కండగానపల్లిలో ఏనుగుల గోల | - | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 6 2023 12:50 AM | Last Updated on Mon, Mar 6 2023 12:50 AM

కండగానపల్లి అటవీ ప్రాంతంలో 
సంచరిస్తున్న ఏనుగులు   - Sakshi

కెలమంగలం: డెంకణీకోట అటవీ ప్రాంతంలో మకాం వేసిన 20 ఏనుగుల మంద నుంచి నాలుగు ఏనుగులు విడిపోయి సమీపంలోని కండగానపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. డెంకణీకోట సమీపంలోని కస్బా అటవీ ప్రాంతంలో 20 ఏనుగులు మకాం వేసి రైతు పంటలపై దాడి చేయడంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గుర య్యారు. బాధిత రైతులు అటవీశాఖాధికార్లకు సమాచారం అందజేయడంతో వారు వచ్చి టపాకాయలు పేల్చి, డప్పులు వాయిస్తూ దట్టమైన అటవీ ప్రాంతానికి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో 20 ఏనుగుల మంద నుంచి నాలుగు ఏనుగులు విడిపోయి కండగానపల్లి అటవీ ప్రాంతానికి చేరుకొన్నాయి. ఆ ప్రాంతంలోని ఓ కుంటలో జలకాలాడుతూ స్థానికుల కంటబడ్డాయి. ప్రజలు ఏనుగులను తరిమేందుకు యత్నించగా నీటికుంట నుంచి బయటకొచ్చి రైతు పంటలపై దాడులు చేస్తున్నాయని వాపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement