జాతీయ హోదా అడిగావా..: వంశీచంద్‌ | Sakshi
Sakshi News home page

జాతీయ హోదా అడిగావా..: వంశీచంద్‌

Published Tue, Apr 16 2024 1:20 AM

నారాయణపేటలో జనజాతర సభకు హాజరైన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు - Sakshi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దగ్గరకు వెళ్లి ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి తెచ్చావా.. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగావా.. కృష్ణా– వికారాబాద్‌ రైల్వే లైన్‌పై విన్నవించావా.. ఇవన్నీ అడగకుండా కేవలం బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి కావాలని మోదీని అడుక్కున్న దొరసానివి నువ్వు. ఎన్నికలు వచ్చినప్పుడు నాది నారాయణపేట అంటున్నావ్‌.. పేట బిడ్డవైతే సైనిక్‌ స్కూల్‌ పోతుంటే ఎందుకు ఆపలేదు.. ధన్వాడ బిడ్డవని చెబుతవ్‌.. ధన్వాడ చెరువును మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు నింపలేదు. కేవలం ఓట్ల కోసమే మాట్లాడుతున్నావ్‌ తప్ప.. ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. పద్మశాలీలకు పెద్దఎత్తున టెక్స్‌టైల్‌ పార్కు రావాలన్నా.. ప్రతి గ్రామంలో రోడ్లు కావాలన్నా.. పేటలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మించాలన్నా.. హస్తం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించండి అని ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి విన్నవించారు.

Advertisement
Advertisement