పుంగనూరు: వినాయక చవితి పండుగను అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం వారు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆది దేవుడిని ప్రతి ఒక్కరూ పూజించి కష్టాలు తొలగిపోయేలా ప్రార్థించాలని, అందరూ సుఖసంతాలతో గడపాలని ఆకాక్షించారు.
మట్టి వినాయకులనే పూజిద్దాం
చిత్తూరు కలెక్టరేట్ : వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి కోరారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. పర్యావరణ పరిక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ దిశగా మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని విజ్ఞప్తి చేశారు. విఘ్నాలకు, సకల దేవగణాలకు అధిపతి అయిన వినాయకున్ని పూజించి సకల కార్యసిద్ధి పొందాలని ఆకాంక్షించారు.
విఘ్నాలు తొలగి..!
చిత్తూరు అర్బన్: అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి.. విజయాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నా. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెంది ముందుకు వెళ్లాలి. చవితి వేడుకలను నిమజ్జనాన్ని ప్రశాంతంగా, ఆనందంగా నిర్వహించుకోవాలి.
– మణికంఠ, ఎస్పీ, చిత్తూరు.
Comments
Please login to add a commentAdd a comment