తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయం విద్యార్థిని షేక్ సాదియా కామన్వెల్త్ పవర్ఫిల్టింగ్ పోటీల్లో సత్తా చాటింది. ఏకంగా నాలుగు బంగారు పతకాలు కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కేఎల్యూ వీసీ డాక్టర్ జి. పార్థసారథి వర్మ, ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్. వెంకట్రామ్, డాక్టర్ కె. రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగ డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్, క్రీడల అసోసియేట్ డీన్ డాక్టర్ కె. హరికిషోర్, వ్యాయామ అధ్యాపకులు తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment