జ్యుడీషియల్‌ విచారణకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

జ్యుడీషియల్‌ విచారణకు డిమాండ్‌

Published Thu, Dec 28 2023 12:36 AM | Last Updated on Thu, Dec 28 2023 12:36 AM

పాఠశాలలో వంటశాలను పరిశీలిస్తున్న దృశ్యం   - Sakshi

మాలూరు: తాలూకాలోని టీకల్‌ ఫిర్కా యలువహళ్లి గ్రామంలోని మొరార్జీ దేశాయి వసతి పాఠశాలలో విద్యార్థులతో టాయ్‌లెట్‌ పిట్‌ శుభ్రం చేయించిన ఘటనపై జుడీషియల్‌ విచారణ జరిపించాలని బుధవారం కర్ణాటక దళిత సంఘర్ష సమితి సంచాలకుడు ఎస్‌ఎం వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. ఆయన బుధవారం పాఠశాలను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. యలువహళ్లి ఘటన యావత్‌ దేశానికే సిగ్గుచేటన్నారు. ఘటనను మూసివేయాలని ప్రయత్నించిన వసతి పాఠశాల సిబ్బందిని డిస్మిస్‌ చేయాలన్నారు, వసతి పాఠశాలలో సిబ్బందిని నియమించి కొరతను తీర్చాలన్నారు. సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా సమన్వయ సంచాలకుడు చవ్వేనహళ్లి వీజీ, తాలూకా సమన్వయ సంచాలకుడు బండిహట్టి నారాయణస్వామి, ఊసరహళ్లి గోపి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement