ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

Published Wed, Aug 28 2024 2:30 AM | Last Updated on Wed, Aug 28 2024 2:30 AM

-

కె.అగ్రహారం(జగ్గయ్యపేట): ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన గోపు సతీష్‌(21) పూల వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం రాత్రి యథావిధిగా వ్యాపారం ముగించుకుని ఇంటికొచ్చాడు. ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున సతీష్‌ ఉరి వేసుకున్నాడు. మంగళవారం కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి విగతజీవిగా ఉన్నాడు. చిల్లకల్లు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. కొంతకాలంగా తన కుమారుడు కడుపునొప్పితో బాధపడుతున్నాడని మృతుడి తల్లి ముత్తమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ తోట సూర్య శ్రీనివాస్‌ కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement