రైతులు మద్దతు ధర పొందాలి
మెదక్ మున్సిపాలిటీ: రైతులు.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని ప్రభుత్వం మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు తెలిపారు. ఆదివారం పట్టణంలోని దాయరవీధిలో, మెదక్ మండలం మగ్దుంపూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలన్నారు. మగ్దుంపూర్ గ్రామం రోడ్డు అధ్వానంగా ఉందని, మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయిస్తానని గ్రామస్తులకు హామీనిచ్చారు. అలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సైతం ఆయన ప్రారంభించారు. మెదక్ పట్టణం ఆజంపుర వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ హాస్పిటల్ను ప్రారంభించారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
Comments
Please login to add a commentAdd a comment