రాయిని ఢీకొన్న బైక్‌.. ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

రాయిని ఢీకొన్న బైక్‌.. ఒకరి మృతి

Published Tue, Apr 23 2024 8:15 AM

-

ఆరబోసిన ధాన్యం కుప్ప వద్ద ఘటన

నవీపేట: రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పపక్కన పెట్టిన రాయిని బైక్‌ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. నవీపేట–నాగేపూర్‌ మధ్య బాసర రోడ్డుపై ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై యాదగిరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాగేపూర్‌కు చెందిన నేతి సాయిలు(40) తన ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై నవీపేటకు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పకు అడ్డుగా పెట్టిన రాయిని ఢీకొట్టి బైక్‌ అదుపుతప్పింది. ఈ ఘట నలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్ద రు స్నేహితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యా రు. మృతుడికి భార్య వసంత, ఆరేళ్ల కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని..

కామారెడ్డి క్రైం: గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో తాడ్వాయికి చెందిన మర్రి సాయిలు(40) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లా కేంద్రం పరిధిలోని పొందుర్తి శివారులో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సాయిలు పని నిమిత్తం ఆదివారం సాయంత్రం బైక్‌పై భిక్కనూరుకు వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున తిరిగి వెళ్తుండగా, పొందుర్తి సమీపంలోని లక్ష్మీనగర్‌తండా వద్ద వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement