తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో ముత్యాలనాయుడు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలు నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడును నియమిస్తున్నట్టు ప్రకటించింది. అదే విధంగా విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిగా పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజులను నియమించారు. పార్టీ పీఏసీ మెంబర్గా, ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment