రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
తూప్రాన్: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ మెట్టు బాలకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతోనే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వపరంగా రావాల్సిన సబ్సిడీలను అందించలేదని విమర్శించారు. రైతులకు రూ.2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కుతోందన్నారు. రానున్న రోజుల్లో వారికి అనేక సంక్షేమ ఫలాలు అందనున్నాయని తెలిపారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. ధాన్యం ఏ గ్రేడ్ రూ.2,320, బీ గ్రేడ్ రూ.2,300, సన్నరకానికి అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మామిళ్ల జ్యోతికృష్ణ, కౌన్సిలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment