అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

Published Wed, Aug 28 2024 2:30 AM | Last Updated on Wed, Aug 28 2024 2:30 AM

-

ఉంగుటూరు: అనుమానాస్పద స్థితిలో

వృద్ధురాలి మృతి చెందిన ఘటనపై ఉంగుటూరు పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం నందమూరు గ్రామానికి చెందిన రాజేశ్వరి(70) మతిస్థిమితం కోల్పోయి కొద్ది కాలంగా ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తూ ఉంటుంది. అదే విధంగా మంగళవారం ఉదయం బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుమారుడు అనగాని వెంకటేశ్వరరావు పరిసర ప్రాంతాల్లో వెతికాడు. ఈ క్రమంలో గ్రామనికి చెందిన హరీష్‌ అనే వ్యక్తి వెంకటేశ్వరరావుకు ఫోన్‌ చేసి మీ అమ్మ రాజేశ్వరి కొండయ్య కాలువ వంతెన వద్ద రోడ్డు పక్కనే పడిపోయి ఉందని చెప్పాడు. వెంటనే వెంకటేశ్వరరావు అక్కడకు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న తల్లి రాజేశ్వరిని చికిత్స నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందిందని నిర్ధారించడంతో మృతురాలి కుమారుడు ఉంగుటూరు పోలీసులకు తెలియజేశాడు. అతని ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా ఎస్‌ఐ గోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement