వరుస లాభాలకు బ్రేక్‌.. నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

వరుస లాభాలకు బ్రేక్‌.. నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

Published Fri, Jul 5 2024 9:40 AM | Last Updated on Fri, Jul 5 2024 11:04 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ 116 పాయింట్లు కోల్పోయి 24,186కు చేరింది. సెన్సెక్స్‌ 498 పాయింట్లు తగ్గి 79,553 వద్ద ట్రేడవుతోంది. దాంతో వరుస లాభాలకు బ్రేక్‌ పడినట్లయింది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.11 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 87.11 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.51 శాతం, నాస్‌డాక్‌ 0.88 శాతం  లాభపడ్డాయి.

ఈక్విటీ మార్కెట్ల గణనీయమైన పెరుగుదల నేపథ్యంలో భారత్‌ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ రెగ్యులేటర్‌– సెబీ, సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు (శాట్‌) కీలక సూచనలు చేశారు. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్త అవసరమన్నారు. ఎటువంటి సవాలునైనా సత్వరం పరిష్కరించడానికి,  వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి మరిన్ని ట్రిబ్యునల్‌ బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. శాట్‌ కొత్త ప్రాంగణాన్ని ఇక్కడ ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లలో అధిక మొత్తంలో లావాదేవీలు, అలాగే కొత్త నిబంధనల కారణంగా శాట్‌పై అధిక పనిభారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో శాట్‌ కొత్త బెంచ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement