‘14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం’ | Sakshi
Sakshi News home page

‘14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం’

Published Wed, May 8 2024 12:15 AM

‘14 ఎంపీ స్థానాల్లో   కాంగ్రెస్‌ గెలుపు ఖాయం’

చెన్నూర్‌: రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు అబ్జర్వర్‌ హైమవతి ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని మంగళవారం స్థానిక ఎస్సీ కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత పదేళ్లలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ప్రజలు ఆ రెండు పార్టీలను నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు హిమవంతరెడ్డి, చెన్న సూర్యనారాయణ, మైదం రవి, చీర్ల సుధాకర్‌రెడ్డి, బాపగౌడ్‌, పిట్టల రవి పాల్గొన్నారు.

Advertisement
Advertisement