చీరాల: చీరాల వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రంలో ఆస్తులు, అప్పులను ప్రకటించారు. కరణం వెంకటేష్ తన పేరుపై రూ.13,37,90,250లు, భార్య కరణం గీత పేరు మీద రూ.8,06,89,600 ఆస్తులు ఉన్నట్లు చూపారు. వెంకటేష్కు రూ.1,13,32,624లు, భార్య గీత పేరుమీద రూ.87,00,511లు అప్పులు ఉన్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. అలానే తన వద్ద రూ.45,000 నగదు, తన భార్య వద్ద రూ.30,000 నగదు ఉందని, తన పేరుమీద ఫార్చూనర్ కారు, ఒక ద్విచక్రవాహనం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఏలూరికి వాహనమే లేదంటా.. !
చినగంజాం: పర్చూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఏలూరి సాంబశివరావు తన అఫిడవిట్ ఆస్తుల వివరాలను ఆర్వో సమక్షంలో ఎలక్షన్ కమిషన్కు సమర్పించారు. తన పేర స్థిర, చరాస్తులు రూ.19.99 కోట్లు భార్య ఎస్.మాలతి పేరు మీద రూ.187 కోట్లు, పెద్ద కుమారుడు దివ్యేష్పై రూ.41.58 కోట్లు, రెండవ కుమారుడు మైనాంక్ తారక్ పేరు మీద రూ.41.40 కోట్లు ఉన్నట్లు చూపారు. భార్య మాలతి పేరు మీద అప్పు రూ.8.87 కోట్లు ఉన్నాయని, వారికి ఎలాంటి వాహనాలు లేవని అఫిడవిట్లో చూపారు. ఏలూరి సాంబశివరావుపై అఫిడవిట్ ప్రకారం ఇప్పటి వరకు 6 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఎలాంటి చార్జి షీట్లు దాఖలు కాలేదు.