సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి ఎంపీ స్థానానికి రెండోరోజు ముగ్గురు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఏకాదశి మంచిరోజు కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.. మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కొరుకంటి చందర్తో కలిసి రెండుసెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.. ఎమ్మెల్యేలు విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెల, నేతకాని సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం నరేశ్తో కలిసి ఒకసెట్ నామినేషన్ పత్రం దాఖలు చేశారు. ఆ తర్వాత తన కుటుంబసభ్యులతో కలిసి మరోసెట్ అందజేశారు. వీరుకాకుండా బీఆర్ఎస్ తరఫున కొంకటి లింగమూర్తి ఒకసెట్ నామినేషన్ వేశారు. వీరితో ఇప్పటివరకు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో రాలేకపోయారు. దీంతో సాదాసీదాగానే నామినేషన్ వేశారు. మరోసారి అగ్రనేతల సమక్షంలో భారీ ర్యాలీలతో మరోసెట్ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
పెద్దపల్లిలో సాదాసీదాగా
నామినేషన్ వేసిన కొప్పుల, వంశీ
అగ్రనేతల ఆధ్వర్యంలో
మరోసెట్ వేయనున్న అభ్యర్థులు
ఇప్పటివరకు ఏడుగురు నామినేషన్..