వడదెబ్బతో ఏడుగురి మృతి | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఏడుగురి మృతి

Published Sun, May 5 2024 2:40 AM

వడదెబ

చెన్నారావుపేట: వడదెబ్బతో ఇద్దరు మృతి చెందిన సంఘటన మండలంలోని అక్కల్‌చెడలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన ఆకుల భాస్కర్‌(25), హరియాతండాకు చెందిన బాదావత్‌ నర్సింహ(100) ఎండ వేడికి తాళలేక వాంతులు చేసుకుని మరణించినట్లు తెలిపారు. కాగా బాధిత కుటుంబ సభ్యులను శనివారం కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్‌నాయక్‌, పావని రమేష్‌ పరామర్శించారు.

రంగాపూర్‌లో ఒకరు..

గోవిందరావుపేట : మండలంలోని రంగాపూర్‌ గ్రామానికి చెందిన వంక లక్ష్మి వడదెబ్బతో శనివారం మృతి చెందారు.లక్ష్మి ఎండ తీవ్రత తట్టుకోలేక, వడ దెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఇప్పల్‌తండాలో ఒకరు..

నర్సంపేట రూరల్‌ : నర్సంపేట మండలంలోని ఇప్పల్‌తండాకు చెందిన అజ్మీరా మంగ్యా (45)కు గ్రామశివారులో మూడెకరాల భూమి ఉంది. ఇటీవల వరి కోసి ధాన్యాన్ని అక్కడే ఆరబోశారు. మూడురోజుల నుంచి ధాన్యం నేర్పేందుకు ఎండలో వెళ్తున్నాడు. ఈక్రమంతో మంగ్యా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నర్సంపేటలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య భోజమ్మ, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు.

కొత్తగూడలో వృద్ధుడు..

కొత్తగూడ : వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని గాంధీనగర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆవుల కనకయ్య(75) శుక్రవారం వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. నర్సంపేట పట్టణంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

రేగులగూడెంలో రైతు..

కాటారం : వడదెబ్బతో అస్వస్థతకు గురై రైతు మృతి చెందిన సంఘటన జయశంకర్‌భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేకల లస్మయ్య(56) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల వరి కోతలు పూర్తికాగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ఆరబోశాడు. రోజులాగే కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యం ఆరబెట్టేందుకు వెళ్లిన లస్మయ్య ఎండ తీవ్రతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108అంబు లెన్స్‌కు సమాచారం ఇవ్వగా ఇంటికి చేరుకునే లోపే పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.

పెద్దముప్పారంలో వృద్ధుడు..

దంతాలపల్లి : మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గొడిశాల దేవయ్య(70) ఎండ తీవ్రత భరించలేక మధ్యాహ్నం అస్వస్థకు గురై మృతి చెందినట్లు తెలిపారు.

వడదెబ్బతో ఏడుగురి మృతి
1/5

వడదెబ్బతో ఏడుగురి మృతి

వడదెబ్బతో ఏడుగురి మృతి
2/5

వడదెబ్బతో ఏడుగురి మృతి

వడదెబ్బతో ఏడుగురి మృతి
3/5

వడదెబ్బతో ఏడుగురి మృతి

వడదెబ్బతో ఏడుగురి మృతి
4/5

వడదెబ్బతో ఏడుగురి మృతి

వడదెబ్బతో ఏడుగురి మృతి
5/5

వడదెబ్బతో ఏడుగురి మృతి

Advertisement
Advertisement