ధాన్యం.. దళారుల భోజ్యం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం.. దళారుల భోజ్యం

Published Mon, Oct 28 2024 8:47 AM | Last Updated on Mon, Oct 28 2024 8:47 AM

ధాన్యం.. దళారుల భోజ్యం

ధాన్యం.. దళారుల భోజ్యం

ధాన్యం దళారుల పాలవుతోంది. వడ్లు చేతి కొచ్చి పక్షం రోజులు గడుస్తున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. ధాన్యం కాంటా పెట్ట లేదు. దీంతో వ్యాపారులకు, దళారులకు ఆశ్రయించి పంట ఉత్పత్తులను అమ్ముకోవాల్సి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): మెదక్‌ జిల్లాలో 472 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా కొనుగోళ్లు ప్రారంభించనే లేదు. దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో పొలాల వద్దకు దళారులు వెళ్లి ధాన్యం కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. వారు ఇక్కడే తూకం వేసి క్వింటాలు రూ.1,900లు కొనుగోలు చేస్తున్నారు. అదే కల్లాల వద్ద ఆరబెట్టిన ధాన్యానికై తే క్వింటాలు రూ.2,200 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,330 ఉండగా 400 రూపాయలు తక్కువకే రైతులు అమ్ముకుంటున్నారు. మరి కొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు పంటను తరలించినా.. కాంటా ఇంకా మొదలు కాకపోవడంతో వేచిచూడలేక దళారులను ఆశ్రయిస్తున్నారు.

సన్నరకం కూడా ..

సన్న రకానికి ప్రభుత్వం రూ.500 బోనస్‌ ప్రకటించినప్పటికి కూడా రైతులు విక్రయిస్తున్నారు. క్వింటాలు రూ.2,500ల వరకు దళారులే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కాంటా వేయాలని రైతులు చెబుతున్నారు.

వడ్లను విక్రయిస్తున్న అన్నదాత

దక్కని మద్దతు ధర

కేంద్రాల్లో ఏర్పాటు చేసినాజరగని కొనుగోళ్లు

చేసేది లేక అందినకాడికిఅమ్ముకుంటున్న రైతన్న

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement