-
దేశంలో మోదీ హవా నడుస్తోంది
మీర్పేట: మీర్పేట కార్పొరేషన్ 6వ డివిజన్ కార్పొరేటర్ మమత ప్రవీణ్ తమ అనుచరులతో కలిసి మంగళవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం మోదీ హవా నడుస్తోందని, రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కాలం చెల్లిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 12 నుంచి 15 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీరాములుయాదవ్, శంకర్రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్రెడ్డి, నాయకులు నర్సింహ, నీలారవినాయక్, నాగరాజు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
హుడాకాంప్లెక్స్: సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధన ఎంతో ఉపయోగపడుతుందని శిక్షకుడు గురూజీ ఇస్మాయిల్ అన్నారు. సరూర్నగర్ హుడాకాంప్లెక్స్ లోటస్ల్యాప్ స్కూల్లో ఉచిత యోగా శిక్షణా తరగతులను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వేసవి సెలవులు కావడంతో మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. కొద్దిపాటి శారీరక శ్రమతో వాటన్నింటిని దూరం చేసుకోవడానికి యోగా గొప్ప ఆయుధమన్నారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. కార్యక్రమంలో నరేందర్, దయాదేవి, ఉపేందర్, మల్లికార్జున్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక భావన అలవర్చుకోవాలి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంచాల: ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజల్లో మరింత మార్పు వస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మంచాల మండలంలోని తాళ్లపల్లిగూడలో వీఆర్వన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని కల్యాణోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రశాంతంగా జరుపుకోవడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, నరేందర్రెడ్డి, వెంకటేష్, గణేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
గాయపడిన వ్యక్తి మృతి
ధారూరు: చికెన్ వండిన పాత్రలో పడి తీవ్ర గాయాలైన వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారూరు మండలంలోని కుక్కింద గ్రామానికి చెందిన గొర్రెంకల మల్లయ్య(45) ఈ నెల 2న మండల కేంద్రంలో బీఆర్ఎస్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ముగియగానే అందరితో పాటు భోజనానికి వెళ్లారు. ఒక్కసారిగా గుంపుగా జనాలు భోజనం కోసం ఎగబడ్డారు. అక్కడ మల్లయ్య అతికష్టం మీద భోజనం వడ్డించుకుని చికెన్ కోసం వేడిగా ఉన్న పాత్ర దగ్గరికి వెళ్లారు. ఆ తోపులాటలో అదుపు తప్పి చికెన్ పాత్ర(బొగవాన)లో పడిపోయారు. వేడి ఎక్కువ ఉండడంతో ఆయన కాళ్లు, చేతులు, నడుము భాగం కాలిపోయింది. వెంటనే 108 వాహనంలో వికారాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. మరోపక్క ఆయనకు తోడుగా ఉన్న తల్లి రాజమ్మ అదృశ్యమైంది. ఆమె రెండో కుమారుడు కృష్ణ అప్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో మల్లయ్య మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపించారు. మృతుడి సోదరుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వేణుగోపాల్గౌడ్ తెలిపారు. మంగళవారం పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మరుగుతున్న కూర పాత్రలో పడి చికిత్స పొందుతూ మృత్యువాత -
మేం సిద్ధం
● ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఏర్పాట్లు ● దేశభక్తి ఉన్నవారు ఓట్లేయండి ● అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ ● దివ్యాంగులకు ఉచిత రాకపోకల సదుపాయం ● జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సమస్యాత్మక కేంద్రాల వద్ద గట్టి భద్రత.. డీఆర్సీలు, స్ట్రాంగ్రూమ్స్, కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శాంతిభద్రతల పరంగా 383 సమస్యాత్మక కేంద్రాలు సహా మొత్తం 1,046 పోలింగ్ కేంద్రాల వద్ద తగిన భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. 14వేల మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారన్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు వైన్ షాపులు పోలింగ్కు 48 గంటల ముందే మూసివేయాల్సి ఉంటుందని తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: లోక్సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓట్లు వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. నగరంలో పోలింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై మంగళవారం సీపీ శ్రీనివాస్రెడ్డిలతో కలిసి మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. గత లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో 45 శాతం పోలింగ్ మాత్రమే జరిగిందని చెబుతూ, ఈసారి పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. అయిదేళ్లకోసారి లభించే అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని, దేశభక్తి, దేశంపై ప్రేమ ఉన్న వారు దేశం కోసం ఓటు వేయాలన్నారు. జిల్లాలోని 3,986 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ స్క్రీనింగ్ ఆడియోతో సహ ఉంటుందని, రాజకీయ పార్టీలు కోరితే ఫీడ్ అందజేస్తామని తెలిపారు. ఇంటింటికీ ఓటరుస్లిప్పుల పంపిణీ 81 శాతం పూర్తయిందని, 95 శాతం వరకు జరిగే వీలుందన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 47 కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లాలో 16,776 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లుండగా, ఇప్పటివరకు 9,266 మంది ఓట్లు వేశారన్నారు. మిగతావారికి 10వ తేదీ వరకు అ వకాశం కల్పిస్తామన్నారు. వికలాంగులు ‘సాక్షం’ యాప్లో పేరు నమోదు చేసుకుంటే ఇంటినుంచి పోలింగ్ కేంద్రం వరకు ఉచితంగా రాకపోకల సదుపాయం కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు 288 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. హోమ్ ఓటర్లు 571మందికి గాను ఇప్పటి వరకు 532 మంది ఓట్లు వేశారన్నారు. విధులకు హాజరు కాని సిబ్బందిలో వందమందికి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. దరఖాస్తు చేయని హౌసింగ్ సొసైటీలు హౌసింగ్ సొసైటీలు కోరితే పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు ఎన్నికల సంఘం అనుమతి ఉన్నప్పటికీ, జిల్లాలో తమకు పోలింగ్ కేంద్రం కావాలంటూ ఏ ఒక్క సొసైటీ కూడా లిఖితపూర్వకంగా కోరలేదన్నారు. పోలింగ్ రోజున వాణిజ్య దుకాణాలు, హోటళ్లు బంద్ పాటించాలన్నారు. ఇంకా ఏమన్నారంటే.. ● ఎండలు తీవ్రంగా ఉన్నందున బాధితులకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వైద్యసాయమందేలా ఏర్పాట్లు. ఇంటింటికీ ఓటరు స్లిప్లతోపాటు పోలింగ్కు సంబంధించి సమాచార పుస్తకాలు, స్టిక్కర్ల పంపిణీ. ● క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లుగా నియమితులైన 1,250 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎన్నికల సిబ్బంది అందరికీ అవసరమైన శిక్షణలు పూర్తి. ● గత అసెంబ్లీ ఎన్నికల మాదిరే పోలింగ్ కేంద్రం వద్ద ఎంతమంది క్యూలో ఉన్నారో తెలుసుకునేలా పోల్క్యూ రూట్ యాప్ అందుబాటులో ఉంటుంది. గూగుల్ మ్యాప్తో పోలింగ్ కేంద్రం దారి కూడా తెలుసుకోవచ్చు. ● హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థిపై ఉల్లంఘనల కేసులు నమోదు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా మహిళా సిబ్బంది ఉండేలా ఏర్పాటు. వేలిపై పురుషులు ఇంక్మార్క్ వేస్తే ఇబ్బంది పడే వారుంటే.. మహిళా సిబ్బందితోనే ఇంక్ వేయించే ఏర్పాటు. ● ప్రచార గడువు ముగిశాక కూడా పత్రికలు, సోషల్ మీడియాలో ‘సైలెన్స్ ప్రచారం’ చేసుకోవచ్చు. వాటికి ముందస్తు అనుమతి అవసరం. ఏఎస్డీ(ఆబ్సెంట్,షిఫ్టెడ్,డెత్)ఓటర్లుగా ఇప్పటి వరకు 18వేల మందిని గుర్తించాం. ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. ● సమావేశంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు అనుదీప్ దురిశెట్టి, హేమంత్ కేశవ్పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ తేదీ తెలిపే ఓటరు స్టిక్కరు, ‘ఐ ఓట్ ఫర్ షూర్’ తదితర స్టిక్కర్లను ప్రదర్శించారు. -
ఐపీఎల్ మ్యాచ్కు ప్రత్యేక బస్సులు
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 8వ తేదీన జరుగనున్న ఐపీఎల్–20 క్రికెట్ మ్యాచ్ కోసం నగరంలోని వివిధప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.ఈసీఐఎల్, ఎల్బీనగర్, కొండాపూర్, జీడిమెట్ల, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం,మియాపూర్,లకిడికాఫూల్, కూకట్పల్లిహౌసింగ్బోర్డ్, జూబ్లీబస్స్టేషన్,హకీంపేట్, మేడ్చల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, బీహెచ్ఈఎల్,తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. అలాగే ప్రయాణికుల రద్దీ మేరకు వివిధ మార్గాల్లో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. -
డొక్కా సీతమ్మ జీవితం స్ఫూర్తిదాయకం
నాగోలు: డొక్కా సీతమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. 19వ దశకపు నిత్యాన్న దాత డొక్కా సీతమ్మ 116వ వర్ధంతి సందర్భంగా నాగోల్లోని కో ఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో మంగళవారం ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కేంద్ర సమా చార మాజీ కమిషనర్ మాఢభూషి శ్రీధర్, రచయిత్రి, ప్రవచన కర్త డా.అనంత లక్ష్మి, ఆకృతి సుధాకర్, మదర్ థెరిసా ఫౌండేషన్ అధ్యక్షుడు చేపూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా -
చేవెళ్ల అభివృద్ధే లక్ష్యం
మొయినాబాద్: చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం అభివృద్ధే తన లక్ష్యం అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకు ముందు చిలుకూరు బాలాజీ దేవాలయంలో పూజలు చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల ప్రజలకోసమే నిరంతరం పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికోసం ఇప్పటికే పలు కంపెనీలను తేవడం జరిగిందని.. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్, టీపీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు కోట్ల నరోత్తంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ సర్పంచ్లు రామకృష్ణగౌడ్, వీరభద్రస్వామి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే సంక్షేమం మీర్పేట: కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమం కోరుకునేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మీర్పేట కార్పొరేషన్లో జరిగిన బైకుర్యాలీలో ఆయన పాల్గొని నందిహిల్స్ కూడలిలో మాట్లాడారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేశామని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అన్ని హామీలను నెరవేరుస్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు లేవని, వారు అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్, పెన్షన్లు, సిలిండర్లు వద్దంటున్నారని, ఏ పార్టీ ప్రజలకు ఏం చేస్తుందో, అభ్యర్థి ఏం చేస్తాడో ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధితో పాటు ప్రజలకు సాయం చేశానని తెలిపారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి అందుబాటులో ఉండడు.. అపాయింట్మెంట్ అడుగుతాడని ఎద్దేవా చేశారు. గెలిచిన వెంటనే నందిహిల్స్ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్ ముద్దా పవన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నాయకులు సామిడి గోపాల్రెడ్డి, సిద్దాల దశరథ, జిల్లెల నరేందర్రెడ్డి, జెటావత్ రవినాయక్, చల్లా బాల్రెడ్డి, సురేందర్రెడ్డి, రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డి -
కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెబుదాం
షాబాద్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెబుదాం.. కష్టపడి పనిచేయండి గెలుపు మనదే అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం రాత్రి ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జెడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి రోడ్డుషో నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడుతూ.. గ్యారంటీలు అమలయ్యే గ్రామాల్లో మేం ఓట్ల అడగమని, అమలు కాని గ్రామాల్లో మీరు ఓట్లు అడగొద్దని చెప్పారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే ఈ నాయకులు ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. పేదల వర్గాలకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్రంలో కరెంటు పోయినా, నీరు రాకపోయినా, పంటలు ఎండియినా పట్టించుకునే దిక్కే లేదని విమర్శించారు. కేసీఆర్ సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ కష్టాలు చెబుతున్నారని చెప్పారు. నమ్మిన పార్టీని, కేసీఆర్ను మోసం చేసిన రంజిత్రెడ్డికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి రాముడి గుడి, రాముడి పేరు చెప్పి ఓట్లు వేయాలని అడుగుతున్నారన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలిసిన నాయకుడిగా ఈ ప్రాంత గొంతుకుగా ఉంటానన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, శాసన మండలి మాజీ చెర్మన్ స్వామిగౌడ్, జెడ్పీటీసీ అవినాశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్నారని తమ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్కు బహుమతి ఇస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, నాయకులు నక్క శ్రీనివాస్గౌడ్, రాజేందర్గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
No Headline
నియోజకవర్గం 18–19 20–29 30–39 40–49 50–59 60–69 70–79 80–89 90–99 100–120 మహేశ్వరం 50,963 1,04,113 1,64,775 1,21,057 77,682 45,610 22,465 6,400 1,236 95 రాజేంద్రనగర్ 55,568 1,13,241 1,92,334 1,41,689 80,468 45,070 20,191 4,522 791 65 శేరిలింగంపల్లి 54,138 1,12,281 2,39,949 1,93,788 99,951 59,885 30,233 7,779 1,304 08 చేవెళ్ల 28,822 57,685 70,239 55,732 39,153 23,535 11,353 3,339 578 93 పరిగి 10,368 62,369 77,230 50,845 33,269 20,423 9,483 2,249 321 00 వికారాబాద్ 7,081 50,173 69,561 44,148 31,551 18,491 8,390 1,937 301 05 తాండూరు 8,716 57,625 71,011 47,974 32,034 17,191 7,556 1,754 228 03 -
చల్లగా.. హాయిగా
పోలింగ్కు జాగ్రత్తలు తీసుకోవాలి కొద్ది రోజులుగా జిల్లావ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ క్రమంలో మంగళవారం ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. దీంతో ఉపశమనం దొరికింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల వడగళ్లు కురిసాయి. మామిడికాయలు నేలరాలాయి. ఇబ్రహీంపట్నం రూరల్: పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశాంక అధికారులకు సూచించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వికారబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాభారతితో కలిసి చేవెళ్ల లోక్సభ ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్, మేరినాట్ పాఠశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా శశాంక మాట్లాడుతూ.. ఈ నెల 13న జరిగే పోలింగ్కు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరం మేరకు అదనంగా సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈవీఎంల పంపిణీ రోజున అన్ని మౌలిక సదుపాయలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. హెల్ప్ డెస్క్లను సందర్శించి ఫెసిలిటేషియన్ కేంద్రంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయని వారికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలన్నారు. శశాంకకు వికారాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా భారతి, జెడ్పీసీఈఓ సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. వికారాబాద్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం చేవెళ్ల రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి వికారాబాద్లో పర్యటించారు. వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పట్టణంలోని మేరీ ఏ క్నోటాస్ స్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించారు. కమిషనింగ్ ప్రక్రియ, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తాండూరులోని సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ హై స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లను, పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలోని మినీ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించారు. కార్యక్రమంలో వికారాబాద్ అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాభారతి, వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఫెసిలిటేషన్ కేంద్రం నోడల్ అధికారి సాజీదాబేగం, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శశాంక -
నేడు షాద్నగర్కు అస్సాం ముఖ్యమంత్రి రాక
షాద్నగర్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం షాద్నగర్ పట్టణానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ విచ్చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెబాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం 7గంటలకు షాద్నగర్ పట్టణంలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశానికి అస్సాం ముఖ్యమంత్రితో పాటు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హాజరు కానున్నట్లు తెలిపారు. ట్రాన్స్జెండర్లు నిర్భయంగా ఓటు వేయాలి జిల్లా సంక్షేమాధికారి పద్మజారమణ ఇబ్రహీంపట్నం రూరల్: ట్రాన్స్జెండర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా సంక్షేమాధికారి పద్మజా రమణ పేర్కొన్నారు. సరూర్నగర్లోని మహిళా సాధికారిత కేంద్రంలో మంగళవారం ట్రాన్స్జెండర్లకు ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఉచిత ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్లు, ఐడీ కార్డులు అందజేశారు. అనంతరం పద్మజారమణ మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్న వారు తప్పకుండా ఓటు వేయాలని సూచించారు. మహిళా సాధికారిత కేంద్రంలో ట్రాన్స్జెండర్స్ కోసం తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ట్రాన్స్జెండర్స్ ఎక్కడైనా వివక్షకు గురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన అఫిడవిట్లు, నోటరీపత్రాలను క్వీర్ బందు పేరెంట్స్ అసోసియేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు ముకుందమాల ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నాయసేవాధికార సంస్థ సెక్రెటరీ శ్రీదేవి, సీడీపీఓలు, మహిళా సాధికారిత సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. జనార్దన్రెడ్డితో కొండా భేటీ మద్దతు ఇవ్వాలని కోరిన విశ్వేశ్వర్ రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత బి.జనార్దన్రెడ్డితో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన జనార్దన్రెడ్డి కొన్నాళ్లుగా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆరోగ్యరీత్యా విరామం తీసుకుంటున్న ఆయన సేవలను పార్టీకి వినియోగించుకోవాలని భావించిన కొండా.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రానున్న లోకసభ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి జనార్దన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇరువురి కలయికతో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. కొండా వెంట మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నాయకులు నవీన్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. బహుజనుల గొంతుకలను గెలిపించుకోవాలి సుందరయ్య విజ్ఞాన కేంద్రం: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గౌడ సామాజిక వర్గానికి చెందిన బహుజన గొంతుకలు బూర నర్సయ్య గౌడ్, పద్మారావు గౌడ్లను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌడ జన హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్న గౌడ కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యమివ్వకపోవడం బాధాకరమన్నారు. బీసీల్లో అత్యధిక జనాభా కలిగి ఉండి రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషిస్తున్న వీరిని గెలిపించుకోవాలన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వారసత్వాన్ని పార్లమెంట్లో నిలబెట్టాలని కోరారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఇరువురు పని చేశా రని గుర్తు చేశారు. వలస పాలకుల ఆధిపత్యాన్ని ఎదురించి డాక్టర్ల జేఏసీ చైర్మన్గా పని చేసిన బూర నర్సయ్యగౌడ్, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీపర్గా సేవలు అందించిన పద్మారావుగౌడ్ను గెలి పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిరంతరం ప్రజల పక్షాన, ప్రజల మధ్య ఉండి వారి హక్కుల కోసం పోరాడుతున్న వీరిని లోక్సభకు పంపాలని విజ్ఞప్తి చేశారు. -
స్వతంత్రుల ప్రభావం కొంతే!
సాక్షి, సిటీబ్యూరో: శాసనసభ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రుల ప్రభావం తక్కువనే చెప్పాలి. 2019 లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో పోలైన మొత్తం ఓట్లలో స్వతంత్ర అభ్యర్థు లకు దక్కిన ఓట్లు కేవలం ఒక్క శాతం మాత్రమే. గత ఎన్నికల్లో సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కా జిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో 47 లక్షల మంది ఓటర్లు ఓటింగ్లో పాల్గొనగా.. ఇండిపెండెంట్లకు 50 వేల కంటే తక్కువే ఓట్లు పోలయ్యాయి. గ్రేటర్ చర్రితలో నాలుగు లోక్సభ సెగ్మెంట్లలోనూ ఇప్పటివరకు ఒక్కసారిగా కూడా స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన దాఖలాల్లేవు. సెగ్మెంట్ల వారీగా స్వతంత్రుల ఓట్లు.. ● 2019 లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో 9 మంది స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 5,173 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఈ నియోజకవర్గ పరిధిలోని 8.7 లక్షల ఓట్లలో వీరి బలం కేవలం 0.5 శాతం మాత్రమే. ● సికింద్రాబాద్ సెగ్మెంట్లోనూ ఇదే తీరు కనిపించింది. మొత్తం 9.1 లక్షల ఓట్లు పోలవగా.. ఈ నియోజకవర్గంలో బరిలోకి దిగిన 15 మంది స్వతంత్రులు సాధించిన ఓట్లు 10,051 మాత్రమే. ● ఇక మల్కాజిగిరి, చేవెళ్ల సెగ్మెంట్లలో ఇండిపెండెంట్లకు 30 వేల ఓట్లు వచ్చాయి. ఈసారి బరిలోకి 66 మంది ఈ నెల 13న జరగనున్న లోకసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను 525 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. వీరిలో 50 మంది మహిళలు, 475 మంది పురుష అభ్యర్థులున్నారు. మొత్తం 286 మంది స్వతంత్రులు పోటీపడుతున్నారు. అత్యధికంగా మెదక్ లోక్సభ నుంచి 29 మంది ఇండిపెండెంట్లు బరిలోకి దిగారు. గ్రేటర్లో చూస్తే.. చేవెళ్లలో 21 మంది, మల్కాజిగిరిలో 11, సికింద్రాబాద్లో 27, హైదరాబాద్లో 7 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు. స్థానిక సమస్యలే ఎజెండా.. గ్రేటర్లోని స్థానిక సమ స్యలే ప్రధాన ఎజెండా స్వతంత్ర అభ్య ర్థులు ప్రచారం సాగిస్తున్నారు. స్వచ్ఛంద కార్యక్రమాల నిర్వహణతో పాటు సామాజిక వర్గాలను నమ్ముకొని పోటీపడుతున్నారు. యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఎక్స్, ఇన్స్ట్రాగామ్ వేదికగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మహిళలు, వృద్ధ ఓటర్లను మెప్పించేందుకు స్థానికులు, కుటుంబీకులతో కలిసి పలు ప్రాంతాల్లో సాయంత్రం సమయాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు, బేబీ వాకర్, రోడ్డు రోలర్ వంటి పలు గుర్తులను కేటాయించింది. 2019లో గ్రేటర్లో వీరికిపోలైన ఓట్లు ఒక్క శాతమే నాలుగు సెగ్మెంట్లలో కలిపి 50 వేల లోపే .. ఈసారి బరిలో 66 మంది ఇండిపెండెంట్లు స్థానిక సమస్యలే ఎజెండాగా ప్రచారం గ్రేటర్ చరిత్రలో ఒక్కసారి కూడా గెలవని అభ్యర్థులు -
268 మంది శతాధిక వృద్ధులు!
లోక్సభ స్థానంలో యువ ఓటర్లే కాదు.. శతాధిక వృద్ధులు కూడా ఉన్నారు. మహేశ్వరంలో 95 మంది, రాజేంద్రనగర్లో 65 మంది, శేరిలింగంపల్లిలో 8 మంది, చేవెళ్లలో 93 మంది, వికారాబాద్లో ఐదుగురు, తాండూరులో ముగ్గురు ఉన్నట్లు ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాలో వెల్లడైంది. వీరిలో మెజార్టీ ఓటర్లకు పుట్టిన రోజు ధ్రువపత్రాలు లేకపోవడం, ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఏదో ఒక సంవత్సరం, తేదీ పేర్లు చెప్పడం, ఎన్నికల అధికారులు కూడా ఇవేవీ పట్టించుకోకుండా గుడ్డిగా వారి పేర్లతో పాటు వయసు నమోదు చేశారు. నిజానికి వీరి వయసు వందేళ్ల లోపే ఉండగా, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అధిక వయసు నమోదైనట్లు సమాచారం. ఇక 90 నుంచి 99 ఏళ్ల వయసు వారు 4,759 మంది ఉండటం విశేషం. సాక్షి, రంగారెడ్డిజిల్లా: చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో యువ ఓటర్లే కీలకం కాబోతున్నారు. వారు ఎటువైపు మొగ్గు చూపితే.. ఆ పార్టీ అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు సైతం యువతే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మెజార్టీ ఓట్లు సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కొనసాగుతుండగా, వీటిలో మొత్తం 29,38,370 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 15,04,260 మంది పురుషులు ఉండగా, 14,33,830 మంది మహిళలు, 280 మంది ఇతరులు ఉన్నారు. 18 నుంచి 39 ఏళ్లలోపు వారు 15,20,890 మంది (52శాతం) ఉండటం విశేషం. ఓటు హక్కు వినియోగించుకునే అంశంపై ఇప్పటికే వీరంతా ఓ స్పష్టతకు రావడంతో పాటు కుటుంబ సభ్యులు, నివాస ప్రాంతాన్ని, సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఈ యువత నే ప్రధానంగా దృష్టిలో పె ట్టుకుని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మెగా డీఎస్సీ వేయనున్నట్లు ప్రచారం చేస్తుండగా, బీజేపీ అభ్యర్థి మోదీ సాధించిన విజయాలు, స్వయం ఉపాధి, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటును ఎజెండాగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి సాగునీరు, ఉచిత కరెంట్, రియల్ ఎస్టేట్, ప్రభుత్వ ఉద్యోగాలు వంటి అంశాలను ప్రచారం చేస్తున్నారు. బరిలో 43 మంది.. ప్రచారంలో ముగ్గురే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు మినహా క్షేత్రస్థాయి ప్రచారంలో ఇతరులు పెద్దగా కన్పించడం లేదు. క్షేత్రస్థాయిలోనే కాదు కనీసం సోషల్ మీడియాలోనూ వీరి ప్రచారం కన్పించక పోవడాన్ని పరిశీలిస్తే వీరంతా పేరుకే పోటీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పోటీ చేస్తున్న వారిలో మెజార్టీ అభ్యర్థులు 40 ఏళ్లలోపు వారే. పీజీ, పీహెచ్డీ, ఎంబీఏ, బీటెక్ వంటి ఉన్నత కోర్సులు పూర్తి చేసిన వారే ఉండటం గమనార్హం. వయసు వారీగా ఓటర్లు -
ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం
భారీగా పట్టుబడుతున్న నగదు, బంగారం, మద్యం, గంజాయి సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు తనిఖీలు ము మ్మరం చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,332 కేసుల్లో రూ.9,39,42,041 కోట్ల నగదు సహా మొత్తం రూ.41,81,11,904 విలువ చేసే బంగారు ఆభరణాలు, మద్యం సీసాలు, డ్రగ్స్ సీజ్ చేశారు. వీటిలో రూ.24, 88,40,388 విలువ చేసే 4,44,639. 8652 గ్రాముల బంగారం, రూ.30,34,700 విలువ చేసే 48,900 గ్రాముల వెండి, రూ.1,50, 00,738 విలువ చేసే 48,810 లీటర్ల మద్యం పట్టుబడింది. రూ.50 లక్షలకుపైగా విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మోడల్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు షురూ చేవెళ్ల: తెలంగాణ ప్రభుత్వ మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమైనట్ల్లు కళాశాల ప్రిన్సిపాల్ టేనావతి పేర్కొన్నారు. చేవెళ్లలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల విడుదలపై పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ మోడల్ కళాశాలలో చేరాలనుకుంటే దరఖాస్తు చేసుకోవా లన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులు ఉన్నాయని తెలిపారు. పదో తరగతిలో 9జీపీఏ పైగా సాధించిన అమ్మాయిలకు హాస్టల్వసతి కూడా ఉందని చెప్పారు. మార్కుల మెమో, ఆధార్కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ల జిరాక్స్లతోపాటు రెండు పాస్పోర్టు ఫొటోలతో కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు కళాశాలలో సంప్రదించాలని ఆమె సూచించారు. స్ట్రాంగ్రూంను పరిశీలించిన మహబూబ్నగర్ కలెక్టర్ షాద్నగర్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో షాద్నగర్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్రూంను సోమవారం మహబూబ్నగర్ కలెక్టర్ రవి నాయక్ పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ రిసెప్షన్ సెంటర్ను తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లపై ఆర్డీఓ వెంకట మాధవరావును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ పార్థసారధి, పట్టణ సీఐ ప్రతాప్లింగం ఉన్నారు. ‘పట్నం’లో స్ట్రాంగ్ రూం పరిశీలన ఇబ్రహీంపట్నం: భువనగరి లోక్సభ పరిధి లోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్ట్రాంగ్రూంను సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ జెండగే హనుమంత్ కొండబా సందర్శించారు. ఖానాపూర్ సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హనుమంత్ అక్కడి పరిస్థితులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అయన వెంట ఆర్డీఓ, నియోజకవర్గ ఎన్నికల అధికారి అనంతరెడ్డి ఉన్నారు. మోదీ రాక.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు సనత్నగర్: ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా మంగళ, బుధవారాల్లో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 7న (మంగళవారం) రాత్రి 7.50 నుంచి 8.25 మధ్య ప్రధాని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ వై జంక్షన్, పీ అండ్ టీ ఫ్లైఓవర్ వద్ద యూ టర్న్, షాపర్స్స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్ల్యాండ్స్, రాజీవ్గాంధీ విగ్రహం వద్ద లెఫ్ట్ టర్న్, మోనప్ప ఐల్యాండ్ జంక్షన్, యశోద హాస్పి టల్, ఎంఎంటీఎస్ మీదుగా రాజ్భవన్ చేరుకుంటారు. ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఈ నెల 8న (బుధవారం) ఉదయం 8.35 నుంచి 9.10 గంటల మధ్య అదే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. -
విద్యతోపాటు సంస్కారం ప్రధానం
షాద్నగర్రూరల్: చిన్నారులకు విద్యతోపాటు సంస్కారం, సామాజిక విలువలు నేర్పించాలని విశ్వహిందూ పరిషత్ దక్షిణమధ్య ప్రాంత సేవాప్రముఖ్ బండారు రమేష్ అన్నారు. పట్టణంలోని యోగా కేంద్రంలో సోమవారం సంస్కారభారతి జాతీయ సామాజిక, సాంస్కృతిక సేవా సంస్థ షాద్నగర్శాఖ ఆధ్వర్యంలో బాలల రంగస్థల నట శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బండారు రమేష్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువు ఒక్కటే ప్రధానం కాదని, సభ్యత, సంస్కారం, తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, తోటి వారిని గౌరవించడం, అభిమానించడం, సహాయం చేయడంవంటి మంచి విలువలను నేర్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అలాంటి మంచి విలువలను నేర్పించేందుకు పాఠశాలలతో పాటు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. పిల్లలకు చిన్నతనం నుంచే విలువలతో కూడిన సంస్కారం నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యుడు, సంస్కారభారతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీవీ రంగయ్య మాట్లాడుతూ.. నట శిక్షణా శిబిరంలో చిన్నారులకు నటనలో మెలకువలు, పది మందిలో ధైర్యంగా మాట్లాడగలగడం, భావ వ్యక్తీకరణ, నీతి కథలు, పద్యపఠనం, చిత్రలేఖనం, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడంవంటి పలు అంశాలలో అనుభవం కలిగిన అధ్యాపకులచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నేటి బాలల్లో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఎంతోమంది యువకులు ఉన్నత విద్యావంతులుగా ఉన్నప్పటికీ వేదికమీద తమ భావాలను సరైన సరైన రీతిలో వ్యక్త పరచలేకపోతున్నారని, అందుకు కారణం కేవలం పుస్తకపఠనానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆట, పాటలకు ఇవ్వకపోవడమేనని అన్నారు. చిన్నారులకు మన సంస్కృతిని ప్రతిబింబించే సాంప్రదాయ కళలను పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి శిక్షణ శిబిరాలు చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం పద్మశ్రీ పురస్కార గ్రహీతల ముఖచిత్రాలతో రూపొందించిన శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది కాలమానిని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బెజుగం రమేష్, సింగారం శ్రీనివాస్, బాలబ్రహ్మచారి, చెట్ల వెంకటేశ్, రవీందర్, రమేష్చారి, వీరేశం, ప్రణీత తదితరులు పాల్గొన్నారు. వీహెచ్పీ దక్షిణమధ్య ప్రాంత సేవాప్రముఖ్ బండారు రమేష్ -
ప్రచార పాట్లు
ఓట్ల ఫీట్లు..షాద్నగర్: క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే.. ● రద్దీ ప్రాంతాలే ప్రచార అడ్డాలు ● ఉపాధి పని వద్దకు ఉదయపు నడక ● పొలం బాట పడుతున్న నేతలు ● కూలీలు పని చేసే చోట ఓట్ల అభ్యర్థన షాద్నగర్: లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఎక్కడుంటే అక్కడికే వెళ్తున్నారు. గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్న నేపథ్యంలో నేతలు కూలీలు పని చేసే ప్రాంతాలకు వరుస కడుతున్నారు. వారితో కలిసి పని చేస్తూ.. తట్టా, బుట్టా మోస్తూ, కూరగాయలు కోస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వారికి ఉపాధి.. వీరికి ప్రచార పరమావధి జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చాలాగ్రామాల్లో కొనసాగుతున్నాయి. ఎండలు తీవ్రంగా ఉండడంతో కూలీలు 8 గంటల వరకే పనులకు వెళ్తున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు వంద నుంచి మూడు వందల మంది కూలీలు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నారు. చెరువుల్లో పూడిక తీత, కందకాల తవ్వకం వంటి పనులు చేపడుతున్నారు. దీంతో నాయకులు ఉపాధి హామీ పనులు చేపట్టే ప్రాంతాలనే ప్రచార అడ్డాలుగా మార్చుకుంటున్నారు. రైతన్న.. నీ ఓటు మాకేనన్న యాసంగి పంటలు కోతలు జరుగుతున్నాయి. గ్రా మాల్లో చాలా మంది రైతులు వ్యవసాయ పొలాల వద్ద పంట కోతల్లో నిమగ్నమయ్యారు.తెల్లవారింది మొదలు సాయంత్రం వరకు పొలాల వద్దే ఉంటున్నారు.దీంతో నేతలు ప్రచారాల కోసంపొలం బాట పడుతున్నారు. పంట పొలాల వద్దకు వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి రైతులను కలుస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి తమ పార్టీ కృషి చేస్తుందని వారికి హామీల వర్షం కురిపిస్తున్నారు. ఆట.. ఓట్ల వేటవేసవి సెలవులు కావడంతో ఉదయం, సాయంత్ర వేళల్లో పట్టణాలు, గ్రామాల్లో క్రీడా మైదానాలు కిటకిటలాడుతున్నాయి. కొందరు వ్యాయామాలు, నడకకు వెళ్తే, యువత క్రికెట్ టోర్నమెంట్లలో నిమగ్నం అవుతోంది. దీంతో నాయకులు క్రీడా మైదానాలను ఎంచుకొని అక్కడికి వెళ్తూ వారితో సరదాగా ఆటలు ఆడుతూ.. వ్యాయామాలు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో పట్టణ ప్రాంతాల్లో కూరగాయలు, చికెన్, మటన్ దుకాణాల వద్ద ప్రచారాలు నిర్వహిస్తున్నారు. -
బీజేపీకి ఆదరణ పెరుగుతోంది
చేవెళ్ల: దేశంలో మోదీ ప్రభంజనంతో రాష్ట్రంలో రోజురోజుకూ బీజేపీకి ఆదరణ పెరుగుతోందనిఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. శంకర్పల్లి మండలకేంద్రంలో సోమ వారం సాయంత్రం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల గడ్డపై ఈసారి కాషాయ జెండా ఎగురవేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గ్రామాల్లో బీజేపీ జోరు చూసిన కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు. రంజిత్రెడ్డి ఐదేళ్లలో చేసిన కోళ్ల స్కాం, దాణా స్కాంలు ప్రజలందరికీ తెలుసన్నారు. ఫిలింనగర్లో హనుమాన్ దేవాలయం కూల్చి వేసిన పాపం రంజిత్రెడ్డిని వెంటాడుతోందని, ఆయన ఈఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు. అలాంటి వ్యక్తులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. దేశాభివృద్ధికి మోదీలాంటి నాయకుడే కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని కొండా విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. మండలంలోని ప్రొద్దటూరు మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, కొత్తపల్లి ఎంపీటీసీ శోభ తదితరులు విశ్వేశ్వర్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రభాకర్రెడ్డి, రాములు, నర్సింహారెడ్డి, సురేశ్, వాసుదేవ్కన్న తదితరులు పాల్గొన్నారు. ఈసారి చేవెళ్ల గడ్డపైకాషాయ జెండా ఎగురుతుంది బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి -
పోలింగ్ను నిశితంగా పరిశీలించాలి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు విధిగా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ సరళిని సూక్ష్మ స్థాయిలో పరిశీలించేందుకు వీలుగా నియమించిన మైక్రో అబ్జర్వర్లకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేందర్ కుమార్ కటారియా కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పరిశీలన బాధ్యతలు కేటాయించడం జరుగుతుందన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగలుగుతారని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్ఓ సంగీత, మాస్టర్ ట్రైనర్లు, మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి చేవెళ్ల: లోక్సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. చేవెళ్లలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కళాశాలలో చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చేపట్టిన కమిషనింగ్ ప్రక్రియను సోమవారం రాత్రి ఆయన పరిశీలించారు. బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లలో బ్యాలెట్ పేపర్, అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తులను అమరుస్తున్న తీరును పరిశీలించారు. కమిషనింగ్ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. ఈవీఎంలను అన్ని విధాలా సిద్ధం చేయాలని.. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కమిషనింగ్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా కమిషనింగ్ జరిపించాలని సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. చేవెళ్ల ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట చేవెళ్ల ఆర్డీఓ సాయిరాం, ఇతర అధికారులు ఉన్నారు. కలెక్టర్ శశాంక -
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
షాద్నగర్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీని గెలిపించి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాల్రాజ్ మాదిగ అన్నారు. షాద్నగర్ పట్టణంలో సోమవారం నిర్వహించిన సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలతో నిరుపేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ ఎందుకు వేయలేదని, నల్లధనాన్ని ఎందుకు వెలికి తీయలేదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లౌకిక, ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసర ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపాగ జంగయ్య, నాయకులు పెంటయ్య, వెంకటయ్య, నర్సింలు, కృష్ణ పాల్గొన్నారు. టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాల్రాజ్మాదిగ -
తనిఖీల్లో రూ.1.6 లక్షల పట్టివేత
ఇబ్రహీంపట్నం రూరల్: ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్రెడ్డి కథనం ప్రకారం.. రాగన్నగూడ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్యాప ప్రశాంత్ అనే సెల్స్మ్యాన్ వద్ద రూ.1,60,350 నగదు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. అనుమానంతో భార్యను రాయితో మోది పాశవికంగా హత్య చేసిన భర్త చేవెళ్ల: కట్టుకున్నోడే కాల యముడు అయ్యాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త బండరాయితో భార్యను కొట్టి పాశవికంగా మట్టుబెట్టాడు. ఈ సంఘటన శంకర్పల్లి మండలంలోని మోకిల పోలీస్స్టేషన్ పరిధిలోని ఇంద్రారెడ్డినగర్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలంలోని ఇంద్రారెడ్డినగర్కు చెందిన జల్పేట్ మాణిక్యం భార్య యాదమ్మ(45)లు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. యాదమ్మ హౌస్ కీపింగ్ పనికి వెళ్తుంది. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గత కొంత కా లంగా గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చిన మా ణిక్యం అందరూ పడుకున్న తరువాత భార్య యాదమ్మ ముఖంపై బండరాయితో కొట్టి చంపేశాడు. ఉదయం కుటుంబసభ్యులు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి పరిశీలించి వివరాలు సేకరించారు. భర్తను అదుపులోకి తీసుకొని ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఏడాది జైలు యాచారం: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఓ వ్యక్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు సోమవారం ఏడాది జైలు శిక్షాతో పాటు రూ. 500 జరిమానా విధించింది. యాచారం సీఐ శంకర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎండీ హఫీజ్ మద్యం తాగి 2006లో అదే గ్రామానికి చెందిన తలారి యాదయ్యను కులం పేరుతో దూషించి కొట్టాడు. యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన యాచారం పోలీసులు ఎండీ హఫీజ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసులు పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించగా విచారణ చేపట్టిన న్యాయస్థానం సోమవారం హఫీజ్కు ఏడాది జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. -
గల్లంతైన మృతదేహాలు లభ్యం
చెరువు నుంచి వెలికి తీసిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పహాడీషరీఫ్: చేపలు పట్టేందుకు వెళ్లి జల్పల్లి చెరువులో గల్లంతైన ఇద్దరు బాలుర మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సోమ వారం వెలికితీశాయి. పహాడీషరీఫ్ పోలీసుల వివరాల ప్రకారం.. పాతబస్తీ బార్కాస్కు చెందిన అబ్దుల్ వాహెద్(14), ఉస్మాన్ నహదీ(16), హఫీజ్, వసీం, అబుబకర్ నహదీ అనే బాలురు ఆదివారం చేపలు పట్టేందుకు వచ్చి వాహెద్, ఉస్మాన్ నహదీలు గల్లంతైన విషయం తెలిసిందే. అప్పటినుంచి గాలించినప్పటికీ లభ్యం కాకపోవడంతో, సోమ వారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలించగా రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ఇబ్రహీంపట్నం రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ కృష్ణయ్య కథనం ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడలో నివాసం ఉంటూ బ్రహ్మణపల్లి సమీపంలో వీరమణి చాక్లెట్ కంపెనీలో ఇమాన్యుల్(22) పని చేస్తున్నాడు. ఆదివారం విధులు పూర్తి చేసుకొని తన బైక్పై స్నేహితుడు బసంతపూరి నరేష్తో కలిసి తుర్కయంజాల్ వైపు వస్తున్నారు. బ్రహ్మణపల్లి రోడ్డు దాటి రాగన్నగూడ సమీపంలో ముందుగా వెళ్తున్న ఆటోను తప్పించబోయి బైక్ అదుపుతప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇరువురిని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇమాన్యుల్ మరణించినట్లు ధ్రువీకరించారు. నరేష్కు తీవ్రంగా గాయాలవ్వడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు వివరించారు. -
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్
హుడాకాంప్లెక్స్: జనరల్ అబ్జర్వర్ డా.ప్రియాంక శుక్ల సోమవారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మాక్ పోల్, ఈవీఎంల కమిషనింగ్, సింబల్ లోడింగ్, పోస్టల్ బ్యాలెట్ తీరును, స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎస్.పంకజ, నోడల్ అధికారులు పాల్గొన్నారు. సీఎంను కలిసిన లారీ అసోసియేషన్ సభ్యులు కొందుర్గు: లారీ ఓనర్స్ అసో సియేషన్ సభ్యులు సోమ వారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా లారీ ఓనర్ల ప్రధాన సమస్యలు తీర్చేందుకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చినట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సాధిక్ తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే ఇచ్చారు. ఎన్నికల కోడ్కు సహకరించాలి సీఐ శంకర్కుమార్ యాచారం: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు సహకరించాలని యాచారం సీఐ శంకర్కుమార్ కోరారు. యాచారం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం సాగర్ రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారమే డబ్బులు తీసుకెళ్లాలని సూచించారు. మద్యం తరలింపుపై సైతం నిఘా పెట్టినట్లు తెలిపారు. తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బెల్టు షాపులపై దాడులు షాద్నగర్రూరల్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎకై ్సజ్ అధికారులు బెల్టు షాపులపై దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని వెలిజర్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని వెలిజర్ల, హజిపల్లి, షాద్నగర్ పట్టణంలో ఎకై ్సజ్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బెల్టుషాపులపై దాడులు చేపట్టారు. వెలిజర్ల గ్రామంలో రాఘవేందర్ నిర్వహిస్తున్న షాపులో 11.34 లీటర్ల (63 లిక్కరు బాటిళ్లు) మద్యాన్ని స్వాధీనం చేసుకొని షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం విలువ సుమారు రూ.12 వేలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యం అమ్మినా, నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం స్వాధీనం ఇబ్రహీంపట్నం రూరల్: ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద సోమవారం మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాఘవేందర్రెడ్డి తెలిపారు. రావిర్యాలకు చెందిన టి.శ్రీకాంత్ వద్ద 41 మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్లు తెలిపారు. -
అర్ధరాత్రి ఇళ్లలో చోరీ
ఆమనగల్లు: మండల పరిధిలోని మేడిగడ్డతండాలో ఆదివారం అర్ధరాత్రి మూడు ఇళ్లలో దుండగులు చోరీ చేశారు. తండాకు చెందిన రమేశ్, మరో ఇద్దరు రాత్రి వేళలో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిపై నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయా ఇళ్లలోకి చొరబడ్డారు. బీరువాలను పగులగొట్టారు. మూడు ఇళ్లలో దాదాపు రెండున్నర తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఇంటిపై నుంచి కిందికి వచ్చి చూడగా, ఇళ్ల తాళాలు పగుల గొట్టి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితుడు రమేశ్ ఆమనగల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ బాల్రామ్నాయక్ తండాను సందర్శించి చోరీకి గురైన ఇళ్లను పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మళ్లీ మోదీనే ప్రధాని
కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు నారాయణలాల్ పంచారియా మొయినాబాద్రూరల్: దేశంలో మళ్లీ నరేంద్రమోదీనే ప్రధాని కావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి నారాయణలాల్ పంచారియా ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలంలో ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అజీజ్నగర్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న మోసపూరిత హామీలను ప్రజలు నమ్మొద్దన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఆరు గ్యారంటీల హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేదని విమర్శించారు. కానీ కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ వస్తుందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అందరూ గెలుస్తారని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని, పదేళ్లలో ప్రజలకు న్యాయమైన పాలన అందించిందన్నారు. మూడోసారి ముచ్చటగా నరేంద్రమోదీ ప్రధానమంత్రి అవుతారని ఆయన తెలిపారు. నాయకులు, కార్యకర్తలు బూత్లెవల్ సభ్యులు కష్టపడి గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా నాయకుడు చిలుకూరు గోపాల్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మధుసుధన్రెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజమల్లేష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు అశోక్, నాయకులు లక్ష్మీపతియాదవ్, శ్రీకాంత్, శ్రీనివాస్రెడ్డి, మహేందర్, మాధవరెడ్డి, చిట్టి తదితరులు పాల్గొన్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement