![మహిళా సమాఖ్య సభ్యులతో వెదురు సాగు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11kgm394-192029_mr-1739302749-0.jpg.webp?itok=Ui8KrqqG)
మహిళా సమాఖ్య సభ్యులతో వెదురు సాగు
చుంచుపల్లి: రాష్ట్రంలోని 5 జిల్లాల్లో (భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్) జిల్లాకు వెయ్యి మంది చొప్పున 5,000 మంది మహిళా సమాఖ్య సభ్యులచే వెదురు సాగు ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్ణయించిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో రెండో రోజు ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెదురు సాగుపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని చుండ్రుగొండ, ములకలపల్లి, గుండాల మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామని, ఈ మండలాల్లోని 1,000 మంది మహిళా సమాఖ్య సభ్యులను గుర్తించి వారికి వెదురు సాగుపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. వీరికి ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కల సరఫరా, నిర్వహణ కోసం నిధులు సమకూర్చుతామని, మొక్కలు నాటిన తర్వాత నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభమై 80 ఏళ్ల వరకు వస్తుందని, అందుకు సంబంధించి సర్టిఫికెట్, మార్కెటింగ్కు సంబంధించి సెర్ప్, ఇండస్ట్రీ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుందని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ నీలేశ్, మూడు మండలాల డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, ఏపీఓలు, ఉద్యానవన శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు, ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ అధికారులు రమ్య, శ్రీకాంత్, సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన
Comments
Please login to add a commentAdd a comment