ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): పోషణ్ వాటికాస్ కాంపోనెంట్ కింద ప్రతి అంగన్వాడీ కేంద్రానికి రూ.10 వేలు విడుదల చేస్తున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. శనివారం నగరంలోని సిగిడిలపేట, బాలాజీపేట లలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ సూపర్వైజర్ పర్యవేక్షణలో పోషణ్ వాటికాస్ నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా 8 రకాల ఆకుకూరలు, ఆరు రకాల కూరగాయలు అంగన్వాడీ కేంద్రాల్లో పెంచాల్సి ఉంటుందన్నారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి కేంద్రానికి రూ.పది వేలు చొప్పున నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. వాటికల నిర్వహణ నిమిత్తం అంగన్వాడీ కార్యకర్త బ్యాంకు ఖాతాకు నిధులను జమ చేస్తామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం ఆవరణలో లేదా అంగన్వాడీ కేంద్రానికి సమీపంలో ఉన్న స్థలం లభ్యతను బట్టి పోషణ వాటిక/కిచెన్ గార్డెన్ను ఏర్పాటు చేయాలన్నారు. కూరగాయలు, పచ్చి కూరగాయలు తదితరాలను పండించడానికి కంటైనర్ గార్డెనింగ్ లేదా కుండ తోటపని ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ సూచించారు. కంటైనర్ గార్డెనింగ్ విధానంలో భూమికి బదులుగా కంటైనర్/కుండీలలో మొక్కలను పెంచడం ఒక భాగమని తెలియజేశారు. పచ్చని ఆకు కూరలు (8 రకాలు), ఔషధ మొక్కలు/పండ్ల చెట్లు (5 లేదా 6 చెట్లు) పెంచాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఆకు కూరల విభాగంలో పాలకూర, మెంతి, అమరంథస్, తోటకూర, గుంటకలగారాకు (బ్రహ్మి), పునర్నవ (బోయర్హవియా), డయోస్కోరియా (రాటాలు), వంటి ఆకు కూరలు, ఔషధ మొక్కలు/పండ్ల చెట్లు విభాగంలో మోరింగా (సహజన్), పపిట (బొప్పాయి), కరిపట్ట, నిమ్మకాయ, ఉసిరి, పూనిక (అనార్) మొదలైన వాటిని పెంచాల్సి ఉంటుందన్నారు. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత అనీమియా వంటి వాటికి పరిష్కారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోషణ్ వాటికాస్ కాంపోనెంట్ను ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందచేశారు. ఆమె వెంట సీ్త్ర, శిశు సంక్షేమసాధికారిత అధికారి కె.విజయకుమారి, సీడీపీవో, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు
రూ.10 వేల చొప్పున మంజూరు
కలెక్టర్ ప్రశాంతి
Comments
Please login to add a commentAdd a comment