గండేపల్లి: మండలంలోని బొర్రంపాలెంలోని ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. బొర్రంపాలేనికి చెందిన మంగిన వీర వెంకటేశ్వరరావు ఉపాధి నిమిత్తం తన కుటుంబంతో సహా హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. పెన్షన్ నిమిత్తం ఈ నెల మొదటి వారంలో బొర్రంపాలెం వచ్చి పెన్షన్ తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయాడు. గురువారం ఉదయం గ్రామంలోని తన సొంతింటి తలుపు తాళాలు పగలగొట్టి ఉండడాన్ని చుట్టుపక్కల వారు గమనించి మల్లేపల్లిలోని వెంకటేశ్వరరావు మరదలు బేరి వీరలక్ష్మికి తెలిపారు. ఆమె వచ్చి చూడగా బీరువాలోని రూ.లక్ష విలువైన బంగారం, రూ.20 వేల నగదును దొంగిలించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment