఇలా ఎన్నో విషయాలలో ఎంతోమంది క్లయింట్స్కు సేవలు అందించిన ‘డిజైన్బాక్స్’ మోస్ట్ ఇన్నోవేటివ్ ఫర్మ్ అవార్డ్ గెలుచుకుంది. తన ఫేవరెట్ ప్రాజెక్ట్ల విషయానికి వస్తే ఇరవై అయిదు ఎకరాల పరిధిలోని భీమాశంకర్ హిల్స్(కర్జత్, మహారాష్ట్ర), పుదుచ్చేరిలోని మలీప్లె్లక్స్,గ్రీన్హౌజ్, చెంబూర్లోని ఏడు ఎకరాల కమర్షియల్ ఇంటీరియర్... ఇలా ఎన్నో ఉన్నాయి. ‘నాకంటూ ప్రత్యేకమైన స్టైల్ లేదు. క్లయింట్స్ అభిరుచి, అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తాను’ అంటున్న శ్వేత నిర్మాణ ప్రక్రియలో పర్యావరణ కోణానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఉదా: స్క్రాప్ మెటీరియల్ను రీసైకిలింగ్ కంపెనీలకు తరలించడం, వర్షపునీటి నిల్వ, స్థానిక వనరులను సమర్థవంతంగా వాడుకోవడం... మొదలైనవి. ‘నా డిజైనింగ్కు ప్రకృతే స్ఫూర్తి ఇస్తుంది’ అని చెబుతున్న శ్వేత బాగా అభిమానించే ఆర్కిటెక్ట్ లారీ బేకర్. బ్రిటన్లో పుట్టిన బేకర్ ఇండియాకు వచ్చి నిర్మాణరంగం లో అనేక ప్రయోగాలు చేసి ‘లెజెండ్’ అనిపించుకున్నాడు. సామాన్యుల ఆర్కిటెక్ట్గా పేరు తెచ్చుకున్నాడు. ‘ఇతర ఆర్కిటెక్ట్ల నుంచి స్ఫూర్తి పొందడం కంటే సామాన్యులు సృష్టించిన వాటిలో నుంచే ఎక్కువగా స్ఫూర్తి పొందుతాను’ అనే లారీ బేకర్ మాట తనకు ఇష్టమైనది. ఆయన చెప్పిన ‘లోకల్ విజ్డమ్’ను అనుసరిస్తుంది. ‘ఒక డిజైన్ చేసే ముందు ఆ పరిసరాలకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకోవాలి’ అని లారీ చెప్పిన మాటను ఆచరణలో చూపుతుంది శ్వేత. గౌతమ్ భాటియా రాసిన ‘లారీ బేకర్: లైఫ్, వర్క్ అండ్ రైటింగ్’ పుస్తకం అంటే ఇష్టం. ‘ప్రతి వృత్తిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయితే ప్రతి సవాలు మన విజయానికి ఒక మెట్టులా ఉపయోగపడుతుంది. మొదట్లో మాకు కూడా రకరకాల సందేహాలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఇలా స్టార్ట్ చేశాం. ఇలాగే ఉంటాం... అన్నట్లు కాకుండా ఎప్పటికప్పుడు మా ప్రణాళికలో మార్పు చేసుకుంటూ వచ్చాం’ అంటుంది శ్వేతాదేశ్ముఖ్. చదువుకునే రోజుల్లో, వృత్తిలోకి వచ్చిన తొలిరోజుల్లో మూర్ఛవ్యాధి సమస్యతో సతమతమయ్యేది శ్వేత. అలా అని ఎప్పుడూ ఆగిపోలేదు. ఇంటికి పరిమితం కాలేదు. పనిలో దొరికే ఉత్సాహన్నే ఔషధంగా చేసుకొని ముందుకు కదులుతుంది. -
'మేజర్' అరుదైన రికార్డు.. పాక్తో సహా 14 దేశాల్లో ట్రెండింగ్
Major Trends At Top 10 On Netflix Across 14 Countries: 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అడివి శేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలాగే ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో జులై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ప్లాట్ఫామ్పై కూడా సత్తా చాటుతోంది. అడవి శేష్ నటన, యాక్షన్ సీక్వెన్స్, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వివిధ దేశాల్లోని ప్రజలను ఆకట్టుకుంటోంది. 'మేజర్' చిత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా 14 దేశాల్లో ట్రెండింగ్లో ఉంది. తెలుగు, హిందీ భాషలతోపాటు ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో అందుబాటులో ఉండగా.. బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, మలేషియా, ఒమన్, మాల్దీవులు, పాకిస్థాన్, శ్రీలంక, యూఏఈ, ఖతార్, సింగపూర్ సహా 14 దేశాల్లో నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్స్ టాప్-10లో నిలిచింది. ఇండియా, మారిషస్, నైజీరియాలో టాప్-1లో ఉన్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ విషయంపై హీరో అడవి శేష్ సంతోషం వ్యక్తం చేశాడు. 'నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమాపై ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను. నిజంగా మేము గర్వపడే సందర్భమిది. ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే' అని తెలిపాడు. India's hero is being celebrated worldwide 💥💥#MajorTheFilm is trending in Top 10 films on @NetflixIndia across 14 countries ❤️🔥❤️🔥@AdiviSesh #SobhitaDhulipala @saieemmanjrekar @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @sonypicsindia pic.twitter.com/sKv0jQ3IGr — Major (@MajorTheFilm) July 14, 2022 -
అత్యధికంగా వీక్షించిన టాప్ 10 సినిమాలు, సిరీస్లు ఇవే..
Netflix Top 10 Most Watched Movies Web Series May 1st Week: కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో థియేటర్లు మూతపడ్డాయి. వీటికి ప్రత్యామ్నాయంగా మారాయి ఓటీటీ ప్లాట్ఫామ్లు. థియేటర్లకు అల్టర్నేట్గా మాత్రమే కాకుండా విభిన్నమైన కథాంశాలతో ఉన్న చిత్రాలను, వెబ్ సిరీస్లు చూడాలనుకునే సినీ ప్రియులకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాయి. అలాగే ఈ ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలు, సిరీస్లను రూపొందిస్తున్నాయి. ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది నెట్ఫ్లిక్స్. ఎప్పుడూ సరికొత్త హంగులతో ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా కొత్తదనంతో ఆకట్టుకునేందుకు ముందుంటుంది ఈ దిగ్గజ సంస్థ. అయితే నెట్ఫ్లిక్స్లో ఈ వారం టాప్ 10లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ల లిస్ట్ను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఇందులో అలియా భట్ 'గంగూబాయి కతియావాడి' మూవీ నుంచి రణ్వీర్ సింగ్ '83' వరకు పలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్లు ఉన్నాయి. ఈ జాబితాలో చాలా కాలం తర్వాత తెలుగులో తాప్సీ నటించిన మిషన్ ఇంపాజిబుల్ కూడా ఉండటం విశేషం. మరీ ఈ లిస్ట్లో ఉన్న మూవీస్, సిరీస్లు చూశారో లేదో చెక్ చేసుకోండి. చదవండి: పగ, ప్రతీకారంతో రగిలిన కీర్తి సురేష్ 'చిన్ని' మూవీ రివ్యూ Nothing tops this week’s top 10 most watched titles 👇 Gangubai Kathiawadi Mai Bridgerton 365 Days: This Day The Marked Heart Dasvi Ozark Mishan Impossible Anatomy Of A Scandal ‘83 — Netflix India (@NetflixIndia) May 7, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సినిమా 2021
-
గూగుల్ సెర్చ్ లో అవే టాప్..!
ఏదైనా వెతకాలంటే అందరూ మొదటగా తెరిచేది గూగుల్. అదే గూగుల్ ఈ సంవత్సరం ఏది ఎక్కువ వెతికారో ఆ సంస్థ బయట పెట్టింది. గూగుల్ సెర్చ్ టాప్ 10 లో నాలుగు అహార పదార్ధాలకు సంబంధించినవే ఉన్నాయి. ఇందులో ఎలా చేయాలి అనే వెతికినవాటిని చూస్తుంటే ప్రజలందరూ లాక్డౌన్లో ఎలా గడిపారో అర్థమవుతుంది. అయితే సెర్చ్ చేసిన వాటిలో పన్నీర్ ఎలా చేయాలి అనేది టాప్లో ఉంది. తరువాత రోగ నిరోధక శక్తి ఎలా పెంచకోవాలి అని రెండవ స్ధానంలో ఉండగా డల్గోనా కాఫీ ఎలా తయారు చేయాలని మూడవ స్థానంలో ఉంది. ఇక ఆహార ప్రియులు డెజర్ట్ట్స్ ని , స్వీట్స్ ని ఇష్టపడని వారు ఉండరు. అయితే ఇందులో వెతికిన వాటిల్లో కేకు తయారీ ఎలా? జిలేబి ఎలా తయారు చేయాలి? అని లాక్డౌన్ సమయంలో బయటికి వెళ్లలేక ఇలా వెతికారు. ఇవే కాకుండా పాన్ కార్డుకి ఆధార్ ఎలా లింక్ చేయాలి? ఫాస్టాగ్కి ఎలా రీఛార్జ్ చేయాలి? కరోనా వైరస్ని ఎలా నిరోధించాలి? అంతేకాకుండా ఈ-పాస్కి ఎలా అప్లై చేయాలి? అనేవి కూడా లిస్ట్ లో ఉన్నాయి. ఎలా అనేవి అలా ఉండగా ఇంక అసలు అది ఏమిటి? అనేవి కూడా సెర్చ్ లిస్ట్లో ఉన్నాయి. ఇందులో కరోనా వైరస్ గురించి, నెపోటిజమ్, ప్లాస్మా థెరపీ, కోవిడ్-19,సిఏఏ,సూర్య గ్రహణం, హంటా వైరస్ వీటన్నింటిని గురించి ప్రశ్నలో జాబితాలో ఉన్నాయి. 2020లో కరోనా వైరస్ సెర్చ్లో ఆధిపత్యం కనబరిచినప్పటికి ఐపీఎల్ టాప్ స్థానంలో నిలించింది. దీని తరువాత కరోనా వైరస్, అమెరికా ఎన్నికలు, పీఎం కిసాన్ యోజన,బీహార్ ఎన్నికలు, డిల్లీ ఎన్నికలు జాబితాలో ఉన్నాయి. ఇంక 2020లో ఎక్కువగా వ్యక్తులను వెతికి టాప్లో నిలిచిన వారిలో జో బిడెన్, అర్ణబ్ గోస్వామి, కనికా కపూర్, కిమ్ జాంగ్ యున్, అమితా బచ్చన్, రషీద్ ఖాన్, రియా చక్రవర్తి, కమలా హారిస్, అంకిత లోకండె, కంగనా రనౌత్ నిలిచారు. దిల్ బెచారా సినిమా ఇండియాలో ఎక్కువగా వెతికిన సినిమాలల్లో టాప్లో నిలిచింది. ఇంకా సూరారై పట్రు,తానాజీ,శకుంతలదేవి, గుంజన్ సక్సేనా సినిమాలు టాప్లో ఉన్నాయి. -
టాలీవుడ్ టాప్-10 లవింగ్ హీరోలు!
ప్రత్యేక మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్ మ్యాక్స్ జూన్ నెల 2020కు సంబంధించి టాలీవుడ్ టాప్ 10 లవింగ్ యాక్టర్స్ జాబితను ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ జాబితాలో టాప్ 1లో ప్రిన్స్ మహేష్ బాబు నిలవగా ఆ తర్వాత స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి వరుస స్థానాలను దక్కించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, నాచురల్ స్టార్ నాని, మెగా పవర్స్టార్ రామ్చరణ్ టాప్ 10 జాబితాలో ఉన్నారు. ఇక ఈ జాబితాలో విజయ్దేవర కొండ, విక్టరీ వెంకటేష్ టాప్-9, టాప్-10 స్థానాల్లో నిలిచారు. గత నెలలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలవగా, ప్రిన్స్ రెండో స్థానంలో నిలిచారు. Ormax Stars India Loves (Telugu): Top 10 male stars in Telugu cinema (June 2020) #OrmaxSIL #OSILTelugu pic.twitter.com/aIpWqRZDGK — Ormax Media (@OrmaxMedia) July 26, 2020 చదవండి: బీపీ మాత్రలు మింగిన నటి , పరిస్థితి విషమం! ఆర్మ్యాక్స్ గత ఎనిమిదేళ్లుగా సినిమాలు, సీరియల్స్కు ఇంక ఇతర ట్రెండ్ విషయాలకు సంబంధించిన వ్యూవర్ షిప్, బాక్సాఫీస్ కలెక్షన్స్, ఇంకా ఇతర విషయాలను తెలియజేస్తోంది. ఇవే కాకుండా వాటికి సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందిస్తోంది. చదవండి: ధ్రువ సర్జా, రష్మికా ‘పొగరు’ -
కరోనా : టాప్-10 నుంచి స్టాక్ మార్కెట్ ఔట్
సాక్షి, ముంబై : కోవిడ్-19 మహమ్మారి పుణ్యమా అని భారతీయ స్టాక్ మార్కెట్ టాప్-10 స్టాక్ మార్కెట్ల జాబితా నుంచి పడిపోయింది. కరోనా వైరస్, లాక్ డౌన్ ఆందోళన నేపథ్యంలో భారతీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసింది. కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ పతనంతో లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ టాప్ 10 జాబితానుంచి, 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ క్లబ్ నుంచి తప్పుకుంది. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి రికార్డు కనిష్టానికి చేరుకుంది. బ్లూమ్బెర్గ్ డేటా ప్రకారం ఈక్విటీ మార్కెట్ల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్, సంవత్సరం ప్రారంభం నుండి డాలర్ పరంగా 27.31శాతం పడిపోయింది. 1.57 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ కాప్ తో 11 వ స్థానానికి పడిపోయింది. 2019 జనవరిలో 2.08 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ ఏడవ స్థానాన్ని సంపాదించుకుంది. కాగా గత జనవరిలో 2.16 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్తో భారతదేశం 10 వ స్థానానికి చేరింది. తాజాగా కోవిడ్ -19 విలయంతో 10 స్థానాన్ని కూడా కోల్పోయింది. (ప్రపంచంలోనే టాప్ సుందర్ పిచాయ్) బెంచ్మార్క్ సూచికలు అతిపెద్ద వన్డే క్షీణతను నమోదు చేసిన మార్చి 23 న భారత్ టాప్ 10 జాబితాలో పడిపోయింది, ఈ రోజు భారతదేశం మొత్తం మార్కెట్ క్యాప్ డాలర్ పరంగా 31 1.31 ట్రిలియన్లు . రూపాయి పరంగా రూ.101.87 ట్రిలియన్లు. అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 21.74 శాత తగ్గి 121.73 ట్రిలియన్ చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 155.54 ట్రిలియన్లు. (‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’ షాక్) సిఎల్ఎస్ఎ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గత 30 ఏళ్లలో భారతీయ మార్కెట్లలో 40శాతం నమోదు చేయడం ఇది ఐదవ సారి. భారతదేశంలో రికార్డు స్థాయిలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. భారతదేశం బెంచ్మార్క్ఇండెక్స్ ఈ సంవత్సరం ఇప్పటివరకు 29.10శాతం(డాలర్ల పరంగా) కోల్పోయింది ఈ సంవత్సరం ప్రారంభంనుండి 24 శాతం కుప్ప కూలడంతో మొత్తం మార్కెట్ క్యాప్ నష్టానికి దారితీసింది. 2019 లో 11.91 శాతం పెరిగింది. మొత్తం ప్రపంచ మార్కెట్ క్యాప్లో భారతదేశం2.18శాతంఉండగా, 2019 ప్రారంభంలో ఇది 2.97శాతం గా ఉంది. 2020లో ఇప్పటివరకు, ప్రపంచ స్టాక్ మార్కెట్లు మొత్తం విలువలో 17.15 శాతం క్షీణించాయి. 86.99 ట్రిలియన్ నుండి 72.07 ట్రిలియన్లకు చేరాయి. అయితే కోవిడ్ -19 కు కేంద్రంగా ఉన్న చైనా 2020లో ఇప్పటివరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.36 శాతం లేదా 7.24 ట్రిలియన్ల డాలర్లు నష్టపోయింది. 29.34 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్తో అమెరికా తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. 2020లో 30.09 శాతం కోల్పోయిన యుకె, 2.44 ట్రిలియన్ డాలర్ల (మార్కెట్ క్యాప్)తో ఐదవ స్థానంలో ఉంది. (కరోనా డ్రగ్ వైఫల్యం, రూపాయి బలహీనం) రూపాయి పతనం : ఆసియాలో భారతీయ కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. వరుస రికార్డు కనిష్టాలతో ఈ ఏడాది ఇప్పటివరకు డాలర్తో పోలిస్తే 6.64 శాతం బలహీనపడింది. ఏప్రిల్ మాసంలో భారత కరెన్సీ 76.92 కనిష్ట స్థాయిని తాకింది. ఇదే సమయంలో డాలర్ 4.14 శాతం లాభపడడం గమనార్హం. (కరోనా: ప్రమాదంలో 29 లక్షలకు పైగా ఉద్యోగాలు) అంబిట్ క్యాపిటల్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల ఉద్దాన పతనాలు సాధారణమే అనేది 100 సంవత్సరాల చరిత్ర చెబుతోంది. దశాబ్దంలో ఏదో ఒక సంఘటన 35 శాతం పతనానికి దారి తీస్తుంది. నష్టాల్లో మార్కెట్లో పెట్టుబడిదారుల సెంటిమెంటు దెబ్బతింటుంది. ఆందోళనతో అమ్మకాలకు పాల్పడతారు. ఫలితంగా ఆర్థిక మాంద్యం, ఉద్యోగ మాంద్యం, వేతనాల కోతలు అనివార్యమవుతాయి. అయితే ఇలాంటి సంక్షోభాలనుంచి భారత మార్కెట్లు అమెరికా లేదా ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్ల కంటే వేగంగా కోలుకుంటాయి. సగటున 12-14 నెలల్లో కోలుకుంటాయి. సగటున 16 -18 నెలల్లో గరిష్టాలను తాకుతాయి. భారతీయ మార్కెట్లు ఎంత వేగంగా పడిపోతాయో, అంతే వేగంగా పుంజు కుంటాయని అంచనా. -
టాప్ 10 గ్లోబల్ సీఈఓల్లో మనోళ్లు..
న్యూయార్క్: ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అగ్రశేణి 10 కంపెనీల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ)ల జాబితాలో.. ఏకంగా ముగ్గురు భారత సంతతికి చెందిన వారు స్థానం సంపాదించారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్బీఆర్) రూపొందించిన ఈ ఏడాది టాప్–100 ప్రపంచ సీఈఓల్లో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ 6వ స్థానంలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా ఉండడం విశేషం. కాగా.. తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 9వ ర్యాంకులో నిలిచారు. తొలి పది స్థానాల్లో ముగ్గురు భారత సంతతి వారు ఉండగా.. పూర్తి జాబితాలో డీబీఎస్ బ్యాంక్ పియూష్ గుప్తా 89వ స్థానంలో నిలిచి మొత్తం భారత సంతతి సంఖ్యను నాలుగుకు పెంచారు. 62వ స్థానంలో టిమ్కుక్ గ్లోబల్ టాప్ 100 జాబితాలో నైక్ సీఈఓ మార్క్ పార్కర్ (20), జేపీ మోర్గాన్ చీఫ్ జామీ డిమోన్ (23), లాక్హీడ్ మార్టిన్ సీఈఓ మారిలిన్ హ్యూసన్ (37), డిస్నీ సీఈఓ రాబర్ట్ (55), ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (66), సాఫ్ట్బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ (96) ర్యాంకుల్లో ఉన్నారు. అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అగ్రస్థానంలో నిలిచారు.