పెద్దతిప్పసముద్రం : మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ దిగవ బండమీదపల్లికి చెందిన నెలవంకి నరసింహులు భార్య రెడ్డెమ్మ (35) ఈ నెల 7న అదృశ్యమైనట్లు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బి.కొత్తకోటకు వెళుతున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పిందని, అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదన్నారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. కర్నాటక రాష్ట్రం దొడ్డబళ్ళాపురం తాలూకా చెన్నాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
మరొక వార్త..
మదనపల్లె : దారి సమస్యపై జరిగిన గొడవలో కొంతమంది కలిసి ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచిన సంఘటన గుర్రంకొండ మండలంలో మంగళవారం జరిగింది. మండలంలోని నడిమికండ్రిగ పంచాయతీ గెరికుంటపల్లెకు చెందిన దేవరయ్య (45) ఇంటికి, అదే గ్రామానికి చెందిన గుర్రయ్య ఇంటి ముందు ఉన్న దారి వెంట వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే తమ ఇంటి ముందు రావద్దని గుర్రయ్య గొడవ పెట్టుకున్నాడు. దేవరయ్యపై గుర్రయ్య, అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఆ సమయంలో అటువైపు వచ్చిన అదే గ్రామానికి చెందిన మోహన్ భార్య చిట్టెమ్మ (34)పై అక్కడే ఉన్న గుర్రయ్య బంధువు భద్రయ్య దాడి చేసి గాయపరిచాడు. దాడిలో దేవరయ్య, చిట్టెమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఔట్ పోస్టు సిబ్బంది గుర్రంకొండ పోలీసులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment