ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@24,314 | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@24,314

Published Fri, Jul 5 2024 3:31 PM | Last Updated on Fri, Jul 5 2024 3:32 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 24,314 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 72 పాయింట్లు నష్టపోయి 79,977 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు మొగ్గు చూపినట్లు నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీలో అధిక షేర్‌ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ శుక్రవారం తగ్గడంతో మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లినట్లు అభిప్రాయపడుతున్నారు.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, ఎల్‌ అండ్‌ టీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నెస్లే, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటాన్‌, టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement