పిడుగుపాటుకు రైతు మృతి | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు రైతు మృతి

Published Sun, May 5 2024 2:40 AM

పిడుగుపాటుకు రైతు మృతి

బయ్యారం: మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కొత్తలక్ష్మీపురంలో శనివారం పిడుగుపాటుకు రైతు పొడుగు సుమంత్‌(26) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. సుమంత్‌ సా యంత్రం సమయంలో మొక్కజొన్న చేను వద్దకు వె ళ్లి ఇంటికి వస్తుండగా గాలివాన మొదలైంది. ఈ క్ర మంలో ఓ చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగుపడడంతో అపస్మారకస్థితికి చేరుకున్నా డు. అటుగా వెళ్తున్న వా రు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా చేరుకుని ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వై ద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. సు మంత్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Advertisement
Advertisement