కోరిన కోర్కెలు తీర్చే.. కల్పవల్లి
పాపన్నపేట(మెదక్): వన దుర్గమ్మా మా కోరికలు తీర్చు తల్లి అంటూ వేలాది మంది భక్తులు ఆదివారం వేడుకున్నారు. అర్చకులు శంకరశర్మ, పార్థివ శర్మలు తల్లిని అలంకరించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి, బోనాలు తీసి, ఒడి బియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. తమ బంధు వర్గాలతో కలిసి భక్తులు విందులు చేసుకొని సాయంత్రం వరకు సరదాగా గడిపారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment