ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..నిఫ్టీ@24,300 | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..నిఫ్టీ@24,300

Published Thu, Jul 4 2024 3:32 PM | Last Updated on Thu, Jul 4 2024 3:32 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 24,304 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 66 పాయింట్లు ఎగబాకి 80,049 వద్ద ముగిసింది. ఈ రోజు ఒకానొక సమయంలో సెన్సెక్స్‌ ఏకంగా 80,392 మార్కు చేరింది.

డెరివేటివ్‌ మార్కెట్‌లో సుమారు 3.5 లక్షల లాంగ్‌ కాంట్రాక్ట్‌లు నమోదయ్యాయి. ఎఫ్‌ఐఐ, ఇతర పెద్ద ఇన్వెస్టర్లు మార్కెట్లు మరింత పెరిగాక గరిష్ఠాల వద్ద అమ్మకాలకు సిద్ధమవుతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, టీసీఎస్‌, కోటక​్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస​్‌ ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే, పవర్‌గ్రిడ్‌, మారుతీసుజుకీ, ఎస్‌బీఐ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement