ఉద్యోగుల సమస్యలు త్వరలో పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యలు త్వరలో పరిష్కారం

Published Thu, Dec 14 2023 12:20 AM | Last Updated on Thu, Dec 14 2023 12:20 AM

నూతనంగా ఎంపికై న కార్యవర్గ సభ్యులతో 
ఎన్‌జీఓ సంఘం జిల్లా నేతలు  
 - Sakshi

రాయచోటి అర్బన్‌ : ఉద్యోగుల సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని ఏపీ ఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. బుధవారం స్థానిక ఎన్‌జీఓ సభా భవనంలో జరిగిన రాయచోటి ఎన్‌జీఓ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.శ్రీనివాసులు, కె.వి.శివారెడ్డిలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నారన్నారు. అనంతరం రాయచోటి ఎన్‌జీఓ అసోసియేషన్‌ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సహ అధ్యక్షుడు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాసులు, రామమోహన్‌, వెంకటరమణలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎన్‌జీఓ సంఘం రాయచోటి అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాల్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కోశాఽధికారి నిత్యపూజయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, లక్కిరెడ్డిపల్లె అధ్యక్షుడు బలరామరాజు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement