-
నీలంను భారీ మెజార్టీతో గెలిపించాలి
మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావునిజాంపేట(మెదక్): కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు అన్నా రు. బుధవారం నిజాంపేట మండల కేంద్రంలోని రేణుక ఫంక్షన్ హాల్లో మండలానికి చెందిన సుమారు 500 మంది కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంపేట మండలం పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి కమిటీ వేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధ రాములు, పార్టీ మండల అధ్యక్షుడు మారుతీ, ముత్యంరెడ్డి, లింగంగౌడ్, అమరసేనారెడ్డి, నసీరొద్దీన్, మహేందర్, వెంకటేశ్, లస్మాగౌడ్, క్రాంతి కిరణ్, రాహుల్ రెడ్డి, నర్సింహారెడ్డి, అజయ్, పలు గ్రామాల మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎమ్మార్పీస్ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు పాపన్నపేట(మెదక్): పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. బుధవారం రాత్రి పాపన్నపేట కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో 5 గ్యారంటీలు అమలు చేసిందన్నారు. -
గ్యారంటీల అమలును మరిచారు
చేర్యాల(సిద్దిపేట): అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలును మర్చిన కాంగ్రెస్ పార్టీని ఎంపీ ఎన్నికల్లో ఓడించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని వీరన్నపేట, ము స్త్యాల, రాంపూర్, ఆకునూర్, దొమ్మాట, గుర్జకుంట గ్రామాల్లో బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్కి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ఆరు గ్యారంటీల అమలు విషయంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందన్నారు. చేర్యాల, జనగామ ప్రాంత సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పినట్లుగానే పార్లమెంట్లో ఈ ప్రాంత సమస్యలపై మాట్లాడాలంటే మల్లేష్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, పార్టీ పట్టణ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వరరావు, నాయకులు ముస్త్యాల బాల్ నర్సయ్య, అంకుగారి శ్రీధర్ రెడ్డి, ఎలికట్టె శివశంకర్, పెడతల ఎల్లారెడ్డి, గదరాజు చందు, వల్లూరి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
లేగ దూడపై హైనా దాడి
మద్దూరు(హుస్నాబాద్): లేగ దూడపై హైనా దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి మండలంలోని కూటిగల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన జ్ఞానమైన శ్రీనివాస్ అనే రైతు వ్యవసాయ బావి వద్ద లేగ దూడని కట్టేశాడు. బుధవారం ఉదయం వెళ్లి చూసేసరికి హైనా దాడిలో తీవ్రంగా గాయపడి ఉంది. ఇటీవల కాలంలో మద్దూరు, దూల్మిట్ట మండలాల్లోని గ్రామాల్లో హైనాలు సంచరిస్తూ మూగ జీవాలపై దాడి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఫారెస్టు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బైక్ను పట్టాలు దాటిస్తుండగా.. రైలు ఢీకొని యువకుడి మృతి రామాయంపేట(మెదక్): బైక్ను పట్టాలు దాటిస్తుండగా రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని అక్కన్నపేట బీసీ కాలనీ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే పోలీసుల కథనం మేరకు.. బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని యువకులు గేటు ద్వారా కాకుండా గ్రామ శివారులోని బీసీ కాలనీ వద్ద బైక్ను పట్టాలు దాటిస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ వైపు అతి వేగంగా వెళ్తున్న ఓకా రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా, మరో యువకుడు పారిపోయాడు. మృతి చెందిన యువకుని కాళ్లు, చేతులు తెగిపోయి పట్టా లపై పడిపోయాయి. చెవిలో ఎయిర్ ఫోన్స్ పెట్టుకోవడంతో రైలు వస్తున్న శబ్ధం వినిపించక ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహం వద్ద పాన్కార్డు లభించగా ప్రకాశ్ అనే పేరు ఉంది. ఈ ప్రమాదంతో అరగంటకు పైగా ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. కామారెడ్డి రైల్వే ఎస్ఐ తావూనాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డికాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి మధు నర్సాపూర్ రూరల్: కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ మండలంలోని పెద్ద చింతకుంట, చిన్నచింతకుంట గ్రామాలతోపాటు గిరిజన తండాల్లో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాగు, తాగు నీటితో పాటు అనేక పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. వెంకట్రామిరెడ్డిని గెలిపించి కేసీఆర్కు గిఫ్టు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బాబియా నాయక్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు నర్సింగరావు, చిన్న చింతకుంట మాజీ సర్పంచ్ సురేశ్ గౌడ్, పెద్ద చింతకుంట మాజీ సర్పంచ్ శివ కుమార్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రతీ క్షణం నిఘా
● ప్రశాంత ఎన్నికలకు పోలీసుల చర్యలు ● 2,098 పోలింగ్ కేంద్రాల్లో 381 సీసీ కెమెరాలు మెదక్ కలెక్టరేట్: మెదక్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల సంఘం పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అని చర్యలు చేపడుతోంది. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఎక్కడా అవాంఛనీయ ఘటన జరిగినా క్షణాల్లో తెలిసేలా పోలింగ్ పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తుంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మెదక్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఉన్నాయి. ఇందులో 18,28,210 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 2,098 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే మరో 26 అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఆలోచనలో అధికారులు ఉన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 381 పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతీక్షణం పరిశీలించనున్నారు. పోలింగ్కు ఒక రోజు ముందు కెమెరాలను బిగించి ఎప్పటికప్పుడూ అధికార యంత్రాంగం పర్యవేక్షించే ఏర్పాట్లు చేస్తుంది. అలాగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 349 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైన కేంద్రాలు, 1770 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి చర్యలు చేపడుతున్నారు. ఒక్కో ప్రాంతంలో 2 నుంచి 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో సీసీ కెమెరాల ఏర్పాటు సంఖ్యను తగ్గించనున్నారు. ప్రత్యక్షంగా వీక్షణం పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను ఎప్పటికప్పుడూ వీక్షించేలా సహాయ ఎన్నికల అధికారి కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయనున్నారు. సాధారణ, పోలీసు పరిశీలకులతో సహా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు కంట్రోల్రూంలో అందుబాటులో ఉండి పోలింగ్ తీరును ప్రత్యక్షంగా వీక్షిస్తారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమయ్యేలా, ఘర్షణలకు తావులేకుండా పోలీసు బలగాలను రంగంలోకి దించేలా నిఘా కెమెరాల వ్యవస్థ పనిచేస్తుంది. -
కాంగ్రెస్కు పెరుగుతున్న ఆదరణ
పొలిటికల్ హీట్పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్నారాయణఖేడ్: కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని కాంగ్రెస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ అన్నారు. బుధవారం నారాయణఖేడ్లోని ఆయన నివాసంలో ఉమ్మడి మెదక్ జిల్లా జెడ్పీ ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేశ్ షెట్కార్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. ఖేడ్ పట్టణానికి చెందిన దర్గా మజీద్ కమిటీ అధ్యక్షు డు హశం అలీ, నాయకులు లతీఫ్ సేట్, సలీం, అమేర్లతోపాటు వెంకటాపూర్, రాంతీర్థ్, నాగూరు(బి), పుల్కుర్తి, తడ్కల్ గ్రామాలకు చెందిన దాదాపు 150 మంది చేరిన వారిలో ఉన్నారు. జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేశ్ శెట్కార్ అన్నారు. బుధవారం రాత్రి జహీరాబాద్ పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సురేశ్ శెట్కార్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేయనుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి ఎ.చంద్రశేఖర్, ఐడీసీ మాజీ చైర్మన్ ఎం.డీ తన్వీర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంకాల్ సుభాష్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. గిరిధర్రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మెదక్లో ఎగిరేది గులాబీ జెండానే
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిదుబ్బాక: బీజేపీ, కాంగ్రెస్లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్నా మెదక్ పార్లమెంట్లో ఎగిరేది గులాబి జెండానేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గంలోని పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలనపై పట్టు ఉన్న మంచి మనిషి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ఏంటో దుబ్బాక ప్రజలకు అంతా తెలుసు అని.. అన్నారు. రఘునందన్రావును మరోసారి దుబ్బా క ప్రజలు చిత్తుగా ఓడించాలన్నారు. -
అభివృద్ధి, సంక్షేమం మాతోనే సాధ్యం
ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డికేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి నారాయణఖేడ్: సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం పార్టీ అభ్యర్థి సురేశ్ షెట్కార్కు మద్దతుగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జి శశికళ యాదవరెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్, ఎంపీటీసీ సబితా లింగారెడ్డి, రాధాకిషన్, శంకర్, పార్టీ మండ ల అధ్యక్షుడు తాహేర్, సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ చౌహాన్ పాల్గొన్నారు. నిరుపేద కూలీలకు ఉపాధి కోసం కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి చట్టం చేసిందని టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు వినోద్పాటిల్ తెలిపారు. కల్హేర్(నారాయణఖేడ్): ఎమ్మెల్యే డాక్టర్ పీ.సంజీవరెడ్డి బుధవారం సిర్గాపూర్, వాసర్, బీబీపేట, మార్డిలో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రాకేశ్ షెట్కార్, అసెంబ్లీ ఇన్చార్జి శశికళ మాధవరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోచయ్య, మనీశ్ పాటిల్, మాజీ ఆత్మ చైర్మన్ గుండు నరేందర్, నాయకులు దేవదాస్, తదితరులు పాల్గొన్నారు. -
No Headline
రాయపోలు(దుబ్బాక): పదేళ్ల బీజేపీ పాలనలో పే ద ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు దేశాన్ని దోచిపెట్టారని కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు విమర్శించారు. బుధవారం రాయపోలు, దౌల్తాబాద్ మండల కేంద్రాల్లో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇక మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసి పేదలకు తీరని అన్యాయం చేస్తారన్నారు. కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పాల్గొని ప్రసంగించారు. వారితోపాటు దుబ్బాక కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
ఓటరు మదిలో ఏముందో?
● అర్థం కాక తలలు పట్టుకుంటున్న నాయకులు ● సుక్కా, ముక్కా లేకపాయే.. ● చేతులో జెండా.. ఆలోచనేమో పక్కకు రామచంద్రాపురం(పటాన్చెరు): లోక్సభ ఎన్నికలు దగ్గర పడడంతో ఓటర్ల నాడీ తెలియక రాజకీయ పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. నమ్ముకున్న కార్యకర్తలే తమ పార్టీని కాదని మరొకరికి ఓటు వేస్తారన్న ఆలోచనలో కొంత మంది నాయకులు ఉన్నారు. పార్టీల కార్యకర్తలు ఒక దగ్గరికి చేరారంటే జెండాలను పక్కనపెట్టి అభ్యర్థుల గెలుపు, ఓటమిలపైనే చర్చించుకుంటున్నారు. బడా నేతలు సైతం ఎప్పటికప్పుడూ క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడీ పట్టుకునే ప్రయత్నంలో బిజీబిజీగా ఉంటున్నారు. కానీ వారికి ఓటర్ నాడీ దొరక్క ఒక తాటి మీదకి రాలేని పరిస్థితి నెలకొంది. గత ఎన్నికలకు భిన్నంగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వైపే ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం ఎటువైపు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. పైకి తాము ఈ పార్టీకే ఓటు వేస్తామని చెబుతున్నా లోపల మాత్రం మరొకటి ఉంటుందని స్థానికంగా చర్చించుకుటుంన్నారు. గత ఎన్నికల మాదిరిగా ఈ ఎన్నికలకు సందడి కనిపించడంలేదు. గత ఎన్నికల్లో ఆది నుంచే మద్యం, డబ్బుల హవా నడిచేది. రాత్రి అయిందంటే ఎక్కడికి వెళ్లిన బిర్యానీ, మందు దావతులే కనిపించేవి. ప్రస్తుతం అవేమీ ఇక్కడ కనిపించడం లేదు. చాలామటుకు ఈ ఎన్నికల్లో కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారని పలు పార్టీల నేతలు చెప్పుకొస్తున్నారు. పై నుంచి రానిది తాము ఎక్కడి నుంచి తేవాలి అందుకే అందరం అభ్యర్థి కోసం స్వచ్ఛందంగా పని చేస్తున్నామని పలువురు నాయకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో ఓటర్ నాడీని మాత్రం ఎవరూ పట్టుకోలేకపోతున్నారు. -
పరిశ్రమలో కార్మికుడు మృతి
హత్నూర (సంగారెడ్డి): పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన హత్నూర మండలంలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబీకులు, గ్రామస్తుల కథనం మేరకు.. హత్నూర మండలం మంగాపూర్ గ్రామానికి చెందిన నకచుంచు సత్యనారాయణ(42) కొన్నేళ్లుగా నస్తీపూర్ గ్రామ శివారులోని లోటస్ చాక్లెట్ పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం జనరల్ షిఫ్ట్లో విధులకు హాజరయ్యాడు. పని చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా సత్యనారాయణ కుప్పకూలిపోయాడు. వెంటనే సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసు కున్న కుటుంబీకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పరిశ్రమ వద్దకు చేరుకొని మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఎస్ఐ సుభాష్ ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పినా వినలేదు. చివరగా పరిశ్రమ యాజమాన్యం మృతుడి కుటుంబానికి రూ.8 లక్షలతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుభాష్ తెలిపారు. -
కార్మిక వ్యతిరేక బీజేపీని ఓడించాలి
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ నర్సాపూర్: కార్మిక వ్యతిరేక మతోన్మాద బీజేపీ పార్లమెంటు ఎన్నికలలో ఓడించాలని సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ కోరారు. బుధవారం ఓ ప్రైవేటు కాలేజీలో సీఐటీయూ ఆధ్వర్యంలో పార్లమెంటు ఎన్నికలు–కార్మికుల కర్తవ్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం, వారి హక్కులపై దాడి పెరిగిందని, పోరాడి సాధించిన 44 కేంద్ర కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సదస్సుకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకు లు నాగరాజు, దాసు, నాగభూషణం, సురేశ్, పాల్గొన్నారు. సదస్సు అనంతరం పట్టణంలో నీలం మధుకు మద్దతుగా సీఐటీయూ, సీపీఎం నాయకులు ప్రచారం చేపట్టారు. రక్తంతో మంత్రి పొన్నం చిత్రపటం హుస్నాబాద్రూరల్: రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పుట్టిన రోజు పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ నాయకుడు గట్టు సాయికృష్ణ గౌడ్ తన రక్తంతో చిత్ర పటం వేయించి బుధవారం బహూకరించాడు. 10 మిల్లీ లీటర్ల రక్తంతో చిత్ర పటానికి పెయింట్ వేయించి మంత్రి క్యాంపు కార్యాలయంలో అందించడంతో అందరూ అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అక్కు శ్రీనివాస్, వరప్రసాద్ పాల్గొన్నారు. సైబర్ వలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రూ.3.99 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు పటాన్చెరు టౌన్: పార్ట్ టైమ్ జాబ్ అంటూ ఫోన్కు వచ్చిన వాట్సాప్ మెసేజ్ కు స్పందించి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు డబ్బులు పోగొ ట్టుకున్న ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని నందన్ రతన్ ఫ్రైడ్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఏప్రిల్ 8వ తేదీన పార్ట్ టైమ్ జాబ్ అంటూ వాట్సాప్కు మెసేజ్ వచ్చింది. ఆ ఉద్యోగి తన వివరాలను నమోదు చేయడంతో సైట్ నిర్వాహకులు అతడికి ఒక వ్యాలెట్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారు. ఉద్యోగి ముందుగా రూ.3 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్లు పూర్తి చేశాడు. ఈ క్రమంలో బాధితుడు మొత్తం రూ. 3 లక్షల 99 వేలు చెల్లించాడు. ఉద్యోగి తా ను పెట్టిన నగదుతోపాటు కమీషన్ ఇవ్వాలని అడుగగా సైబర్ నేరగాళ్లు స్పందించలేదు. బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతి పథకంలో కొండి.. తొండి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/దుండిగల్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు విమర్శించారు. ప్రతి పథకంలో కొండి పెట్టడం.. తొండి పెట్టడం.. అబద్ధాలు చెప్పడం ఆ పార్టీకి పరిపాటిగా మారిందని అన్నారు. రైతుబంధు ఆర్థిక సాయం తాము అందరికీ ఇస్తే.. కాంగ్రెస్ వ్యవసాయం చేసిన వారికే ఇస్తామంటోందని చెప్పారు. వరి నాట్లు వేసేటప్పుడు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం.. కోతలు, కల్లాలైనా కూడా ఇవ్వడం లేదన్నారు. వడ్లు కొనడం లేదని, వడ్లకు బోనస్ బోగస్ అయిందని ఎద్దేవా చేశారు. రూ.రెండు లక్షల రుణమాఫీ జరగలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్, పటాన్చెరు, మల్కాజిగిరి లోక్సభ పరిధిలోని దుండిగల్లో జరిగిన రోడ్ షోల్లో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కింది ‘నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చిన కాంగ్రెస్ ఉచితబస్సు హామీ తప్ప ఏ ఒక్క హామీనీ నెరవేర్చ లేదు. పేదల సంక్షేమం కాంగ్రెస్కు పట్టడం లేదు. రైతుబంధు సాయం అందలేదు. ఫ్రీబస్సు పథకం పెట్టి ఆటో కార్మికుల నోళ్లు కొట్టారు. మేము మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ఇస్తే.. ఇప్పుడు ఆ నీళ్లు మాయమైపోయాయి. మా ప్రభుత్వ హయాంలో తొమ్మిదేళ్లు బ్రహా్మండంగా వచ్చిన కరెంట్.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎక్కడికి పోయింది? ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇస్తలేరు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను నిలిపివేశారు. కల్యాణలక్ష్మికి అదనంగా ఇస్తామన్న తులం బంగారం ఇవ్వలేదు. రూ.4 వేల పింఛను ఇస్తారనే నమ్మకం ప్రజల్లో లేదు. మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం హామీ నెరవేర్చామని రాహుల్ గాంధీ ఇటీవల బహిరంగ సభలో అబద్ధాలు చెప్పారు..’అని కేసీఆర్ విమర్శించారు. ఏ వర్గాన్నీ పట్టించుకోవడం లేదు ‘టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నియామకాల్లో గిరిజన రిజర్వేషన్లపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, దానిపై సరైన, గట్టి వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమవుతోంది. మా ప్రభుత్వ హయాంలో గిరిజనుల పోడు భూములకు కూడా రైతుబంధు ఆర్థిక సాయం అందించాం. కానీ ఇప్పుడు రావడం లేదు. నేను 58 ఏండ్లుగా మొత్తుకున్నా ఏ ఒక్క సీఎం కూడా తండాలను గ్రామ పంచాయతీలుగా చేయలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తండాలను పంచాయతీలుగా చేసి నేరుగా నిధులు ఇచ్చాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవేవీ రాకుండా చేసింది. ఏ ఒక్క వర్గం కోసం కూడా కాంగ్రెస్ పని చేయడం లేదు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోవడానికి ఆ పార్టీ విధానాలే కారణం. కాంగ్రెస్ విధానాల కారణంగా పారిశ్రామిక వేత్తలు ఇక్కడి నుంచి తరలిపోతున్నరు. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లిస్తున్నాడని స్వయంగా మోదీయే ప్రకటించారు..’అని మాజీ సీఎం చెప్పారు. పాకిస్తాన్ పేరిట బీజేపీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ‘పాకిస్తాన్తో పంచాయతీ అంటూ బీజేపీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తోంది. ‘బుట్కంత దేశం పాకిస్తాన్.. జాడిచ్చి కొడితే 25 ఏండ్లు మన దిక్కు చూడదు.. ప్రతిసారి పాకిస్తాన్ అని చెప్పుడు.. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం.. ఓట్లు దండుకోవడం. ప్రధాని మోదీతో తెలంగాణకు పైసా కూడా లాభం కాలేదు. 150 స్లోగన్లు చెప్పిన మోదీ.. సబ్కా సాత్.. సబ్కా వికాస్ అయిందంటున్నరు.. అది కాలేదు కానీ.. దేశం సత్తెనాస్ అయింది.. మోదీ హయాంలో రూపాయి విలువ ఏ ప్రధాని హయాంలో దిగజారనంతగా పడిపోయింది. పెట్టుబడులు పోయాయి. అంతర్జాతీయంగా భారతదేశ విలువలు మంట గలిసిపోతున్నాయి. విశ్వ గురువుగా ప్రకటించుకున్న మోదీ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత అరెస్టులపై అమెరికా దేశం సైతం తమ నిరసన తెలిపింది. మోదీ ఎజెండాలో పేదల బాధలుండవు. ఢిల్లీలో ధర్నా చేస్తే 750 మంది రైతులను చంపిన మోదీ.. తర్వాత జరిగిన యూపీ ఎన్నికల్లో క్షమాపణలు చెప్పిండు. మదన్రెడ్డి కాంగ్రెస్లో ఎందుకు చేరిండు? నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి కాంగ్రెస్లో ఎందుకు చేరిండని కేసీఆర్ ప్రశ్నించారు. పైసల కోసం చేరిండా? ఎవరిని ఉద్ధరించేందుకు ఆయన కాంగ్రెస్లో చేరిండో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. పోలీసులు చాలా అతిగా ప్రవర్తిస్తున్నారని, రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మెదక్, మల్కాజిగిరి బీ ఆర్ఎస్ అభ్యర్థులు వెంకట్రామ్రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ది మూడో స్థానమే.. ఈ దేశం, ఈ రాష్ట్రం మనది. అందరం ఏకమై తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. యువత, మేధావులు ఆలోచన చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలే తప్ప.. ఒక ఒరవడిలో పిచ్చిపిచ్చిగా కొట్టుకుని పోవద్దు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుంది. అలాంటి కాంగ్రెస్కు ఒటేస్తే బీజేపీకి మేలు జరుగుతుంది. బీఆర్ఎస్ 12 స్థానాలు గెలిస్తే పార్లమెంట్లో కీలక పాత్ర పోషిస్తుంది. కృష్ణా, గోదావరి జలాలను తమిళనాడుకు తీసుకెళ్లే ప్రయత్నం మోదీ చేస్తు న్నారు. సీఎం రేవంత్ ఒక్క మాట మాట్లాడటం లేదు. ఈ నీళ్లను కాపాడు కోవాలంటే తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాలి. అలా అయితే తెలంగాణ హక్కుల సాధన సాధ్యమవుతుందని’ కేసీఆర్ పేర్కొన్నారు. -
బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు
ఎమ్మార్పీఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రత్నయ్య మెదక్జోన్: బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని, మత రాజకీయాలు చేస్తూ మనుషుల మధ్య చిచ్చుపెట్టే ఆ పార్టీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రత్నయ్య అన్నారు. సోమవారం ఆయన మెదక్లో విలేకరుల సమావేశశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో 400 సీట్లు తమకు వస్తాయని చెప్పుకుంటున్నారని, అదే జరిగితే రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తారన్నారన్నారు. మోదీ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తే ఏబీసీడీ వర్గీకరణ జరుగుతుందని, మంద కృష్ణమాదిగ తన స్వార్థం కోసం ఎస్సీలను మోసం చేసే కుట్ర చేస్తున్నారని రత్నయ్య ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నిమ్మలగారి గంగయ్య, నాయకులు భిక్షపతి, దాస్, జగన్, ఎండీ ఖాజీం తదితరులు ఉన్నారు. దేవుళ్ల మీద ప్రమాణం ఓట్లు దండుకోవడానికే.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కొమురవెల్లి(సిద్దిపేట): సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ప్రమాణం చేసేది ఓట్లు దండుకోవడానికే అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలోని కిష్టంపేట, గౌరయపల్లి, మర్రిముచ్చాల, లెనిన్నగర్, రాంసాగర్, కొమురవెల్లి, రసులాబాద్, అయినాపూర్, తపాస్పల్లి, గురువన్నపేట, పోసాన్పల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశంకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయని కాంగ్రెస్ను విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ తలారి కీర్తన, జెడ్పీటీసీ సిద్ధప్ప, వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గదరాజు చందు, కొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే
పొలిటికల్ హీట్నారాయణఖేడ్: హామీలను అమలుచేయని బీజేపీ, కాంగ్రెస్లకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి నారాయణఖేడ్ శివాజీ చౌక్ నుంచి రాజీవ్ చౌక్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలను ఎగ్గొట్టడంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందేనని విమర్శించారు. తనను గెలిపిస్తే బసవేశ్వర ఎత్తిపోతల పథకం, రైల్వేలైను ఏర్పాటు, జాబ్మేళాలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాకే ప్రజల అవసరాలు గుర్తించి అనేక అభివృద్ధి పనులు చేశానన్నారు. ఖేడ్ జెడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, బీఆర్ఎస్ అధ్యక్షుడు పరమేశ్, నగేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రుబీనా నజీబ్, ముజమ్మిల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, భూపాల్ రెడ్డి సోమవారం మండలంలోని పైడిపల్లి, రుద్రార్ తదితర గ్రామాల్లో అనిల్ కుమార్ తరఫున ప్రచారం నిర్వహించారు.బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ -
బాబోయ్ డ్యూటీనా..
ఆర్టీసీ డ్రైవర్ల అరిగోసఇంజన్ వేడి ఒక వైపు.. మండే ఎండలు మరో వైపు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి ● డ్రైవర్ సీట్ వద్ద ఫ్యాన్లు కరువు నిత్యం 12 గంటలపాటు విధుల్లో.. ● ఇటీవల ఎనిమిది మంది డ్రైవర్లు ఆస్పత్రిపాలునలభై ఐదు డిగ్రీల ఎండ వేడిమి ఒక వైపు.. ఇంజన్ వేడి మరో వైపుతో ఆర్టీసీ డ్రైవర్లు అరి గోస పడుతున్నారు. తీవ్ర ఎండలోనే ప్రతి రోజూ సుమారు 12 గంటలపాటు డ్యూటీ చేస్తున్నారు. దీంతో ఉక్కపోత భరించలేక డ్రైవర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డ్రైవర్ సీటు వద్ద కనీసం ఫ్యాన్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో చేసేదిమి లేక కష్టం మీద విధులు నిర్వహిస్తూ ఇప్పటికే 8 మంది డ్రైవర్లు అనారోగ్యం పాలయ్యారు. – మెదక్జోన్ -
మంజీరాలో మునిగి బాలుడు మృతి
కొల్చారం(నర్సాపూర్): మంజీరా నీటి మడుగులో మునిగి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామానికి చెందిన కొండి భూమేశ్–యశోదకు ఇద్దరు కుమారులు. భూమేశ్ కుటుంబం ఖాళీ సీసాలు ఏరుతూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉద యం ఇంటి నుంచి ఖాళీ సీసాలు ఏరేందుకు భూమేశ్ భార్య, కుమారులతో ఏడుపాయల వనదుర్గాదేవి సన్నిధికి వచ్చారు. సీసాలు ఏరుతూ మధ్యాహ్నం సమయంలో ఎండ ఉక్కపోతగా ఉండడంతో నలుగురు కలిసి పోతంశెట్టిపల్లి గ్రామ శివారులోని మంజీరా నది మడుగులోకి దిగి స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు కొండి దుర్గేశ్ (16) స్నానం చేస్తూ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కిష్టాపూర్ నుంచి గజ ఈతగాళ్లని రప్పించి దుర్గేశ్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి, మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎండ ఉపశమనం కోసం స్నానానికి వెళ్లిన కుటుంబం ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత -
ధార్మికార్య వీరగల్లు విగ్రహం లభ్యం
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో గుర్తింపు బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని దేవక్కపల్లిలో సోమవారం కొత్త తెలంగాణ బృందం యువ పరిశోధక సభ్యుడు శ్రీనివాస్ పర్యటించి ధార్మికకార్య వీరగల్లు విగ్రహం గుర్తించారు. వీరగల్లులో ప్రత్యేక వర్గానికి చెందిన వాడు ధార్మిక వీరగల్లుడని తెలిపారు. దేవక్కపల్లిలో గతంలో లభించిన శాసనం శక సంవత్సరం 993 విరోధికృత్ ఆషాఢ మాసం సూర్య గ్రహణం సందర్భంగా అనగా క్రీస్తు శకం 1071 జూన్ 30న దానం చేయుట గురించి చెక్కబడిందని వివరించారు. ఈ వీరుడి పేరున దానాలు చేసినట్లు భావించవచ్చన్నారు. వీరగల్లు వీరుడి ఆహార్య శైలి, నడినెత్తిన కొప్పు, ఎడమ చేతిలో లింగం కనిపిస్తుంది. మూడు అంతస్తులతో కనిపిస్తున్న కల్యాణి చాణిక్యుల కాలం నాటిదని తెలిపారు. యువతి అదృశ్యం న్యాల్కల్(జహీరాబాద్): యువతి అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని చినిగెపల్లిలో చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్ఐ రామానాయుడు కథనం మేరకు.. గ్రామానికి చెందిన నర్సప్ప కుమార్తె కొటారి భాగ్య(28) గత నెల 30న కుటుంబ సభ్యులతో కలసి రాత్రి నిద్రించింది. కొద్దిసేపటికే రాత్రి 2 గంటల ప్రాంతంలో ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు ఆమె ఒంటిపై ఎరుపు రంగు పంజాబీ డ్రెస్ ఉందన్నారు. తెలుగు, కన్నడ భాష మాట్లాడుతుందన్నారు. ఈ విషయంలో అదే గ్రామానికి చెందిన యువకుడిపై అనుమానం ఉన్నట్లు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. వివాహిత.. చేగుంట(తూప్రాన్): వివాహిత అదృశ్యమైన ఘటన మండలంలోని అనంతసాగర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాలరాజు కథనం మేరకు.. గ్రామానికి చెందిన కోటగిరి నీలమణి(26)కి పాప, బాబు ఉన్నారు. ఈమె ఏప్రిల్ 28న తన పుట్టింటికి వెళుతున్నట్లు చెప్పి వెల్దూర్తి మండలం రామాయిపల్లి గ్రామానికి వెళ్లింది. ఈ నెల 4న అనంతసాగర్కు వస్తున్నట్లు రామాయిపల్లి నుంచి బయలు దేరి అనంతసాగర్కు రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మా పార్టీతోనే సంక్షేమం సాధ్యం
నారాయణఖేడ్: అభివృద్ధితోపాటు అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని ఆ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ అన్నారు. ఖేడ్లోని ఆయన నివాసంలో సోమవారం నాగల్గిద్ద మండలం షాపూర్, మోర్గీ, మనూరు మండలం తిమ్మాపూర్, కంగ్జి మండలం, ముకుంద్ తండాలకు చెందిన దాదాపు 250 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు శంకరయ్యస్వామి, కంగ్జి మాజీ జెడ్పీటీసీ సర్ధార్, తదితరులు పాల్గొన్నారు. హామీలన్నీ అమలు జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ శెట్కార్ అన్నారు. సోమవారం మండలంలోని రంజోల్ గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన మాజీ సర్పంచ్ బాబు, బీఆర్ఎస్ నాయకులు బాబా, నర్సింహా, గుండ్రెడ్డి, చంద్రన్న, యూనూస్, నిజాం, సర్దార్, మస్తాన్, యూసూఫ్లను కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి ఎ.చంద్రశేఖర్, పార్టీ యువజన నియోజకవర్గం ఇన్చార్జి కె.నరేశ్ గౌడ్, పార్టీ నాయకులు వైజ్యనాథ్, ఖలీల్, మన్సూర్, షబ్బీర్, రవీందర్రెడ్డి, రాజు, శశి, మజార్, షౌకత్ పాల్గొన్నారు.కాంగ్రెస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
హవేళిఘణాపూర్(మెదక్): కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద ప్రజలు కన్న కలలను సాకారం చేసే దిశగా పని చేస్తుందని కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బూర్గుపల్లిలో స్థానిక ఎమ్మెల్యే రోహిత్తో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మెదక్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉందని, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్ని రంగాల్లో వివక్షకు గురైందన్నారు. తనను గెలిపిస్తే మెదక్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పార్టీ నాయకులు మహేందర్రెడ్డి, వెంకన్న, పరుశురామ్, పద్మారావు, హఫీజుద్దీన్ పాల్గొన్నారు. బైక్ ర్యాలీలో అపశృతి, ముగ్గురికి గాయాలు హవేళిఘణాపూర్ నుంచి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన యువకులు బైక్ ర్యాలీగా బయల్దేరారు. ఇదే సమయంలో ఎల్లారెడ్డి వైపు నుంచి బీహార్ రాష్ట్రంకు చెందిన ఇద్దరు కూలీలు బైక్పై వస్తూ శాలిపేట మలుపు ర్యాలీకి ఎదురుగా వచ్చారు. తొగిటకు చెందిన భరత్ బైక్ను ఢీకొట్టగా ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మెదక్ ఆస్పత్రికి తరలించారు.కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు -
రూ.14.62 లక్షలు సీజ్
సిద్దిపేటకమాన్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో సోమవారం నిర్వహించిన ఆకస్మిక వాహనాల తనిఖీల్లో రూ.14,62,000 సీజ్ చేసినట్లు సిద్దిపేట వన్ టౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా వాహనాల తనిఖీ నిర్వహించగా పట్టణానికి చెందిన రమేశ్ ఎలాంటి ఆధారాలు లేకుండా బైక్పై తరలిస్తున్న రూ.8,62,000 సీజ్ చేశామన్నారు. అదే విధంగా చౌడారం గ్రామానికి చెందిన రాములు నుంచి రూ.6 లక్షలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నగదును జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ కమిటీకి అప్పగించడం జరిగిందన్నారు. రూ.1.23 లక్షలు స్వాధీనం గజ్వేల్రూరల్: సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు సోమవారం వాహన తనిఖీలను చేపట్టినట్లు గజ్వేల్ అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యంరాజు తెలిపారు. ఈ సందర్భంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో బూరం మల్లేశం తన వాహనంలో ఎలాంటి అధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 55 వేలు, లాల్గడి మలక్పేటకు చెందిన మరో వ్యక్తి శిలసాగర్ సిద్ధులు కారులో తీసుకెళ్తున్న రూ.68.500 సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. రూ. 1,11,400 సీజ్ చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని అనంతసాగర్ చెక్పోస్టు వద్ద సోమవారం రాత్రి సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేశారు. సిద్దిపేటకు చెందిన సుంచు నాగరాజు తన వాహనంలో ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకువెళ్తున్న రూ.1,11,400 సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. -
ఉపశమనం కోసం మజ్జిగ ఇస్తున్నాం
మెదక్ డిపోలో మొత్తం 109 బస్సులు ఉండగా వాటిలో 55 బస్సులు ప్రైవేట్కు చెందినవి కాగా 54 ఆర్టీసీ సంస్థకు చెందినవి ఉన్నాయి. కాగా 320 మంది సిబ్బంది ఉండగా వారిలో 280 మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు. ఇందులో ఆర్డీనరీ బస్సు రోజుకు 340 కిలో మీటర్లు తిరుగుతుండగా ఎక్స్ప్రెస్లు, డీలక్స్లు మాత్రం నిత్యం 360 నుండి 400 కిలో మీటర్ల వరకు తిరుగుతున్నాయి. 20 రోజులుగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో 45.1 డిగ్రీలుగా నమోదవుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భానుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. జిల్లాలో ఇంటి నుంచి బయట కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇంతటి ఎండలోనూ ఆర్టీసీ డ్రైవర్లు రోజుకు సుమారు 400 కిలోమీటర్ల మేర బస్సులను నడుపుతూ నరకం అనుభవిస్తున్నారు. డ్రైవర్ సీటుపై బాగాన చిన్నపాటి ఫ్యాను అమర్చితే తమకు కొంతైనా మేలు జరుగుతుందని, తమ ఆరోగ్యాలు పాడవకుండా ఉంటాయని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. 12 గంటలు డ్యూటీ లేబర్ చట్టం ప్రకారం ఆర్టీసీలో పని చేసే డ్రైవర్లు, కండక్టర్లకు నిత్యం 8 గంటలు మాత్రమే విధులు నిర్వహించాలి. అంతకు మించి పని చేస్తే ఓవర్ టైం(ఓటీ) కట్టించాల్సి ఉంటుంది. గతంలో ఆర్టీసీలో 12 నుంచి 13 గంటల డ్యూటీ చేస్తే ఆ మరుసటి రోజు స్పెషల్ ఆఫ్ కింద డ్యూటీ ఉండేది కాదు. ప్రస్తుతం కండక్టర్లకు అదే విధానం కొనసాగుతుండగా డ్రైవర్లకు మాత్రం ఆ విధానం తొలగించినట్లు కొందరు డ్రైవర్లు చెబుతున్నారు. నిత్యం 12 గంటలకు పైగా ఎర్రటి ఎండలో వందల కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతున్నారు. గతంలో మాదిరిగా 12 గంటలపాటు బస్సు నడిపితే ఆ మరుసటిరోజున స్పెషల్ ఆఫ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎనిమిది మందికి అస్వస్థత ఇటీవల మెదక్ డిపోకు చెందిన 8 డ్రైవర్లు అనారోగ్యం పాలయ్యారు. వారిలో ముఖ్యంగా బీపీ, కంటిజబ్బులు, హార్ట్కు సంబంధించిన వ్యాధులతో బాదపడుతున్న వారు ఉన్నారు. డిపోలో ఇటీవల హెల్త్క్యాంపు ఏర్పాటు చేయగా వైద్యులు వారిని గుర్తించారు. ఎనిమిది తార్నాకలో గల ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.ఫ్యాన్లు అమర్చాలి బస్సుల్లో డ్రైవర్ సీటు చిన్నగా ఉంటుంది. చిన్నపాటి ఫ్యాన్లు అమర్చితే గాలి వచ్చేది. కొంత మేర ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేవాళ్లం. కానీ మా బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదు. – ఎండీ ముజీద్, డ్రైవర్ మెదక్ డిపోభరించలేకపోతున్నాం ఎండలు, ఇంజన్ వేడి భరించలేక పోతున్నాం. తరుచూ విరేచనాలు అవుతున్నాయి. నరకం అనుభవిస్తూ తప్పని పరిస్థితుల్లో బస్సు నడుపుతూ తరుచూ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నాం. – ఎండీ గౌసొద్దీన్, డ్రైవర్ మెదక్ డిపోఎండల తీవ్రత నుంచి ఉపశమనం కోసం డ్రైవర్లు, కండక్టర్లతోపాటు ఇతర సిబ్బందికి నిత్యం మజ్జిగ ఇస్తున్నాం. ఇటీవల వైద్యులతో సిబ్బంది హెల్త్ చెకప్ చేయించగా 8 మందిని రెఫర్ చేశారు. డ్రైవర్లకు స్పెషల్ ఆఫ్ ఎప్పుడు లేదు. డ్రైవర్లు ఉపశమనం పొందేలా చర్యలు చేపడుతాం. – సుధ, ఆర్టీసీ డీఎం మెదక్ -
కేసీఆర్ రోడ్షోను జయప్రదం చేయండి
పటాన్చెరు: మెదక్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఈనెల 8వ తేదిన పటాన్చెరు పట్టణంలో నిర్వహించనున్న మాజీ సీఎం కేసీఆర్ రోడ్షోను జయప్రదం చేయాలని మాజీ మంత్రి హరీష్ పిలుపునిచ్చారు. రోడ్షోపై సోమవారం పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. సమావేశంలో వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు శ్రీకాంత్ గౌడ్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.అనంతరం జిన్నారం మండలం కొడకంచి గ్రామ మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు శ్రీశైలం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ బాల్రెడ్డి, మాజీ సర్పంచ్ శివ రాజ్ హాజరయ్యారు.మాజీ మంత్రి హరీశ్ రావు -
మోదీ హ్యాట్రిక్ విజయం ఖాయం
వెల్దుర్తి(తూప్రాన్): మెదక్ పార్లమెంట్తోపాటు దేశంలో గెలిచేది బీజేపీనే అని, ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రం వెల్దుర్తిలో అంబేడ్కర్ చౌరస్తా నుంచి హైస్కూల్ క్రీడాప్రాంగణం వరకు రోడ్డు షో చేపట్టారు. ప్రజలనుద్దేశించి రఘునందన్రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలకు చేసిన అన్యాయాన్ని తిప్పికొట్టి బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని చేసే బూటకపు ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసే తనను ఎంపీ ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం నిధులతో పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. ప్రచారంలో నియోజకవర్గ నాయకులు మురళీయాదవ్, మండల అధ్యక్షుడు నర్సింలు, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, శేఖర్గౌడ్, శ్రీనివాస్, వెంకటేశం, బాలకిషన్, పాల్గొన్నారు.బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు -
పథకాలను ప్రజలకు వివరించండి
చేర్యాల(సిద్దిపేట): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వే యించాలని మాజీ ఎమ్మెల్యే, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో మండల పరిధిలోని గ్రామాల, పట్టణ పరిధిలోని వార్డుల వారీగా బూత్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి, పట్టణ అధ్యక్షుడు చిరంజీవులు, నాయకులు, కిష్టయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement