డీఏ ప్రకటించకపోవడం బాధాకరం | - | Sakshi
Sakshi News home page

డీఏ ప్రకటించకపోవడం బాధాకరం

Published Mon, Oct 28 2024 8:48 AM | Last Updated on Mon, Oct 28 2024 8:48 AM

డీఏ ప్రకటించకపోవడం బాధాకరం

డీఏ ప్రకటించకపోవడం బాధాకరం

● ఉద్యోగ ఐకాస జిల్లా చైర్మన్‌ నరేందర్‌

మెదక్‌జోన్‌ : మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించకపోవడం బాధాకరమని జిల్లా ఉద్యోగుల ఐకాస చైర్మన్‌ దొంతి నరేందర్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం మెదక్‌లో విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మూడు, కాంగ్రెస్‌ హయాంలో రెండు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. దీపావళి కానుకగా డీఏ ప్రకటిస్తారని ఎదురుచూసిన ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించే విషయమై ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని స్పష్టం చేశారు. కరువుభత్యం మంజూరు విషయమై జాప్యం పట్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా సర్కారు స్పందించి డీఏ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు ఇక్బాల్‌ పాషా, కోశాధికారి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement