చంద్రబాబువి మోసపూరిత వాగ్దానాలు | Sakshi
Sakshi News home page

చంద్రబాబువి మోసపూరిత వాగ్దానాలు

Published Sun, May 5 2024 2:55 AM

చంద్రబాబువి మోసపూరిత వాగ్దానాలు

రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు

బుట్టాయగూడెం: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మవద్దని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు అన్నారు. శనివారం రాత్రి మండలంలోని కృష్ణాపురంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ దేశానికే ఆదర్శమైన సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు బుద్ధి చెప్పేలా ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జగన్‌ సీఎం అయితేనే మరలా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. ఈ దిశగా ప్రతిఒక్కరూ ఆలోచన చేసి ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన సతీమణి రాజ్యలక్ష్మి కూడా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని చెప్పారు. సీనియర్‌ నాయకులు ఊదరగొండి చంద్రమౌళి ఉన్నారు.

Advertisement
 
Advertisement