మెరుగైన వైద్యం అందుతుందా?
నర్సాపూర్ రూరల్ : మీకు మెరుగైన వైద్యం అందిస్తున్నారా? సమయానికి మందులు పంపిణీ చేస్తూరా? అని ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులను అడిగి తెలుసుకున్నారు. శిక్షణలో భాగంగా రెండో రోజైన ఆదివారం నర్సాపూర్ మున్సిపాలిటీలో వారు పర్యటించారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రితో పాటు అర్బన్ పార్క్ను సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రిలో.. రోగులతో మీకు మెరుగైన వైద్యం అందిస్తున్నారా? సమయానికి మందులు పంపిణీ చేస్తున్నారా? అని రోగులను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు అర్బన్ పార్క్లో ఏర్పాటు చేసిన వాచ్ టవర్ పైకెక్కి అటవీ ప్రాంతాన్ని వీక్షించారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వివిధ ఔషధ మొక్కలను, కృత్రిమ జంతువుల విగ్రహాలను, నడక కోసం ఏర్పాటు చేసిన ట్రాక్లను పరిశీలించి బాగుందన్నారు. అనంతరం అధికారుల బృందానికి మునిసిపల్ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్ శాలువా పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మధుసూదన్, శానిటైజర్ ఇన్స్పెక్టర్ చల్ల మురళి, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ శ్రీకాంత్, సబ్ ఇంజినీర్ భూపాల్, మున్సిపల్ సిబ్బంది వినీత్, రాములు, ఉదయ్, రణదీప్, జవాన్ ఎల్లం అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రిలో ట్రైనీ సివిల్ సర్వీస్అధికారుల బృందం ఆరా
Comments
Please login to add a commentAdd a comment