కరపత్రాలు పంచి ప్రచారం చేస్తున్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ.వీ.శ్రీనివాసరెడ్డి
సాక్షి,బళ్లారి: కేఆర్పీపీ అభ్యర్థిని గాలి లక్ష్మీ అరుణ పుట్బాల్ గుర్తుకు ఓటు వేసి నగర అభివృద్ధికి తోడ్పాటునందించాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ.వీ.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం 17వ వార్డులో ఇంటింటా ప్రచారం చేస్తూ పార్టీ కరపత్రాలను పంచి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కేఆర్పీపీ గుర్తు పుట్బాల్కు ఓటు వేయాలని ఈవీఎంలో క్రమ సంఖ్య–8 అని చూపుతూ ప్రచారం చేశారు. నగరంలో రాజ్యమేలుతున్న సమస్యల పరిష్కారానికి ఏకై క మార్గం లక్ష్మీ అరుణను గెలిపించడం ఒక్కటేనని, తద్వారా నగర రూపురేఖలు మారుతాయన్నారు. ఈసందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment