రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి

Published Tue, Apr 23 2024 8:40 AM

-

కశింకోట: మండలంలోని విసన్నపేట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కూలీ దుర్మరణం చెందాడు. సీఐ వినోద్‌బాబు అందించిన వివరాల ప్రకారం..యలమంచిలిలోని చిన్న గొల్లలపాలెంకు చెందిన మువ్వల సన్యాసినాయుడు (45) బయ్యవరం నుంచి విసన్నపేటకు బైక్‌పై వెళుతుండగా అదుపు కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సన్యాసినాయుడు ఎక్కడ పని ఉంటే అక్కడకు వెళ్లి కూలి చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఎప్పటిలాగే కూలి పనికి వెళుతుండగా జరిగిన ప్రమాదంలోమృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించినట్టు సీఐ తెలిపారు.

Advertisement
Advertisement