బీజేపీకి బుద్ధి చెబితేనే ప్రజాస్వామ్య మనుగడ | Sakshi
Sakshi News home page

బీజేపీకి బుద్ధి చెబితేనే ప్రజాస్వామ్య మనుగడ

Published Mon, May 6 2024 10:10 AM

బీజేపీకి బుద్ధి చెబితేనే ప్రజాస్వామ్య మనుగడ

చండూరు(గట్టుప్పల్‌): పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పినప్పుడే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం గట్టుప్పల్‌ మండల పరిధిలోని తేరట్‌పల్లిలో జరిగిన సీపీఎం గ్రామ శాఖ జనరల్‌ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే మోదీ దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు అమ్మేస్తాడని అన్నారు. మోసపూరిత మాటలు, మతం, దేవుళ్ల సెంటిమెంట్‌తో ప్రజలను మభ్యపెట్టి మోసగించి మరోసారి అధికారంలోకి రావాలని మోదీ చూస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, వివిధ మండలాల కార్యదర్శులు నాంపల్లి చంద్రమౌళి, ఏర్పుల యాదయ్య, నాయకులు శివకుమార్‌, ధనంజయ గౌడ్‌, శ్రీను, శ్రీశైలం పాల్గొన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి

Advertisement
 
Advertisement