కొండగట్టు/విద్యానగర్(కరీంనగర్)/వేములవాడఅర్బన్: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో విజయదశమిని రోజున భక్తులు తమ వాహన పూజలు నిర్వహించుకుంటారు. వందలాది వాహనాలు ఇక్కడికి తరలివస్తాయి. అంజన్న సన్నిధిలో వాహనపూజ చేయిస్తే ఏడాదంతా సుభిక్షంగా ఉంటుందని వారి నమ్మకంగా చెబుతున్నారు. కరీంనగర్లోని కోతిరాంపూర్లో గల గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో దసరా రోజులు ఉదయం 6 గంటల నుంచి దాదాపు 2 వేల వాహనాలకు పూజలు జరుగుతాయి. గణపతి పూజ, సాయంత్రం శమీపూజ, రాత్రి 8 గంటల తర్వాత మహిసాసుర సంహారం కార్యక్రమం నిర్వహిస్తారు. వేములవాడ మండలంలోని అగ్రహారం శ్రీజోడాంజనేయ స్వామి ఆలయంలో దసరా రోజు వాహనాలకు పూజ చేస్తారు. ఇక్కడ పూజ జరిపిస్తే స్వామివారు ప్రమాదాలు జరగకుండా చూస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉందని అర్చకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment